భారత రాష్ట్రపతి వారికి సాదర వీడ్కోలు.



భారత రాష్ట్రపతి వారికి సాదర వీడ్కోలు.



తిరుపతి, డిసెంబర్05 (ప్రజా అమరావతి): రాష్ట్ర పర్యటనలో భాగంగా తిరుపతి తిరుమల రెండు రోజుల పర్యటన అనంతరం మధ్యాహ్నం  02.30 గం. లకు రేణిగుంట విమానాశ్రయం చేరుకున్న గౌ.భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వారికి సాదర వీడ్కోలు లభించింది.


గౌ. ఉప ముఖ్యమంత్రి ఎక్సైజ్ మరియు జిల్లా ఇంఛార్జి మంత్రి మరియు రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధి మినిస్టర్ ఇన్ వెయిటింగ్  హోదాలో శ్రీ కె. నారాయణ స్వామి , రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మరియు దేవాదాయ శాఖ మంత్రి శ్రీ కొట్టు సత్యనారాయణ, దేవాదాయ, రెవెన్యూ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ   అనిల్ కుమార్ సింఘాల్ (సి ఎస్ ప్రతినిధి),  డా.రవిశంకర్ ఏపీ అదనపు డిజిపి శాంతి భద్రతలు మంగళగిరి ( DGP ప్రతినిధి), జిల్లా కలెక్టర్ కె వెంకటరమణారెడ్డి,  తిరుపతి ఎస్పీ ఎస్. పరమేశ్వర్ రెడ్డి, మాజీ టీటీడీ బోర్డు మెంబర్ జి .భాను ప్రకాష్ రెడ్డి గౌ భారత రాష్ట్రపతి కి వీడ్కోలు పలికారు.


గౌ. యూనియన్ మినిస్టర్ ఆఫ్ కల్చర్ మరియు టూరిజం, డిఓఎన్ఈఆర్ జి.కిషన్ రెడ్డి గౌ.భారత రాష్ట్రపతి వారితో పాటుగా ఢిల్లీకి తిరుగు ప్రయాణమయ్యారు.

Comments