పర్యావరణ పరిరక్షణకు సీఎం శ్రీ వైయస్ జగన్ పెద్దపీట


విజయవాడ (ప్రజా అమరావతి);


- పర్యావరణ పరిరక్షణకు సీఎం శ్రీ వైయస్ జగన్ పెద్దపీట


- ఎపి ఎన్విరాన్ మెంట్ మేనేజ్ మెంట్ కార్పోరేషన్ ద్వారా చర్యలు 

- కాలుష్య కారక వ్యర్థాల నిర్వహణపై ప్రత్యేక దృష్టి

- వ్యర్థాల వినియోగం కోసం కొత్త విధానం

- ఇకపై ఎపిఇఎసిఎల్ ఆధ్వర్యంలో ఫ్లైయాష్

- ఇందుకోసం ప్రత్యేక పోర్టల్ ఏర్పాటు

- ప్లైయాష్ ఉత్పత్తిదారులు, వినియోగదారుల కోసం ప్రత్యేక ఫ్లాట్ ఫాం

- కాలుష్య కారక వ్యర్థాలపై సమగ్ర పర్యవేక్షణ


- మంత్రి శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి


విజయవాడ:


1) రాష్ట్రంలో పర్యావరణ పరిరక్షణకు సీఎం శ్రీ వైయస్ జగన్ గారు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని రాష్ట్ర పర్యవరణ, అటవీ, ఇంధన, సైన్స్&టెక్నాలజీ, గనులశాఖ మంత్రి శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. విజయవాడలోని ఆంధ్రప్రదేశ్ ఎన్విరాన్ మెంట్ మేనేజ్ మెంట్ కార్పోరేషన్ (ఎపిఇఎంసిఎల్) కార్యాలయంలో స్పెషల్ చీఫ్ సెక్రటరీ (పర్యావరణం) నీరబ్ కుమార్ ప్రసాద్, కార్పోరేషన్ ఎండి ఖజూరియా, చైర్మన్ గుబ్బా చంద్రశేఖర్ లతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కాలుష్య కారక వ్యర్థాల నిర్వహణకు సంబంధించి కొత్తగా ఏర్పాటు చేసిన పోర్టల్ ను ఆయన ప్రారంభించారు. 


2) రాష్ట్రంలోని థర్మల్ పవర్ స్టేషన్ల నుంచి ఉత్పత్తి అవుతున్న ఫ్లైయాష్ నిర్వహణను ఇకపై ఎపి ఎన్విరాన్ మెంట్ మేనేజ్ మెంట్ కార్పోరేషన్ పరిధిలోకి తీసుకువస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పది థర్మల్ పవర్ ప్లాంట్ల ద్వారా ఉత్పత్తి అవుతున్న ఫ్లైయాష్ పై పూర్తిస్థాయిలో పర్యవేక్షణ కోసం ప్రత్యేకంగా ఒక ఆన్ లైన్ పోర్టల్ ను ప్రారంభించడం జరిగిందని తెలిపారు. ఈ పోర్టల్ లో ఫ్లైయాష్ ఉత్పత్తి, కొనుగోలుదారులు, రవాణాదారులకు సంబంధించిన పూర్తి సమాచారం ఉంటుందని అన్నారు. ఎంత మొత్తంలో ఫైయాష్ ఉత్పత్తి అవుతోంది, దానిని కొనుగోలు చేసే వారు ఎవరు, ఎక్కడకు ఈ ఫ్లైయాష్ రవాణా అవుతోంది, ఎందుకోసం దీనిని వినియోగిస్తున్నారనే సమాచారం ఎప్పటికప్పుడు ఈ పోర్టల్ ద్వారా నమోదు చేస్తామని తెలిపారు. దీనివల్ల సిమెంట్ కంపెనీలు, టైల్స్, రెడీమిక్స్ కంపెనీలు, జాతీయ రహదారుల నిర్మాణం, ఫైయాష్ తో ఇటుకలు తయారు చేసే పరిశ్రమలు, ఈ ఫ్లైయాష్ ను రవాణా చేసే సంస్థలు అన్నీ కూడా ఒకే వేదిక మీదికి వస్తాయని తెలిపారు. అటు పరిశ్రమలకు, ఇటు థర్మల్ ప్లాంట్ లకు ఈ ఆన్ లైన్ పోర్టల్ ద్వారా మేలు జరుగుతుందని, మరోవైపు ఫ్లైయాష్ వినియోగం కూడా పూర్తిగా పర్యావరణ నిబంధనల మేరకు జరిగేలా పర్యవేక్షించేందుకు వీలు కలుగుతుందని తెలిపారు. 


3) రాష్ట్రంలో పరిశ్రమలను ప్రోత్సహించడంతో పాటు కాలుష్యంను నియంత్రించేందుకు, వ్యర్థాల నిర్వహణకు ప్రత్యేకంగా చర్యలు తీసుకోవాలనే ఉద్దేశంతో సీఎం శ్రీ వైయస్ జగన్ గారు 2019లో ఎపిఇఎంసిఎల్ ను ప్రారంభించారని గుర్తు చేశారు. ఈ కార్పోరేషన్ ద్వారా వివిధ పరిశ్రమల ద్వారా విడుదల అవుతున్న వ్యర్థాలను ప్రమాదరహితంగా మార్చడం, వాటిని తిరిగి వినియోగంలోకి తీసుకురావడం, వ్యర్థాలను డిస్పోజ్ చేయాల్సిన పరిస్థితుల్లో వాటిని ఏ రకంగా చేస్తున్నారనే అంశాలను పర్యవేక్షించడపై దృష్టి సారించడం జరిగిందని అన్నారు. పారిశ్రామిక, బయో వ్యర్థాల నిర్వహణను నిర్లక్ష్యం చేస్తే ప్రజల ఆరోగ్యాలపై పెను ప్రభావం చూపుతుందని, అలాగే పర్యావరణానికి విఘాతం ఏర్పడుతుందని అన్నారు. 


4) కార్పోరేషన్ పరిధిలో ఇప్పటి వరకు 983 వ్యర్థాలను సృష్టించే సంస్థలు రిజిస్టర్ అయ్యాయని, అలాగే సదరు వ్యర్థాలను రీసైక్లింగ్, రీ ప్రోసెసింగ్ చేసే 171 సంస్థలు, ఈ వ్యర్థాలను రవాణా చేసే 170 సంస్థలు, వాటిని తీసుకువెళ్ళే 1279 వాహనాలు రిజిస్టర్ అయ్యాయని తెలిపారు. ఇప్పటి వరకు కార్పోరేషన్ ద్వారా 8.32 లక్షల మెట్రిక్ టన్నుల ఘన వ్యర్థాలను తిరిగి వినియోగించుకునేందుకు చర్యలు తీసుకోవడం జరిగిందని అన్నారు. పర్యావరణ పరిరక్షణలో సీఎం శ్రీ వైయస్ జగన్ గారి ఆలోచనా విధానం ఇతర రాష్ట్రాలకు కూడా ఆదర్శప్రాయంగా నిలుస్తుందని అన్నారు. దేశంలోనే కాలుష్య నియంత్రణ, పర్యావరణ పరిరక్షణలో ఎపి ముందుంజలో నిలుస్తుందని పేర్కొన్నారు.

Comments