అంగన్‌వాడీలలో నిరంతర పర్యవేక్షణ ఉండాలన్న సీఎం.



*మహిళా శిశు సంక్షేమశాఖపై క్యాంపు కార్యాలయంలో సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ సమీక్ష.*


అమరావతి (ప్రజా అమరావతి);

*అంగన్‌వాడీలలో నాడు – నేడుపై సీఎం సమీక్ష.* 

దాదాపు రూ.1500 కోట్లకు పైగా ఖర్చుచేస్తున్న ప్రభుత్వం.

మూడు విడతల్లో చేపట్టాలని సీఎం ఆదేశం.

మౌలిక సదుపాయాలు గణనీయంగా మెరుగుపడాలన్న సీఎం.

పనుల్లో నాణ్యత ఉండాలని, చిన్నారులకు మంచి వాతావరణం అందించాలన్న సీఎం.

ప్రతి మండలంలో కూడా పనులు జరిగేలా మూడు విడతలకూ కార్యాచరణ చేయాలన్న సీఎం.


అంగన్‌వాడీలలో నిరంతర పర్యవేక్షణ ఉండాలన్న సీఎం.


పాలు, గుడ్లు లాంటి ఆహారం పంపిణీలో ఎలాంటి సమస్యలు ఉండకూడదన్న సీఎం.

వీటి పంపిణీపై సమగ్ర పర్యవేక్షణ, పరిశీలన ఉండాలన్న సీఎం.

సమగ్రమైన ఎస్‌ఓపీలు రూపొందించుకోవాలని, టెక్నాలజీ వాడుకోవాలని సీఎం ఆదేశం.

పంపిణీలో ఎక్కడైనా లోపాలు ఉంటే కచ్చితంగా సంబంధిత వ్యక్తులను బాధ్యులు చేసి చర్యలు తీసుకోవాలని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చిన సీఎం.

సూపర్‌వైజర్లపైన కూడా పర్యవేక్షణ ఉండాలన్న సీఎం.

స్త్రీ శిశు సంక్షేమ శాఖలో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీతో పాటు, పదోన్నతుల ప్రక్రియను వీలైనంత త్వరగా పూర్తిచేయాలని సీఎం ఆదేశం.

63 సీడీపీఓ పోస్టుల భర్తీకి సీఎం గ్రీన్‌ సిగ్నల్‌.

వీటిని వీలైనంత త్వరగా భర్తీచేయాలని ఆదేశాలు. 


నూటికి నూరుశాతం పిల్లలకు పాలు పంపిణీ కావాలి.


అలాగే పిల్లలకు ప్లేవర్డ్‌ పాలు పంపిణీని పైలట్‌ ప్రాజెక్టుగా ప్రారంభించాలన్న సీఎం.

మూడు నెలల తర్వాత పూర్తిస్థాయిలో ప్లేవర్డ్‌ మిల్క్‌ పంపిణీ కావాలన్న సీఎం.

ఈ మేరకు షెడ్యూల్‌  రూపొందించుకోవాలని సీఎం ఆదేశం.


అంగన్‌వాడీలలో బోధనపైనా కూడా ప్రత్యేక శ్రద్ధ పెట్టాలన్న సీఎం.

ఉత్తమ బోధనలను అందుబాటులోకి తీసుకురావాలన్న సీఎం.

అంగన్వాడీలలో స్మార్ట్‌ టీవీల ద్వారా డిజిటల్‌ పద్ధతుల్లో బోధనపై ఆలోచనలు చేసి, ప్రతిపాదనలు రూపొందించాలన్న ముఖ్యమంత్రి.


అంగన్వాడీల్లో పిల్లల ఆరోగ్య పరిస్థితులపై విలేజ్, వార్డు క్లినిక్స్‌ ద్వారా పరిశీలన చేయించాలన్న ముఖ్యమంత్రి.

వైద్యపరంగా ఎలాంటి చికిత్సలు అవసరమైనా ఆరోగ్యశ్రీని వినియోగించుకుని వారికి మెరుగైన వైద్యం అందించేలా చూడాలన్న సీఎం.

తల్లికానీ, బిడ్డకానీ.. ఎవరైనా రక్తహీనత, పౌష్టికాహారలోపం లాంటి సమస్యలతో బాధపడుతుంటే.. వాటిని నివారించడానికి సమగ్రమైన కార్యాచరణ ఉండాలన్న సీఎం.

ఈ విషయంలో అంగన్‌వాడీలు, విలేజ్‌ క్లినిక్స్,  వైద్య ఆరోగ్య శాఖలు సమన్వయంతో పనిచేయాలన్న సీఎం.

ఇలాంటి సమస్యలు ఉన్నవారికి అందరితోపాటు ఇచ్చే ఆహారం, అందరితోపాటు ఇచ్చే మందులు కాకుండా.. అదనంగా ఇస్తూ... వీరి ఆరోగ్యాన్ని మెరుగుపరచడంపై దృష్టి పెట్టాలన్న సీఎం.

దీనిపై ఎస్‌ఓపీలను తయారు చేయాలన్న సీఎం.

ఫిబ్రవరి 1 నుంచి దీన్ని అమలు చేయాలన్న సీఎం.

ఫ్యామిలీ డాక్టర్‌ కాన్సెప్ట్‌తో దీనికి పరిష్కారం చూపించాలన్న సీఎం.


– తల్లులకు టేక్‌ హోం రేషన్‌ విధానం పై ఆలోచన చేయాలన్న సీఎం.

దీనికోసం లోపాలకు తావులేని విధానాన్ని రూపొందించాలన్న సీఎం.


– అంగన్‌వాడీలలోలను, ప్రభుత్వ బడులలో బలహీనవర్గాలకు చెందిన పిల్లలే అధికంగా ఉంటారు.

ఈ వర్గాలకు చెందిన పిల్లలకు తోడుగా నిలబడాల్సిన అవసరం ఉంది.

వారి పట్ల సానుకూల ధృక్పధంతో పనిచేయాలన్న సీఎం.

– 10–12  ఏళ్ల వయస్సులో మంచి బోధన అందించడం ద్వారా ఉత్తమైన ఫలితాలు సాధించవచ్చన్న సీఎం.

– విద్య, వ్యవసాయం, వైద్య ఆరోగ్యం తరహాలో మహిళ, శిశు సంక్షేమాన్ని కూడా ప్రభుత్వం ప్రాధాన్యకార్యక్రమంగా చేపట్టిందన్న సీఎం.



ఈ సమీక్షా సమావేశంలో మహిళా, శిశు సంక్షేమశాఖ మంత్రి కే వి ఉషశ్రీ చరణ్, సీఎస్‌ డాక్టర్‌ కే ఎస్‌ జవహర్‌ రెడ్డి, మహిళా శిశు సంక్షేమశాఖ ముఖ్య కార్యదర్శి ముద్దాడ రవిచంద్ర, ఏపీ డెయిరీడెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ ఎండీ ఎ బాబు, పాఠశాల మౌలికవసతులశాఖ కమిషనర్‌ కాటమనేని భాస్కర్, పౌరసరఫరాలశాఖ ఎండీ జీ వీరపాండ్యన్, మహిళా శిశు సంక్షేమశాఖ డైరెక్టర్‌ డాక్టర్‌ ఏ సిరి, మార్క్‌ ఫెడ్‌ ఎండీ రాహుల్‌ పాండే, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Comments