*మహిళా శిశు సంక్షేమశాఖపై క్యాంపు కార్యాలయంలో సీఎం శ్రీ వైయస్.జగన్ సమీక్ష.*
అమరావతి (ప్రజా అమరావతి);
*అంగన్వాడీలలో నాడు – నేడుపై సీఎం సమీక్ష.*
– దాదాపు రూ.1500 కోట్లకు పైగా ఖర్చుచేస్తున్న ప్రభుత్వం.
– మూడు విడతల్లో చేపట్టాలని సీఎం ఆదేశం.
– మౌలిక సదుపాయాలు గణనీయంగా మెరుగుపడాలన్న సీఎం.
– పనుల్లో నాణ్యత ఉండాలని, చిన్నారులకు మంచి వాతావరణం అందించాలన్న సీఎం.
– ప్రతి మండలంలో కూడా పనులు జరిగేలా మూడు విడతలకూ కార్యాచరణ చేయాలన్న సీఎం.
– అంగన్వాడీలలో నిరంతర పర్యవేక్షణ ఉండాలన్న సీఎం.
– పాలు, గుడ్లు లాంటి ఆహారం పంపిణీలో ఎలాంటి సమస్యలు ఉండకూడదన్న సీఎం.
– వీటి పంపిణీపై సమగ్ర పర్యవేక్షణ, పరిశీలన ఉండాలన్న సీఎం.
– సమగ్రమైన ఎస్ఓపీలు రూపొందించుకోవాలని, టెక్నాలజీ వాడుకోవాలని సీఎం ఆదేశం.
– పంపిణీలో ఎక్కడైనా లోపాలు ఉంటే కచ్చితంగా సంబంధిత వ్యక్తులను బాధ్యులు చేసి చర్యలు తీసుకోవాలని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చిన సీఎం.
– సూపర్వైజర్లపైన కూడా పర్యవేక్షణ ఉండాలన్న సీఎం.
– స్త్రీ శిశు సంక్షేమ శాఖలో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీతో పాటు, పదోన్నతుల ప్రక్రియను వీలైనంత త్వరగా పూర్తిచేయాలని సీఎం ఆదేశం.
– 63 సీడీపీఓ పోస్టుల భర్తీకి సీఎం గ్రీన్ సిగ్నల్.
– వీటిని వీలైనంత త్వరగా భర్తీచేయాలని ఆదేశాలు.
– నూటికి నూరుశాతం పిల్లలకు పాలు పంపిణీ కావాలి.
– అలాగే పిల్లలకు ప్లేవర్డ్ పాలు పంపిణీని పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించాలన్న సీఎం.
– మూడు నెలల తర్వాత పూర్తిస్థాయిలో ప్లేవర్డ్ మిల్క్ పంపిణీ కావాలన్న సీఎం.
– ఈ మేరకు షెడ్యూల్ రూపొందించుకోవాలని సీఎం ఆదేశం.
– అంగన్వాడీలలో బోధనపైనా కూడా ప్రత్యేక శ్రద్ధ పెట్టాలన్న సీఎం.
– ఉత్తమ బోధనలను అందుబాటులోకి తీసుకురావాలన్న సీఎం.
– అంగన్వాడీలలో స్మార్ట్ టీవీల ద్వారా డిజిటల్ పద్ధతుల్లో బోధనపై ఆలోచనలు చేసి, ప్రతిపాదనలు రూపొందించాలన్న ముఖ్యమంత్రి.
– అంగన్వాడీల్లో పిల్లల ఆరోగ్య పరిస్థితులపై విలేజ్, వార్డు క్లినిక్స్ ద్వారా పరిశీలన చేయించాలన్న ముఖ్యమంత్రి.
– వైద్యపరంగా ఎలాంటి చికిత్సలు అవసరమైనా ఆరోగ్యశ్రీని వినియోగించుకుని వారికి మెరుగైన వైద్యం అందించేలా చూడాలన్న సీఎం.
– తల్లికానీ, బిడ్డకానీ.. ఎవరైనా రక్తహీనత, పౌష్టికాహారలోపం లాంటి సమస్యలతో బాధపడుతుంటే.. వాటిని నివారించడానికి సమగ్రమైన కార్యాచరణ ఉండాలన్న సీఎం.
– ఈ విషయంలో అంగన్వాడీలు, విలేజ్ క్లినిక్స్, వైద్య ఆరోగ్య శాఖలు సమన్వయంతో పనిచేయాలన్న సీఎం.
– ఇలాంటి సమస్యలు ఉన్నవారికి అందరితోపాటు ఇచ్చే ఆహారం, అందరితోపాటు ఇచ్చే మందులు కాకుండా.. అదనంగా ఇస్తూ... వీరి ఆరోగ్యాన్ని మెరుగుపరచడంపై దృష్టి పెట్టాలన్న సీఎం.
– దీనిపై ఎస్ఓపీలను తయారు చేయాలన్న సీఎం.
– ఫిబ్రవరి 1 నుంచి దీన్ని అమలు చేయాలన్న సీఎం.
– ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్తో దీనికి పరిష్కారం చూపించాలన్న సీఎం.
– తల్లులకు టేక్ హోం రేషన్ విధానం పై ఆలోచన చేయాలన్న సీఎం.
దీనికోసం లోపాలకు తావులేని విధానాన్ని రూపొందించాలన్న సీఎం.
– అంగన్వాడీలలోలను, ప్రభుత్వ బడులలో బలహీనవర్గాలకు చెందిన పిల్లలే అధికంగా ఉంటారు.
ఈ వర్గాలకు చెందిన పిల్లలకు తోడుగా నిలబడాల్సిన అవసరం ఉంది.
వారి పట్ల సానుకూల ధృక్పధంతో పనిచేయాలన్న సీఎం.
– 10–12 ఏళ్ల వయస్సులో మంచి బోధన అందించడం ద్వారా ఉత్తమైన ఫలితాలు సాధించవచ్చన్న సీఎం.
– విద్య, వ్యవసాయం, వైద్య ఆరోగ్యం తరహాలో మహిళ, శిశు సంక్షేమాన్ని కూడా ప్రభుత్వం ప్రాధాన్యకార్యక్రమంగా చేపట్టిందన్న సీఎం.
ఈ సమీక్షా సమావేశంలో మహిళా, శిశు సంక్షేమశాఖ మంత్రి కే వి ఉషశ్రీ చరణ్, సీఎస్ డాక్టర్ కే ఎస్ జవహర్ రెడ్డి, మహిళా శిశు సంక్షేమశాఖ ముఖ్య కార్యదర్శి ముద్దాడ రవిచంద్ర, ఏపీ డెయిరీడెవలప్మెంట్ కార్పొరేషన్ ఎండీ ఎ బాబు, పాఠశాల మౌలికవసతులశాఖ కమిషనర్ కాటమనేని భాస్కర్, పౌరసరఫరాలశాఖ ఎండీ జీ వీరపాండ్యన్, మహిళా శిశు సంక్షేమశాఖ డైరెక్టర్ డాక్టర్ ఏ సిరి, మార్క్ ఫెడ్ ఎండీ రాహుల్ పాండే, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
addComments
Post a Comment