అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందించడమే ప్రధాన లక్ష్యం

 

నెల్లూరు, జనవరి 4  (ప్రజా అమరావతి): అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందించడమే ప్రధాన లక్ష్యం


గా గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి శ్రీ కాకాణి గోవర్ధన్ రెడ్డి  పేర్కొన్నారు. 


బుధవారం సాయంత్రం సర్వేపల్లి నియోజకవర్గం వెంకటాచలం మండలం  చెముడుగుంట గ్రామంలో రెండోరోజు  గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పర్యటించిన  మంత్రికి గ్రామ ప్రజలు, స్థానిక నాయకులు ఘన స్వాగతం పలికారు.  


తొలుత గ్రామంలోని చింతాలమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు పాల్గొన్న మంత్రి అనంతరం గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా గ్రామంలోని ప్రతి ఇంటికి వెళ్లి ప్రజలను ఆప్యాయంగా పలకరించి, వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు.


ఈ సందర్భంగా మంత్రి  మాట్లాడుతూ   అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందించాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి వినూత్నంగా గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని చేపట్టారన్నారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు సక్రమంగా అందుతున్నాయా తెలుసుకోవడం, అందకపోతే కారణాలు తెలుసుకొని అర్హులందరికీ అందించడమే ధ్యేయంగా ప్రతి గడపకు వెళుతున్నామన్నారు. చెముడుగుంట గ్రామంలో అర్హత గల ప్రతి ఒక్కరికి ఇంటి స్థలాలు కేటాయించి ఇల్లు నిర్మించి ఇస్తామన్నారు. అర్హత ఒకటే ప్రామాణికంగా ఎటువంటి దళారులు, నాయకులు లేకుండా నేరుగా  సంక్షేమ పథకాలను ప్రజలకు చేరవేస్తున్నట్లు చెప్పారు.  గ్రామాల్లో పర్యటించినప్పుడు గ్రామస్తులు అడిగిన అభివృద్ధి పనులను మంజూరు చేయించి పూర్తి చేయించేందుకు కృషి చేస్తున్నామన్నారు. గ్రామాల అభివృద్ధి, సమగ్రంగా సంక్షేమ పథకాలు అందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు చెప్పారు.


ఈ కార్యక్రమంలో తాసిల్దార్ నాగరాజు, సర్పంచ్ విజయమ్మ, స్థానిక నాయకులు మందల వెంకట శేషయ్య, కుంచె రమేష్, సచివాలయ సిబ్బంది, వివిధ శాఖల మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు.

Comments