శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం, ఇంద్రకీలాద్రి,
విజయవాడ (ప్రజా అమరావతి):
ఈ రోజు అనగా ది.25-01-2023న ప్రముఖ సినీ నటులు మరియు జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ కె. పవన్ కళ్యాణ్ గారు మరియు రాష్ట్ర మాజీ శాసనసభ స్పీకర్ మరియు జనసేన నాయకులు శ్రీ నాదెండ్ల మనోహర్ గారు శ్రీ అమ్మవారి దర్శనార్థము ఆలయమునకు విచ్చేసి అమ్మవారిని దర్శించుకున్నారు. శ్రీ అమ్మవారి దర్శనానంతరము వేదపండితులు వీరికి వేద ఆశీర్వచనము చేయగా, ఆలయ కార్యనిర్వహణాధికారి డి.భ్రమరాంబ గారు శేషవస్త్రము, శ్రీ అమ్మవారి ప్రసాదములు, చిత్రపటం అందజేసినారు. ఘాట్ రోడ్ ఎంట్రన్స్ వద్ద ఉన్న శ్రీ కామధేను అమ్మవారి ఆలయము వద్ద వారాహి వాహన పూజ నిర్వహించడం జరిగినది.
addComments
Post a Comment