*బీఆర్ఎస్లోకి ఊపందుకున్న చేరికలు*
*మంత్రుల సమక్షంలో గులాబి కండువాలు కప్పుకున్న పలువురు కాంగ్రెస్ నేతలు*
*కేసీఆర్ నాయకత్వం దేశానికి ఎంతో అవసరం - మంత్రులు హరీశ్రావు, ఎర్రబెల్లి దయాకర్ రావు*
హైదరాబాద్, జనవరి 30 (ప్రజా అమరావతి);
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ కేసిఆర్ గారి నాయకత్వం దేశానికి ఎంతో అవసరమనికి రాష్ట్ర ఆర్థికశాఖ, వైద్య ఆరోగ్యశాఖల మంత్రి హరీశ్రావు, రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి మరియు గ్రామీణ నీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు గారు అన్నారు.
పరకాల నియోజకవర్గం, గీసుగొండ మండలంలోని కాంగ్రెస్ పార్టీకి చెందిన వైస్ ఎంపీపీ, సర్పంచులు, మాజీ సర్పంచులతో పాటు పలువురు నాయకులు పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి గారి ఆధ్వర్యంలో మంత్రులు తన్నీరు హరీశ్రావు, ఎర్రబెల్లి దయాకర్రావు గార్ల సమక్షంలో నేడు హైదరాబాద్ లో, బీ.ఆర్.ఎస్. పార్టీలో చేరారు.
ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ తెలంగాణ కోసం అలుపెరుగని పోరాటం చేసి.. కేసీఆర్ ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించి, దేశంలోనే నెంబర్ వన్గా నిలిపారని కొనియాడారు. సీఎం కేసీఆర్ విధివిధానాలకు ఆకర్షితులమై తాము బీఆర్ఎస్లో చేరుతున్నట్లు నాయకులు పేర్కొన్నారు.
పార్టీలో చేరిన వారిలో గీసుకొండ వైస్ ఎంపీపీ రడం శ్రావ్య భరత్, రాంపూర్ సర్పంచ్ గాజర్ల గోపి, మచ్చాపూర్ మాజీ సర్పంచ్ నమిండ్ల మానస, సీనియర్ కాంగ్రెస్ నాయకులు పొలబోయిన గోవర్ధన్, పొలబోయిన శ్రీనివాస్, కందికొండ రాజు, ఇట్టారి గురువయ్య, యూత్ లీడర్లు పొలెబోయిన సంపత్, గాజర్ల రంజిత్, పేర్ల శ్రవణ్, మంద అనిల్, పులి నాగేశ్, దండబోయిన సుమన్, పొలెబోయిన రాము తదితరులు ఉన్నారు.
ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ సీనియర్ నేత దాసోజు శ్రావణ్ కుమార్, గీసుగొండ మండల అధ్యక్షులు వీరగోని రాజకుమార్, జెడ్పిటిసి పోలీస్ ధర్మారావు, పుండ్రు జైపాల్ రెడ్డి, జూలూరి లెనిన్, యాత్ర బాలకృష్ణ, రౌతు యుగేందర్ తదితరులు పాల్గొన్నారు.
addComments
Post a Comment