అన్నివర్గాల సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తున్న ముఖ్యమంత్రి


 

నెల్లూరు, జనవరి 19  (ప్రజా అమరావతి): అన్నివర్గాల సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తున్న ముఖ్యమంత్రి


శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి పాలన పట్ల ప్రజలు పూర్తిస్థాయిలో సంతృప్తి వ్యక్తం చేస్తున్నారని  రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి శ్రీ కాకాణి గోవర్ధన్ రెడ్డి  పేర్కొన్నారు. 


గురువారం సాయంత్రం సర్వేపల్లి నియోజకవర్గం ముత్తుకూరు మండల కేంద్రంలో మూడో రోజు గడపగడపకు మన ప్రభుత్వంలో భాగంగా సాయినగర్ కాలనీలో  పర్యటించిన  మంత్రికి గ్రామ ప్రజలు, స్థానిక నాయకులు ఘన స్వాగతం పలికారు.  ప్రతి గడపకు వెళ్ళిన మంత్రి ఆ కుటుంబ సభ్యులతో మమేకమవుతూ, వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు


ఈ సందర్భంగా మంత్రి  మాట్లాడుతూ   అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందించాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి వినూత్నంగా గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని చేపట్టారన్నారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు సక్రమంగా అందుతున్నాయా తెలుసుకోవడం, అందకపోతే కారణాలు తెలుసుకొని అర్హులందరికీ అందించడమే ధ్యేయంగా ప్రతి గడపకు వెళుతున్నామన్నారు. ఇచ్చిన ప్రతి ఒక్క హామీని నెరవేరుస్తున్నామని, ముత్తుకూరు మండల వాసులకు నాన్ ఫిషర్ మాన్ ప్యాకేజీని అందించామని, కొన్ని సాంకేతిక కారణాలతో కొంతమందికి నగదు జమ కాలేదని,   సాంకేతిక కారణాలను సరిచేసి నగదు జమ చేసేందుకు  చర్యలు చేపట్టామన్నారు. ఒకవేళ బ్యాంకు సమస్యలు పరిష్కారం కాకపోతే చెక్కు రూపంలో అయినా లబ్ధిదారులకు నగదు అందించే ప్రయత్నం చేస్తున్నామన్నారు. ఈ మూడేళ్ల కాలంలో అన్ని వర్గాల సంక్షేమమే లక్ష్యంగా  పనిచేశామని, రానున్న రోజుల్లో మరింత ఎక్కువగా అభివృద్ధి, సంక్షేమానికి ప్రాధాన్యతనిస్తూ పనిచేస్తామన్నారు. సర్వేపల్లి నియోజకవర్గం పరిధిలో ఇప్పటికే 50 సచివాలయాల పరిధిలో గడపగడపకు మన ప్రభుత్వం మన ప్రభుత్వం కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేశామని, ప్రతి గడపలోనూ ప్రజలు ముఖ్యమంత్రి పాలన పట్ల సంతృప్తి వ్యక్తం చేస్తున్నారని, ఇదే తమ ప్రభుత్వ పారదర్శ పాలనకు నిదర్శనమన్నారు. 

ఈ కార్యక్రమంలో ఎంపీపీ గండవరం సుగుణమ్మ, జడ్పిటిసి వెంకటసుబ్బయ్య, ఎంపీడీవో ప్రత్యూష, తాసిల్దార్ మనోహర్ బాబు,  స్థానిక నాయకులు, సచివాలయ సిబ్బంది, వివిధ శాఖల మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు.


Comments