చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు సారా బట్టీలను ధ్వంసం చేశాం..


 తిరుపతిజిల్లా, సత్యవేడు నియోజకవర్గం, వెంకటరెడ్డి కండ్రిగ (ప్రజా అమరావతి);

మీ తరపున పోరాడుతున్నానని ప్రభుత్వం నా గొంతు నొక్కుతోంది.

కనీసం మీ కష్టాలు తెలుసుకునేందుకు కూడా మైకు ఇవ్వడం లేదు.

పోలీసులను అడ్డుపెట్టి జగన్ రెడ్డి, వైసీపీ నాయకులు యువగళాన్ని అడ్డుకుంటున్నారు..

గతంలో రాజశేఖరరెడ్డి, జగన్మోహన్ రెడ్డి, షర్మిల పాదయాత్ర చేసినప్పుడు కూడా మనం ఎవర్నీ అడ్డుకోలేదు...స్వేచ్ఛగా మీటింగులు పెట్టుకోనిచ్చాం...దాన్ని వాళ్లు మరిచారు.

మంత్రి రోజా మహిళల్ని అడ్డగోలుగా అవమానిస్తున్నారు.

తెలుగింటి ఆడపడుచులు రోజాకు సారె తీసుకెళ్తే రోజా వాళ్లను జైలుకు పంపింది.

అడ్డగోలుగా వ్యవహరించిన ఏ ఒక్కర్నీ వదిలిపెట్టను.

మీ సమస్యలు చెప్పండి....వాటిని ఏ విధంగా పరిష్కరించుకోవాలో ఆలోచిద్దాం.



జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తానని హామీ ఇచ్చాడు..

కానీ అధికారంలోకి వచ్చాక మద్యం వ్యాపారాన్ని జగన్ రెడ్డి అధికంగా చేస్తున్నాడు.

ప్రభుత్వం అమ్మే మద్యాన్ని కెమికల్ ల్యాబ్ కు పంపితే అది పురుగుల మందుకంటే విషతుల్యమని రిపోర్టులు వచ్చాయి..

కల్తీ మద్యం రాష్ట్రంలో ఏరులై పారుతోంది...అదీ చాలక సారా బట్టీలు నడుపుతున్నారు.

రోడ్డుకు ఒకవైపు పాఠశాల...మరోవైపు మద్యం షాపు ఉంది ఈ రాష్ట్రంలో.

చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు సారా బట్టీలను ధ్వంసం చేశాం..

కల్తీమద్యం, సారాయిపై మహిళలు పెద్దఎత్తున ఉద్యమించాలి..మీకు మేం అండగా ఉంటాం.

టీడీపీ అధికారంలోకి వచ్చాక వీటిని నిషేధిస్తాం.

తూర్పుగోదావరిలో టీడీపీ మహిళలు కల్తీ సారాపై పోరాడితే వారిపైనే పోలీసులు కేసులు పెట్టారు.

మహిళల సమస్యలపై పోరాడుతున్నా వైసీపీ ప్రభుత్వం అక్రమ కేసులు బనాయిస్తోంది.

నాపై వైసీపీ ప్రభుత్వం వచ్చాక ఇప్పటికి 20కేసులు పెట్టారు. ఎన్నికేసులు పెట్టినా మనం భయపడే పరిస్థితి లేదు.

మహిళల సమస్యల్ని అధికారంలోకి వచ్చాక పరిష్కరిస్తాం.

ప్రభుత్వాలు ఎప్పటికీ శాశ్వతం కాదు...ప్రజలు శాశ్వతం.

ప్రభుత్వాలు మారినప్పుడు పేదవాళ్లకు అమలయ్యే పథకాలు నిలుపుదల చేయకూడదు.

చంద్రన్న బీమాను కూడా వైసీపీ ప్రభుత్వం నిలిపేసింది.

పేద కుటుంబాలకు ఆర్థిక తోడ్పాటునివ్వాలనే సదుద్దేశంతో చంద్రన్నబీమా పెట్టాం..

ఈ పథకం అమలైన అనేక కుటుంబాలు అప్పుల ఊబినుండి బయటపడి ప్రశాంతంగా బతికాయి..

పేద,మధ్యతరగతి ప్రజలకు చంద్రబాబు ఇచ్చిన భోరోసా ఈ పథకం.

2014లో ఒక ఇంట్లో ఎంత మంది అర్హులుంటే అంతమందికి పెన్షన్ ఇవ్వాలనే నిర్ణయాన్ని చంద్రబాబు చేశారు. 

ఒక ఇంట్లో కనీసం ఇద్దరికైనా పెన్షన్లు ఇవ్వాలని క్యాబినెట్ నిర్ణయించింది.

జగన్ సీఎం అయ్యాక పెన్షన్లు ఎలా నిలిపేయాలో ఆలోచిస్తున్నారు.

వైసీపీ పాలనలో ఇప్పటికీ 6లక్షల పెన్షన్లు నిలిపేశారు.

చంద్రబాబు సీఎం అయ్యాక జగన్ రద్దు చేసిన పెన్షన్లన్నీ పునరుద్ధరిస్తాం..అర్హులందరికీ పెన్షన్లు ఇస్తాం.

గతంలో టీడీపీ పాలనలో అమలైన విధానాలన్నీ పునరుద్ధరిస్తాం.

చంద్రబాబు పాలనలో పెన్షన్ రూ.1800పెంచితే...జగన్ రెడ్డి 4ఏళ్లలో రూ.750మాత్రమే పెంచారు.

దేశంలో ఎక్కడా లేని విధంగా నిత్యావసరాల ధరలు ఏపీలోనే ఉన్నాయి

కేరళ రాష్ట్రం నిత్యావసరాల ధరలు తగ్గించడానికి బడ్జెట్ లో రూ.2వేల కోట్లు కేటాయించారు.

చంద్రబాబు సీఎం అయ్యాక నిత్యావసరాల ధరలు తగ్గిస్తాం...పెట్రోల్, డీజిల్ ధరలు కూడా తగ్గిస్తాం.

ఆర్టీసీ బస్సు టికెట్ గతంలో రూ.10 ఉంటే నేడు రూ.30కి పెరిగింది.

ముఖ్యమంత్రి కార్యక్రమాలకు కూడా డ్వాక్రా మహిళల డబ్బులను వైసీపీ నాయకులు లాక్కుంటున్నారు.

మహిళలు దాచుకున్న డబ్బులను దోచేస్తున్నారు.

టీడీపీ ఏనాడూ డ్వాక్రా మహిళలను ఇబ్బందిపెట్టింది లేదు.


రెండు ఫ్యాన్లు, ఒక లైట్, ఒక టీవీ ఉన్న ఇంటికి లక్ష రూపాయల బిల్లు ఎలా వస్తుంది జగన్?

ఎస్టీలకు ప్రభుత్వం 200యూనిట్లు ఉచిత విద్యుత్ ఇస్తోంది.

అయినా మీకు లక్ష రూపాయల బిల్లు రావడం ప్రభుత్వ అసమర్థతే.

జగన్ సీఎం అయ్యాక ఎస్సీ, ఎస్టీల సంక్షేమ పథకాలన్నీ రద్దు చేశాడు.

అందుకే ఈ విధంగా లక్షల్లో బకాయిలు చూపి ముక్కుపిండి వసూలు చేస్తున్నారు.

విద్యుత్ కనెక్షన్ ఇవ్వడానికి కూడా జగన్ ప్రభుత్వం పేదవాడి జేబులు ఖాళీ చేస్తున్నారు.

జగన్ అధికారంలోకి వచ్చాక మహిళలను ఘోరంగా మోసం చేస్తున్నాడు.

2019ఎన్నికల ముందు ఇచ్చిన ప్రతి హామీని జగన్ రెడ్డి విస్మరించారు.

జగన్ సీఎం అయ్యాక 900మందిపై అత్యాచారాలు జరిగితే జగన్ కనీసం స్పందించలేదు.

సీఎం ఇంటి సమీపంలోనే ఇటీవల ఓ యువకుడు గంజాయి మత్తులో ఓ దళిత యువతి రాణిని దారుణంగా నరికి చంపేశాడు.

కనీసం ముఖ్యమంత్రి నోరువిప్పలేదు...కేవలం రూ.10లక్షలు ప్రభుత్వం ప్రకటించింది.

ఏపీలో దిశచట్టం లేదు...కానీ ఏదేదో చేస్తున్నట్లు జగన్ మహిళల్ని మోసం చేస్తున్నాడు.

ఎస్సీ,ఎస్టీ,బీసీ,మైనారిటీ మహిళలకు 45ఏళ్లకే పెన్షన్ ఇస్తానని చెప్పి మోసం చేశాడు.

జగన్ రెడ్డి సంక్షేమ పథకాలు ఇవ్వడానికి కాకుండా వాటిని ఎలా రద్దు చేయాలో ఆలోచిస్తున్నాడు.

మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మీకు న్యాయం చేస్తాం.

జగన్ సీఎం అయ్యాక ఆరోగ్యశ్రీ పథకాన్ని నాశనం చేశాడు.ఆసుపత్రులకు బిల్లులు కట్టడం లేదు..

చంద్రన్న పాలనలో ఆరోగ్యశ్రీ పథకం చాలా ఎక్కువగా అమలైంది..

ఈ పథకానికి ఎన్టీఆర్ పేరు తీసేసి వైఎస్ఆర్ పేరు పెట్టుకున్నాడు జగన్.

నేడు వైఎస్ఆర్ పేరును కూడా జగన్ చెడగొడుతున్నాడు.

జగన్ ప్రభుత్వం ఇచ్చిన ఆరోగ్యశ్రీ కార్డు దేనికీ పనికిరాదు.

ఏపీకి జగరోనా అనే వైరస్ పట్టింది....చంద్రన్న అనే వ్యాక్సిన్ పడితేనే రాష్ట్రం బాగుపడుతుంది.

జగరోనా వైరస్ కరోనా వైరస్ కంటే చాలా ప్రమాదం..మరోసారి జగన్ సీఎం అయితే రాష్ట్రం దివాలా తీయాల్సిందే.

చంద్రన్నను సీఎం చేసుకుంటే భవిష్యత్తు బాగుంటుంది.

Comments