గుడివాడలో మొదలైన వెనిగండ్ల రాము ప్రభంజనం

 *- గుడివాడలో మొదలైన వెనిగండ్ల రాము ప్రభంజనం


 *- గుడ్ మెన్ పేటలో ఇంటింటికీ తెలుగుదేశం* 

 *- వెనిగండ్లకు బ్రహ్మరథం పట్టిన అశేష జనవాహిని* 

 *- ప్రజలతో మమేకమై సమస్యలు తెలుసుకున్న వెనిగండ్ల* 

 *- మద్దతుగా తరలివచ్చిన యువతలోనూ యమక్రేజ్*



గుడివాడ, మార్చి 27 (ప్రజా అమరావతి): కృష్ణాజిల్లా గుడివాడ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, ఎన్నారై వెనిగండ్ల రాము ప్రభంజనం మొదలైంది. గుడివాడ పట్టణంలోని గుడ్ మెన్ పేటలో నిర్వహించిన ఇంటింటికీ తెలుగుదేశం కార్యక్రమానికి ప్రజలు వేలాదిగా తరలివచ్చారు. గుడ్ మెన్ పేట ప్రాంతం అశేష జనవాహినితో నిండిపోయింది. మహిళలు అడుగడుగునా హారతులిస్తూ వెనిగండ్ల రాముకు బ్రహ్మరథం పట్టారు. ప్రజలు పూలవర్షం కురిపిస్తూ గుడ్ మెన్ పేటలోకి స్వాగతం పలికారు. వేలాదిగా వచ్చిన ప్రజలు, మహిళలు, యువతకు వెనిగండ్ల రాము అభివాదం చేస్తూ గుడ్ మెన్ పేటలో విస్తృతంగా పర్యటించారు. ఇంటింటికీ వెళ్ళి ప్రజలతో మమేకమయ్యారు. ప్రజలందరినీ కలుస్తూ వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. స్థానికంగా నెలకొన్న సమస్యలను ప్రత్యక్షంగా వీక్షించారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై ఆరా తీశారు. ముఖ్యంగా యువతలో వెనిగండ్ల రాముపై మంచి క్రేజ్ ఉన్నట్టుగా కన్పించింది. పాఠశాలలు, కళాశాలల విద్యార్థులు వెనిగండ్ల రాముతో సెల్ఫీలు దిగేందుకు పోటీపడ్డారు. సహజంగానే చదువుకునే విద్యార్థులంటే అమితంగా ఇష్టపడే వెనిగండ్ల రాము నవ్వుతూ, ఎంతో చక్కగా వారిని పలకరిస్తూ ఫొటోలు దిగడం అందరినీ ఆకర్షించింది. విద్యార్థుల లక్ష్యాలు, వారి తల్లిదండ్రుల ఆర్ధిక స్థితిగతులను తెలుసుకుంటూ ముందుకు సాగారు. యువతలో వెనిగండ్ల రాముకు ఇంతటి క్రేజ్ రావడానికి కారణాలూ లేకపోలేదు. తన ఫౌండేషన్ ద్వారా ఇటీవల గుడివాడ పట్టణంలోని వీకేఆర్, వీఎన్బీ అండ్ ఏజికే కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ లో మెగా జాబ్ మేళాను నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రముఖ కంపెనీలను ఆహ్వానించి అర్హులైన దాదాపు 2వేల మంది విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలను కల్పించారు. నిత్యం పదుల సంఖ్యలో ఉద్యోగాల కోసం నిరుద్యోగ అభ్యర్థులు వెనిగండ్ల రామును కలుస్తూ వస్తున్నారు. అభ్యర్థుల అర్హతల ఆధారంగా ఆయా కంపెనీల్లో ఇంటర్వ్యూలను ఏర్పాటు చేయిస్తూ యువతకు తమ భవిష్యత్తుపై ఉన్న ఆశలను పెంచుతున్నారు. చదువుకున్న ప్రతి ఒక్కరికీ ఉద్యోగ అవకాశాలపై భరోసాను కల్పిస్తున్నారు. దీంతో యువతలో వెనిగండ్ల రాముపై విశ్వాసం రోజురోజుకూ పెరుగుతూ వస్తోంది. ఈ కారణంగానే గుడివాడ పట్టణం గుడ్ మెన్ పేటలో నిర్వహించిన ఇంటింటికీ తెలుగుదేశం కార్యక్రమంలో ప్రధానంగా యువత భాగస్వామ్యం స్పష్టంగా కన్పించింది. ఇదిలా ఉండగా ఇంటింటికీ తెలుగుదేశం కార్యక్రమంలో భాగంగా వికలాంగులకు ట్రై సైకిళ్ళు, చిరు వ్యాపారులకు తోపుడుబండ్లు, రజక వృత్తిదారులకు ఇస్త్రీ బళ్ళను అందజేస్తూ వెనిగండ్ల రాము అన్నివర్గాలకు మరింత చేరువవవుతున్నారు.

Comments