జగనన్న విద్యా దీవెన

 

అమరావతి (ప్రజా అమరావతి);


*జగనన్న విద్యా దీవెన*


*పూర్తి ఫీజు రీఇంబర్స్‌మెంట్‌ – క్రమం తప్పకుండా ఏ త్రైమాసికం ఫీజు ఆ త్రైమాసికం అయిన వెంటనే చెల్లింపులు*


*అక్టోబర్‌ – డిసెంబర్‌ 2022 త్రైమాసికానికి 9.86 లక్షల మంది విద్యార్ధులకు రూ. 698.68 కోట్లను సీఎం శ్రీ వైఎస్‌ జగన్‌ నేడు (19.03.2023) ఎన్‌టీఆర్‌ జిల్లా తిరువూరులో బటన్‌ నొక్కి నేరుగా విద్యార్ధుల తల్లుల ఖాతాల్లో జమ చేయనున్న సీఎం శ్రీ వైఎస్‌ జగన్‌*


*గత ప్రభుత్వం అరకొరగా ఇచ్చిన ఫీజు రీఇంబర్స్‌మెంట్‌కు 2017 సంవత్సరం నుండి పెట్టిన బకాయిలు రూ. 1,778 కోట్లతో కలిపి ఇప్పటివరకు జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన క్రింద శ్రీ వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం అందించిన మొత్తం సాయం రూ. 13,311 కోట్లు*.


పేద విద్యార్ధులు ఉన్నత చదువులు అభ్యసించేందుకు శ్రీ వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం అందిస్తున్న జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన పథకాలకు లిమిట్స్‌ లేవు. కుటుంబంలో ఎంతమంది చదువుతుంటే అంతమందిని చదివించవచ్చు. 


*జగనన్న విద్యా దీవెన*


పేద విద్యార్ధులు కూడా పెద్ద చదువులు చదవాలన్న సమున్నత లక్ష్యంతో ఐటీఐ, పాలిటెక్నిక్, డిగ్రీ, ఇంజినీరింగ్, మెడిసిన్‌ తదితర కోర్సులు చదివే పేద విద్యార్ధులు కాలేజీలకు చెల్లించాల్సిన పూర్తి ఫీజుల మొత్తాన్ని క్రమం తప్పకుండా ఏ త్రైమాసికానికి ఆ త్రైమాసికం ముగిసిన వెంటనే విద్యార్ధుల తల్లుల ఖాతాల్లో నేరుగా జమ చేస్తున్న శ్రీ వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం


*జగనన్న వసతి దీవెన*


ఉన్నత చదువులు చదివే పేద విద్యార్ధులు భోజన, వసతి ఖర్చుల కోసం ఇబ్బంది పడకుండా ఏటా రెండు వాయిదాలలో ఐటీఐ విద్యార్ధులకు రూ. 10 వేలు, పాలిటెక్నిక్‌ విద్యార్ధులకు రూ. 15 వేలు, డిగ్రీ, ఇంజినీరింగ్, మెడిసిన్‌ తదితర కోర్సులు అభ్యసించేవారికి రూ. 20 వేల చొప్పున ఆర్ధిక సాయం. కుటుంబంలో ఎంతమంది చదువుతుంటే అంతమందికి, వారి తల్లుల ఖాతాల్లో సంవత్సరానికి రెండు దఫాల్లో నేరుగా జమ చేస్తున్న శ్రీ వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం


కాలేజీల్లో జవాబుదారీతనం పెరిగేలా, తల్లులకు ప్రశ్నించే హక్కు కల్పిస్తూ, తల్లుల సాధికారతకు పట్టం కడుతూ ఆర్ధిక సాయం నేరుగా విద్యార్ధుల తల్లుల ఖాతాల్లో జమ


గత ప్రభుత్వంలో ఉన్నత చదువులు చదివే పేద విద్యార్ధులకు పూర్తి ఫీజు రీఇంబర్స్‌మెంట్‌ ఇవ్వాలనే ఆలోచన కూడా చేయలేదు, అరకొరగా ఇచ్చిన ఫీజు రీఇంబర్స్‌మెంట్‌ కూడా సంవత్సరాల తరబడి జాప్యంతో, భారీగా బకాయిలు పెట్టిన పరిస్ధితి, భోజన, వసతి ఖర్చులు దేవుడెరుగు, ఇచ్చిన ఫీజు రీఇంబర్స్‌మెంట్‌ సైతం అరకొరగా ఇచ్చిన గత ప్రభుత్వం. 


*ఉన్నత విద్యకు ప్రోత్సాహం*


పేద విద్యార్ధులు ఉన్నత విద్యను అభ్యసించేలా పూర్తి ఫీజు రీఇంబర్స్‌మెంట్‌తో పాటు భోజన, వసతి సౌకర్యాలకు కూడా ఆర్ధిక సాయం అందిస్తూ జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన


జాబ్‌ ఓరియెంటెడ్‌ కరిక్యులమ్‌తో ప్రస్తుత అవసరాలకు తగ్గట్లు కరిక్యులమ్‌లో మార్పులు చేసి నాలుగేళ్ళ ఆనర్స్‌ కోర్సులు, విద్యార్ధులలో నైపుణ్యాలు పెంచి వారు వెంటనే ఉపాధి పొందేలా 30 శాతం నైపుణ్యాభివృద్ది కోర్సులు


కరిక్యులమ్‌లో 10 నెలల కంపల్సరీ ఇంటర్న్‌షిప్‌ పెట్టడం ద్వారా విద్యార్ధులను పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా తీర్చిదిద్దుతున్న శ్రీ వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం


40 నైపుణ్యాలలో 1.62 లక్షల మంది విద్యార్ధులకు శిక్షణ ఇచ్చేందుకు మైక్రోసాఫ్ట్‌తో ఒప్పందం, ఇప్పటికే 1.07 లక్షల మందికి మైక్రోసాఫ్ట్‌ టెక్నాలజీలో, 73 వేల మందికి ఇతర అత్యాధునిక సాంకేతిక అంశాల్లో శిక్షణ పూర్తి, సర్టిఫికెట్స్‌ పంపిణీ, దేశంలో ఒకే క్యాలెండర్‌ ఇయర్‌లో 1.75 లక్షల కంటే ఎక్కువ సర్టిఫికేషన్స్‌ సాధించిన ఏకైక రాష్ట్రంగా ఏపీ


*సత్ఫలితాలు ఇస్తున్న శ్రీ వైఎస్‌ జగన్‌ ప్రభుత్వ సంస్కరణలు*


ఇంటర్‌ పాసై పై చదువులకు వెళ్ళని విద్యార్ధుల సంఖ్య 2018–19 లో 81,813 కాగా జగనన్న ప్రభుత్వం ప్రవేశపెట్టిన విద్యా దీవెన, వసతి దీవెన కారణంగా ఈ సంఖ్య గణనీయంగా తగ్గి 2022 –23 నాటికి 22,387 కి చేరింది. 2018 – 19 లో పై చదువులకు వెళ్ళని విద్యార్ధుల సగటు 20.37 శాతం కాగా, 2022–23 నాటికి ఈ సగటు 6.62 శాతంకి తగ్గింది.


2018–19 సంవత్సరంలో 32.4 గా ఉన్న స్ధూల నమోదు నిష్పత్తి (జీఈఆర్‌) 2020–21 సంవత్సరానికి 37.2 కి పెరిగింది. రాబోయే రోజుల్లో జీఈఆర్‌ శాతం 70 కి తీసుకువెళ్ళేలా చర్యలు. 2018–19లో సగటున ప్రతి 100 మంది బాలురకు 81 మంది బాలికలు కళాశాలల్లో చేరితే 2020–21 నాటికి ఈ సగటు 94 కు పెరిగింది. 


2018–19 లో 37,000 గా ఉన్న క్యాంపస్‌ ప్లేస్‌మెంట్స్‌ కూడా గణనీయంగా పెరిగి 2021 – 22 సంవత్సరానికి 85,000 కు చేరడం విశేషం


అర్హులందరికీ క్రమం తప్పకుండా కుల, మత, పార్టీ వివక్ష లేకుండా, లంచాలకు తావు లేకుండా పారదర్శకంగా పథకాలు అందిస్తూ కేవలం విద్యారంగంలో సంస్కరణలపై మాత్రమే శ్రీ వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం గత 45 నెలల్లో చేసిన వ్యయం మొత్తం రూ. 57,642.36 కోట్లు. 


*డిజిటల్‌ విద్య దిశగా అడుగులు*


8 వ తరగతి విద్యార్ధులకు బైజూస్‌ కంటెంట్‌ తో కూడిన ఉచిత ట్యాబ్‌లు, నాడు నేడు ద్వారా ఇప్పటికే అభివృద్ది చేసిన పాఠశాలల్లో 6 వ తరగతి పైన ప్రతి క్లాస్‌ రూమ్‌లో ఉండేలా 30,213 ఇంటరాక్టివ్‌ ఫ్లాట్‌ ప్యానల్స్, 10.038 ఫౌండేషన్, ఫౌండేషన్‌ ప్లస్‌ స్కూళ్ళల్లో స్మార్ట్‌ టీవీలు. 


ప్రభుత్వ బడులు కార్పొరేట్‌ బడులతో పోటీ పడడం కాదు, కార్పొరేట్‌ బడులే ప్రభుత్వ బడులతో పోటీపడాలి అన్న లక్ష్యంతో విద్యావ్యవస్ధలో విప్లవాత్మక సంస్కరణలు ప్రవేశపెట్టిన శ్రీ వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం.

Comments