*రూయ చిన్నపిల్లల ఆసుపత్రి విభాగం వైద్య అధికారుల పనితీరు సేవలు బాగున్నాయి
*
*రూయా చిన్న పిల్లల ఆసుపత్రిని ఆకస్మిక తనిఖీ చేసిన జాతీయ బాలల హక్కుల కమిషన్ సభ్యులు డాక్టర్ ఆర్.జి ఆనంద్*
తిరుపతి, మార్చి25 (ప్రజా అమరావతి): రూయా ఆసుపత్రి చిన్న పిల్లల విభాగంలోని వివిధ విభాగాలను ఆకస్మిక తనిఖీ చేసి సంతృప్తి వ్యక్తం చేసిన జాతీయ బాలల హక్కుల కమిషన్ సభ్యులు డాక్టర్ ఆర్.జి ఆనంద్.
శనివారం సాయంత్రం స్థానిక రుయా ఆస్పత్రిలోని చిన్న పిల్లల విభాగంలోని నియోనేటల్ ఇంటెన్సివ్ కేర్ వార్డును ఆకస్మిక తనిఖీ చేసి అక్కడ చికిత్స పొందుతున్న పిల్లలకు అందుతున్న సేవలను వారి తల్లులను, డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. అత్యాధునిక పరిజ్ఞానం కలిగిన చికిత్స విధానం మరియు పరికరాలను పరిశీలించారు. అనంతరం జాతీయ గ్రామీణ ఆరోగ్య మిషన్ కింద ఏర్పాటు చేసిన వార్డులలో చికిత్స పొందుతున్న పోషకాహార లోపం గల పిల్లలు, ఎదుగుదల లేని పిల్లలకు అందిస్తున్న చికిత్స విభాగాన్ని సంబంధిత చిన్న పిల్లల ఆసుపత్రి హెచ్ ఓ డి డా. తిరుపతి రెడ్డి వారితో కలిసి పరిశీలించారు. అందులో రోజు వారీగా అందిస్తున్న మెనూ చార్టు, కిచెన్ పరిశీలించి అందులో పిల్లలకు అందిస్తున్న ఎన్ ఆర్ సి లడ్డు ను రుచి చూసి చాలా నాణ్యత గల పౌష్టికాహారం అందిస్తున్నందుకు అధికారులను అభినందించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల ఆరోగ్యం, విద్యా, బాలల శ్రేయస్సు కు కట్టుబడి ఉన్నాయని అన్నారు. ఆసుపత్రి విభాగాలలో పరిశుభ్ర వాతావరణం ఉండేలా చర్యలు చేపడుతున్నందుకు వారికి వారి సిబ్బందిని అభినందించారు. పిల్లలకు కౌన్సెలింగ్ రూము, ఆట పాటలకు ఎన్ ఆర్ సి విభాగంలో ఏర్పాటు బాగుందని అన్నారు.
అనంతరం మీడియాతో మాట్లాడుతూ కేంద్రంలో అత్యున్నత స్థాయి కమిటీ ఈ జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ అనీ ఇది బాలల హక్కులు వారి అభివృద్ధికి కృషి చేసే విభాగం అని తెలిపారు. కేంద్రంలో గౌరవ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రి వైద్య ఆరోగ్యం కు, ఆసుపత్రుల ఏర్పాటు, మౌలిక సదుపాయాల కల్పన కు బాలల శ్రేయస్సు కు పెద్ద పీట వేశారని ఇది శుభ పరిణామం అని అభినందనీయం అని అన్నారు. ఆసుపత్రికి సంబంధించిన బాలలకు ఉపయోగపడే మెరుగైన విధానాల అమలుకు ఏమైనా సహకారం కావాలంటే అందిస్తామని తెలిపారు. తొందరలోనే పూర్తి స్థాయి సభ్యులతో వచ్చి సందర్శిస్తామని తెలిపారు. ఆసుపత్రి పనితీరు, పరిసరాల పరిశుభ్రత, వైద్య సదుపాయాలు చాలా బాగా ఉన్నాయని కితాబిచ్చారు.
తనిఖీ లో వీరి వెంట రుయా ఆసుపత్రి సూపరింటెండెంట్ నాగ మునీంద్రుడు, ప్రసూతి ఆసుపత్రి సూపరింటెండెంట్ పార్థ సారథి రెడ్డి, సి ఎస్ ఆర్ ఎంఓ లక్ష్మా నాయక్, జిల్లా సమాచార పౌర సంబంధాల అధికారి బాల కొండయ్య, పి ఆర్ ఓ కిరణ్ ఇతర వైద్యాధికారులు ఉన్నారు.
addComments
Post a Comment