2023 మే 13 శనివారం జాతీయ లోక్ అదాలత్



రాజమహేంద్రవరం (ప్రజా అమరావతి): 


2023 మే 13 శనివారం జాతీయ లోక్ అదాలత్


- ఇంచార్జ్  డి ఎల్ ఎస్ ఏ చైర్మన్ మరియు ప్రధాన జిల్లా న్యాయమూర్తి  శ్రీమతి కె.సునీత


 జాతీయ న్యాయసేవాధికార సంస్థ మరియు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఆదేశానుసారం తూర్పు గోదావరి జిల్లాలో ఈ దిగువ తెలుపబడిన అన్ని కోర్టుల యందు ది. 13.05.2023 న (శనివారం) జాతీయ లోక్ అదాలత్ నిర్వహించబడునని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఇంచార్జ్ చైర్మన్ మరియు ప్రధాన జిల్లా న్యాయమూర్తి  శ్రీమతి కె.సునీత శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.


పూర్వపు తూర్పు గోదావరి జిల్లా పరిధిలో ఉన్న 15 కోర్టులు రాజమహేంద్రవరం, అమలాపురం,  కాకినాడ, పెద్దాపురం ,  పిఠాపురం , రామచంద్రపురం , రాజోలు , ఆలమూరు , తుని ,  ముమ్మిడివరం , కొత్తపేట ,  ప్రత్తిపాడు , అనపర్తి , రంపచోడవరం ,  అడ్డతీగల లలో మే 13 శనివారం జాతీయ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నట్లు ఆమె తెలిపారు.


ఈ జాతీయ లోక్ అదాలత్ నందు కోర్టులలో పెండింగ్ లో ఉన్న సివిల్ తగాదాలు, యాక్సిడెంట్ కేసులు, బ్యాంకు కేసులు రాజీపడ్డదగ్గ క్రిమినల్ కేసులు మరియు ప్రీ-లిటిగేషన్ కేసులు రాజీమార్గం ద్వారా పరిష్కరింపబడునని పేర్కొన్నారు.



కావున కక్షిదారులందరు ఈ సదావకాశాన్ని ఉపయోగించుకుని జిల్లా వ్యాప్తంగా జరుగు జాతీయ లోక్ అదాలత్ నకు  ది. 13.05.2023 న (శనివారం) ఉదయం 10 గంటల నుండి తమ యొక్క కేసులను ఆయా కోర్టుల నందు పరిష్కరించు కొనవలసినదిగా తెలియ జేయడమైనది. 




Comments