*రేణిగుంట విమానాశ్రయం చేరుకున్న ఆం.ప్ర గవర్నర్ కు ఘన స్వాగతం*
తిరుపతి, ఏప్రిల్ 28, (ప్రజా అమరావతి):
రెండు రోజుల తిరుమల తిరుపతి పర్యటనలో భాగంగా శ్రీ వెంకటేశ్వర వేదిక్ యూనివర్సిటీ ఏడవ కాన్వోకేషన్ కార్యక్రమంలో పాల్గొనుటకు మరియు తిరుమల శ్రీవారిని కుటుంబ సమేతంగా దర్శనం చేసుకునే నేపథ్యంలో నేటి శుక్రవారం ఉదయం 9 గంటలకు రేణిగుంట విమానాశ్రయం చేరుకున్న గౌరవ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ వారికి ఘన స్వాగతం లభించింది.
వీరి వెంట గౌ. ఆం.ప్ర గవర్నర్ గారి ప్రధాన కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ ఉన్నారు.
జిల్లా కలెక్టర్ కే వెంకట రమణారెడ్డి, ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి, వేదిక్ యూనివర్సిటీ వైస్ ఛాన్స్లర్ సదాశివమూర్తి తదితరులు, జిల్లా వక్ఫ్ బోర్డ్ చైర్మన్ సిరాజ్ భాషా ఘన స్వాగతం పలికారు.
వీరితో పాటుగా లైజన్ ఆఫీసర్ చెన్నయ్య, ఎయిర్పోర్ట్ డైరెక్టర్ రాజ్ కిషోర్, శ్రీకాళహస్తి ఆర్డీఓ రామారావు, ఏర్పోర్ట్ సి ఎస్ ఓ రాజశేఖర్, తదితరులు స్వాగతం పలికిన వారిలో ఉన్నారు.
addComments
Post a Comment