పేదలవాళ్ల బతుకులు అన్నీ చితికిపోయాయి. రైతులు కూలీలు నాశనం అయ్యారు.



*నూజివీడులో ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమంలో పాల్గొన్న టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు*


*సభలో టీడీపీ అధినేత ప్రసంగం:-*

అమరావతి (ప్రజా అమరావతి);

మూడు రోజులుగా నా పర్యటనకు అనూహ్య స్పందన కనిపిస్తుంది. ప్రజల్లో చైతన్యానికి ఇది నాంది.

ఎవరి నోట విన్నా సైకో పాలన పోవాలి...సైకిల్ పాలన రావాలి అని కోరుకుంటున్నారు.

ఈ సారి నూజివీడులో కూడా తెలుగు దేశం జెండా ఎగరాలి.

రాష్ట్రంలో ఒక్క వర్గం కూడా ఆనందంగా లేరు. అన్నింటిలో బాదుడే బాదుడు

మళ్లీ ఇప్పుడు కరెంట్ చార్జీలు పెంచుతున్నాడు. 

భవిష్యత్ లో కరెంట్ చార్జీలుపెంచాల్సిన అవసరం లేదు అని చెప్పాను. కానీ జగన్ ముద్దులకు మోస పోయి మీరు జగన్ కు ఓటు వేసి గెలిపించారు

8 సార్లు కరెంట్ చార్జీలు పెంచారు. ఆర్టీసీ చార్జీలు పెంచారు. ఇచ్చింది 10 రూపాయలు...దోచింది 100 రూపాయలు

జగన్ బటన్ నొక్కుడు కాదు...బటన్ బొక్కుడు. మాట్లాడితే నేను బటన్ నొక్కాను అంటాడు.

బటన్ నొక్కుడు గొప్ప కాదు...సంపద సృష్టించే శక్తి ఉండాలి. ఆ సంపద పేదవారికి పంచే శక్తి ఉండాలి.

ఇదొక పరిపాలనా అని నేను అడుగుతున్నా...ఇది అవినీతి పాలన.

పేదలవాళ్ల బతుకులు అన్నీ చితికిపోయాయి. రైతులు కూలీలు నాశనం అయ్యారు.


అమ్మఒడి ఇస్తున్నా అంటున్నాడు...అది నాన్న బుడ్డికి వెళ్లి పోయింది.

రాష్ట్రంలో నాసిరకం బ్రాండ్లు, జె బ్రాండ్లు వచ్చాయా లేదా....

తోపుడు బండి దగ్గర కూడా గూగుల్ పే నుంచి పే చెయ్యవచ్చు....కానీ మద్యం షాపులో మాత్రం ఆన్ లైన్ లో పేమెంట్ లేదు

కొందరు కష్టపడి పనిచేసి...సాయంత్రం మద్యం తాగుతారు...అయితే ఇప్పుడు ఆ అలవాటు వల్లనే ఆర్థికంగా చితికిపోయారు...అనారోగ్యం పాలయ్యారు

రాష్ట్రంలో ఇసుక దొరకడం లేదు. కానీ ఇక్కడ ఎమ్మెల్యే మాత్రం ఇసుక తరలిస్తున్నాడు.

బటన్ బొక్కుడు ద్వారా జగన్ రెడ్డి ఆదాయం రూ. 2 లక్షల కోట్లు

మీ పై పన్నుల భారం రూ 5 లక్షల కోట్లు. 

మీ పై మీ పిల్లలపై అప్పుల భారం రూ.10 లక్షల కోట్లు. అంటే ఒక్కో వ్యక్తిపై రెండు లక్షల అప్పు

రాష్ట్రంలో దొంగల ముఠా పడింది....వైసీపీ ముఠా దోచుకుంటుంది. 

ఇప్పటికైనా రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి ప్రజలు కదిలి రావాలి.

క్విట్ జగన్...సేవ్ ఆంధ్ర ప్రదేశ్ అనే నినాదం కోసం పనిచేయాలి

ముఖ్యమంత్రి నేర చరిత్ర ఉండే వ్యక్తి. నిన్ననే కోడికత్తి డ్రామా బట్టబయలు అయ్యింది.

ఇది కోడికత్తి కమల హాసన్ డ్రామా అని నాడే చెప్పాను. ఆ కోడికత్తి డ్రామా  ఇప్పుడు బయట పడింది.

ఐదు ఏళ్ల నుంచి కోడికత్తి నిందితుడు జైల్లో ఉన్నాడు. ఇదీ జగన్నాటకం.

బాబాయ్ హత్య విషయంలో ఇలాగే చెప్పాడు....నేనే చంపాను అని అన్నాడు.

హైదరాబాద్ లో అమరావతిని అభివృద్ది చేయాలి అని భావించాను. 2029 కి విజన్ కూడా సిద్దం చేశాను.

అయితే జగన్ రావడంతో అన్నీ తల్లకిందులు అయ్యాయి.

ఈ ప్రాంతంలో సాగునీటి కష్టాలు తొలగించేందుకు చింతలపూడి లిఫ్ట్ స్కీం తీసుకువస్తే దాన్ని ఆపేశారు.

జగన్ వచ్చి నాలుగు ఏళ్లు అయ్యింది.....అయినా బందరు పోర్టు పూర్తి చెయ్యలేదు. మళ్లీ శంకుస్థాపన చేస్తాను అంటున్నాడు

ఉత్తరాంధ్రలో భోగాపురం ఎయిర్ పోర్టు ఇప్పటికి పూర్తి చెయ్యలేదు...మళ్లీ దానికి శంకుస్థాపన చేస్తాను అంటున్నాడు

అధికారంలో ఉన్నప్పుడు ప్రజలకు మంచి చేస్తే విశ్వసనీయత.

ఈ ప్రాంతంలో మల్లవల్లి ఇండస్ట్రియల్ పార్క్ తీసుకువచ్చాను. దాన్ని నిలిపివేశాడు. దాన్ని కొనసాగించి ఉంటే 50 వేల ఉద్యోగాలు వచ్చేవి

జగన్ ను ప్రశ్నిస్తే కేసు పెడతాడు....మీరు భయపడుతున్నారు. ఇలా భయపడి ఎవరూ ప్రశ్నించకపోతే ఎలా

ఇన్ని కేసులు పెట్టినా తెలుగు దేశం పోరాడింది. దీంతో ఇప్పుడు జనం కూడా బయటకు వస్తున్నారు.

ఎన్ని రోజులు నిద్ర లేని రాత్రులు గడిపాను. పార్టీనేతలను అరెస్టు చేస్తుంటే చాలా వేదన చెందాను.

కొల్లు రవీంద్ర లాంటి అమాయకులపైనా అక్రమ కేసులు పెట్టి అరెస్టు చేశారు

గన్నవరంలో ఒక ఆడబిడ్డను ....కనీసం బట్టలు కూడా మార్చుకోనివ్వకుండా అరెస్టు చేశారు. పోలీసులు ఇదేం తీరు.

పోలీసులు పెట్టే ప్రతి ఒక్క సమీక్ష్ చేస్తా....తప్పుడు పోలీసులను బొక్కల పెడతాను

నేను అందరినీ అనడం లేదు.....తప్పు చేసిన అధికారులను మాత్రం వదిలేది లేదు. తప్పు చేసిన వారికి వడ్డీతో సహా చెల్లిస్తాం

నేను హైదరాబాద్ అభివృద్ది చేసింది నా పిల్లల కోసం కాదు. ప్రజల కోసం. వారి బిడ్డల కోసం. దీంతో అంతా లబ్ది పొందారు

అమెరికాలో తెలుగు చాలా వేగవంతంగా విస్తరిస్తోంది. దానికి కారణం మన ఐటీ ఉద్యోగులు. టీడీపీ అందించిన ఐటీ ఆయుధం తో నే ఇది సాధ్యం అయ్యింది.

ఈ రోజు వేరే రాష్ట్రాల వారు ఎగతాళి చేసే పరిస్థితి వచ్చింది.

తెలంగాణ ఎంపి వచ్చి మన రోడ్ల గురించి కామెంట్ చేశారు.

మరో తెలంగాణ మంత్రి ఏముందిమీ రాష్ట్రంలో అని ప్రశ్నించారు. 

వైసీపీ సైతాన్‌ను రాష్ట్రం నుంచి తరిమికొట్టాలి

2019లో టీడీపీ వచ్చి ఉంటే ఏపీ దేశంలోనే తొలి స్థానంలో ఉండేది  

ఇవాళ జగన్ ఆస్తి రూ.510 కోట్లు

ఇడుపులపాయలో సొరంగం తవ్వి డబ్బు దాచిపెడుతున్నారేమో

ఇవాళ జగన్ ఒక్కడే సంపన్నుడు

ప్రజలు ఎప్పటికీ పేదవారిగా ఉండాలని జగన్ అనుకుంటున్నారుపట్టభద్రుల 

ఎన్నికల్లో వైసీపీకి దిమ్మ తిరిగింది

దేవుడు స్క్రిప్ట్ తిరగరాశాడు 

నూజివీడు ఎన్టీఆర్ జిల్లాలో కలపాలని కోరుతున్నారు 

టీడీపీ అధికారంలోకి రాగానే పరిశీలించి చేస్తాం 

వివేకాను నేను చంపినట్టు నాటకాలు ఆడిన కమల్‌హాసన్ జగన్ 

ఈ శనిగ్రహం రాష్ట్రాన్ని ఎప్పుడు వదిలిపెడుతుందా అని ప్రజలు ఆలోచిస్తున్నారు 

జగన్‌కు ఎక్స్పైరీ డేట్ దగ్గర పడింది.. మరో 6 నెలలు మాత్రమే

తిరుమలలో పింక్ డైమండ్ నేనే కాజేశా అన్నారు

అధికారంలోకి వచ్చాక అసలు డైమండ్ లేదన్నారు 

వంద కోట్లకు పరువు నష్టం దాదా వేసి ప్రైవేట్ కేసు నడిపిస్తున్నా

వీళ్లని తప్పకుండా బోనెక్కిస్తా - ఏపీలో ఏముందని తెలంగాణ నేతలంటున్నారు  కనీసం రోడ్లైనా లేవని తెలంగాణ నేతలు ఏపీ గురించి మాట్లాడుతున్నారు 

ఏపీ గురించి అలా మాట్లాడుతుంటే బాధ అనిపించడం లేదా?

విశాఖ రామానాయుడు స్టూడియో భూములను కొట్టేశారు

భూములు, సంస్థలను అడ్డగోలుగా రాయించుకున్నారు 

జగన్‌ది ధనబలం.. మనది ప్రజాబలం 

ఇక్కడ ఎమ్మెల్యే అవినీతిపర్వాన్ని కొనసాగిస్తున్నారు

కరెంటు బిల్లు సాకు చూపి పెన్షన్లు తెగ్గోస్తున్నారు 

టీడీపీ అధికారంలోకి వస్తే.. నూజివీడు మామిడికి మంచిరేటు కల్పిస్తాం  

అందరం కలిసి సమిష్టిగా రాష్ట్రాన్ని కాపాడుకోవాలి 

ఎమ్మెల్యే కొడుకు దుకాణం తెరిచాడు...అక్రమాలకు తెరతీశాడు. అధికారంలోకి వచ్చిన తరువాత విచారణ జరుపుతాం.

Comments