*వ్యవసాయ, మార్కెటింగ్, పౌరసరఫరాలశాఖలపై క్యాంపు కార్యాలయంలో సీఎం శ్రీ వైయస్.జగన్ సమీక్ష.*
అమరావతి (ప్రజా అమరావతి);
రబీలో ఇ– క్రాప్ బుకింగ్పై సీఎంకు వివరాలు అందించిన అధికారులు.
48.02 లక్షల ఎకరాల్లో ఇ–క్రాప్ బుకింగ్ పూర్తయిందని వెల్లడించిన అధికారులు.
97.5 శాతం ఇ – క్రాపింగ్ పూర్తి చేశామన్న అధికారులు.
ఇ– క్రాపింగ్ చేసుకున్న రైతులందరికీ కూడా డిజిటల్ రశీదులు, భౌతికంగా రశీదులు ఇచ్చామన్న అధికారులు.
ఈ డేటాను సివిల్ సఫ్లైస్ డిపార్ట్మెంటుకు, మార్కెటింగ్ డిపార్ట్మెంటుకు పంపించామని వెల్లడించిన అధికారులు.
3953 ఆర్బీకే స్థాయి కమ్యూనిటీ హైరింగ్ సెంటర్లు (సీహెచ్సీ)లకూ, 194 క్లస్టర్ స్ధాయి సీహెచ్సీలకూ మే 20లోగా వైయస్సార్ యంత్రసేవ కింద వ్యవసాయ ఉపకరణాలు అందిస్తున్నట్టు వెల్లడించిన అధికారులు.
ఇప్పటికే గతంలో సుమారు 6,500 ఆర్బీకేల పరిధిలోని సీహెచ్సీలకు వ్యవసాయ ఉపకరణాలను అందించామని వెల్లడించిన అధికారులు.
ఆర్బీకే స్ధాయి సీహెచ్సీలకు రూ.8.2 లక్షలు, క్లస్టర్ స్ధాయి సీహెచ్సీలకు రూ. 25 లక్షల విలువైన యంత్రాలు ఉంచుతున్నట్టు వెల్లడించిన అధికారులు.
*వైయస్సార్ యంత్రసేవా పథకం కింద కిసాన్ డ్రోన్లు*
జులై నాటికి 500 డ్రోన్లు ఇచ్చేందుకు వ్యవసాయశాఖ కార్యాచరణ.
డిసెంబర్ నాటికి 1500కు పైగా డ్రోన్లు ఇచ్చే దిశగా వ్యవసాయశాఖ చర్యలు.
ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో శిక్షణ కార్యక్రమాలు.
తిరుపతి, కడప, మార్టేరు, విజయనగరంలలో డ్రోన్ల వినియోగంపై శిక్షణ ఇచ్చేందుకు వర్శిటీ చర్యలు.
గతంలో సీఎం ఇచ్చిన ఆదేశాలమేరకు ఉత్తరాంధ్రలోని విజయనగరంలో శిక్షణకేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్టు వెల్లడించిన అధికారులు.
ఖరీఫ్ ప్రారంభానికి ముందు మే నెలలో రైతు భరోసా ఇన్స్టాల్మెంట్ ఇచ్చేందుకు సిద్ధం కావాలని అధికారులకు సీఎం ఆదేశం.
వైయస్సార్ రైతుభరోసా కింద రైతులకు డబ్బు జమచేసేందుకు సిద్ధం కావాలన్న సీఎం.
అర్హులైన రైతుల జాబితాలను వెల్లడించేందుకు చర్యలు తీసుకోవాలన్న సీఎం.
మే 10 కల్లా అర్హులైన రైతుల జాబితాలను గ్రామ సచివాలయాల్లో ప్రదర్శిస్తామని తెలిపిన అధికారులు.
సీఎం ఆదేశాల మేరకు ఆర్బీకేల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించిన అధికారులు.
467 వీఏఏ, 1644 వీహెచ్ఏ, 23 వీఎస్ఏ, 64 వీఎఫ్ఏ పోస్టుల భర్తీకి చర్యలు తీసుకుంటున్నామని వెల్లడి.
4656 ఏనిమల్ హస్బెండరీ అసిస్టెంట్ల పోస్టుల భర్తీకీ చర్యలు తీసుకుంటున్నామన్న అధికారులు.
ఖరీఫ్ సీజనల్లో రైతుల దగ్గరనుంచి సేకరించిన ధాన్యానికి దాదాపుగా చెల్లింపులు పూర్తి.
రూ.7233 కోట్లకు గానూ రూ.7200 కోట్లు చెల్లించిన అధికారులు.
ఖాతాల్లో సాంకేతిక పరమైన ఇబ్బందులు కారణంగా రూ.33 కోట్లు పెండింగ్లో ఉన్నాయన్న అధికారులు.
ఈ డబ్బునుకూడా వెంటనే చెల్లించాలన్న సీఎం.
అలాగే తొలిసారిగా రైతులకు ఇస్తున్న గన్నీ బ్యాగులు, రవాణా ఖర్చుల పేమెంట్లు కూడా దాదాపుగా పూర్తిచేశామన్న అధికారులు.
రబీ ప్రొక్యూర్మెంట్కు అన్నిరకాలుగా సిద్ధమవుతున్నామని తెలిపిన అధికారులు.
ధాన్యం సేకరించిన తర్వాత రైతులకు తప్పనిసరిగా రశీదులు ఇవ్వాలి.
ఆ రశీదు వెనుక రైతులనుద్దేశించి సూచనలు తప్పనిసరిగా ఉండాలన్న సీఎం.
నాణ్యతా ప్రమాణాలను కూడా అందులో పేర్కొనాలన్న సీఎం.
రైతులనుంచి ఎవరైనా డబ్బులు డిమాండ్ చేస్తే, లేదా ధాన్యం కొనుగోలుకు అక్కడకు ఇక్కడకు వెళ్లమని ఎవరైనా చెప్తే ఫిర్యాదు చేయడానికి టోల్ ఫ్రీ నెంబరు 1967 కూడా తప్పనిసరిగా పొందుపరచాలన్న సీఎం.
ధాన్యానికి మరింత ధర వచ్చేలా రైతులకు తగిన అవకాశాలు కల్పించాలన్న సీఎం.
విదేశాల్లో డిమాండ్ఉన్న వంగడాలను సాగు చేయడంపై రైతుల్లో అవగాహన కల్పించాలన్న సీఎం.
దీనివల్ల ఎగుమతులు పెరిగి వారికి మంచి ధర వస్తుందన్న సీఎం.
రైతులకు అవసరమైన వంగడాలు, వాటి విత్తనాలను అందుబాటులో ఉంచాలన్న సీఎం.
ప్రతి ఆర్బీకే పరిధిలో ఒక గోడౌన్ ఉండాలన్న కార్యాచరణ దిశగా ముందుకు సాగాలన్న సీఎం.
దీన్ని పరిగణలోకి తీసుకునే మ్యాపింగ్ చేశామన్న అధికారులు.
దీంట్లో భాగంగా 1005 చోట్ల గోడౌన్ల నిర్మాణం చేపట్టామని, 206కుపైగా పూర్తయ్యాయని, మరో 93 గోడౌన్లు తుదిమెరుగులు దిద్దుకుంటున్నాయని మిగిలినవి వివిధ దశల్లో ఉన్నాయని తెలిపిన అధికారులు.
జులై కల్లా వీటిని పూర్తిచేస్తామన్న అధికారులు.
సీఎం ఆదేశాలను దృష్టిలో ఉంచుకుని ముందుకు సాగుతామన్న అధికారులు.
నాణ్యమైన ఎరువులు, పురుగుమందులు, విత్తనాలను ఆర్బీకేల ద్వారా అందిస్తున్న ప్రక్రియ మరింత సమర్థవంతంగా ముందుకుసాగాలన్న సీఎం.
ప్రతిఏటా ఈ పంపిణీ మొత్తం పెరగాలన్న సీఎం.
గత ఏడాది సుమారు 7 లక్షల టన్నులకు పైగా ఎరువులు అందించామని, ఈ ఏడాది మరింతగా పెంచుతామన్న అధికారులు.
పంటల ధరలపై సీఎం యాప్ ద్వారా వచ్చిన సమాచారాన్ని దృష్టిలో ఉంచుకుని ఎప్పటికప్పుడు మార్కెట్లో జోక్యం చేసుకుంటున్నామని తెలిపిన అధికారులు.
సీఎం యాప్ ద్వారా వివిధ ప్రాంతాలనుంచి, వివిధ పంటలకు వస్తున్న ధరలు, వాటి పరిస్థితులపై నిరంతరం పర్యవేక్షణ ఉండాలన్న సీఎం.
నిరంతరం మాక్ డ్రిల్ చేస్తూ... ఈ విధానం పనితీరును పర్యవేక్షించాలన్న సీఎం.
ఎక్కడైనా లోపాలు ఉంటేం వెంటనే సరిదిద్దేలా చర్యలు తీసుకోవాలన్న సీఎం.
సీఎంయాప్ ఎలా పనిచేయాలన్నదానిపై నిర్దేశించుకున్న ఎస్ఓపీని నిరంతరం పర్యవేక్షించాలన్న సీఎం.
ఎక్కడైనా రైతులకు కనీస మద్దతు ధర లభించలేని పక్షంలో వెంటనే జోక్యంచేసుకోవాలని అధికారులను ఆదేశించిన సీఎం.
ఈ సమీక్షా సమావేశానికి వ్యవసాయ, మార్కెటింగ్, పౌరసరఫరాలశాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి, పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు, ఏపీ అగ్రిమిషన్ వైస్ చైర్మన్ ఎం వీ యస్ నాగిరెడ్డి, ఏపీ వ్యవసాయశాఖ సలహాదారు ఐ తిరుపాల్ రెడ్డి, సీఎస్ డాక్టర్ కె ఎస్ జవహర్రెడ్డి, వ్యవసాయశాఖ ముఖ్య కార్యదర్శి గోపాల కృష్ణ ద్వివేది, మార్కెటింగ్, సహకార శాఖ ముఖ్యకార్యదర్శి చిరంజీవి చౌదరి, వ్యవసాయశాఖ స్పెషల్ కమిషనర్ సి హరికిరణ్, అగ్రికల్చర్ మార్కెటింగ్ శాఖ కమిషనర్ రాహుల్ పాండే, హార్టికల్చర్ కమిషనర్ ఎస్ ఎస్ శ్రీధర్, పౌరసరఫరాలశాఖ కమిషనర్ హెచ్ అరుణ్కుమార్, ఏపీ స్టేట్ సీడ్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ ఎండీ అండ్ వీసీ జి శేఖర్ బాబు, ఏపీ స్టేట్ సివిల్ సఫ్లైస్ కార్పొరేషన్ లిమిటెడ్ వీసీ అండ్ ఎండీ జీ వీరపాండ్యన్ ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.
addComments
Post a Comment