తిరుపతి (ప్రజా అమరావతి);
ఇక పై గ్రామ వార్డు సచివాలయం లో కూడా విద్యుత్ సంబంధిత ఫిర్యాదులు
తిరుపతి కలెక్టరేట్ లో పోర్టల్ ను ప్రారంభించిన రాష్ట్ర విద్యుత్, అటవీ, భూగర్భ గనుల శాఖ మంత్రి శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
ఎస్పిడిసిఎల్ పరిధిలో ఇకపై సచివాలయంలో కూడా విద్యుత్ ఫిర్యాదులు స్వీకరణ
*మంత్రి శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కామెంట్స్.....*
అనేక అంశాల పై రివ్యూ నిర్వహించాం
అనేక సమస్యలపై ఈ సమావేశం లో దృష్టి సారించాం
గత ఏడాది అత్యధికంగా ఒక రోజులో 232 మిలియన్ యూనిట్లు వినియోగిస్తే... ఈ ఏడాది 248 మిలియన్ యూనిట్లు అందించాం
ఎక్కడా విద్యుత్ అంతరాయం లేకుండా సరఫరా చేస్తున్నాం
రాష్ట్ర అభివృద్ధికి ఇది ఒక నిదర్శనం
పరిశ్రమలకు నాణ్యమైన విద్యుత్ అందిస్తున్నాం
అధికారులు శ్రమిస్తున్నారు, మరింత బాధ్యతతో పని చేయాలి
గ్రామ, వార్డ్ సచివాలయంలో ఫిర్యాదులు కోసం పోర్టల్ ప్రారంభించాం
రైతులను, గ్రామీణ ప్రాంత ప్రజలకు ఇది ఉపయోగపడుతుంది
ఇంతకముందు 45 సేవలు అందిస్తున్నాం, తాజాగా మరో 12 సేవలు పొందుపరిచాం
సచివాలయంలో ఫిర్యాదు ద్వారా స్థానికంగా ఉండే అధికారులు మరింత బాధ్యతగా వ్యవహరిస్తారు
ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నా.
addComments
Post a Comment