శ్రీ అమ్మవారి పంచహారతుల సేవలో పాల్గొన్న కమీషనర్

 విజయవాడ (ప్రజా అమరావతి);

శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం, ఇంద్రకీలాద్రి:        

     శ్రీ అమ్మవారి ఆలయమునకు   రాష్ట్ర దేవాదాయ కమీషనర్ మరియు సెక్రటరీ  అయిన శ్రీ ఎస్.సత్యనారాయణ, IAS  విచ్చేయగా ఆలయ కార్యనిర్వాహణాధికారి దర్భముళ్ల భ్రమరాంబ  వీరికి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు.


అనంతరం కమీషనర్


  శ్రీ అమ్మవారి పంచహారతుల సేవలో పాల్గొన్నారు. 

అనంతరం వీరికి వేదపండితులు వేదాశీర్వచనం చేయగా, ఆలయ కార్యనిర్వాహణాధికారి  వీరికి శ్రీ అమ్మవారి ప్రసాదములు, శేషవస్త్రం అందజేసినారు.

Comments