తెలుగు దేశం అంటేనే సంక్షేమం....మన ప్రభుత్వ విధానాల వల్ల సంపద సృష్టి జరిగింది.


అమరావతి (ప్రజా అమరావతి);

*పెదకూరపాడు  నియోజకవర్గంలో ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమంలో పాల్గొన్న టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు*


*సభలో టీడీపీ అధినేత ప్రసంగం:-*


వివేకా హత్యలో ఏం జరిగిందో ప్రజలు ఇప్పుడు చూస్తున్నారు

జగన్ బాబాయ్ ను చంపి నాపై ఆరోపణలు చేశారు. నేను ఎన్నికల సమయంలో చాలా క్షోభ పడ్డాను. నాపై తప్పుడు ఆరోపణలు చేశారు. సానుభూతి సంపాదించారు

కోడికత్తి డ్రామా ఆడిన కోడికత్తి కమల హాసన్ ఇప్పుడు ఆ కేసుపై ఏం సమాధానం చెపుతాడు

చేయని నేరానికి నాపై ఆరోపణలు చేస్తే నేను ఎంత బాధపడి ఉంటాను.

పింక్ డైమండ్ విషయంలో కూడా ఇలాంటి తప్పుడు ఆరోపణలే చేశారు.

నాడు డ్రామాలు ఆడి ప్రజలను నమ్మించిన వ్యక్తి జగన్ రెడ్డి

తెలుగు దేశం అంటేనే సంక్షేమం....మన ప్రభుత్వ విధానాల వల్ల సంపద సృష్టి జరిగింది.


4 ఏళ్లలో జగన్ ఒక్క పని చేశాడా? హైదరాబాద్ లో నాడు మనం చేసిన అభివృద్దిని తరువాత వచ్చిన ప్రభుత్వాలు కొనసాగించాయి. అందుకే హైదరాబాద్ ఇప్పుడు అంత అభివృద్ది చెందింది. 

అధికారంలోకి రావడంతోనే విధ్వంసంతోనే జగన్ పాలన ప్రారంభించాడు.

ఇక్కడ ఒక ఎమ్మెల్యే ఉన్నాడు...మనం వస్తుంటే మనకు వ్యతిరేకంగా ఫ్లెక్స్ లు పెట్టాడు ఇది మంచి పద్దతి కాదు. ఎమ్మెల్యే జాగ్రత్తగా ఉండాలి

నాడు నేను పాదయాత్రకు అడ్డుపడి ఉంటే జగన్ ఊరూరా తిరిగి ముద్దులు పెట్టేవాడా?

జగన్ అందరి జీవితాలు నాశనం చేశాడు. రూ. 10 ఇచ్చి 100 దోచేశాడు

నిత్యావసర వస్తువుల ధరలు ఎందుకు పెరుగుతాయి...ట్యాక్సులు పెంచితేనే కదా?

దేశంలో పెట్రోలు ధరలు, డీజిల్ ధరలు పెరగడం వల్లనే నిత్యావసర వస్తువుల ధరలు పెరిగాయి

రూ.600 ఉండే వంట గ్యాస్ రూ.1200 అయ్యింది. నాడు నేను దీపం పథకం ద్వారా గ్యాస్ ఇచ్చాను. ఇప్పుడు మీ దీపం ఆర్పింది ఈ సైకో

సోలార్ విద్యుత్ పెంపు  ద్వారా విద్యుత్ చార్జీలు తగ్గించవచ్చు. మన ప్రభుత్వం ఉండి ఉంటే కరెంట్ చార్జీలు తగ్గించేవాళ్లం.

5 ఏళ్లు పాటుమనం విద్యుత్ చార్జీలు పెంచలేదు. జగన్ 8 సార్లు విద్యుత్ చార్జీలుపెంచాడు

అన్ని పన్నులు పెంచి 10 ఇచ్చి 100 దోస్తున్నాడు జగన్ రెడ్డి

మీ ఇంటి మీద జగన్ స్టిక్కర్ ఏంటి....మీ అనుమతి ఉందా స్టిక్కర్ వేయడానికి

జగన్ ఇంటి మీద మీ బొమ్మ వేస్తే ఒప్పుకుంటాడా....పోలీసుల ఇంటి మీద మీ బొమ్మ వేస్తే ఒప్పుకుంటారా

మన ఇంటి మీద వీళ్ల బొమ్మలు ఏంటి.....ఆ స్టిక్కర్లు తీసేయండి. ఇంటికి వాళ్లు బొమ్మ అంటిస్తే...మనం వాళ్ల మొహం పై బొమ్మ వేస్తామని చెప్పండి

పట్టాదారు పుస్తకాలపై, సర్వే రాళ్లపైనా జగన్ బొమ్మ ఏంటి. ఆ సైకో బొమ్మ మనకెందుకు?

ఆ బొమ్మ చూస్తే మనకు బాబాయ్ కేసే గుర్తుకు వస్తుంది. ఇలాంటి పాలనతో సమాజాన్ని నాశనం చేస్తుంటే మనం ఓర్చుకోవాలా

మొన్న యర్రగొండ పాలెం వెళితే సాక్షాత్తూ మంత్రే నాపై దాడి చేశాడు. దాడిలో నన్ను కాపాడబోయి ఎన్ఎస్జి కమాండో గాయపడ్డాడు. 

ఏకంగా మంత్రి నాపై రౌడీయిజం చేయడం ప్రభుత్వ కుట్ర కాదా?

మీరు రౌడీయిజం చేస్తే మనం పారిపోవాలా...నేను ఎస్ సిలకు అన్యాయం చేశాను అంటాడు ఆ మంత్రి

ఎస్సిలకు న్యాయం చేసిన పార్టీ తెలుగు దేశం. ఎస్సీలకు కమిషన్ తెచ్చింది.....ఎస్సీలకు ఫైనాన్స్ కమిషన్ తెచ్చిన పార్టీ టీడీపీ

ఎస్సీ నేతకు ఆర్థిక శాఖ మంత్రిగా చేసిన పార్టీ టీడీపీ. ఎస్సీల పథకానికి అంబేద్కర్ పేరు తీసేసి జగన్ సొంత పేరు పెట్టుకున్నాడు.

నిజమైన దళిత ద్రోహి జగన్ మోహన్ రెడ్డి. 

బిసిలకు ఉన్న 34 శాతం రిజర్వేషన్లను 24 శాతం చేసింది జగన్ మోహన్ రెడ్డి

ఎస్సీలకు, బిసిలకు, మైనారిటీలకు జగన్ ఒక్క కార్యక్రమం అయినా ఇచ్చాడా?

ఏం ఘన కార్య చేశాడు అని స్టిక్కర్లు వేసుకుంటున్నాడు

గూగుల్ లో జగన్ అని కొడితే 6093 నెంబర్ వచ్చే ఖైదీ ఫోటో మేం ఇట్లో పెట్టుకోవాలా...

త్వరలో కొత్త సంక్షేమ కార్యక్రమాలు ప్రకటిస్తా. జగన్ నేను ఏదో సంక్షేమం తొలగిస్తా అని ప్రచారం చేస్తున్నాడు.

జగన్ 4 ఏళ్లలో రూ. 2లక్షల కోట్లు సంపాదించాడు

జగన్ ఈ నియోజకవర్గంలో ఇసుక దందా ద్వారా నెలకు 20 కోట్లు దోచుకుంటున్నాడు. ఎమ్మెల్యే నెలకు 20 కోట్లు జగన్ కు ఇసుకదందాలో చెల్లిస్తున్నాడు

నియోజవకవర్గంలో ఇసుద దందా అంతా ఎమ్మెల్యే ద్వారా నడుస్తోంది. కృష్టానదిలో రోడ్డు వేసి మరీ ఇసుక దోపిడీ చేస్తున్నారు. 

మద్యం దుకాణాల్లో ఆన్లైన్ లో పేమెంట్ ఎందుకు తీసుకోవడం లేదు. డబ్బు అంతా ఎటుపోతుంది.

తెలుగు దేశం పార్టీ వస్తేనే ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది. 

పేదరికం లేని సమాజం నిర్మించాలి అనేది నా జీవితాశయం

నిరుపేదలకు తెలుగు దేశం పార్టీ జెండా అండగా ఉంటుంది

సంపద సృష్టితో పాటు ఆ సంపదను పేదలకు చేర్చడం కూడా ముఖ్యం

రాష్ట్రంలో నేషనల్ హైవే రోడ్లు బాగున్నాయి.....కానీ రాష్ట్ర రహదారులు బాలేదు. దీనికి కారణం ఎవరు సైకో సిఎం జగనే కదా

జగన్ ఒక్క ఇల్లు కట్టాడా...మనం కట్టిన టిడ్కో ఇళ్లను కూడా లబ్దిదారులకు ఇవ్వలేదు

ప్రజల జీవన ప్రమాణాలు తగ్గిపోయాయి...కానీ జగన్ ఆస్తులు మాత్రం పెరిగాయి.

దేశంలో అందరి సిఎంల కంటే జగన్ ఆస్తి ఎక్కువ. జగన్ ఆస్తి 510 కోట్లు

జగన్ సైకో సి2 కంపెనీ నడుపుతున్నాడు. అంటే సైకో కరప్షన్ అండ్ క్రైం కంపెనీ

జగన్ ను నమ్ముకున్న పోలీసులూ జాగ్రత్త. బాబాయినే గొడ్డలిపోటు పొడిచాడు...పోటు పొడిచిన బాబాయి జైలుకు పోయాడు

జగన్ ను నమ్ముకున్న వాళ్లు జైలుకుపోతారు. ఈ విషయం పోలీసులు గుర్తుపెట్టుకోవాలి.

ఉమ్మడి గుంటూరు జిల్లాలో నాడు 2750 కోట్లతో సాగునీటి ప్రాజెక్టుల, లిఫ్ట్ లపై ఖర్చు పెట్టాను.

కృష్ణా డెల్టా ఆధునీకరణ కోసం 470 కోట్లు పెట్టాను. పట్టిసీమ 10 నెలల్లో పూర్తి చేసి సాగునీటి సమస్య లేకుండా చేశాను. కొండవీడు వాగు తో ఇబ్బంది లేకుండా 237 కోట్లతో లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టాను.

నాగార్జున సాగర్ కాలువల ఆధునీకరణ పనులు చేశాం. 

పెదకూరపాడు నియోజవర్గంలో పెద్ద ఎత్తున ఇసుక దోపిడీ జరుగుతోంది. దోపిడీ చేసింది అంతా కక్కిస్తా. పర్యావరణానికి నష్టం వస్తుందని చెపుతున్నా...ఇసుక తవ్వకాలు ఆపడం లేదు. నెలకు రూ. 20 కోట్లు ఇసుక సొమ్ము తాడేపల్లికి చెల్లిస్తున్నారు. అంటే ఎంత దోపిడీ అవుతుందో చూడండి.

రేషన్ బండి వెనుక బండి పెట్టి బియ్యం సేకరించి అక్రమంగా తరలిస్తున్నారు.

గోదావరి నీళ్లు పెన్నాకు తీసుకుపోవాలని.....ఈ ప్రాంతంలో పనులకు శంకుస్థాపన చేశాను. టెండర్లు పిలిచాను. కానీ ఆపనులు కూడా ఆపేశారు.

Comments