చిన్నారులకు నాణ్యత కలిగిన భోజనం అందించాలి.

 *చిన్నారులకు నాణ్యత కలిగిన భోజనం అందించాలి*


*: జిల్లా కలెక్టర్ పి.అరుణ్ బాబు*


*: కప్పలబండలోని అంగన్వాడీ కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్*


పుట్టపర్తి (శ్రీ సత్యసాయి జిల్లా), మే 12 (ప్రజా అమరావతి):


చిన్నారులకు నాణ్యత కలిగిన భోజనం అందించాలని జిల్లా కలెక్టర్ పి.అరుణ్ బాబు ఆదేశించారు. శుక్రవారం పుట్టపర్తి మండలంలోని కప్పలబండలోని అంగన్వాడీ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ చిన్నారులకు నాణ్యత కలిగిన ఆహారం అందించడం అత్యంత ముఖ్యమన్నారు. ప్రతిరోజు మెనూ ప్రకారం భోజనం అందించాలన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ విద్యార్థుల హాజరును పరిశీలించారు. అంగన్వాడీ కేంద్రానికి ఎన్ని కోడిగుడ్లు వచ్చాయి, స్టాక్ బ్యాలెన్స్ బుక్ బ్యాలెన్స్ ఎంత ఉంది అనేది తనిఖీ చేశారు. అనంతరం విద్యార్థులతో మాట్లాడి, వారి విద్యా ప్రమాణాలను పరిశీలించి విద్యార్థులకు మంచి విద్య బోధించాలన్నారు. చిన్నారులకు అందిస్తున్న మధ్యాహ్న భోజనం నాణ్యతను జిల్లా కలెక్టర్ పరిశీలించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ నవీన్ కుమార్, అంగన్వాడీ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.



Comments