మా జిల్లాలో జిల్లా స్ధాయిలో ప్రత్యేక యూనిట్‌ను ఏర్పాటుచేశాం.


అమరావతి (ప్రజా అమరావతి);


*జగనన్నకు చెబుదాం – 1902 టోల్‌ఫ్రీ నెంబర్‌*


*సీఎం క్యాంప్‌ కార్యాలయం నుంచి లాంఛనంగా ప్రారంభించిన ముఖ్యమంత్రి శ్రీ వైఎస్‌ జగన్‌*


*ఈ సందర్భంగా వివిధ జిల్లాల నుంచి వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడిన కలెక్టర్లు, ఎస్పీలు ఏమన్నారంటే...వారి మాటల్లోనే*


*దినేష్‌ కుమార్, కలెక్టర్, ప్రకాశం జిల్లా*


గడిచిన ఆరు నెలలుగా మీరు ఇస్తున్న సూచనల మేరకు మా జిల్లాలో జిల్లా స్ధాయిలో ప్రత్యేక యూనిట్‌ను ఏర్పాటుచేశాం


, కలెక్టర్, జేసీల నేతృత్వంలో ప్రాజెక్ట్‌ మానిటరింగ్‌ యూనిట్‌ పనిచేస్తుంది, ఇందులో ఒక స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌ కన్వీనర్‌గా ఉన్నారు, అన్ని ప్రభుత్వ విభాగాలలో వస్తున్న వినతులు, ఫిర్యాదులు పరిశీలించడం, మండల స్ధాయిలో కూడా పరిశీలించేలా చర్యలు తీసుకున్నాం, ప్రతి గ్రీవియెన్స్‌ను పరిశీలించడం, మానిటరింగ్‌ చేయడం జరుగుతుంది. మా జిల్లాలో వస్తున్న గ్రీవియెన్స్‌ను పరిష్కరించడం, రీ ఓపెన్‌ అయిన వాటిని పరిష్కరించడం చేస్తున్నాం. మీ సూచనల ప్రకారం గ్రామ సచివాలయం నుంచి జిల్లా కేంద్రం వరకు అందరూ పర్యవేక్షిస్తున్నారు. ఈ కార్యక్రమంలో మీ పేరు ఉండడం వల్ల నాణ్యతతో కూడిన పరిష్కారం వచ్చేలా చర్యలు తీసుకున్నాం, ప్రతి సచివాలయంలో ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నారు, మీ సూచనలు సలహాలు పాటించి ఈ కార్యక్రమాన్ని మరింతగా ముందుకు తీసుకెళతాం. మా జిల్లా యంత్రాంగం అంతా సర్వసన్నద్ధంగా ఉంది. ధ్యాంక్యూ సార్‌.


*నిషాంత్‌కుమార్, కలెక్టర్, పార్వతీపురం మన్యం జిల్లా*


సార్, ఈ కార్యక్రమాన్ని జిల్లా అధికార యంత్రాంగం అంతా వీక్షిస్తుంది. మేం మా దగ్గరకు వచ్చే గ్రీవియెన్స్‌ పరిష్కారానికి పూర్తి మెకానిజాన్ని సిద్దం చేసుకున్నాం, 24 గంటలు పనిచేసేలా కాల్‌ సెంటర్‌ ఏర్పాటుచేశాం, స్పెషల్‌ ఆఫీసర్‌ కూడా పరిశీలిస్తున్నారు, ఫిర్యాదు చేసిన వ్యక్తి సమస్య పరిష్కారం అవగానే చిరునవ్వుతో వెనుదిరగాలి అనే విధంగా ముందుకెళుతున్నాం, గడిచిన కొద్ది వారాలుగా మేం ఈ కార్యక్రమానికి పూర్తి సన్నద్దమై ఉన్నాం, జిల్లా స్ధాయి నుంచే కాదు మండల స్ధాయి నుంచి కూడా అధికారులు సిద్దంగా ఉన్నారు, ఎలాంటి జాప్యం లేకుండా సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకున్నాం, ఇప్పటికే జిల్లా అధికారులకు తగిన విధంగా శిక్షణ కూడా ఇచ్చాం, గ్రీవియెన్స్‌ పరిష్కారం తర్వాత ఇతరులకు ఉపయోగపడేలా మార్గదర్శకాలు కూడా రూపొందిస్తున్నాం. ఇది ఒక కొత్త శకానికి నాంది పలుకుతుంది.


*అన్భురాజన్, ఎస్పీ, వైఎస్సార్‌ కడప జిల్లా* 


జగనన్నకు చెబుదాం కార్యక్రమాన్ని సక్సెస్‌ చేయడానికి అన్ని చర్యలు తీసుకున్నాం, జిల్లా స్ధాయిలో, మండల స్ధాయిలో ప్రాజెక్ట్‌ మానిటరింగ్‌ యూనిట్‌లలో అవసరమైన పోలీస్‌ సిబ్బందిని నియమించాం, ఇప్పటికే అవగాహన తరగతులు నిర్వహించాం, 1902 నెంబర్‌ను ప్రతి గడపకు తీసుకెళ్ళేలా చర్యలు తీసుకున్నాం, డైలీ స్టేటస్‌ రిపోర్ట్‌ను తీసుకుని పెండింగ్‌ సమస్యలను తక్షణమే పరిష్కరిస్తాం, పిటీషన్‌ను నిర్ణీత కాలపరిధిలో పరిష్కరిస్తున్నారా లేదా అని జిల్లా స్ధాయిలో పర్యవేక్షణ జరుగుతుంది, అన్ని శాఖల సమన్వయంతో పిటీషనర్‌కు న్యాయం జరిగేలా చూస్తాం, సివిల్‌ కేసుల పరిష్కారానికి మండల, జిల్లా లీగల్‌ సర్వీస్‌ అథారిటీ సహకారం తీసుకుంటాం. ఫీడ్‌ బ్యాక్‌ మెకానిజాన్ని కూడా ఏర్పాటుచేశాం, ఈ కార్యక్రమం దేశానికే రోల్‌మోడల్‌ అవుతుందని భావిస్తున్నాం.

Comments