చిన్నారుల బంగారు భవితకు బాటలు వేయాలి.

 


*చిన్నారుల బంగారు భవితకు బాటలు వేయాలి


*


పార్వతీపురం, మే 20 (ప్రజా అమరావతి): ప్రాథమిక విద్య బలోపేతం చేసి చిన్నారుల బంగారు భవితకు బాటలు వేయాలని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ అన్నారు. శనివారం బలిజిపేట మండలంలో విస్తృతంగా పర్యటించారు. బలిజిపేటలోని గృహ నిర్మాణల లే అవుట్, ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నాడు నేడు క్రింద చేపడుతున్న భవనాల ఆధునీకరణ  పనులను, నారాయణ పురం మండల పాఠశాలలోని అంగాన్వాడీ కేంద్రం నూతన భవనాన్ని, బర్లి గ్రామ ప్రాథమిక ఉన్నత పాఠశాలలో నాడు నేడు రెండో దశ పనులలో భాగంగా నూతనంగా నిర్మిస్తున్న అంగన్వాడీ కేంద్రం భవాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రాథమిక దశలో చిన్నారులకు చక్కని విద్యతోపాటు పౌష్ఠికాహారం సక్రమంగా అందించడంలో అంగన్వాడీ కేంద్రాలు సమర్థవంతంగా పనిచేయాలని అన్నారు. బర్లి అంగన్వాడీ కేంద్రాన్ని తనిఖీ చేశారు. గర్భిణీలకు అందిస్తున్న పాలు వివరాలను స్టాక్ రూంలో రికార్డులను పరిశీలించారు. సచివాలయ వెల్ఫేర్ అసిస్టెంట్స్, అంగన్వాడీ కార్యకర్తలు నిర్వహిస్తున్న లబ్ధిదారుల వివరాల నమోదును సరిచూసారు. సమన్వయ లోపం లేకుండ పౌష్ఠికాహారం అమలు రికార్డులను ఖచ్చితంగా నిర్వహించాలని ఆదేశించారు. అంగన్వాడీ కేంద్రం పరిధిలోని బరువు తక్కువ ఉన్న చిన్నారులు, రక్త హీనత కలిగిన గర్భిణీలు, బాలింతల వివరాలను అడిగి తెలుసుకున్నారు. కేంద్రంలోని అందుతున్న సేవలను, చిన్నారుల పరిజ్ఞానాన్ని పరీక్షించారు. మడక వేదాన్సి, పలిశెట్టి గీతోన్మయి అనే చిన్నారులు అడిగిన ప్రశ్నలకు చక్కగా జవాబులు చెప్పడంతో కలెక్టర్ సంతృప్తి వ్యక్తం చేశారు. చిన్నారులను అభినందించారు. చిన్నారుల బంగారు భవిష్యత్ చక్కగా తీర్చదిద్దడంలో అంగన్వాడి కార్యకర్తలు భాద్యతగా వ్యవహరించాలని అన్నారు. కేంద్రానికి కరెంట్ లేకపోవడాన్ని గమనించి కలెక్టర్ ప్రశ్నించగా విద్యుత్ మీటర్ లేదని సి డి పి ఓ తెలపగా వెంటనే ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకోవాలని మండల విద్యా శాఖ అధికారికి ఆదేశించారు. సమీపంలోనే నాడు నేడు రెండో దశ పనులు క్రింద చేపడున్న నూతన అంగన్వాడీ కేంద్రం భవన నిర్మాణాన్ని పరిశీలించారు. ప్రభుత్వ నిర్దేశించిన ప్రకారం గదుల నిర్మాణం నాణ్యతా ప్రమాణాలతో పూర్తి చేయాలని ఆదేశించారు. 


*గృహ నిర్మాణ లే అవుట్ ను పరిశీలించిన కలెక్టర్*


బలిజిపేటలోని  గృహ నిర్మాణాల లేఔట్ ను జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ పరిశీలించారు. ఈ సందర్భంగా వివిధ దశలోని నిర్మాణాల పురోగతిని పరిశీలించారు. పునాది దశలో 26 ఇల్లు నిర్మాణంలో ఉండగా, పై కప్పు స్థాయికి ఐదు, గృహ నిర్మాణాలు పూర్తి అయినవి 4 ఉన్నాయని సచివాలయం ఇంజనీరింగ్ అసిస్టెంట్ సాయి కిరణ్ వివరించారు. అక్కడే ఉన్న గృహ నిర్మాణ లబ్ధిదారులతో మాట్లాడారు. గృహ నిర్మాణం ఆలస్యం గల కారణాలను అడిగితెలుసుకున్నారు. స్వయం సహాయక సంఘం గ్రూప్ ద్వారా రుణం మంజూరైనందున వెంటనే నిర్మాణ పనులు చేపడతామని తెలపగా కలెక్టర్ సంతృప్తిని వ్యక్తం చేశారు. ప్రభుత్వం పేదలకు ఇల్లు నిర్మించి ఇవ్వాలన్న  లక్ష్యంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని పర్యవేక్షిస్తున్నందున వచ్చిన అవకాశాన్ని వినియోగించుకుని త్వరితగతిన సొంతింటి కల నెరవేర్చుకోవాలని ఆయన సూచించారు. అనంతరం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చేపడుతున్న అదనపు తరగతుల భవన ఆధునీకరణ పనులు, ఫ్లోరింగ్ పనులు నిశితంగా పరిశీలించారు. స్కూల్ లు ప్రారంభం నాటికి పనులు పెండింగ్ ఉండకుండా పూర్తి చేయాలని ఆదేశించారు.


ఈ కార్యక్రమంలో తహశీల్దార్ కె.రత్న కుమారి, ఎమ్.పి.డి. ఓ ఏ.భాను మూర్తి, గృహనిర్మాణ శాఖ డి ఈ అర్. ఐ.వి.ప్రసాద్, ఐ.సి.డి.ఎస్ ప్రాజెక్ట్ అధికారి కేతిరెడ్డి విజయ గౌరీ, మండల విద్యా శాఖ అధికారి శ్రీనివాస్, సి డి పి ఓ సి హెచ్. సుగుణ, ప్రధాన ఉపాధ్యాయులు సుధా దేవి, గ్రామ సచివాలయం సిబ్బంది, అంగన్వాడి కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

Comments
Popular posts
దసరా నవరాత్రులు: కనకదుర్గమ్మ తొమ్మిది రోజులు అలంకరణ రూపాలు ... విజయవాడ, ఇంద్రకీలాద్రి (prajaamaravati), అక్టోబరు 18 :- దసరా శరన్నవరాత్రులు హిందువులకు ఒక ముఖ్యమైన పండుగ. ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుండి ఆశ్వయుజ శుద్ధ నవమి వరకు తొమ్మిది రోజులు దేవీ నవరాత్రులు పదవ రోజు విజయ దశమి కలసి దసరా అంటారు. ఇది ముఖ్యముగా శక్తి ఆరాధనకు ప్రాధాన్యత ఇచ్చే పండుగ. ఈ పండుగకు నవరాత్రి, శరన్నవరాత్రి అనీ కూడా అంటారు. శరదృతువు ఆరంభంలో వచ్చే పండుగ కనుక ఈ పేరు వచ్చింది. కొందరు ఈ పండుగకు మొదటి మూడు రోజులు పార్వతిదేవికి తరువాతి మూడు రోజుల లక్ష్మీ దేవికి తరువాతి మూడురోజులు సరస్వతి దేవికి పూజలు నిర్వహిస్తారు. ఈ సమయంలో పూజలో విద్యార్ధులు తమ పుస్తకాలను ఉంచుతారు. ఇలా చేస్తే విద్యాభ్యాసంలో విజయం లభిస్తుందని విశ్వసిస్తారు. సామాన్యులే కాక యోగులు నవరాత్రులలో అమ్మవారిని పూజిస్తారు. ముఖ్యముగా శాక్తేయులు దీనిని ఆచరిస్తారు. బొమ్మల కొలువు పెట్టడం ఒక ఆనవాయితీ. ఆలయాలలో అమ్మవారికి ఒక్కోరోజు ఒక్కో అలంకారం చేస్తారు. ఈ తొమ్మిది రోజుల్లో అమ్మవారిని తొమ్మిది రూపాల్లో పూజిస్తూ ఉంటారు. లోకకల్యాణం కోసం అమ్మవారు ఒక్కోరోజు ఒక్కో రూపాన్ని ధరించింది. అందువలన అలా అమ్మవారు అవతరించిన రోజున, ఆ రూపంతో అమ్మవారిని అలంకరించి ఆ నామంతో ఆరాధిస్తూ ఉంటారు. ఇంద్రకీలాద్రిపై వేంచేసి యున్న శ్రీ కనకదుర్గమ్మావారు మొదటి రోజు శ్రీ స్వర్ణకవచాలంకృత శ్రీ దుర్గాదేవిగా రెండవ రోజు బాలాత్రిపుర సుందరి మూడవ రోజు గాయత్రి దేవిగా, నాల్గవ రోజు అన్నపూర్ణ దేవిగా ఐదవరోజు శ్రీ సర్వస్వతి దేవిగా ఆరవ రోజు శ్రీ లలిత త్రిపుర సుందరీ దేవిగా, ఏడవ రోజు శ్రీ మహలక్ష్మీదేవిగా, ఎనిమిదవ రోజు దుర్గాదేవి మరియు మహిషాసుర మర్థిని దేవిగా, తొమ్మిదవ రోజు శ్రీ రాజరాజేశ్వరి దేవి మొదలైన అవతార రూపాలతో దర్శనమిస్తూ భక్తులకు అమ్మవారు దర్శనమిస్తారు.ఇలా ఈ నవరాత్రుల సమయంలో ఒక్కో అమ్మవారిని ఆరాధించడం వలన ఒక్కో విశేష ఫలితం లభిస్తుందని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి. నవరాత్రుల్లో బెడవాడ శ్రీకనకదుర్గమ్మ వారు వివిధ అలంకారాలతో భక్తుల కోర్కేలను తీర్చు చల్లని తల్లిగా దర్శనమిస్తారు.. 1. దుర్గాదేవి అలకారం ః శరన్నవరాత్రి మహోత్సవాల్లో శ్రీ కనకదుర్గమ్మవారు శ్రీ స్వర్ణకవచాలంకృత శ్రీ దుర్గాదేవిగా దర్శినమిచ్చి భక్తులకు ఆయురారోగ్య ఐశ్వర్యాలను కలుగుజేస్తారు. 2. శ్రీ బాలాత్రిపుర సుందరి: ఫత్రిపురాత్రయంలో శ్రీ బాలాత్రి పుర సుందరీదేవి ప్రథమ స్థానంలో ఉంది. ఆమె ఎంతో మహిమాన్వితమైన ది. సమస్త దేవీ మంత్రాలలోకెల్లా శ్రీ బాలా మంత్రం గొప్పది. సకల శక్తి పూజలకు మూలమైన శ్రీ బాలాదేవి జగన్మోహనాకారాన్ని పవిత్రమైన శరన్నవరాత్రుల్లో దర్శించి, ఆమె అనుగ్రహాన్ని పొందితే, సంవత్సరం పొడుగునా అమ్మవారికి చేసే పూజలన్నీ సత్వర ఫలితాలనిస్తాయి. 3. శ్రీ గాయత్రి దేవి అలంకారం: ముక్తా విద్రుమ హేమనీల ధవల వర్థాలలతో ప్రకాశిస్తు, పంచ ముఖాలతో దర్శనమిస్తుంది. సంధ్యావందనం అధి దేవత . గాయత్రి మంత్రం రెండు రకాలు: 1. లఘు గాయత్రి మంత్రం 2. బ్రుహద్గాయత్రి మంత్రం. ప్రతి రోజూ త్రిసంధ్యా సమయంల్లో వేయి సార్లు గాయత్రి మంత్రంని పఠిస్తే వాక్సుద్ది కలుగుతుంది. 4. శ్రీ అన్నపూర్ణేశ్వరి దేవి: నాల్గవ రోజున నిత్యాన్నదానేశ్వరి శ్రీ అన్నపూర్ణా దేవి అలంకారం అన్నం జీవుల మనుగడకు ఆదారం. జీవకోటి నశించకుండా వారణాసి క్షేత్రాన్ని నిజ క్షేత్రంగా, క్షేత్ర అధినాయకుడు విశ్వేశ్వరుడి ప్రియపత్నిగా శ్రీ అన్నపూర్ణా దేవి విరాజిల్లుతుంది. 5. శ్రీ మహా సరస్వతీ దేవి: ఐదవ రోజున చదువుల తల్లి సరస్వతీ దేవి అలంకారం త్రి శక్తులలో ఒక మహాశక్తి శ్రీ సరస్వతీ దేవి. సరస్వతీ దేవి సప్తరూపాలలో ఉంటుందని మేరు తంత్రంలో చెప్పబడింది . అవి చింతామని సరస్వతి, జ్ఝాన సరస్వతి, నిల సరస్వతి, ఘట సరస్వతి, కిణి సరస్వతి, అంతరిక్ష సరస్వతి, మరియు మహా సరస్వతి. మహా సరస్వతి దేవి శుంభని శుంభులనే రాక్షసులను వధించింది. ..2 ..2.. 6. శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవివేవి : 6వ రోజున త్రిపురాత్రయంలో రెండో శక్తి శ్రీ లలితా దేవి అలంకారం. త్రిమూర్తులకన్నా ముందు నుండి ఉన్నది కాబట్టి, త్రిపుర సుందరి అని పిలవబడుతుంది. శ్రీచక్ర ఆదిష్టాన శక్తి, పంచదశాక్షరి అదిష్టాన దేవత. ఆదిశంకరాచార్యులు శ్రీ చక్రయంత్రాన్ని ప్రతిష్టించక పూర్వం ఈ దేవి ఉగ్ర రూపిణిగా ‘చండీదేవి'గా పిలవబడేది. ఆది శంకరాచార్యలు శ్ీర చక్రయంత్రాన్ని ప్రతి ష్టించాక పరమశాతం రూపిణిగా లలితా దేవిగా పిలవబడుతున్నది. 7. శ్రీ మహాలక్ష్మి తేది : 7వ రోజున మంగళ ప్రద దేవత శ్రీ మహాలక్ష్మీ దేవి అలంకారం అష్టరూపాలతో అష్ట సిద్దులు ప్రసాదించే దేవత. రెండు చేతులలో కమలాలని ధరించి, వరదాభయ హస్తాల్ని ప్రదర్శిస్తూ, పద్మాసనిగా దర్శనిమిస్తుంది. ఆది పరాశక్తి మహాకాళీ, మహాలక్ష్మీ, మహా సరస్వతి రూపాలు ధరించింది. ఆ ఆదిపరాశక్తి రూపంగానే మహాలక్ష్మీ అలంకారం జరుగుతుంది. 8. శ్రీ దుర్గా దేవి అలంకారం: దుర్గతులను నాశనం చేసే శ్రీ దుర్గా దేవి అలంకరాం రురుకుమారుడైన ‘దుర్గముడు' అనే రాక్షసున్ని సంహరించింది అష్టమి రోజునే కనుక ఈ రోజును దుర్గాష్టమి అని, దుర్గమున్ని సంహరించిన అవతారం కనుక దేవిని ‘దుర్గా' అని పిలుస్తారు. శ్రీ మహిషాసుర మర్ధినీ దేవి అలంకారం: మహిశాసురున్ని చంపడానికి దేవతలందరూ తమ తమ శక్తులను ప్రదానం చేయగా ఏర్పడిన అవతారం ఇది. సింహాన్ని వాహనంగా ఈ దేవికి హిమవంతుడు బహుకరించాడు. సింహ వాహనంతో రాక్షస సంహారం చేసి అనంతరం ఇంద్ర కీలాద్రి పై వెలిసింది 9. శ్రీరాజరాజేశ్వరి దేవి అలంకారం: 9వరోజు అపజయం అంటే ఎరుగని శక్తి కాబట్టి ఈ మాతను ‘అపరాజిత' అంటారు. ఎల్లప్పుడు విజయాలను పొందుతుంది కాబట్టి‘విజయ' అని కూడా అంటారు. శ్రీ రాజరాజేశ్వరి దేవి ఎప్పుడూ శ్రీ మహా పరమేశ్వరుడి అంకముపై ఆసీనురాలై భక్తులకు దర్శనమిస్తుందని పురాణ ఇతి హాసారు వెల్లడిస్తున్నాయి. -
Image
గాజువాక జర్నలిస్టుల వినతిని సీఎం జగన్మోహనరెడ్డి దృష్టికి తీసుకువెళ్తా
Image
మహిళల ఆర్థిక స్వావలంబనే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం
Image
శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం, ఇంద్రకీలాద్రి
Image
Kvik Fitness Arena " జిమ్ సెంటర్
Image