రాష్ట్ర సచివాలయంలో ఎస్పీఎఫ్ పోలీసులకు వైద్య శిబిరం.
అమరావతి,4 మే (ప్రజా అమరావతి):ఎ.పి. సెక్రటేరియట్లో పనిచేస్తున్న ఎస్.పి.ఎఫ్. సిబ్బంది మరియు అధికారులకు గురువారము ఎస్.పి.ఎఫ్ ఆఫీస్ ఆవరణలో విజయవాడ రమేష్ హాస్పిటల్ వారి ఆధ్వర్యములో ఉచిత వైద్య శిబిరం నిర్వహిoచడం జరిగింది.ఎస్. పి. ఎఫ్. డి.జి. హరీష్ కుమార్ గుప్తా ఆదేశాలు మేరకు ఎస్.పి.ఎఫ్. డి.ఐ.జి. బి.వి.రామి రెడ్డి సలహాల మేరకు commandant Dr. కె.ఎన్.రావు ఆద్వర్యములో ఈ వైద్య శిబిరము జరిగిందని చీఫ్ సెక్యూరిటీ అధికారి కె.కృష్ణమూర్తి తెలిపారు. ఈ వైద్య శిబిరములో 222 ఎస్.పి.ఎఫ్. అధికారులు మరియు సిబ్బంది కి గుండె, షుగర్, బి.పి. మరియు ఇతర వైద్య పరిక్షలు నిర్వహిoచడం జరిగిందని చెప్పారు. ఇందులో భాగముగా ఇ.సి.జి. పరిక్ష నిర్వహిoచడం జరిగిందని పేర్కొన్నారు.అంతకు ముందు సిబ్బందిని ఉద్దేశించి ఆర్యోగ్యము పట్ల తీసుకోవలసిన జాగ్రత్తలు మరియు సలహాలను రమేష్ హాస్పిటల్ డాక్టర్స్ అయిన Dr. అబ్దుల్ ఖలీద్ ,కార్దియలజిస్ట్ మరియు Dr.శామ్యూల్ మార్క్ ఫిజిషియన్ లు సూచిoచడము జరిగిoది. ఈ కార్యక్రమములో చీఫ్ సెక్యూరిటీ అధికారి కృష్ణమూర్తి తోపాటు ఇన్స్పెక్టర్లు వి.ఎస్..నారాయణ & Dr. ఎ.సతీష్ కుమార్, సబ్ ఇన్స్పెక్టర్స్ ,సిబ్బంది పాల్గొన్నారు.
addComments
Post a Comment