మానవత్వానికి మరో రూపం ముఖ్యమంత్రి వై. ఎస్ జగన్ మోహన్ రెడ్డి.

  


            మానవత్వానికి మరో రూపం ముఖ్యమంత్రి వై. ఎస్ జగన్ మోహన్ రెడ్డి. 


            నేనున్నాను..   మీ జీవితాలకు నాదీ భరోసా అంటూ ఆదుకున్న వైనం. 

            మీరే నా కుటుంబం   మీ బాధలను నా బాధగానే  పంచుకుంటానన్న ముఖ్యమంత్రి.  

           సిఎం  హామీ ఇచ్చిన గంట లోపే   వాలంటీర్  కు రూ.  రెండు లక్షలు అందజేసిన  కలెక్టర్ ఢిల్లీరావు.   

                                                          జిల్లా కలెక్టర్ యస్. ఢిల్లీరావు. 


విజయవాడ (ప్రజా అమరావతి);

    ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధులుగా నిలిచేందుకు  2019లో రాష్ట్ర ముఖ్యమంత్రిగా వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం ప్రారంభించిన వాలంటీర్ వ్యవస్థ గత నాలుగు ఏళ్లలో ఎన్నో సంక్షేమ పథకాలను కోట్లాదిమందికి చేరేందుకు నిర్విరామంగా కృషి చేస్తోంది.   ప్రజల కోసం కనీస వేతనం కూడా ఆశించకుండా ప్రభుత్వం కల్పించిన   5000 రూపాయల గౌరవ వేతనంతో తీసుకుని  వాలంటీర్లు ప్రభుత్వ ప్రాధాన్యాలకు అనుగుణంగా విధులు నిర్వహిస్తున్నారు.    ప్రజల కోసం పనిచేస్తున్న వాలంటీర్లలో చాలామంది నిరుపేదలే. సంపదలో పేదవారేమో కానీ సేవలో మాత్రం అందరికంటే ముందుంటారు మన   వాలంటీర్లు.  అటువంటి  వాలంటీర్ లలో పెనమలూరు మండలం కానూరు మురళి నగర్, 20వ వార్డులో ఐదవ నెంబర్ సచివాలయంలో విధులు నిర్వహిస్తున్న జక్కుల సోంబాబు ఒకరు.  రెండు కిడ్నీలు పడైనప్పటికీ   తన ఆరోగ్యాన్ని సైతం లెక్కచేయకుండా గత నాలుగేళ్లుగా  ప్రభుత్వం అప్పగించిన ప్రతి పనిని చిత్తశుద్ధితో అమలు చేస్తున్నారు.   కానూరు గ్రామా సచివాలయం పరిధిలో వాలంటీర్ గా పనిచేస్తూ  దళిత సామాజిక వర్గానికి  చెందిన జక్కుల సోంబాబు చిన్న తనం లోనే  తండ్రిని కోల్పోయారు.   తల్లి ఒక సాధారణ కూలీగా జీవనం సాగిస్తోంది. సోంబాబు వాలంటీర్ గా బాధ్యతలు చేపట్టే నాటికే మూత్రపిండాల వ్యాధితో బాధపడుతున్నాడు. అయినప్పటికీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పై ఉన్న అభిమానంతో వాలంటీర్ గా సేవలందించేందుకు బాధ్యతలు చేపట్టారు. కానీ అతనికి రెండు కిడ్నీలు పూర్తిగా చెడిపోయాయి. డయాలసిస్ చేయించుకోకపోతే జీవించలేని పరిస్థితి. నిజానికి అతను వాలంటీర్ గా మరింత మందికి సేవలు అందించాలనే సంకల్పమే అతనిని బతికిస్తోందేమో. అతని సంకల్పమే రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దృష్టిలో పడేలా చేసింది. శుక్రవారం వాలంటీర్లకు వందనం కార్యక్రమంలో పాల్గొని సభ ముగించుకొని బయలుదేరిన ముఖ్యమంత్రిని సోంబాబు తన తల్లి, సోదరుడితో కలిసి  తన ఆవేదన, వాలంటీరుగా మరింత కాలం సేవలందించాలనే సంకల్పాన్ని గురించి వివరించారు.   సోంబాబు దిన గాధను విన్న ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి చలించి పోయారు.వెంటనే ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఢిల్లీ రావుని పిలిచి సోంబాబుకు తక్షణసాయంగా రెండు లక్షల రూపాయలు అందించాలని ఆదేశించారు. ఈ సాయంతో పాటుగా ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి 10 లక్షల రూపాయలు ఆర్థిక సాయం ప్రకటించారు. ముఖ్యమంత్రి మానవత్వానికి మరో మచ్చుతునక అని చెప్పగలిగే మరొక సహాయాన్ని కూడా ప్రకటించారు. డయాలసిస్ పేషెంట్లకు ప్రభుత్వం ఇస్తున్న పదివేల రూపాయల పెన్షన్ కూడా అందించాలని అధికారులను ఆదేశించారు. వీటితోపాటుగా మూత్రపిండాల మార్పిడికి అవసరమైన ఆన్లైన్ రిజిస్ట్రేషన్ కూడా తక్షణమే పూర్తిచేయాలని చెప్పారు. మూత్రపిండాల మార్పిడికి అయ్యే ఖర్చులను కూడా ప్రభుత్వమే భరిస్తుందని సోంబాబు కుటుంబానికి హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రి చేసిన ఈ సహాయం తన జీవితంలో మర్చిపోలేనని సోంబాబు తన సంతోషాన్ని వ్యక్తం చేస్తూ  ముఖ్యమంత్రికి పాదాభివందనం చేసేందుకు ప్రయత్నించగా జగన్మోహన్ రెడ్డి వారించారు. తన ప్రభుత్వంలో వాలంటీర్లకు ఎటువంటి కష్టం వచ్చినా తాను అండగా ఉంటానని ప్రకటించారు.


రెండు లక్షల రూపాయలు   చెక్కు అందజేత జిల్లా కలెక్టర్ ఢిల్లీరావు. 

    ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఒక సాధారణ వాలంటీర్ కు ఇచ్చిన హామీని తక్షణమే ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఢిల్లీ రావు అమలు చేసి చూపించారు.  వాలంటీర్లకు వందనం సభలో కానూరు మురళి నగర్ కు చెందిన వాలంటీర్ కు జక్కుల సోంబాబు కు తక్షణ ఆర్ధిక సహాయం ప్రకటించిన   రెండు లక్షల రూపాయలు ఆర్ధిక సహాయాన్ని సభ ముగిసిన గంట లోపే ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ సోంబాబు కుటుంబానికి తన కార్యాలయంలో అందజేసి ముఖ్యమంత్రి హామీని నెరవేర్చారు. సహాయం ప్రకటించిన గంట వ్యవధిలో బాధితునికి సాంత్వన కలిగేలా జిల్లా అధికార యంత్రాంగం వేగంగా స్పందించడం పరిపాలన దక్షతకు నిదర్శనం.   చెక్కు అందజేసిన అనంతరం జిల్లా కలెక్టర్ ఢిల్లీరావు మాట్లాడుతూ  ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు తక్షణమే రెండు లక్షల రూపాయల ఆర్ధిక సహాయాన్ని అందిస్తున్నామన్నారు.  ఇతర సహాయాలను  కృష్ణా జిల్లా కలెక్టర్ కార్యాలయం అమలు చేస్తుందని తమ కార్యాలయం సిబ్బంది ఎప్పటికప్పుడు ఆర్ధిక సహాయం అందిచటంలో పర్యవేక్షణ చేయడం జరుగుతుందన్నారు.  ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడంలో  ముఖ్యమంత్రి  మానవత్వానికి  నేటి సంఘటన నిదర్శనమన్నారు.   ఎన్టీఆర్ జిల్లాలో మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి, పేద, బలహీన వర్గాలకు  చెందిన వారి సమస్యలను తక్షణం పరిష్కరించేందుకు జిల్లా అధికార యంత్రాంగం నిర్విరామంగా కృషి చేస్తోందని అన్నారు.   అపరిష్కృత సమస్యలన్నీ జిల్లా యంత్రాంగం దృష్టికి వచ్చినంత వరకు సకాలంలోనే పరిష్కరిస్తున్నామని తెలిపారు. సమస్యల పట్ల ఇంత వేగంగా స్పందించి, మానవత్వంతో ఆలోచించే ప్రభుత్వం ఉండటం అరుదైన విషయమని జిల్లా కలెక్టర్ ఢిల్లీరావు అన్నారు.  

      జిల్లా కలెక్టర్ నుండి ఆర్ధిక సహాయం చెక్కును స్వీకరించిన వాలంటీర్ జక్కుల సోంబాబు తో పాటు ఆయన మాతృమూర్తి జక్కుల వెంకమ్మ, సోదరులు జక్కుల జనార్దన్, జక్కుల నవీన్ లు  ఉన్నారు. 


Comments
Popular posts
దసరా నవరాత్రులు: కనకదుర్గమ్మ తొమ్మిది రోజులు అలంకరణ రూపాలు ... విజయవాడ, ఇంద్రకీలాద్రి (prajaamaravati), అక్టోబరు 18 :- దసరా శరన్నవరాత్రులు హిందువులకు ఒక ముఖ్యమైన పండుగ. ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుండి ఆశ్వయుజ శుద్ధ నవమి వరకు తొమ్మిది రోజులు దేవీ నవరాత్రులు పదవ రోజు విజయ దశమి కలసి దసరా అంటారు. ఇది ముఖ్యముగా శక్తి ఆరాధనకు ప్రాధాన్యత ఇచ్చే పండుగ. ఈ పండుగకు నవరాత్రి, శరన్నవరాత్రి అనీ కూడా అంటారు. శరదృతువు ఆరంభంలో వచ్చే పండుగ కనుక ఈ పేరు వచ్చింది. కొందరు ఈ పండుగకు మొదటి మూడు రోజులు పార్వతిదేవికి తరువాతి మూడు రోజుల లక్ష్మీ దేవికి తరువాతి మూడురోజులు సరస్వతి దేవికి పూజలు నిర్వహిస్తారు. ఈ సమయంలో పూజలో విద్యార్ధులు తమ పుస్తకాలను ఉంచుతారు. ఇలా చేస్తే విద్యాభ్యాసంలో విజయం లభిస్తుందని విశ్వసిస్తారు. సామాన్యులే కాక యోగులు నవరాత్రులలో అమ్మవారిని పూజిస్తారు. ముఖ్యముగా శాక్తేయులు దీనిని ఆచరిస్తారు. బొమ్మల కొలువు పెట్టడం ఒక ఆనవాయితీ. ఆలయాలలో అమ్మవారికి ఒక్కోరోజు ఒక్కో అలంకారం చేస్తారు. ఈ తొమ్మిది రోజుల్లో అమ్మవారిని తొమ్మిది రూపాల్లో పూజిస్తూ ఉంటారు. లోకకల్యాణం కోసం అమ్మవారు ఒక్కోరోజు ఒక్కో రూపాన్ని ధరించింది. అందువలన అలా అమ్మవారు అవతరించిన రోజున, ఆ రూపంతో అమ్మవారిని అలంకరించి ఆ నామంతో ఆరాధిస్తూ ఉంటారు. ఇంద్రకీలాద్రిపై వేంచేసి యున్న శ్రీ కనకదుర్గమ్మావారు మొదటి రోజు శ్రీ స్వర్ణకవచాలంకృత శ్రీ దుర్గాదేవిగా రెండవ రోజు బాలాత్రిపుర సుందరి మూడవ రోజు గాయత్రి దేవిగా, నాల్గవ రోజు అన్నపూర్ణ దేవిగా ఐదవరోజు శ్రీ సర్వస్వతి దేవిగా ఆరవ రోజు శ్రీ లలిత త్రిపుర సుందరీ దేవిగా, ఏడవ రోజు శ్రీ మహలక్ష్మీదేవిగా, ఎనిమిదవ రోజు దుర్గాదేవి మరియు మహిషాసుర మర్థిని దేవిగా, తొమ్మిదవ రోజు శ్రీ రాజరాజేశ్వరి దేవి మొదలైన అవతార రూపాలతో దర్శనమిస్తూ భక్తులకు అమ్మవారు దర్శనమిస్తారు.ఇలా ఈ నవరాత్రుల సమయంలో ఒక్కో అమ్మవారిని ఆరాధించడం వలన ఒక్కో విశేష ఫలితం లభిస్తుందని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి. నవరాత్రుల్లో బెడవాడ శ్రీకనకదుర్గమ్మ వారు వివిధ అలంకారాలతో భక్తుల కోర్కేలను తీర్చు చల్లని తల్లిగా దర్శనమిస్తారు.. 1. దుర్గాదేవి అలకారం ః శరన్నవరాత్రి మహోత్సవాల్లో శ్రీ కనకదుర్గమ్మవారు శ్రీ స్వర్ణకవచాలంకృత శ్రీ దుర్గాదేవిగా దర్శినమిచ్చి భక్తులకు ఆయురారోగ్య ఐశ్వర్యాలను కలుగుజేస్తారు. 2. శ్రీ బాలాత్రిపుర సుందరి: ఫత్రిపురాత్రయంలో శ్రీ బాలాత్రి పుర సుందరీదేవి ప్రథమ స్థానంలో ఉంది. ఆమె ఎంతో మహిమాన్వితమైన ది. సమస్త దేవీ మంత్రాలలోకెల్లా శ్రీ బాలా మంత్రం గొప్పది. సకల శక్తి పూజలకు మూలమైన శ్రీ బాలాదేవి జగన్మోహనాకారాన్ని పవిత్రమైన శరన్నవరాత్రుల్లో దర్శించి, ఆమె అనుగ్రహాన్ని పొందితే, సంవత్సరం పొడుగునా అమ్మవారికి చేసే పూజలన్నీ సత్వర ఫలితాలనిస్తాయి. 3. శ్రీ గాయత్రి దేవి అలంకారం: ముక్తా విద్రుమ హేమనీల ధవల వర్థాలలతో ప్రకాశిస్తు, పంచ ముఖాలతో దర్శనమిస్తుంది. సంధ్యావందనం అధి దేవత . గాయత్రి మంత్రం రెండు రకాలు: 1. లఘు గాయత్రి మంత్రం 2. బ్రుహద్గాయత్రి మంత్రం. ప్రతి రోజూ త్రిసంధ్యా సమయంల్లో వేయి సార్లు గాయత్రి మంత్రంని పఠిస్తే వాక్సుద్ది కలుగుతుంది. 4. శ్రీ అన్నపూర్ణేశ్వరి దేవి: నాల్గవ రోజున నిత్యాన్నదానేశ్వరి శ్రీ అన్నపూర్ణా దేవి అలంకారం అన్నం జీవుల మనుగడకు ఆదారం. జీవకోటి నశించకుండా వారణాసి క్షేత్రాన్ని నిజ క్షేత్రంగా, క్షేత్ర అధినాయకుడు విశ్వేశ్వరుడి ప్రియపత్నిగా శ్రీ అన్నపూర్ణా దేవి విరాజిల్లుతుంది. 5. శ్రీ మహా సరస్వతీ దేవి: ఐదవ రోజున చదువుల తల్లి సరస్వతీ దేవి అలంకారం త్రి శక్తులలో ఒక మహాశక్తి శ్రీ సరస్వతీ దేవి. సరస్వతీ దేవి సప్తరూపాలలో ఉంటుందని మేరు తంత్రంలో చెప్పబడింది . అవి చింతామని సరస్వతి, జ్ఝాన సరస్వతి, నిల సరస్వతి, ఘట సరస్వతి, కిణి సరస్వతి, అంతరిక్ష సరస్వతి, మరియు మహా సరస్వతి. మహా సరస్వతి దేవి శుంభని శుంభులనే రాక్షసులను వధించింది. ..2 ..2.. 6. శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవివేవి : 6వ రోజున త్రిపురాత్రయంలో రెండో శక్తి శ్రీ లలితా దేవి అలంకారం. త్రిమూర్తులకన్నా ముందు నుండి ఉన్నది కాబట్టి, త్రిపుర సుందరి అని పిలవబడుతుంది. శ్రీచక్ర ఆదిష్టాన శక్తి, పంచదశాక్షరి అదిష్టాన దేవత. ఆదిశంకరాచార్యులు శ్రీ చక్రయంత్రాన్ని ప్రతిష్టించక పూర్వం ఈ దేవి ఉగ్ర రూపిణిగా ‘చండీదేవి'గా పిలవబడేది. ఆది శంకరాచార్యలు శ్ీర చక్రయంత్రాన్ని ప్రతి ష్టించాక పరమశాతం రూపిణిగా లలితా దేవిగా పిలవబడుతున్నది. 7. శ్రీ మహాలక్ష్మి తేది : 7వ రోజున మంగళ ప్రద దేవత శ్రీ మహాలక్ష్మీ దేవి అలంకారం అష్టరూపాలతో అష్ట సిద్దులు ప్రసాదించే దేవత. రెండు చేతులలో కమలాలని ధరించి, వరదాభయ హస్తాల్ని ప్రదర్శిస్తూ, పద్మాసనిగా దర్శనిమిస్తుంది. ఆది పరాశక్తి మహాకాళీ, మహాలక్ష్మీ, మహా సరస్వతి రూపాలు ధరించింది. ఆ ఆదిపరాశక్తి రూపంగానే మహాలక్ష్మీ అలంకారం జరుగుతుంది. 8. శ్రీ దుర్గా దేవి అలంకారం: దుర్గతులను నాశనం చేసే శ్రీ దుర్గా దేవి అలంకరాం రురుకుమారుడైన ‘దుర్గముడు' అనే రాక్షసున్ని సంహరించింది అష్టమి రోజునే కనుక ఈ రోజును దుర్గాష్టమి అని, దుర్గమున్ని సంహరించిన అవతారం కనుక దేవిని ‘దుర్గా' అని పిలుస్తారు. శ్రీ మహిషాసుర మర్ధినీ దేవి అలంకారం: మహిశాసురున్ని చంపడానికి దేవతలందరూ తమ తమ శక్తులను ప్రదానం చేయగా ఏర్పడిన అవతారం ఇది. సింహాన్ని వాహనంగా ఈ దేవికి హిమవంతుడు బహుకరించాడు. సింహ వాహనంతో రాక్షస సంహారం చేసి అనంతరం ఇంద్ర కీలాద్రి పై వెలిసింది 9. శ్రీరాజరాజేశ్వరి దేవి అలంకారం: 9వరోజు అపజయం అంటే ఎరుగని శక్తి కాబట్టి ఈ మాతను ‘అపరాజిత' అంటారు. ఎల్లప్పుడు విజయాలను పొందుతుంది కాబట్టి‘విజయ' అని కూడా అంటారు. శ్రీ రాజరాజేశ్వరి దేవి ఎప్పుడూ శ్రీ మహా పరమేశ్వరుడి అంకముపై ఆసీనురాలై భక్తులకు దర్శనమిస్తుందని పురాణ ఇతి హాసారు వెల్లడిస్తున్నాయి. -
Image
గాజువాక జర్నలిస్టుల వినతిని సీఎం జగన్మోహనరెడ్డి దృష్టికి తీసుకువెళ్తా
Image
మహిళల ఆర్థిక స్వావలంబనే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం
Image
శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం, ఇంద్రకీలాద్రి
Image
Kvik Fitness Arena " జిమ్ సెంటర్
Image