శ్రీ కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి వారిని దర్శించు కున్న గౌ. సుప్రీంకోర్టు జడ్జి జస్టిస్ జె.కె. మహేశ్వరి
కాణిపాకం,మే 5 (ప్రజా అమరావతి):
శ్రీ కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి వారిని శుక్రవారం సాయంత్రం దర్శించు కున్న గౌ. సుప్రీంకోర్టు జడ్జి జస్టిస్ జె.కె. మహేశ్వరి..
గౌ. సుప్రీంకోర్టు జడ్జి జస్టిస్ జె.కె. మహేశ్వరి.. తోపాటు గౌ.ఆంధ్రప్రదేశ్ హైకోర్టు జడ్జి జస్టిస్ డి.వెంకట రమణ గార్లు స్వామి వారి దర్శనార్థం విచ్చేయ గా గౌ. జిల్లా జడ్జి ఈ.భీమారావ్,
జిల్లా కలెక్టర్ సగిలి షన్మోహన్,పుష్పగుచ్చం అంద జేసి స్వాగతంపలికారు.ఆలయ పాలక మండలి ఛైర్మన్ మోహన్ రెడ్డి,
ఈవో వెంకటేశు..
వేద పండితులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు .
స్వామి వారిని గౌ. సుప్రీంకోర్టు జడ్జి జస్టిస్ దంపతులు, గౌ.హైకోర్టు జడ్జి జస్టిస్ గార్లు దర్శనం చేసుకున్నా అనంతరం వేద ఆశీర్వచనమండపంలో తీర్థ ప్రసాదాలను వేద పండితులు అందజేశారు..
ఈ కార్యక్రమంలో గౌ. తిరుపతి మూడవ అదనపు జిల్లా జడ్జి వై.వి.వీర్రాజు,గౌ. చిత్తూరు మూడవ అదనపు జూనియర్ సివిల్ జడ్జి ఎస్. శ్రీనివాస్,గౌ.చిత్తూరు ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి ఐ. శ్రీనివాసమూర్తి,
చిత్తూరు ఆర్డీఓ రేణుక,ఐరాల తహసీల్దార్ సుశీల ఇతర సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
addComments
Post a Comment