నాణ్యమైన సేవలు అందించాలి.

 *నాణ్యమైన సేవలు అందించాలి*


*: ప్రజలతో సత్సంబంధాలు కొనసాగించాలి*


*: అధికారులపై నమ్మకం కలిగే విధంగా ప్రజల్లో గుర్తింపు తెచ్చుకోవాలి*


*: సేవలు అందించడంలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం*


*: అత్యవసర పరిస్థితిలో రెవెన్యూ వ్యవస్థ చాలా కీలకం*


*: జిల్లా కలెక్టర్ పి.అరుణ్ బాబు*


పుట్టపర్తి (శ్రీ సత్యసాయి జిల్లా), మే 16 (ప్రజా అమరావతి):


ప్రజలకు నాణ్యమైన రెవెన్యూ సేవలు అందించాలని, సేవలు అందించడంలో ఎలాంటి నిర్లక్ష్యం ప్రదర్శించరాదని, నిర్లక్ష్యం వహిస్తే అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ పి.అరుణ్ బాబు హెచ్చరించారు. మంగళవారం పుట్టపర్తి కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో పెనుకొండ సబ్ కలెక్టర్, ఆర్డీవోలు, డిఎస్ఓ, డిఎల్ఎస్ఓ, తహసిల్దార్లు, డిఐఓలతో రీ సర్వే, ఎఫ్పిఓఎల్ఆర్, మ్యుటేషన్స్, హౌస్ సైట్స్, స్పందన, కోర్టుకేసులు, వివిధ ప్రాజెక్టులకు భూసేకరణ, తదితర అంశాలపై జిల్లా స్థాయి రెవెన్యూ కాన్ఫరెన్స్ ను జాయింట్ కలెక్టర్ టీఎస్.చేతన్, పెనుకొండ సబ్ కలెక్టర్ కార్తీక్ తో కలిసి జిల్లా కలెక్టర్ నిర్వహించారు.


ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ అత్యవసర పరిస్థితిలో రెవెన్యూ వ్యవస్థ చాలా కీలకమన్నారు. క్షేత్రస్థాయిలో వీఆర్వో నుంచి ఆర్డీఓ స్థాయి వరకు అధికారులు ఎక్కువ కష్టపడి పనిచేయాలన్నారు. అధికారులంతా ప్రజలతో మంచి తస్సంబంధాలు కొనసాగించాలన్నారు. ఎలాంటి ఫిర్యాదులు లేకుండా ప్రజలకు నాణ్యమైన రెవెన్యూ సేవలు అందించాలన్నారు. సేవలు అందించడంలో ఎలాంటి నిర్లక్ష్యం ప్రదర్శించరాదని, నిర్లక్ష్యం వహిస్తే అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. అధికారులపై నమ్మకం కలిగే విధంగా ప్రజల్లో గుర్తింపు తెచ్చుకోవాలన్నారు. రెవెన్యూ శాఖ, సర్వే శాఖ వేర్వేరు కాదని రెండూ ఒకటేనని, ఆయా శాఖలు సమన్వయం చేసుకొని పనిచేయాలన్నారు. నిజంగా అర్హత కలిగిన వారికి ప్రభుత్వ సంక్షేమ పథకాలను అందించేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. ప్రభుత్వ భూమిని కాపాడుకోవడంలో అధికారులు బాధ్యత వహించి ప్రత్యేక శ్రద్ధ పెట్టాలన్నారు. అర్హత కలిగిన వారికి భూమి కేటాయించేటప్పుడు ఉన్నతాధికారుల అనుమతి తీసుకోవాలని ఆదేశించారు. ఇష్టానుసారం ప్రవర్తిస్తే అధికారులకే ఇబ్బందులు కలుగుతాయన్నారు. కోర్టు కేసులు ఎప్పటికప్పుడు పరిష్కరించేలా పనిచేయాలన్నారు. ఆర్డీవోలు, తహసిల్దార్ సంబంధిత అధికారులతో ప్రతిరోజు సమస్యల పరిష్కారం పై సమీక్ష నిర్వహించుకుని వాటిని ఎప్పటికప్పుడు పరిష్కరించేలా కృషి చేయాలన్నారు. జగనన్న కాలనీలో జరుగుతున్న ఇళ్ల నిర్మాణంలో రెవెన్యూ శాఖ అధికారుల సహకారం తీసుకోవాలని సూచించారు. అన్ని లేఔట్ ల అభివృద్ధికి చర్యలు తీసుకోవాలన్నారు. ఆదాయ, ఇంటిగ్రేటెడ్ సర్టిఫికెట్ల మంజూరులో ఎలాంటి పెండింగ్ ఉంచకుండా ఎప్పటికప్పుడు సకాలంలో ధృవీకరణ పత్రాలను అందించాలన్నారు. అన్ని రకాల ధ్రువీకరణ పత్రాలు అందించే అధికారం ఒక తహసీల్దారులకే ఉందని, ప్రభుత్వ ప్రాధాన్యత భవన నిర్మాణాలకు సంబంధించి భూముల కేటాయింపు విషయంలో త్వరితగతిన భూమిని కేటాయించాలన్నారు. ధ్రువీకరణ పత్రాల మంజూరులో గోరంట్ల, మడకశిర, ఓడి చెరువు, కదిరి, పుట్టపర్తి, నల్లమడ, సోమందేపల్లి, బుక్కపట్నం తదితర మండలాలలో వెనుకబడి ఉందని, ఆయా మండలాల తహసీల్దారులు వెంటనే ధ్రువీకరణ పత్రాలు మంజూరుకు చర్యలు చేపట్టాలన్నారు. తహసీల్దార్ల ఆధ్వర్యంలో ఏదైనా పని చేయగలిగితే చేయాలన్నారు. రీ ఓపెన్ పిటిషన్లకు సంబంధించి లబ్ధిదారులతో స్వయంగా మాట్లాడి క్షేత్రస్థాయిలో పరిశీలించి సంతృప్తికరంగా నాణ్యమైన పరిష్కారం అందించాలని, ఒకవేళ తిరస్కారానికి గురయితే అందుకు తగిన కారణాలు కూడా తెలియజేయాలన్నారు. రెవెన్యూ పరిధిలో అన్ని రకాల అంశాలపై అధికారులు అంతా ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని, సమస్యల పరిష్కారానికి దృష్టి సారించాలన్నారు.


ఈ సమావేశంలో డిఆర్ఓ కొండయ్య, డిప్యూటీ కలెక్టర్లు మధులత, భవాని శంకర్, ఆర్డీవోలు భాగ్యరేఖ, రాఘవేంద్ర, తిప్పే నాయక్, డిఎస్ఓ వంశీకృష్ణ, కలెక్టరేట్ సూపరింటెండెంట్ బాలాజీ, తహసీల్దార్ లు, డిఎల్ఎస్ఓ, డిఐఓలు, తదితరులు పాల్గొన్నారు.



Comments
Popular posts
దసరా నవరాత్రులు: కనకదుర్గమ్మ తొమ్మిది రోజులు అలంకరణ రూపాలు ... విజయవాడ, ఇంద్రకీలాద్రి (prajaamaravati), అక్టోబరు 18 :- దసరా శరన్నవరాత్రులు హిందువులకు ఒక ముఖ్యమైన పండుగ. ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుండి ఆశ్వయుజ శుద్ధ నవమి వరకు తొమ్మిది రోజులు దేవీ నవరాత్రులు పదవ రోజు విజయ దశమి కలసి దసరా అంటారు. ఇది ముఖ్యముగా శక్తి ఆరాధనకు ప్రాధాన్యత ఇచ్చే పండుగ. ఈ పండుగకు నవరాత్రి, శరన్నవరాత్రి అనీ కూడా అంటారు. శరదృతువు ఆరంభంలో వచ్చే పండుగ కనుక ఈ పేరు వచ్చింది. కొందరు ఈ పండుగకు మొదటి మూడు రోజులు పార్వతిదేవికి తరువాతి మూడు రోజుల లక్ష్మీ దేవికి తరువాతి మూడురోజులు సరస్వతి దేవికి పూజలు నిర్వహిస్తారు. ఈ సమయంలో పూజలో విద్యార్ధులు తమ పుస్తకాలను ఉంచుతారు. ఇలా చేస్తే విద్యాభ్యాసంలో విజయం లభిస్తుందని విశ్వసిస్తారు. సామాన్యులే కాక యోగులు నవరాత్రులలో అమ్మవారిని పూజిస్తారు. ముఖ్యముగా శాక్తేయులు దీనిని ఆచరిస్తారు. బొమ్మల కొలువు పెట్టడం ఒక ఆనవాయితీ. ఆలయాలలో అమ్మవారికి ఒక్కోరోజు ఒక్కో అలంకారం చేస్తారు. ఈ తొమ్మిది రోజుల్లో అమ్మవారిని తొమ్మిది రూపాల్లో పూజిస్తూ ఉంటారు. లోకకల్యాణం కోసం అమ్మవారు ఒక్కోరోజు ఒక్కో రూపాన్ని ధరించింది. అందువలన అలా అమ్మవారు అవతరించిన రోజున, ఆ రూపంతో అమ్మవారిని అలంకరించి ఆ నామంతో ఆరాధిస్తూ ఉంటారు. ఇంద్రకీలాద్రిపై వేంచేసి యున్న శ్రీ కనకదుర్గమ్మావారు మొదటి రోజు శ్రీ స్వర్ణకవచాలంకృత శ్రీ దుర్గాదేవిగా రెండవ రోజు బాలాత్రిపుర సుందరి మూడవ రోజు గాయత్రి దేవిగా, నాల్గవ రోజు అన్నపూర్ణ దేవిగా ఐదవరోజు శ్రీ సర్వస్వతి దేవిగా ఆరవ రోజు శ్రీ లలిత త్రిపుర సుందరీ దేవిగా, ఏడవ రోజు శ్రీ మహలక్ష్మీదేవిగా, ఎనిమిదవ రోజు దుర్గాదేవి మరియు మహిషాసుర మర్థిని దేవిగా, తొమ్మిదవ రోజు శ్రీ రాజరాజేశ్వరి దేవి మొదలైన అవతార రూపాలతో దర్శనమిస్తూ భక్తులకు అమ్మవారు దర్శనమిస్తారు.ఇలా ఈ నవరాత్రుల సమయంలో ఒక్కో అమ్మవారిని ఆరాధించడం వలన ఒక్కో విశేష ఫలితం లభిస్తుందని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి. నవరాత్రుల్లో బెడవాడ శ్రీకనకదుర్గమ్మ వారు వివిధ అలంకారాలతో భక్తుల కోర్కేలను తీర్చు చల్లని తల్లిగా దర్శనమిస్తారు.. 1. దుర్గాదేవి అలకారం ః శరన్నవరాత్రి మహోత్సవాల్లో శ్రీ కనకదుర్గమ్మవారు శ్రీ స్వర్ణకవచాలంకృత శ్రీ దుర్గాదేవిగా దర్శినమిచ్చి భక్తులకు ఆయురారోగ్య ఐశ్వర్యాలను కలుగుజేస్తారు. 2. శ్రీ బాలాత్రిపుర సుందరి: ఫత్రిపురాత్రయంలో శ్రీ బాలాత్రి పుర సుందరీదేవి ప్రథమ స్థానంలో ఉంది. ఆమె ఎంతో మహిమాన్వితమైన ది. సమస్త దేవీ మంత్రాలలోకెల్లా శ్రీ బాలా మంత్రం గొప్పది. సకల శక్తి పూజలకు మూలమైన శ్రీ బాలాదేవి జగన్మోహనాకారాన్ని పవిత్రమైన శరన్నవరాత్రుల్లో దర్శించి, ఆమె అనుగ్రహాన్ని పొందితే, సంవత్సరం పొడుగునా అమ్మవారికి చేసే పూజలన్నీ సత్వర ఫలితాలనిస్తాయి. 3. శ్రీ గాయత్రి దేవి అలంకారం: ముక్తా విద్రుమ హేమనీల ధవల వర్థాలలతో ప్రకాశిస్తు, పంచ ముఖాలతో దర్శనమిస్తుంది. సంధ్యావందనం అధి దేవత . గాయత్రి మంత్రం రెండు రకాలు: 1. లఘు గాయత్రి మంత్రం 2. బ్రుహద్గాయత్రి మంత్రం. ప్రతి రోజూ త్రిసంధ్యా సమయంల్లో వేయి సార్లు గాయత్రి మంత్రంని పఠిస్తే వాక్సుద్ది కలుగుతుంది. 4. శ్రీ అన్నపూర్ణేశ్వరి దేవి: నాల్గవ రోజున నిత్యాన్నదానేశ్వరి శ్రీ అన్నపూర్ణా దేవి అలంకారం అన్నం జీవుల మనుగడకు ఆదారం. జీవకోటి నశించకుండా వారణాసి క్షేత్రాన్ని నిజ క్షేత్రంగా, క్షేత్ర అధినాయకుడు విశ్వేశ్వరుడి ప్రియపత్నిగా శ్రీ అన్నపూర్ణా దేవి విరాజిల్లుతుంది. 5. శ్రీ మహా సరస్వతీ దేవి: ఐదవ రోజున చదువుల తల్లి సరస్వతీ దేవి అలంకారం త్రి శక్తులలో ఒక మహాశక్తి శ్రీ సరస్వతీ దేవి. సరస్వతీ దేవి సప్తరూపాలలో ఉంటుందని మేరు తంత్రంలో చెప్పబడింది . అవి చింతామని సరస్వతి, జ్ఝాన సరస్వతి, నిల సరస్వతి, ఘట సరస్వతి, కిణి సరస్వతి, అంతరిక్ష సరస్వతి, మరియు మహా సరస్వతి. మహా సరస్వతి దేవి శుంభని శుంభులనే రాక్షసులను వధించింది. ..2 ..2.. 6. శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవివేవి : 6వ రోజున త్రిపురాత్రయంలో రెండో శక్తి శ్రీ లలితా దేవి అలంకారం. త్రిమూర్తులకన్నా ముందు నుండి ఉన్నది కాబట్టి, త్రిపుర సుందరి అని పిలవబడుతుంది. శ్రీచక్ర ఆదిష్టాన శక్తి, పంచదశాక్షరి అదిష్టాన దేవత. ఆదిశంకరాచార్యులు శ్రీ చక్రయంత్రాన్ని ప్రతిష్టించక పూర్వం ఈ దేవి ఉగ్ర రూపిణిగా ‘చండీదేవి'గా పిలవబడేది. ఆది శంకరాచార్యలు శ్ీర చక్రయంత్రాన్ని ప్రతి ష్టించాక పరమశాతం రూపిణిగా లలితా దేవిగా పిలవబడుతున్నది. 7. శ్రీ మహాలక్ష్మి తేది : 7వ రోజున మంగళ ప్రద దేవత శ్రీ మహాలక్ష్మీ దేవి అలంకారం అష్టరూపాలతో అష్ట సిద్దులు ప్రసాదించే దేవత. రెండు చేతులలో కమలాలని ధరించి, వరదాభయ హస్తాల్ని ప్రదర్శిస్తూ, పద్మాసనిగా దర్శనిమిస్తుంది. ఆది పరాశక్తి మహాకాళీ, మహాలక్ష్మీ, మహా సరస్వతి రూపాలు ధరించింది. ఆ ఆదిపరాశక్తి రూపంగానే మహాలక్ష్మీ అలంకారం జరుగుతుంది. 8. శ్రీ దుర్గా దేవి అలంకారం: దుర్గతులను నాశనం చేసే శ్రీ దుర్గా దేవి అలంకరాం రురుకుమారుడైన ‘దుర్గముడు' అనే రాక్షసున్ని సంహరించింది అష్టమి రోజునే కనుక ఈ రోజును దుర్గాష్టమి అని, దుర్గమున్ని సంహరించిన అవతారం కనుక దేవిని ‘దుర్గా' అని పిలుస్తారు. శ్రీ మహిషాసుర మర్ధినీ దేవి అలంకారం: మహిశాసురున్ని చంపడానికి దేవతలందరూ తమ తమ శక్తులను ప్రదానం చేయగా ఏర్పడిన అవతారం ఇది. సింహాన్ని వాహనంగా ఈ దేవికి హిమవంతుడు బహుకరించాడు. సింహ వాహనంతో రాక్షస సంహారం చేసి అనంతరం ఇంద్ర కీలాద్రి పై వెలిసింది 9. శ్రీరాజరాజేశ్వరి దేవి అలంకారం: 9వరోజు అపజయం అంటే ఎరుగని శక్తి కాబట్టి ఈ మాతను ‘అపరాజిత' అంటారు. ఎల్లప్పుడు విజయాలను పొందుతుంది కాబట్టి‘విజయ' అని కూడా అంటారు. శ్రీ రాజరాజేశ్వరి దేవి ఎప్పుడూ శ్రీ మహా పరమేశ్వరుడి అంకముపై ఆసీనురాలై భక్తులకు దర్శనమిస్తుందని పురాణ ఇతి హాసారు వెల్లడిస్తున్నాయి. -
Image
గాజువాక జర్నలిస్టుల వినతిని సీఎం జగన్మోహనరెడ్డి దృష్టికి తీసుకువెళ్తా
Image
మహిళల ఆర్థిక స్వావలంబనే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం
Image
శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం, ఇంద్రకీలాద్రి
Image
Kvik Fitness Arena " జిమ్ సెంటర్
Image