ప్రజలకు ఇచ్చిన ప్రతి ఒక్క హామీని నూటికి నూరు శాతం అమలు చేయడం తమ ప్రధాన లక్ష్యమ



నెల్లూరు, మే 17 (ప్రజా అమరావతి): గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ప్రజలకు ఇచ్చిన ప్రతి ఒక్క హామీని నూటికి నూరు శాతం అమలు చేయడం తమ  ప్రధాన లక్ష్యమ


ని రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్, ఫుడ్ ప్రాసెసింగ్ మంత్రి శ్రీ కాకాణి గోవర్ధన్ రెడ్డి స్పష్టం చేశారు. 

బుధవారం ఉదయం మనుబోలు మండలం పిడూరు గ్రామంలో రూ. 1.42 కోట్ల తో పలు అభివృద్ధి పనులను నుడా వైస్ చైర్మన్ శ్రీ బాపిరెడ్డి తో కలిసి మంత్రి ప్రారంభించారు. 


తొలుత నుడా సాధారణ నిధులు, గడప గడపకు మన ప్రభుత్వం నిధులు రూ. 20 లక్షలతో నిర్మించిన పలు అంతర్గత సిమెంట్ రోడ్లను మంత్రి ప్రారంభించారు. అనంతరం పిడూరు కొత్త హరిజనవాడలో రూ. 10 లక్షల టీటీడీ నిధులతో నిర్మించనున్న శ్రీ సీతారామ స్వామి ఆలయ నిర్మాణానికి గ్రామస్థులతో కలిసి మంత్రి శంకుస్థాపన చేశారు. 

 తదుపరి స్థానిక నాయకులు మన్నెమాల సాయి మోహన్ రెడ్డి, నిరంజన్ రెడ్డి తమ తల్లిదండ్రుల జ్ఞాపకార్థం నిర్మించిన మహాప్రస్థానం స్మశాన వాటికను మంత్రి ప్రారంభించి, రూ. 23 లక్షల నుడా నిధులతో  స్మశాన వాటిక ప్రహరీగోడ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. పిడూరు గ్రామంలోని సీతారాంపురం గిరిజన కాలనీలో రూ. 5 లక్షల గడప గడపకు మన ప్రభుత్వం నిధులతో నిర్మించిన కమ్యూనిటీ షెల్టర్ ను మంత్రి ప్రారంభించారు. 

 అనంతరం రూ. 40 లక్షల నిధులతో నిర్మించిన సచివాలయ భవనానికి ప్రారంభోత్సవం, రూ. 17.50 లక్షలతో డా. వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్ నిర్మాణానికి మంత్రి శంకుస్థాపన చేశారు. 

 ఈ సందర్భంగా మంత్రి మీడియాతో మాట్లాడుతూ గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చి, తిరిగి వారి వద్దకు వెళ్లి మీకు ఇచ్చిన హామీని నెరవేర్చామని చెప్పడం ప్రధాన బాధ్యతగా పేర్కొన్నారు. పరిపాలన  అంటే మాటల్లో కాకుండా చేతల్లో చేసి చూపిన ఘనత ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందన్నారు. గతంలో ఎన్ని హామీలు ఇచ్చారు, ఎన్ని అమలు చేశారు.. ఇప్పుడు ఎన్ని హామీలు ఇచ్చారు.. ఎన్ని అమలు చేశారు అని ప్రతి ఒక్కరూ ఆత్మ పరిశీలన చేసుకోవాలని మంత్రి కోరారు. తన పాదయాత్రలో ప్రజలకు ఇచ్చిన హామీల్లో 95 శాతం మేర హామీలను అమలు చేసి పేద ప్రజలకు అన్ని విధాల అండగా నిలుస్తున్న ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డే అన్నారు. గతంలో ఏ ముఖ్యమంత్రి నోట కూడా రాని మాట మీ కుటుంబంలో మంచి జరిగి ఉంటే మీ బిడ్డను ఆశీర్వదించండి అని ధైర్యంగా ప్రజలను అడిగిన ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని అన్నారు. ఎవరి ఊహకు అందని విధంగా  గ్రామస్థాయిలోనే గ్రామ సచివాలయం, రైతు భరోసా కేంద్రం, వైయస్సార్ విలేజ్ క్లినిక్ వంటి భవనాలను నిర్మించి, సంపూర్ణంగా ప్రజలకు అన్ని అందుబాటులో తీసుకొచ్చి మెరుగైన సేవలు అందిస్తున్నట్లు చెప్పారు. అలాగే గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం పూర్తయిన వెంటనే మరొకసారి గ్రామాల్లోకి వెళ్లి ప్రజలకు ఇచ్చిన హామీలు ఎంత మేరకు అమలయ్యాయో పరిశీలించి, వాటిని సంపూర్ణంగా నెరవేర్చేందుకు  చర్యలు చేపడతామన్నారు. 

 ఈ కార్యక్రమంలో నుడా విసి బాపిరెడ్డి, ఎంపీపీ వజ్రమ్మ, సర్పంచ్ చెంచు మునెయ్య,  ఎంపీడీవో వెంకటేశ్వర్లు, తాసిల్దార్ లక్ష్మీనారాయణ, స్థానిక ప్రజా ప్రతినిధులు మన్నెమాల సాయికుమార్ రెడ్డి, నిరంజన్ రెడ్డి, దాసరి భాస్కర్ గౌడ్, మండల స్థాయి అధికారులు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. 


Comments