కాపు నేస్తం ద్వారా రూ.1500 కోట్ల లబ్ధి అందించాం.. - కాపు కార్పొరేషన్ ఛైర్మన్ అడపా శేషగిరి.

 

విజయవాడ (ప్రజా అమరావతి);


కాపు నేస్తం ద్వారా రూ.1500 కోట్ల లబ్ధి అందించాం..

            - కాపు కార్పొరేషన్ ఛైర్మన్ అడపా శేషగిరి.


విజయవాడ : రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లోనూ కాపు భవన్ లు నిర్మిస్తాం. ఇప్పటికే విజయవాడ, విశాఖ, కర్నూలు లో కాపు భవన్ ల నిర్మాణానికి నిధులు విడుదల చేయటం జరిగిందని కాపు కార్పొరేషన్ ఛైర్మన్ అడపా శేషగిరిరావు అన్నారు. తాడేపల్లిలోని కాపు కార్పొరేషన్ కార్యాలయంలో మంగళవారం ఛైర్మన్ అడపా శేషగిరి డైరక్టర్లతో బోర్డ్ మీటింగ్ నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కాపు కార్పొరేషన్ ఛైర్మన్ అడపా శేషగిరి మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా కాపు సంక్షేమానికి సంబంధించి జిల్లా, నియోజకవర్గాల వారీగా కమిటీల ఏర్పాటుకు అవసరమైన ప్రణాళికలు సిద్దం చేసినట్లు చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం వివిధ ప్రభుత్వ పథకాల కింద కాపుల సంక్షేమానికి అందించిన లబ్ధిని లబ్ధిదారులకు వివరించే కార్యక్రమాలు పెద్ద ఎత్తున చేపట్టనున్నట్లు తెలిపారు. కాపు సంక్షేమం కోసం అన్ని విధాలుగా కృషి చేస్తున్నట్లు చెప్పారు. జగనన్న విదేశీ విద్యాదీవెన కింద ఇప్పటికే 42 మంది ఉన్నత చదువుల కోసం విదేశాలకు పంపించటం జరిగిందన్నారు. జగనన్న విదేశీ విద్యాదీవెన కు పెద్ద సంఖ్య ధరఖాస్తులు అందుతున్నాయని, పారదర్శకతకు పెద్దపీట వేస్తూ అవినీతికి తావులేకుండా ధరఖాస్తులను పరిశీలించి అర్హులందరికి లబ్ధి చేకూరేలా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. ఒక్క కాపు కార్పొరేషన్ కు మాత్రమే కాకుండా అన్ని కార్పొరేషన్ లకు పెద్ద సంఖ్యలో విదేశీ విద్యా దీవెన అర్జీలు అందాయన్నారు. 

              సంక్షేమ పథకాల అమలులో దేశంలోని అన్ని రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తున్నాయని, సంక్షేమ ఫలాలు నేరుగా లబ్ధిదారులకు అందచేస్తుండటం గొప్ప విప్లవమన్నారు. వాలంటీర్ల వ్యవస్థ, గ్రామ, వార్డు సచివాలయ ఏర్పటుతో అర్హలందరి ఇళ్ల వద్దకే వెళ్లి లబ్ధి అందేలా ఈ ప్రభుత్వం చర్యలు తీసుకోవటం హర్షనీయమన్నారు. కుల, మత, ప్రాంత, పార్టీలు చూడకుండా లబ్ధిదారులకు నేరుగా లబ్ధిని అందిస్తున్నట్లు చెప్పారు. తుని 42 కేసులకు పైగా ఎత్తివేసిన ఘనత ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికే దక్కుతుందన్నారు.  గత ప్రభుత్వ హయాంలో కాపు కార్పొరేషన్ లో జరిగిన అవినీతిపై చేపట్టిన విచారణ మరో 15 రోజుల్లో పూర్తవనుందని చెప్పారు. 

                   నవరత్నాలతో సంబంధం లేకుండా కాపులకు మేలు చేయటానికే కాపు నేస్తంను ఈ ప్రభుత్వం అమలు చేస్తుందని, కాపు నేస్తం ద్వారా మూడు పర్యాయాలు మొత్తం రూ. 1500 కోట్ల లబ్ధిని చేకూర్చినట్లు తెలిపారు. కాపు నేస్తం పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో మంది కాపులకు మేలు జరిగిందన్నారు. ఇప్పటికే విజయవాడ కాపు భవన్ కు రూ. కోటి, విశాఖ, కర్నూల్ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసే కాపు భవన్ కు రూ. 50 లక్షల చొప్పున విడుదల చేయటం జరిగిందన్నారు. ప్రభుత్వం పేదలకు అందిస్తున్న లబ్ధిని ప్రజల్లోకి తీసుకువెళ్లాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. అందుకనే ప్రతి నియోజకవర్గంలోని లబ్ధిదారులతో అవగాహన సదస్సులు ఏర్పాటు చేసి ప్రజలకు అవగాహన కల్పిస్తామన్నారు. రాష్ట్రంలో సుభిక్ష, పారదర్శక  పాలన అందించటం ఎంతో సంతోషకరం. వచ్చే నెలలోనే కాపు కార్పొరేషన్ బోర్డ్ మీటింగ్  మరోసారి ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు.  రాష్ట్ర ప్రభుత్వం విద్య, వైద్యానికి పెద్ద పీట వేసిందన్నారు. రాష్ట్రంలో కొన్ని లక్షల ఉద్యోగాలు కల్పన చేయటమే కాకుండా స్థానికంగా ఉద్యోగాలు చేసుకునే అవకాశం కల్పించిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికే దక్కుతుందన్నారు. గర్భంలో ఉన్న బిడ్డ నుంచి వృద్ధుల వరకు సంక్షేమం అందిస్తున్న ఎకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అని కాపు కార్పొరేషన్ ఛైర్మన్ అడపా శేషగిరి అన్నారు.  కార్యక్రమంలో కాపు కార్పొరేషన్ డైరక్టర్లు చీకట్ల కిషోర్ కుమార్, ధూళిపూడి ఆంజనేయులు, లీలా వెంకట రావు, చిమటా బాలాజి, దాడి లక్ష్మీరాజ్యం, పిన్నిటీ మహేష్, మేడిబోయిన శ్రీవాణి, ఊడి సునీత, ఎస్. నరసింహరావు, వీసం రామ కృష్ణ, శ్రీ నాగ వెంకట లక్ష్మీ కుమారి, ఇలపకుర్తి లక్ష్మీ, మద్ది వెంకట నారాయణ తదితరులు పాల్గొన్నారు.


Comments