రాష్ట్రంలో వ్యవసాయ, అనుబంధ రంగాలకు అతి కీలకమైన పథకం రైతు భరోసా

 


నెల్లూరు, జూన్ 1 (ప్రజా అమరావతి): జిల్లాలో  ఈ ఏడాది  2,14,636 మంది రైతులకు తొలివిడత రైతు భరోసా- పిఎం కిసాన్ నగదు  రూ. 118 కోట్లు, మార్చి, ఏప్రిల్, మే నెలల్లో అకాల వర్షాలకు పంట నష్టపోయున 1579 రైతులకు ఇన్పుట్ సబ్సిడీ నగదు రూ. 1.85 కోట్లు నేరుగా రైతుల ఖాతాలకు  ముఖ్యమంత్రి జమ చేసినట్లు జిల్లా కలెక్టర్ శ్రీ ఎం  హరినారాయణన్ పేర్కొన్నారు. 


వైయస్సార్ రైతు భరోసా ఐదో విడత నిధులు, ఇన్పుట్ సబ్సిడీని కర్నూలు జిల్లా పత్తికొండ నుంచి ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి విడుదల చేయగా, నెల్లూరులోని  ముత్తుకూరు రోడ్డులో గల వ్యవసాయ పరిశోధన కేంద్రంలో నిర్వహించిన కార్యక్రమంలో  జిల్లా కలెక్టర్ శ్రీ ఎం హరి నారాయణన్, జిల్లా వ్యవసాయ సలహా  మండలి చైర్మన్ శ్రీ దొడ్డంరెడ్డి నిరంజన్ రెడ్డి, జిల్లా వ్యవసాయ అధికారి సుధాకర్ రాజు, సిబ్బంది, పలువురు రైతులు పాల్గొన్నారు. 


 ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్రంలో వ్యవసాయ, అనుబంధ రంగాలకు అతి కీలకమైన పథకం రైతు భరోసా


అని, ప్రతి ఖరీఫ్ సీజన్ ప్రారంభానికి ముందు  విత్తనాలు, ఎరువులు, ఇతర వ్యవసాయ ఖర్చులకు పెట్టుబడి సాయంగా రైతులకు ఉపయోగపడేలా ప్రభుత్వం రైతు భరోసా- పిఎం కిసాన్ నగదు అందజేస్తుందన్నారు. అలాగే  మార్చి, ఏప్రిల్, మే నెలల్లో ప్రకృతి వైపరీత్యాల వలన పంట నష్టపోయిన రైతులను ఆదుకునేందుకు ఇన్పుట్ సబ్సిడీ కింద నష్టపరిహారం జమ చేస్తుందన్నారు. ఏ రాష్ట్రంలో కూడా లేని విధంగా నేరుగా రైతుల ఖాతాలకు ప్రభుత్వం నగదును జమ చేస్తుందని, వ్యవసాయానికి మేలు జరిగేలా ప్రభుత్వం అమలు చేస్తున్న ఈ పథకాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. 

 జిల్లా వ్యవసాయ సలహా మండలి చైర్మన్ దొడ్డంరెడ్డి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ వ్యవసాయ రంగంలో ముఖ్యమంత్రి అనేక సంస్కరణలు తీసుకొచ్చారని, యంత్రాల ద్వారా తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆదాయం వచ్చేలా కార్యక్రమాలు అమలు చేస్తున్నారని, రైతు భరోసా కేంద్రాలు రైతుకు ఎంతో ఉపయోగపడుతున్నాయని చెప్పారు. అలాగే వ్యవసాయ పరీక్షల కోసం అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో ప్రయోగశాలలు ఏర్పాటు చేస్తున్నారన్నారు. 

 తొలుత వ్యవసాయ పరిశోధన కేంద్రం ప్రాంగణంలో వ్యవసాయ, ఉద్యానవన శాఖలు ఏర్పాటు చేసిన చిరుధాన్యాలు, వైయస్సార్ యంత్ర సేవ, డ్రిప్ ఇరిగేషన్ పరికరాల ప్రదర్శనను కలెక్టర్ పరిశీలించారు. 

  అనంతరం జిల్లాలో రైతులకు సంబంధించిన రైతు భరోసా నమూనా చెక్కులను రైతులతో కలిసి ఆవిష్కరించారు.

 ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి సుధాకర్ రాజు, ఉద్యానవన శాఖ అధికారి సుబ్బారెడ్డి, ఏపీఎంఐపి పిడి శ్రీనివాసులు, ట్రైనీ కలెక్టర్ సంజనా సింహ, డిడి శివన్నారాయణ, ఏడీలు అనిత, నర్సోజి రావు, వ్యవసాయ శాఖ సిబ్బంది, రైతులు పాల్గొన్నారు.


రైతుల అభిప్రాయాలు

......................... 

1).

రైతుకు ఇంత పెద్దఎత్తున ఎవరూ సాయం చేయలేదు

- ముక్కు మాధవయ్య, జయలక్ష్మి

ఆదర్శ రైతులు, మర్రిపల్లి, పొదలకూరు మండలం. 


మా గ్రామంలో మేము 2.62 సెంట్ల భూమిలో  వ్యవసాయం చేస్తున్నాము. మాకు ఆవులు సుమారు 30 వరకు ఉన్నాయి. మేము మా గ్రామంలో ఆదర్శ రైతులుగా గుర్తింపు పొంది ఎప్పటినుంచో వ్యవసాయం చేస్తున్నాము. మాకు క్రమం తప్పకుండా రైతు భరోసా డబ్బులు పడుతున్నాయి, ఆవులు చనిపోతే ఇన్సూరెన్స్ డబ్బులు కూడా ఆలస్యం లేకుండా చెల్లిస్తున్నారు. ఎన్నో ఏళ్లుగా చాలామంది ముఖ్యమంత్రులను చూసాము కానీ జగన్  లాంటి ముఖ్యమంత్రిని ఇంతవరకు చూడలేదు. రైతులకు జగన్ లాగా ఎవరూ చెయ్యలేదు.. చెయ్యలేరు కూడా. అలాగే మా పాపకు అమ్మ ఒడి, నా భార్యకు ఆసరా డబ్బులు పడ్డాయి. రైతు గతంలో లాగా ఎవరి చుట్టూ తిరగకుండా నేరుగా సేవలు అందిస్తున్నారు. 


2). 

చెప్పినవన్నీ చేస్తున్నాడు

- ఊటుకూరు రమణయ్య, మైపాడు

- ముఖ్యమంత్రులు ఏదో చెప్తారు కానీ.. పూర్తిగా చేయలేరు. కానీ ఒక్క జగన్ మాత్రమే చెప్పిన ప్రతి ఒక్క మాట తప్పకుండా చేస్తున్నాడు. ముసలోళ్లకు, పిల్లలకు, ఆడోళ్లకు, నాలాంటి పేద రైతులకు అన్నీ చేస్తున్నాడు. మేము ఎవరి దగ్గరకి వెళ్లకుండా అన్ని మా గ్రామ సచివాలయం ద్వారా మాకు సాయం అందిస్తున్నాడు. నాలాంటి పేద రైతుకు రైతు భరోసా ఎంతో ఉపయోగపడుతుంది. జగన్ లాగా ఎవరూ గురించి, పేదల గురించి ఇంతలా ఆలోచన చేయలేదు. 


Comments
Popular posts
దసరా నవరాత్రులు: కనకదుర్గమ్మ తొమ్మిది రోజులు అలంకరణ రూపాలు ... విజయవాడ, ఇంద్రకీలాద్రి (prajaamaravati), అక్టోబరు 18 :- దసరా శరన్నవరాత్రులు హిందువులకు ఒక ముఖ్యమైన పండుగ. ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుండి ఆశ్వయుజ శుద్ధ నవమి వరకు తొమ్మిది రోజులు దేవీ నవరాత్రులు పదవ రోజు విజయ దశమి కలసి దసరా అంటారు. ఇది ముఖ్యముగా శక్తి ఆరాధనకు ప్రాధాన్యత ఇచ్చే పండుగ. ఈ పండుగకు నవరాత్రి, శరన్నవరాత్రి అనీ కూడా అంటారు. శరదృతువు ఆరంభంలో వచ్చే పండుగ కనుక ఈ పేరు వచ్చింది. కొందరు ఈ పండుగకు మొదటి మూడు రోజులు పార్వతిదేవికి తరువాతి మూడు రోజుల లక్ష్మీ దేవికి తరువాతి మూడురోజులు సరస్వతి దేవికి పూజలు నిర్వహిస్తారు. ఈ సమయంలో పూజలో విద్యార్ధులు తమ పుస్తకాలను ఉంచుతారు. ఇలా చేస్తే విద్యాభ్యాసంలో విజయం లభిస్తుందని విశ్వసిస్తారు. సామాన్యులే కాక యోగులు నవరాత్రులలో అమ్మవారిని పూజిస్తారు. ముఖ్యముగా శాక్తేయులు దీనిని ఆచరిస్తారు. బొమ్మల కొలువు పెట్టడం ఒక ఆనవాయితీ. ఆలయాలలో అమ్మవారికి ఒక్కోరోజు ఒక్కో అలంకారం చేస్తారు. ఈ తొమ్మిది రోజుల్లో అమ్మవారిని తొమ్మిది రూపాల్లో పూజిస్తూ ఉంటారు. లోకకల్యాణం కోసం అమ్మవారు ఒక్కోరోజు ఒక్కో రూపాన్ని ధరించింది. అందువలన అలా అమ్మవారు అవతరించిన రోజున, ఆ రూపంతో అమ్మవారిని అలంకరించి ఆ నామంతో ఆరాధిస్తూ ఉంటారు. ఇంద్రకీలాద్రిపై వేంచేసి యున్న శ్రీ కనకదుర్గమ్మావారు మొదటి రోజు శ్రీ స్వర్ణకవచాలంకృత శ్రీ దుర్గాదేవిగా రెండవ రోజు బాలాత్రిపుర సుందరి మూడవ రోజు గాయత్రి దేవిగా, నాల్గవ రోజు అన్నపూర్ణ దేవిగా ఐదవరోజు శ్రీ సర్వస్వతి దేవిగా ఆరవ రోజు శ్రీ లలిత త్రిపుర సుందరీ దేవిగా, ఏడవ రోజు శ్రీ మహలక్ష్మీదేవిగా, ఎనిమిదవ రోజు దుర్గాదేవి మరియు మహిషాసుర మర్థిని దేవిగా, తొమ్మిదవ రోజు శ్రీ రాజరాజేశ్వరి దేవి మొదలైన అవతార రూపాలతో దర్శనమిస్తూ భక్తులకు అమ్మవారు దర్శనమిస్తారు.ఇలా ఈ నవరాత్రుల సమయంలో ఒక్కో అమ్మవారిని ఆరాధించడం వలన ఒక్కో విశేష ఫలితం లభిస్తుందని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి. నవరాత్రుల్లో బెడవాడ శ్రీకనకదుర్గమ్మ వారు వివిధ అలంకారాలతో భక్తుల కోర్కేలను తీర్చు చల్లని తల్లిగా దర్శనమిస్తారు.. 1. దుర్గాదేవి అలకారం ః శరన్నవరాత్రి మహోత్సవాల్లో శ్రీ కనకదుర్గమ్మవారు శ్రీ స్వర్ణకవచాలంకృత శ్రీ దుర్గాదేవిగా దర్శినమిచ్చి భక్తులకు ఆయురారోగ్య ఐశ్వర్యాలను కలుగుజేస్తారు. 2. శ్రీ బాలాత్రిపుర సుందరి: ఫత్రిపురాత్రయంలో శ్రీ బాలాత్రి పుర సుందరీదేవి ప్రథమ స్థానంలో ఉంది. ఆమె ఎంతో మహిమాన్వితమైన ది. సమస్త దేవీ మంత్రాలలోకెల్లా శ్రీ బాలా మంత్రం గొప్పది. సకల శక్తి పూజలకు మూలమైన శ్రీ బాలాదేవి జగన్మోహనాకారాన్ని పవిత్రమైన శరన్నవరాత్రుల్లో దర్శించి, ఆమె అనుగ్రహాన్ని పొందితే, సంవత్సరం పొడుగునా అమ్మవారికి చేసే పూజలన్నీ సత్వర ఫలితాలనిస్తాయి. 3. శ్రీ గాయత్రి దేవి అలంకారం: ముక్తా విద్రుమ హేమనీల ధవల వర్థాలలతో ప్రకాశిస్తు, పంచ ముఖాలతో దర్శనమిస్తుంది. సంధ్యావందనం అధి దేవత . గాయత్రి మంత్రం రెండు రకాలు: 1. లఘు గాయత్రి మంత్రం 2. బ్రుహద్గాయత్రి మంత్రం. ప్రతి రోజూ త్రిసంధ్యా సమయంల్లో వేయి సార్లు గాయత్రి మంత్రంని పఠిస్తే వాక్సుద్ది కలుగుతుంది. 4. శ్రీ అన్నపూర్ణేశ్వరి దేవి: నాల్గవ రోజున నిత్యాన్నదానేశ్వరి శ్రీ అన్నపూర్ణా దేవి అలంకారం అన్నం జీవుల మనుగడకు ఆదారం. జీవకోటి నశించకుండా వారణాసి క్షేత్రాన్ని నిజ క్షేత్రంగా, క్షేత్ర అధినాయకుడు విశ్వేశ్వరుడి ప్రియపత్నిగా శ్రీ అన్నపూర్ణా దేవి విరాజిల్లుతుంది. 5. శ్రీ మహా సరస్వతీ దేవి: ఐదవ రోజున చదువుల తల్లి సరస్వతీ దేవి అలంకారం త్రి శక్తులలో ఒక మహాశక్తి శ్రీ సరస్వతీ దేవి. సరస్వతీ దేవి సప్తరూపాలలో ఉంటుందని మేరు తంత్రంలో చెప్పబడింది . అవి చింతామని సరస్వతి, జ్ఝాన సరస్వతి, నిల సరస్వతి, ఘట సరస్వతి, కిణి సరస్వతి, అంతరిక్ష సరస్వతి, మరియు మహా సరస్వతి. మహా సరస్వతి దేవి శుంభని శుంభులనే రాక్షసులను వధించింది. ..2 ..2.. 6. శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవివేవి : 6వ రోజున త్రిపురాత్రయంలో రెండో శక్తి శ్రీ లలితా దేవి అలంకారం. త్రిమూర్తులకన్నా ముందు నుండి ఉన్నది కాబట్టి, త్రిపుర సుందరి అని పిలవబడుతుంది. శ్రీచక్ర ఆదిష్టాన శక్తి, పంచదశాక్షరి అదిష్టాన దేవత. ఆదిశంకరాచార్యులు శ్రీ చక్రయంత్రాన్ని ప్రతిష్టించక పూర్వం ఈ దేవి ఉగ్ర రూపిణిగా ‘చండీదేవి'గా పిలవబడేది. ఆది శంకరాచార్యలు శ్ీర చక్రయంత్రాన్ని ప్రతి ష్టించాక పరమశాతం రూపిణిగా లలితా దేవిగా పిలవబడుతున్నది. 7. శ్రీ మహాలక్ష్మి తేది : 7వ రోజున మంగళ ప్రద దేవత శ్రీ మహాలక్ష్మీ దేవి అలంకారం అష్టరూపాలతో అష్ట సిద్దులు ప్రసాదించే దేవత. రెండు చేతులలో కమలాలని ధరించి, వరదాభయ హస్తాల్ని ప్రదర్శిస్తూ, పద్మాసనిగా దర్శనిమిస్తుంది. ఆది పరాశక్తి మహాకాళీ, మహాలక్ష్మీ, మహా సరస్వతి రూపాలు ధరించింది. ఆ ఆదిపరాశక్తి రూపంగానే మహాలక్ష్మీ అలంకారం జరుగుతుంది. 8. శ్రీ దుర్గా దేవి అలంకారం: దుర్గతులను నాశనం చేసే శ్రీ దుర్గా దేవి అలంకరాం రురుకుమారుడైన ‘దుర్గముడు' అనే రాక్షసున్ని సంహరించింది అష్టమి రోజునే కనుక ఈ రోజును దుర్గాష్టమి అని, దుర్గమున్ని సంహరించిన అవతారం కనుక దేవిని ‘దుర్గా' అని పిలుస్తారు. శ్రీ మహిషాసుర మర్ధినీ దేవి అలంకారం: మహిశాసురున్ని చంపడానికి దేవతలందరూ తమ తమ శక్తులను ప్రదానం చేయగా ఏర్పడిన అవతారం ఇది. సింహాన్ని వాహనంగా ఈ దేవికి హిమవంతుడు బహుకరించాడు. సింహ వాహనంతో రాక్షస సంహారం చేసి అనంతరం ఇంద్ర కీలాద్రి పై వెలిసింది 9. శ్రీరాజరాజేశ్వరి దేవి అలంకారం: 9వరోజు అపజయం అంటే ఎరుగని శక్తి కాబట్టి ఈ మాతను ‘అపరాజిత' అంటారు. ఎల్లప్పుడు విజయాలను పొందుతుంది కాబట్టి‘విజయ' అని కూడా అంటారు. శ్రీ రాజరాజేశ్వరి దేవి ఎప్పుడూ శ్రీ మహా పరమేశ్వరుడి అంకముపై ఆసీనురాలై భక్తులకు దర్శనమిస్తుందని పురాణ ఇతి హాసారు వెల్లడిస్తున్నాయి. -
Image
గాజువాక జర్నలిస్టుల వినతిని సీఎం జగన్మోహనరెడ్డి దృష్టికి తీసుకువెళ్తా
Image
మహిళల ఆర్థిక స్వావలంబనే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం
Image
శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం, ఇంద్రకీలాద్రి
Image
Kvik Fitness Arena " జిమ్ సెంటర్
Image