ఈ సంవత్సరం విద్యుత్ భద్రతా నినాదం... విద్యుత్ భద్రత విషయంలో రాజీ పడవద్దు... తెలివిగా ఉండండి.



ఈ సంవత్సరం విద్యుత్ భద్రతా నినాదం... విద్యుత్ భద్రత విషయంలో రాజీ పడవద్దు...  తెలివిగా ఉండండి



విద్యుత్ భద్రతా ప్రమాణాలు పెంచడం, మరియు విద్యుత్ ప్రమాదాలపై  నివారణకు ప్రజలకు అవగాహన కల్పించడం కోసమే ఈ వారోత్సవాలు


సి ఈ ఐ జీ డిపార్ట్మెంట్ లో  కొత్త పొజిషన్ ల ఏర్పాటు


ప్రజలకు పగటి పూట 9 గంటలు నాణ్యమైన ఉచిత విద్యుత్ అందిస్తున్నాం: మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి


తిరుపతి, జూన్ 30 (ప్రజా అమరావతి): విద్యుత్ భద్రతా ప్రమాణాలు పెంచడం, మరియు విద్యుత్ ప్రమాదాలపై  ప్రజలకు అవగాహన కల్పించడమే జాతీయ విద్యుత్ భద్రత వారోత్సవాల యొక్క ముఖ్య లక్ష్యమని రాష్ట్ర విద్యుత్, అటవీ, భూగర్భ గనుల శాఖా  మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి అన్నారు. 


శుక్రవారం ఉదయం  స్థానిక తాజ్ హోటల్ లో డైరెక్టరేట్ ఆఫ్ ఎలక్ట్రికల్ సేఫ్టీ డిపార్ట్మెంట్ యొక్క డైరెక్టర్  ఎలక్ట్రికల్ సేఫ్టీ మరియు సిఈఐజి విజయ లక్ష్మి వారి ఆధ్వర్యంలో నిర్వహించిన జాతీయ విద్యుత్ భద్రతా వారోత్సవాలు -2023 కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మంత్రి పాల్గొన్నారు. 


ఈ సందర్భంగా మంత్రివర్యులు మాట్లాడుతూ ఈ సంవత్సరం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జాతీయ విద్యుత్ భద్రతా వారోత్సవాల థీమ్ గా "విద్యుత్ భద్రత విషయంలో రాజీ పడవద్దు - తెలివిగా ఉండండి" అనే నినాదంతో  విద్యుత్ భద్రత విషయంలో రాజీ పడకుండా అవగాహన కలిగి జాగ్రత్తలు పాటించాలని ప్రజలలో విస్తృత ప్రచారం చేసి అవగాహన కల్పించడం ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశ్యమని అన్నారు.   విద్యుత్ సంస్థలలో పనిచేసే సిబ్బంది, ప్రైవేట్ వ్యక్తులు  విద్యుత్ పనులు చేసేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకుని పనిచేయాలని  అన్నారు. ప్రగతికి విద్యుత్ రంగం దిక్సూచి లాంటిదని  ఏ రాష్ట్ర పారిశ్రామిక అభివృద్ధి ఐనా ఆ రాష్ట్ర విద్యుత్ సామర్థ్యంపై ఆధారపడి ఉంటుందని,  ప్రతి ఒకరికీ నాణ్యమైన విద్యుత్ అందించడంలో పవర్ యుటిలిటీస్ ను సమర్థవంతంగా నిర్వహించాలని అన్నారు.  మానవ జీవితాలపై విద్యుత్ ప్రమాదాల ప్రభావం అధికంగా ఉంటుందని,  భద్రతా సూత్రాలను, ప్రమాణాలను పాటించడం ద్వారా విద్యుత్ ప్రమాదాలను గణనీయంగా తగ్గించవచ్చని తెలిపారు. విద్యుత్ ప్రమాదాలకు గల కారణాలపై అద్యయనం చేసి వాటి నియంత్రణకు చర్యలు తీసుకోవాలని అన్నారు. 


ఏపి పవర్  యుటిలిటీస్ మరియు సాధారణ ప్రజల కోసం  ఎస్పిడిసిఎల్ మాజీ సిఏండి పి.గోపాల్ రెడ్డి ఆద్వరంలో విద్యుత్ భద్రతా కమిటీలు  ఏర్పాటు చేయడం జరిగిందని  విద్యుత్ ప్రమాదాలు జరగకుండా నాణ్యమైన విద్యుత్ అందించడం ఈ కమిటీల ముఖ్య ఉద్దేశ్యమని అన్నారు. గౌ.ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి  గారి  నేతృత్వంలో సురక్షితమైన ఆంధ్ర ప్రదేశ్ లక్ష్యంగా అనేక  కార్యక్రమాలు అమలు చేయడం జరుగుతున్నదని అన్నారు. విద్యుత్ సరఫరా సమస్యల పరిష్కారం  కోసం ప్రతి సబ్ స్టేషన్ కు ఒక సలహా  కమిటీని నియమించడం జరిగిందని,   డిస్ట్రి బ్యూషన్ ట్రాన్స్ఫార్మర్ల మార్పిడి, వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు మంజూరు గడప గడపకు మన ప్రభుత్వం లో విద్యుత్ శాఖకు  సంబందించిన  అర్జీలు పరిష్కరించడానికి ఈ సలహా కమిటీలు పనిచేస్తాయని తెలిపారు. పారదర్శకత, జవాబుదారీతనం, విద్యుత్ సామర్థ్యం పెంపు ప్రధాన లక్ష్యాలుగా సిఈఐజి ఆన్ లైన్ విధానం ఫైల్ డిస్పోజల్ కు మన ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని అన్నారు.  

విశాఖపట్టణం – చెన్నై కారిడార్లలో భాగంగా శ్రీకాళహస్తి, తిరుపతి , ఏర్పేడు పరిసర ప్రాంతాలతో పాటు చిత్తూరు సౌత్ క్లస్టర్ లలో పెద్ద ఎత్తున్న పరిశ్రమలు రానున్నాయని, విశాఖపట్టణం – చెన్నై కారిడార్లలో కొప్పర్తి లో వై.ఎస్.ఆర్ జగనన్న హెవీ ఇండస్ట్రియల్ హబ్ వల్ల ఈ ప్రాంతంలో పారిశ్రామిక అభివృద్ధి జరగనున్నదని తెలిపారు.  పరిశ్రమల ఏర్పాటుకు ప్రోత్సహించడం  సిఈఐజి  డిపార్ట్మెంట్ లో  కొత్త పొజిషన్ లను ఏర్పాటు చేయాలని నిర్ణయించామని,  కాంట్రాక్ట్ లైసెన్సులు, సూపర్ వైజర్, వైర్ మాన్లు  అనుమతుల కోసం తిరుపతి, రాజమహేంద్రవరంలో రీజినల్ ఎలక్ట్రికల్  ఇన్స్పెక్టర్ కార్యాలయాలు ఏర్పాటు చేయడం కోసం నిర్ణయం తీసుకున్నామని అన్నారు. లైసెన్సింగ్ విధానం,  క్రమబద్దీకరణ కు వినియోగదారుల ప్రత్యేక అవసరాలు తీర్చడం కోసం ఈ చర్య ఎంతో దోహద పడుతుందని అన్నారు. సూపర్వైజర్, వైర్ మాన్లు అనుమతుల జారీ, రెన్యూవల్ కోసం ఫస్ట్ ఏయిడ్ అండ్ పవర్ మెడిసిన్ సర్టిఫికేట్ లను  ప్రస్తుతం హైదరాబాదులో  తీసుకోవడం జరుగుతున్నదని ఈ సమస్యకు పరిష్కారం చూపేందుకు ఈ విధానం రద్దు చేసి ఆంధ్రప్రదేశ్ లోని వైద్య  కళాశాలలో నుంచి ఈ సెర్టిఫికేట్ లను మంజూరు చేసేలా నిర్ణయం తీసుకున్నామని అన్నారు.   అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా  నాణ్యతమైన విద్యుత్ అందించడానికి మన ప్రభుత్వం కట్టుబడి ఉందని  దీనితో వినియోగదారులందరూ సుసంపన్నంగా, సుఖ సంతోషాలతో ఉంటారని తెలిపారు.  ప్రజలు విద్యుత్ పరికరాలు వాడేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవాలని, భద్రత ప్రమాణాలు పాటించాలని ప్రజలందరికీ మంచి జరగాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. 


అనంతరం కేంద్ర ఎలక్ట్రిసిటీ అథారిటీ రెగ్యులేషన్స్ మరియు సేఫ్టీ అండ్ ఎలక్ట్రిక్ సప్లై రెగ్యులేషన్స్ 2023 సంబంధిత కొత్త నియమ నిబంధనల పుస్తకాలను మంత్రి ఆవిష్కరించారు. గతంలో ఉన్న రెగ్యులేషన్స్ స్థానంలో ఈ కొత్త నియమ నిబంధనలు అమలు అవుతాయని తెలిపారు.


అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడుతూ రైతులకు పగటి పూట 9 గంటలు నాణ్యమైన  ఉచిత విద్యుత్ అందిస్తున్నామని అన్నారు. ఈ సంవత్సరంలో ఎన్నడూ లేనివిధంగా అత్యధికంగా  263.37 మిలియన్ యూనిట్లు జూన్ లో కూడా డిమాండ్ కు తగ్గట్టు ఇవ్వగలిగామని అన్నారు.  


ఈ కార్యక్రమంలో  ఏపిఎస్పిడిసిఎల్ సి.ఎం.డి సంతోష రావు, ఏపీ ఎస్పీడీసీఎల్ డైరెక్టర్స్ సుబ్బరాజు, ఏపీఎస్పీడీసీఎల్ ఉమెన్ డైరెక్టర్ శశి కళా, శివప్రసాద్ రెడ్డి, ఏపీఎస్పీడిసీఎల్  ఎస్ఈ, తిరుపతి కృష్ణా రెడ్డి,ఎస్వీ మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ శ్రీ డా. చంద్రశేఖరన్ తదితరులు పాల్గొన్నారు.



Comments
Popular posts
దసరా నవరాత్రులు: కనకదుర్గమ్మ తొమ్మిది రోజులు అలంకరణ రూపాలు ... విజయవాడ, ఇంద్రకీలాద్రి (prajaamaravati), అక్టోబరు 18 :- దసరా శరన్నవరాత్రులు హిందువులకు ఒక ముఖ్యమైన పండుగ. ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుండి ఆశ్వయుజ శుద్ధ నవమి వరకు తొమ్మిది రోజులు దేవీ నవరాత్రులు పదవ రోజు విజయ దశమి కలసి దసరా అంటారు. ఇది ముఖ్యముగా శక్తి ఆరాధనకు ప్రాధాన్యత ఇచ్చే పండుగ. ఈ పండుగకు నవరాత్రి, శరన్నవరాత్రి అనీ కూడా అంటారు. శరదృతువు ఆరంభంలో వచ్చే పండుగ కనుక ఈ పేరు వచ్చింది. కొందరు ఈ పండుగకు మొదటి మూడు రోజులు పార్వతిదేవికి తరువాతి మూడు రోజుల లక్ష్మీ దేవికి తరువాతి మూడురోజులు సరస్వతి దేవికి పూజలు నిర్వహిస్తారు. ఈ సమయంలో పూజలో విద్యార్ధులు తమ పుస్తకాలను ఉంచుతారు. ఇలా చేస్తే విద్యాభ్యాసంలో విజయం లభిస్తుందని విశ్వసిస్తారు. సామాన్యులే కాక యోగులు నవరాత్రులలో అమ్మవారిని పూజిస్తారు. ముఖ్యముగా శాక్తేయులు దీనిని ఆచరిస్తారు. బొమ్మల కొలువు పెట్టడం ఒక ఆనవాయితీ. ఆలయాలలో అమ్మవారికి ఒక్కోరోజు ఒక్కో అలంకారం చేస్తారు. ఈ తొమ్మిది రోజుల్లో అమ్మవారిని తొమ్మిది రూపాల్లో పూజిస్తూ ఉంటారు. లోకకల్యాణం కోసం అమ్మవారు ఒక్కోరోజు ఒక్కో రూపాన్ని ధరించింది. అందువలన అలా అమ్మవారు అవతరించిన రోజున, ఆ రూపంతో అమ్మవారిని అలంకరించి ఆ నామంతో ఆరాధిస్తూ ఉంటారు. ఇంద్రకీలాద్రిపై వేంచేసి యున్న శ్రీ కనకదుర్గమ్మావారు మొదటి రోజు శ్రీ స్వర్ణకవచాలంకృత శ్రీ దుర్గాదేవిగా రెండవ రోజు బాలాత్రిపుర సుందరి మూడవ రోజు గాయత్రి దేవిగా, నాల్గవ రోజు అన్నపూర్ణ దేవిగా ఐదవరోజు శ్రీ సర్వస్వతి దేవిగా ఆరవ రోజు శ్రీ లలిత త్రిపుర సుందరీ దేవిగా, ఏడవ రోజు శ్రీ మహలక్ష్మీదేవిగా, ఎనిమిదవ రోజు దుర్గాదేవి మరియు మహిషాసుర మర్థిని దేవిగా, తొమ్మిదవ రోజు శ్రీ రాజరాజేశ్వరి దేవి మొదలైన అవతార రూపాలతో దర్శనమిస్తూ భక్తులకు అమ్మవారు దర్శనమిస్తారు.ఇలా ఈ నవరాత్రుల సమయంలో ఒక్కో అమ్మవారిని ఆరాధించడం వలన ఒక్కో విశేష ఫలితం లభిస్తుందని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి. నవరాత్రుల్లో బెడవాడ శ్రీకనకదుర్గమ్మ వారు వివిధ అలంకారాలతో భక్తుల కోర్కేలను తీర్చు చల్లని తల్లిగా దర్శనమిస్తారు.. 1. దుర్గాదేవి అలకారం ః శరన్నవరాత్రి మహోత్సవాల్లో శ్రీ కనకదుర్గమ్మవారు శ్రీ స్వర్ణకవచాలంకృత శ్రీ దుర్గాదేవిగా దర్శినమిచ్చి భక్తులకు ఆయురారోగ్య ఐశ్వర్యాలను కలుగుజేస్తారు. 2. శ్రీ బాలాత్రిపుర సుందరి: ఫత్రిపురాత్రయంలో శ్రీ బాలాత్రి పుర సుందరీదేవి ప్రథమ స్థానంలో ఉంది. ఆమె ఎంతో మహిమాన్వితమైన ది. సమస్త దేవీ మంత్రాలలోకెల్లా శ్రీ బాలా మంత్రం గొప్పది. సకల శక్తి పూజలకు మూలమైన శ్రీ బాలాదేవి జగన్మోహనాకారాన్ని పవిత్రమైన శరన్నవరాత్రుల్లో దర్శించి, ఆమె అనుగ్రహాన్ని పొందితే, సంవత్సరం పొడుగునా అమ్మవారికి చేసే పూజలన్నీ సత్వర ఫలితాలనిస్తాయి. 3. శ్రీ గాయత్రి దేవి అలంకారం: ముక్తా విద్రుమ హేమనీల ధవల వర్థాలలతో ప్రకాశిస్తు, పంచ ముఖాలతో దర్శనమిస్తుంది. సంధ్యావందనం అధి దేవత . గాయత్రి మంత్రం రెండు రకాలు: 1. లఘు గాయత్రి మంత్రం 2. బ్రుహద్గాయత్రి మంత్రం. ప్రతి రోజూ త్రిసంధ్యా సమయంల్లో వేయి సార్లు గాయత్రి మంత్రంని పఠిస్తే వాక్సుద్ది కలుగుతుంది. 4. శ్రీ అన్నపూర్ణేశ్వరి దేవి: నాల్గవ రోజున నిత్యాన్నదానేశ్వరి శ్రీ అన్నపూర్ణా దేవి అలంకారం అన్నం జీవుల మనుగడకు ఆదారం. జీవకోటి నశించకుండా వారణాసి క్షేత్రాన్ని నిజ క్షేత్రంగా, క్షేత్ర అధినాయకుడు విశ్వేశ్వరుడి ప్రియపత్నిగా శ్రీ అన్నపూర్ణా దేవి విరాజిల్లుతుంది. 5. శ్రీ మహా సరస్వతీ దేవి: ఐదవ రోజున చదువుల తల్లి సరస్వతీ దేవి అలంకారం త్రి శక్తులలో ఒక మహాశక్తి శ్రీ సరస్వతీ దేవి. సరస్వతీ దేవి సప్తరూపాలలో ఉంటుందని మేరు తంత్రంలో చెప్పబడింది . అవి చింతామని సరస్వతి, జ్ఝాన సరస్వతి, నిల సరస్వతి, ఘట సరస్వతి, కిణి సరస్వతి, అంతరిక్ష సరస్వతి, మరియు మహా సరస్వతి. మహా సరస్వతి దేవి శుంభని శుంభులనే రాక్షసులను వధించింది. ..2 ..2.. 6. శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవివేవి : 6వ రోజున త్రిపురాత్రయంలో రెండో శక్తి శ్రీ లలితా దేవి అలంకారం. త్రిమూర్తులకన్నా ముందు నుండి ఉన్నది కాబట్టి, త్రిపుర సుందరి అని పిలవబడుతుంది. శ్రీచక్ర ఆదిష్టాన శక్తి, పంచదశాక్షరి అదిష్టాన దేవత. ఆదిశంకరాచార్యులు శ్రీ చక్రయంత్రాన్ని ప్రతిష్టించక పూర్వం ఈ దేవి ఉగ్ర రూపిణిగా ‘చండీదేవి'గా పిలవబడేది. ఆది శంకరాచార్యలు శ్ీర చక్రయంత్రాన్ని ప్రతి ష్టించాక పరమశాతం రూపిణిగా లలితా దేవిగా పిలవబడుతున్నది. 7. శ్రీ మహాలక్ష్మి తేది : 7వ రోజున మంగళ ప్రద దేవత శ్రీ మహాలక్ష్మీ దేవి అలంకారం అష్టరూపాలతో అష్ట సిద్దులు ప్రసాదించే దేవత. రెండు చేతులలో కమలాలని ధరించి, వరదాభయ హస్తాల్ని ప్రదర్శిస్తూ, పద్మాసనిగా దర్శనిమిస్తుంది. ఆది పరాశక్తి మహాకాళీ, మహాలక్ష్మీ, మహా సరస్వతి రూపాలు ధరించింది. ఆ ఆదిపరాశక్తి రూపంగానే మహాలక్ష్మీ అలంకారం జరుగుతుంది. 8. శ్రీ దుర్గా దేవి అలంకారం: దుర్గతులను నాశనం చేసే శ్రీ దుర్గా దేవి అలంకరాం రురుకుమారుడైన ‘దుర్గముడు' అనే రాక్షసున్ని సంహరించింది అష్టమి రోజునే కనుక ఈ రోజును దుర్గాష్టమి అని, దుర్గమున్ని సంహరించిన అవతారం కనుక దేవిని ‘దుర్గా' అని పిలుస్తారు. శ్రీ మహిషాసుర మర్ధినీ దేవి అలంకారం: మహిశాసురున్ని చంపడానికి దేవతలందరూ తమ తమ శక్తులను ప్రదానం చేయగా ఏర్పడిన అవతారం ఇది. సింహాన్ని వాహనంగా ఈ దేవికి హిమవంతుడు బహుకరించాడు. సింహ వాహనంతో రాక్షస సంహారం చేసి అనంతరం ఇంద్ర కీలాద్రి పై వెలిసింది 9. శ్రీరాజరాజేశ్వరి దేవి అలంకారం: 9వరోజు అపజయం అంటే ఎరుగని శక్తి కాబట్టి ఈ మాతను ‘అపరాజిత' అంటారు. ఎల్లప్పుడు విజయాలను పొందుతుంది కాబట్టి‘విజయ' అని కూడా అంటారు. శ్రీ రాజరాజేశ్వరి దేవి ఎప్పుడూ శ్రీ మహా పరమేశ్వరుడి అంకముపై ఆసీనురాలై భక్తులకు దర్శనమిస్తుందని పురాణ ఇతి హాసారు వెల్లడిస్తున్నాయి. -
Image
గాజువాక జర్నలిస్టుల వినతిని సీఎం జగన్మోహనరెడ్డి దృష్టికి తీసుకువెళ్తా
Image
మహిళల ఆర్థిక స్వావలంబనే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం
Image
శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం, ఇంద్రకీలాద్రి
Image
Kvik Fitness Arena " జిమ్ సెంటర్
Image