ప్ర‌భుత్వ అండ‌తో రైతుల్లో ధైర్యం / రైతుల‌కు ఏ ఇబ్బంది వ‌చ్చినా ప్ర‌భుత్వ‌మే బాధ్య‌త వ‌హిస్తుంది.



ప్ర‌భుత్వ అండ‌తో రైతుల్లో ధైర్యం / రైతుల‌కు ఏ ఇబ్బంది వ‌చ్చినా ప్ర‌భుత్వ‌మే బాధ్య‌త వ‌హిస్తుంది



చెర‌కు రైతుల స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించాం / ఉద్యోగుల బ‌కాయిలు త్వ‌ర‌లో చెల్లిస్తాం


బొబ్బిలి రైతుభ‌రోసా కార్య‌క్ర‌మంలో మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ‌


 


విజ‌య‌న‌గ‌రం, జూన్ 01 (ప్రజా అమరావతి):


రైతులు పండించే పంట‌ల‌కు మ‌ద్ధ‌తు ధ‌ర ప్ర‌క‌టించడ‌మే కాకుండా మ‌ద్ధ‌తు ధ‌ర‌కు కొనుగోలు చేస్తూ రైతుల‌కు ప్ర‌భుత్వం అండ‌గా నిల‌వ‌డంతో రాష్ట్రంలోని రైతుల్లో ధైర్యం ఏర్ప‌డింద‌ని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ అన్నారు. రాష్ట్రంలో రైతుల‌కు ఏ ఇబ్బంది వ‌చ్చినా అది ప్ర‌భుత్వ బాధ్య‌త‌గా  భావించి వాటిని ప‌రిష్క‌రిస్తుంద‌న్నారు. రైతుల‌తో మ‌మేక‌మై వారి స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రిస్తున్న‌ది త‌మ ప్ర‌భుత్వ హ‌యాంలోనే అన్న విష‌యాన్ని గుర్తించాల‌న్నారు. వైఎస్సార్ రైతుభ‌రోసా - పి.ఎం.కిసాన్ కింద వ‌రుస‌గా ఐదో ఏడాది తొలివిడ‌తగా రైతుల‌కు రాష్ట్ర ప్ర‌భుత్వం అందిస్తున్న స‌హాయాన్ని బ్యాంకు ఖాతాల్లో జ‌మ‌చేసే జిల్లాస్థాయి కార్య‌క్ర‌మం గురువారం బొబ్బిలి మండ‌ల‌ప‌రిష‌త్ కార్యాల‌యంలో నిర్వ‌హించారు. ఈ కార్య‌క్ర‌మంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ జిల్లాలోని 2.58 ల‌క్ష‌ల మంది రైతుల‌కు రూ.193.47 కోట్ల స‌హాయాన్ని అందించారు. ఈ సంద‌ర్భంగా మంత్రి మాట్లాడుతూ దేశానికి వెన్నెముక అయిన రైతుకు వెన్నుద‌న్నుగా నిల‌వాల‌నే ఉద్దేశ్యంతో మ‌న ముఖ్య‌మంత్రి రైతుభ‌రోసా కార్య‌క్ర‌మాన్ని ప్రారంభించార‌ని చెప్పారు. బొబ్బిలి ప్రాంతంలో చెర‌కు రైతుల స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించి వారికి చ‌క్కెర క‌ర్మాగారం ద్వారా రావ‌ల‌సిన‌ బ‌కాయిల‌ను చెల్లించేలా చ‌ర్య‌లు తీసుకున్న ఘ‌న‌త త‌మ ప్ర‌భుత్వానిదేన‌న్నారు. చెర‌కు రైతుల స‌మ‌స్య‌ల‌ను గ‌త ప్ర‌భుత్వాలు ప‌ట్టించుకోలేద‌న్నారు. రాష్ట్రంలో ఉద్యోగుల‌కు చెల్లించాల్సిన బ‌కాయిల‌ను కూడా త్వ‌ర‌గా చెల్లిస్తామ‌ని మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ చెప్పారు.


 


జిల్లా క‌లెక్ట‌ర్ శ్రీ‌మ‌తి నాగ‌ల‌క్ష్మి ఎస్ మాట్లాడుతూ ఖ‌రీఫ్ సీజ‌నులో రైతుల‌కు అవ‌స‌ర‌మైన పెట్టుబ‌డి స‌హాయం అందించే ల‌క్ష్యంతో ప్ర‌భుత్వం రైతుభ‌రోసా స‌హాయం అందిస్తున్న‌ద‌ని చెప్పారు. వ్య‌వ‌సాయంతో పాటు అనుబంధ రంగాల్లో ప్రోత్స‌హించ‌డం ద్వారా రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయాల‌న్న‌దే ప్ర‌భుత్వ ల‌క్ష్య‌మ‌న్నారు. దీనిలో భాగంగానే డైరీ వంటి రంగాల్లో రైతుల‌ను ప్రోత్స‌హిస్తున్న‌ట్టు తెలిపారు. జిల్లాలో ఇటీవ‌ల మొక్క‌జొన్న మ‌ద్ధ‌తుధ‌ర పొంద‌డంలో స‌మ‌స్య‌లు వ‌స్తే ప్ర‌భుత్వం వెంట‌నే మార్క్‌ఫెడ్ ద్వారా 5 వేల ట‌న్నుల మొక్క‌జొన్న‌ను కొనుగోలు చేసి ఆదుకొంద‌ని చెప్పారు.


జిల్లాలో సాగునీటి ప్రాజెక్టుల ద్వారా ఆయ‌క‌ట్టు చివ‌రిలో వున్న ఎక‌రానికి కూడా సాగునీరు అందించాల‌న్న ల‌క్ష్యంతో ప్ర‌భుత్వం ప‌నిచేస్తోంద‌న్నారు. జిల్లాలో 6.50 ల‌క్ష‌ల ట‌న్నుల ధాన్యం రైతుల నుంచి కొనుగోలు చేశామ‌ని చెప్పారు.


శాస‌న‌స‌భ్యులు ఎస్‌.వి.చిన‌ప్ప‌ల నాయుడు మాట్లాడుతూ రాష్ట్ర ప్ర‌భుత్వం గ‌త నాలుగేళ్లుగా అర్హ‌తే ప్రాతిప‌దిక‌గా సంక్షేమ ప‌థ‌కాల‌ను మంజూరు చేస్తోంద‌ని, అవినీతి లేని ప‌రిపాల‌న‌కు ముఖ్య‌మంత్రి శ్రీ‌కారం చుట్టార‌ని పేర్కొన్నారు. సంక్షేమ ప‌థ‌కాల అమ‌లులో దేశంలోని ఇత‌ర రాష్ట్రాల‌కు మ‌న రాష్ట్రం ఆద‌ర్శంగా నిలుస్తోంద‌న్నారు.


ఈ సంద‌ర్భంగా జిల్లాలో రైతుల‌కు ఖ‌రీఫ్ సీజ‌నుకు విత్త‌నాల పంపిణీని మంత్రి ప్రారంభించారు. రాష్ట్ర ప్ర‌భుత్వం మొక్క‌జొన్న రైతుల‌కు విడుద‌ల చేసిన ఇన్‌పుట్ స‌బ్సిడీని కూడా మంత్రి చెక్కు రూపంలో అందించారు.


ఈ కార్య‌క్ర‌మంలో జాయింట్ క‌లెక్ట‌ర్ మ‌యూర్ అశోక్‌, మునిసిప‌ల్ చైర్మ‌న్ ఇంటి గోపాల‌రావు, వ్య‌వ‌సాయ శాఖ జె.డి. వి.టి.రామారావు, ఆర్‌.డి.ఓ. శేష‌శైల‌జ‌, జిల్లా వ్య‌వ‌సాయ స‌ల‌హా మండ‌లి అధ్య‌క్షుడు గేదెల వెంక‌టేశ్వ‌ర‌రావు, ఇంటి గోపాల‌రావు త‌దిత‌రులు పాల్గొన్నారు.


 


Comments
Popular posts
దసరా నవరాత్రులు: కనకదుర్గమ్మ తొమ్మిది రోజులు అలంకరణ రూపాలు ... విజయవాడ, ఇంద్రకీలాద్రి (prajaamaravati), అక్టోబరు 18 :- దసరా శరన్నవరాత్రులు హిందువులకు ఒక ముఖ్యమైన పండుగ. ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుండి ఆశ్వయుజ శుద్ధ నవమి వరకు తొమ్మిది రోజులు దేవీ నవరాత్రులు పదవ రోజు విజయ దశమి కలసి దసరా అంటారు. ఇది ముఖ్యముగా శక్తి ఆరాధనకు ప్రాధాన్యత ఇచ్చే పండుగ. ఈ పండుగకు నవరాత్రి, శరన్నవరాత్రి అనీ కూడా అంటారు. శరదృతువు ఆరంభంలో వచ్చే పండుగ కనుక ఈ పేరు వచ్చింది. కొందరు ఈ పండుగకు మొదటి మూడు రోజులు పార్వతిదేవికి తరువాతి మూడు రోజుల లక్ష్మీ దేవికి తరువాతి మూడురోజులు సరస్వతి దేవికి పూజలు నిర్వహిస్తారు. ఈ సమయంలో పూజలో విద్యార్ధులు తమ పుస్తకాలను ఉంచుతారు. ఇలా చేస్తే విద్యాభ్యాసంలో విజయం లభిస్తుందని విశ్వసిస్తారు. సామాన్యులే కాక యోగులు నవరాత్రులలో అమ్మవారిని పూజిస్తారు. ముఖ్యముగా శాక్తేయులు దీనిని ఆచరిస్తారు. బొమ్మల కొలువు పెట్టడం ఒక ఆనవాయితీ. ఆలయాలలో అమ్మవారికి ఒక్కోరోజు ఒక్కో అలంకారం చేస్తారు. ఈ తొమ్మిది రోజుల్లో అమ్మవారిని తొమ్మిది రూపాల్లో పూజిస్తూ ఉంటారు. లోకకల్యాణం కోసం అమ్మవారు ఒక్కోరోజు ఒక్కో రూపాన్ని ధరించింది. అందువలన అలా అమ్మవారు అవతరించిన రోజున, ఆ రూపంతో అమ్మవారిని అలంకరించి ఆ నామంతో ఆరాధిస్తూ ఉంటారు. ఇంద్రకీలాద్రిపై వేంచేసి యున్న శ్రీ కనకదుర్గమ్మావారు మొదటి రోజు శ్రీ స్వర్ణకవచాలంకృత శ్రీ దుర్గాదేవిగా రెండవ రోజు బాలాత్రిపుర సుందరి మూడవ రోజు గాయత్రి దేవిగా, నాల్గవ రోజు అన్నపూర్ణ దేవిగా ఐదవరోజు శ్రీ సర్వస్వతి దేవిగా ఆరవ రోజు శ్రీ లలిత త్రిపుర సుందరీ దేవిగా, ఏడవ రోజు శ్రీ మహలక్ష్మీదేవిగా, ఎనిమిదవ రోజు దుర్గాదేవి మరియు మహిషాసుర మర్థిని దేవిగా, తొమ్మిదవ రోజు శ్రీ రాజరాజేశ్వరి దేవి మొదలైన అవతార రూపాలతో దర్శనమిస్తూ భక్తులకు అమ్మవారు దర్శనమిస్తారు.ఇలా ఈ నవరాత్రుల సమయంలో ఒక్కో అమ్మవారిని ఆరాధించడం వలన ఒక్కో విశేష ఫలితం లభిస్తుందని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి. నవరాత్రుల్లో బెడవాడ శ్రీకనకదుర్గమ్మ వారు వివిధ అలంకారాలతో భక్తుల కోర్కేలను తీర్చు చల్లని తల్లిగా దర్శనమిస్తారు.. 1. దుర్గాదేవి అలకారం ః శరన్నవరాత్రి మహోత్సవాల్లో శ్రీ కనకదుర్గమ్మవారు శ్రీ స్వర్ణకవచాలంకృత శ్రీ దుర్గాదేవిగా దర్శినమిచ్చి భక్తులకు ఆయురారోగ్య ఐశ్వర్యాలను కలుగుజేస్తారు. 2. శ్రీ బాలాత్రిపుర సుందరి: ఫత్రిపురాత్రయంలో శ్రీ బాలాత్రి పుర సుందరీదేవి ప్రథమ స్థానంలో ఉంది. ఆమె ఎంతో మహిమాన్వితమైన ది. సమస్త దేవీ మంత్రాలలోకెల్లా శ్రీ బాలా మంత్రం గొప్పది. సకల శక్తి పూజలకు మూలమైన శ్రీ బాలాదేవి జగన్మోహనాకారాన్ని పవిత్రమైన శరన్నవరాత్రుల్లో దర్శించి, ఆమె అనుగ్రహాన్ని పొందితే, సంవత్సరం పొడుగునా అమ్మవారికి చేసే పూజలన్నీ సత్వర ఫలితాలనిస్తాయి. 3. శ్రీ గాయత్రి దేవి అలంకారం: ముక్తా విద్రుమ హేమనీల ధవల వర్థాలలతో ప్రకాశిస్తు, పంచ ముఖాలతో దర్శనమిస్తుంది. సంధ్యావందనం అధి దేవత . గాయత్రి మంత్రం రెండు రకాలు: 1. లఘు గాయత్రి మంత్రం 2. బ్రుహద్గాయత్రి మంత్రం. ప్రతి రోజూ త్రిసంధ్యా సమయంల్లో వేయి సార్లు గాయత్రి మంత్రంని పఠిస్తే వాక్సుద్ది కలుగుతుంది. 4. శ్రీ అన్నపూర్ణేశ్వరి దేవి: నాల్గవ రోజున నిత్యాన్నదానేశ్వరి శ్రీ అన్నపూర్ణా దేవి అలంకారం అన్నం జీవుల మనుగడకు ఆదారం. జీవకోటి నశించకుండా వారణాసి క్షేత్రాన్ని నిజ క్షేత్రంగా, క్షేత్ర అధినాయకుడు విశ్వేశ్వరుడి ప్రియపత్నిగా శ్రీ అన్నపూర్ణా దేవి విరాజిల్లుతుంది. 5. శ్రీ మహా సరస్వతీ దేవి: ఐదవ రోజున చదువుల తల్లి సరస్వతీ దేవి అలంకారం త్రి శక్తులలో ఒక మహాశక్తి శ్రీ సరస్వతీ దేవి. సరస్వతీ దేవి సప్తరూపాలలో ఉంటుందని మేరు తంత్రంలో చెప్పబడింది . అవి చింతామని సరస్వతి, జ్ఝాన సరస్వతి, నిల సరస్వతి, ఘట సరస్వతి, కిణి సరస్వతి, అంతరిక్ష సరస్వతి, మరియు మహా సరస్వతి. మహా సరస్వతి దేవి శుంభని శుంభులనే రాక్షసులను వధించింది. ..2 ..2.. 6. శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవివేవి : 6వ రోజున త్రిపురాత్రయంలో రెండో శక్తి శ్రీ లలితా దేవి అలంకారం. త్రిమూర్తులకన్నా ముందు నుండి ఉన్నది కాబట్టి, త్రిపుర సుందరి అని పిలవబడుతుంది. శ్రీచక్ర ఆదిష్టాన శక్తి, పంచదశాక్షరి అదిష్టాన దేవత. ఆదిశంకరాచార్యులు శ్రీ చక్రయంత్రాన్ని ప్రతిష్టించక పూర్వం ఈ దేవి ఉగ్ర రూపిణిగా ‘చండీదేవి'గా పిలవబడేది. ఆది శంకరాచార్యలు శ్ీర చక్రయంత్రాన్ని ప్రతి ష్టించాక పరమశాతం రూపిణిగా లలితా దేవిగా పిలవబడుతున్నది. 7. శ్రీ మహాలక్ష్మి తేది : 7వ రోజున మంగళ ప్రద దేవత శ్రీ మహాలక్ష్మీ దేవి అలంకారం అష్టరూపాలతో అష్ట సిద్దులు ప్రసాదించే దేవత. రెండు చేతులలో కమలాలని ధరించి, వరదాభయ హస్తాల్ని ప్రదర్శిస్తూ, పద్మాసనిగా దర్శనిమిస్తుంది. ఆది పరాశక్తి మహాకాళీ, మహాలక్ష్మీ, మహా సరస్వతి రూపాలు ధరించింది. ఆ ఆదిపరాశక్తి రూపంగానే మహాలక్ష్మీ అలంకారం జరుగుతుంది. 8. శ్రీ దుర్గా దేవి అలంకారం: దుర్గతులను నాశనం చేసే శ్రీ దుర్గా దేవి అలంకరాం రురుకుమారుడైన ‘దుర్గముడు' అనే రాక్షసున్ని సంహరించింది అష్టమి రోజునే కనుక ఈ రోజును దుర్గాష్టమి అని, దుర్గమున్ని సంహరించిన అవతారం కనుక దేవిని ‘దుర్గా' అని పిలుస్తారు. శ్రీ మహిషాసుర మర్ధినీ దేవి అలంకారం: మహిశాసురున్ని చంపడానికి దేవతలందరూ తమ తమ శక్తులను ప్రదానం చేయగా ఏర్పడిన అవతారం ఇది. సింహాన్ని వాహనంగా ఈ దేవికి హిమవంతుడు బహుకరించాడు. సింహ వాహనంతో రాక్షస సంహారం చేసి అనంతరం ఇంద్ర కీలాద్రి పై వెలిసింది 9. శ్రీరాజరాజేశ్వరి దేవి అలంకారం: 9వరోజు అపజయం అంటే ఎరుగని శక్తి కాబట్టి ఈ మాతను ‘అపరాజిత' అంటారు. ఎల్లప్పుడు విజయాలను పొందుతుంది కాబట్టి‘విజయ' అని కూడా అంటారు. శ్రీ రాజరాజేశ్వరి దేవి ఎప్పుడూ శ్రీ మహా పరమేశ్వరుడి అంకముపై ఆసీనురాలై భక్తులకు దర్శనమిస్తుందని పురాణ ఇతి హాసారు వెల్లడిస్తున్నాయి. -
Image
గాజువాక జర్నలిస్టుల వినతిని సీఎం జగన్మోహనరెడ్డి దృష్టికి తీసుకువెళ్తా
Image
మహిళల ఆర్థిక స్వావలంబనే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం
Image
శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం, ఇంద్రకీలాద్రి
Image
Kvik Fitness Arena " జిమ్ సెంటర్
Image