చిత్తూరు జిల్లాకు చెందిన రిటైర్డ్ పోలీస్ అధికారి పిసి స్వామి తెలుగుదేశం పార్టీలో చేరిక.




*చిత్తూరు జిల్లాకు చెందిన రిటైర్డ్ పోలీస్ అధికారి పిసి స్వామి తెలుగుదేశం పార్టీలో చేరిక


*


అమరావతి (ప్రజా అమరావతి):- ఎస్పీజీ కమాండెడ్ గా పనిచేసిన, చిత్తూరు జిల్లాకు చెందిన పోలీసు అధికారి పి.సి స్వామి తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. నారా చంద్రబాబు నాయుడు ఆయనకు తెలుగుదేశం పార్టీ కండువా కప్పి సాదరంగా  పార్టీలోకి ఆహ్వానించారు. SPG విభాగం లో కమాండెంట్ గా స్వామి 8 మంది ప్రధాన మంత్రుల రక్షణ బాధ్యతల్లో పాలు పంచుకున్నారు. 33 ఏళ్ల సర్వీస్ తరువాత స్వామి పదవీ విరమణ చేశారు. చంద్రబాబు నాయుడు విజన్ ను, అయన పాలనను అభిమానించే పిసి స్వామి... నేడు పార్టీ లో చేరారు. చంద్రబాబు ఏ బాధ్యతలు ఇచ్చినా పార్టీకి సేవలందిస్తారని తెలియజేశారు. పీసీ స్వామితో పాటు విశ్రాంత రోడ్లు భవనాలు ఇంజనీర్  జీవి కృష్ణయ్య కూడా తెలుగుదేశం పార్టీ లో చేరారు. ఈ చేరిక సమావేశంలో టిడిపి పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య,  పార్టీ రాష్ట్ర కార్యదర్శి సురా సుధాకర్ రెడ్డి, రాష్ట్ర అధికార ప్రతినిధి, ఎన్. బి. సుధాకర్ రెడ్డి రాష్ట్ర పార్టీ కార్యదర్శి  బుల్లెట్ రమణ,  రాష్ట్ర సంస్కృతిక విభాగం ప్రధాన కార్యదర్శి ముని చంద్రారెడ్డి, ఎదురు కుప్పం మండలం ప్రధాన కార్యదర్శి నరసింహ యాదవ్,  తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు పి. సుబ్బయ్య తదితరులు పాల్గొన్నారు.

Comments