బాధ్యతారహితంగా చేసిన తప్పులకు ప్రజలు శిక్ష అనుభవించాల్సిన అవసరం లేదు

 *- బాధ్యతారహితంగా చేసిన తప్పులకు ప్రజలు శిక్ష అనుభవించాల్సిన అవసరం లేదు*


 *- గుడివాడ నియోజకవర్గంలోని  గ్రామాల్లో నడుంలోతు నీటిలో బతకాల్సి రావడం బాధగా ఉంది*

 *- ముంపు సమస్యలిలా ఉంటాయని పాలకులకు తెలియాలి కదా* 

 *- వెన్ననపూడిలో ప్రతి ఇంటికీ రూ.20వేల ఆర్ధికసాయమందించాలి* 

 *- వరద తగ్గుముఖం పట్టిన తర్వాత ఆర్డీవోకు వినతిపత్రమందిస్తాం* 

 *- ప్రజలేం తప్పు చేయలేదు, వారికి నష్టపరిహారం పొందే హక్కుంది*

 *- వెన్ననపూడిలో పర్యటించిన అనంతరం మీడియాతో వెనిగండ్ల* 



గుడివాడ మెయిల్, జూలై 28 (ప్రజా అమరావతి): పాలకులు బాధ్యతారహితంగా చేసిన తప్పులకు ప్రజలు శిక్షను అనుభవించాల్సిన అవసరం లేదని, గుడివాడ నియోజకవర్గంలోని గ్రామాల్లో బిక్కుబిక్కుమంటూ నడుం లోతు వరదనీటిలో బతకాల్సి రావడం బాధగా ఉందని తెలుగుదేశం పార్టీ నాయకులు వెనిగండ్ల రాము అన్నారు. శుక్రవారం వరదనీటిలో పూర్తిగా చిక్కుకుపోయిన వెన్ననపూడి, శివారు కాలనీలో పర్యటించి అక్కడి పరిస్థితులను చూసి చలించిన వెనిగండ్ల మీడియాతో మాట్లాడారు. నందివాడ మండలం వెన్ననపూడి గ్రామం శివారు కాలనీ పూర్తిగా వరదనీటిలో మునిగిపోయిందని తెలిసి ఇక్కడకు వచ్చానన్నారు. గత నాలుగు రోజులుగా కురిసిన వర్షాల వల్ల ఇళ్ళ చుట్టూ నడుం లోతు నీరు చేరిందని, వర్షాలు తగ్గుముఖం పట్టినప్పటికీ వరదనీరు అంతకంతకు పెరుగుతోందన్నారు. పూడుకుపోయిన కాల్వల్లో వరదనీటి ప్రవాహం ఎక్కువ కావడంతో నీరు ఎగదన్ని వెన్ననపూడి కాలనీని ముంచెత్తుతోందన్నారు. ఇళ్ళ ముందు రోడ్డు కూడా కన్పించడం లేదన్నారు. జనజీవనం పూర్తిగా స్తంభించిపోయిందని, గ్రామస్థులు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారన్నారు. గుడివాడ నియోజకవర్గంలో మనుషులు ఇలా బతకాల్సి రావడంపై చాలా బాధగా ఉందన్నారు. తట్టుకోలేని పరిస్థితుల్లో ఉన్నానన్నారు. ఇక్కడి పరిస్థితులను చూసి వెంటనే మండల తహసీల్దార్ కు సమాచారం ఇచ్చానని తెలిపారు. వెంటనే స్పందించి వచ్చారన్నారు. పాలు, బ్రెడ్, బియ్యం ఇస్తానని చెప్పారని, పప్పు, నూనె కూడా ఇవ్వాలని కోరడం జరిగిందన్నారు. ముంపు సమస్యల విషయంలో ఇప్పటికిప్పుడు చేయాల్సిందేమీ కల్పించడం లేదన్నారు. దీర్ఘకాలిక ప్రణాళిక ఉండాల్సిందేనని. అభిప్రాయపడ్డారు. ముందుచూపు లేని వ్యక్తులు పరిపాలిస్తే ఇలానే ఉంటుందన్నారు. వరదనీరు ప్రవహించే దారులన్నీ ఎక్కడికక్కడ పూడుకుపోయాయన్నారు. అందువల్లే అకాల వర్షాలకు గ్రామాలు పూర్తిగా నీటమునిగే పరిస్థితి దాపురించిందన్నారు. ప్రజలంతా చాలా దారుణమైన పరిస్థితుల్లో ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం ఇళ్ళ నుండి ప్రజలను తరలించడానికి ప్రయత్నం చేయవచ్చని, కోళ్ళు, గేదెలు కూడా ఇళ్ళ దగ్గరే ఉండిపోయాయన్నారు. ముంపు వల్ల ప్రజలు ఇళ్ళను వదిలేసి వెళ్ళలేక, ఉండలేక ఇబ్బందులు పడుతున్నారన్నారు. గతంలో వెనిగండ్ల ఫౌండేషన్ ఏర్పాటు చేసిన మంచినీటి ట్యాంక్ అందుబాటులోనే ఉందన్నారు. అక్కడి నుండి ప్రతి ఇంటికీ 20లీటర్ల మంచినీటిని సరఫరా చేస్తున్నామన్నారు. చేతనైనంత సాయాన్ని ఎప్పటికప్పుడు చేసుకుంటూ వస్తున్నామన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో బతకాల్సిన అవసరం లేదని ప్రజలంతా గుర్తించాలన్నారు. బాధ్యతారహితంగా వ్యక్తులు చేసే తప్పులకు ప్రజలంతా అనుభవించాల్సిన అవసరం లేదన్నారు. అకాల వర్షాలకు ఇంతటి వరదనీరు వస్తుందని ప్రజలకు తెలియకపోవచ్చని, పరిపాలించే వారికి తెలియాలన్నారు. రీజనింగ్ లేని ప్రభుత్వమే రాష్ట్రంలో నడుస్తోందన్నారు. సరైన ఆలోచన కూడా లేదన్నారు. కనీసం గ్రామంలో ఉన్న ప్రతి ఇంటికి రూ.15 వేల నుండి రూ.20వేల వరకు నష్టపరిహారాన్ని అందజేయాలని విజ్ఞప్తి చేస్తున్నామన్నారు. వరదనీరు తగ్గుముఖం పట్టిన వెంటనే గ్రామస్థులతో కలిసి ఆర్డీవోకు వినతిపత్రాన్ని అందజేస్తామన్నారు. స్థలం ఇస్తే ఇళ్ళు కట్టుకున్నారని, ప్రజలేం తప్పు చేయలేదున్నారు. నష్టపరిహారం పొందే హక్కు ప్రజలకు ఉంటుందన్నారు.

Comments
Popular posts
దసరా నవరాత్రులు: కనకదుర్గమ్మ తొమ్మిది రోజులు అలంకరణ రూపాలు ... విజయవాడ, ఇంద్రకీలాద్రి (prajaamaravati), అక్టోబరు 18 :- దసరా శరన్నవరాత్రులు హిందువులకు ఒక ముఖ్యమైన పండుగ. ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుండి ఆశ్వయుజ శుద్ధ నవమి వరకు తొమ్మిది రోజులు దేవీ నవరాత్రులు పదవ రోజు విజయ దశమి కలసి దసరా అంటారు. ఇది ముఖ్యముగా శక్తి ఆరాధనకు ప్రాధాన్యత ఇచ్చే పండుగ. ఈ పండుగకు నవరాత్రి, శరన్నవరాత్రి అనీ కూడా అంటారు. శరదృతువు ఆరంభంలో వచ్చే పండుగ కనుక ఈ పేరు వచ్చింది. కొందరు ఈ పండుగకు మొదటి మూడు రోజులు పార్వతిదేవికి తరువాతి మూడు రోజుల లక్ష్మీ దేవికి తరువాతి మూడురోజులు సరస్వతి దేవికి పూజలు నిర్వహిస్తారు. ఈ సమయంలో పూజలో విద్యార్ధులు తమ పుస్తకాలను ఉంచుతారు. ఇలా చేస్తే విద్యాభ్యాసంలో విజయం లభిస్తుందని విశ్వసిస్తారు. సామాన్యులే కాక యోగులు నవరాత్రులలో అమ్మవారిని పూజిస్తారు. ముఖ్యముగా శాక్తేయులు దీనిని ఆచరిస్తారు. బొమ్మల కొలువు పెట్టడం ఒక ఆనవాయితీ. ఆలయాలలో అమ్మవారికి ఒక్కోరోజు ఒక్కో అలంకారం చేస్తారు. ఈ తొమ్మిది రోజుల్లో అమ్మవారిని తొమ్మిది రూపాల్లో పూజిస్తూ ఉంటారు. లోకకల్యాణం కోసం అమ్మవారు ఒక్కోరోజు ఒక్కో రూపాన్ని ధరించింది. అందువలన అలా అమ్మవారు అవతరించిన రోజున, ఆ రూపంతో అమ్మవారిని అలంకరించి ఆ నామంతో ఆరాధిస్తూ ఉంటారు. ఇంద్రకీలాద్రిపై వేంచేసి యున్న శ్రీ కనకదుర్గమ్మావారు మొదటి రోజు శ్రీ స్వర్ణకవచాలంకృత శ్రీ దుర్గాదేవిగా రెండవ రోజు బాలాత్రిపుర సుందరి మూడవ రోజు గాయత్రి దేవిగా, నాల్గవ రోజు అన్నపూర్ణ దేవిగా ఐదవరోజు శ్రీ సర్వస్వతి దేవిగా ఆరవ రోజు శ్రీ లలిత త్రిపుర సుందరీ దేవిగా, ఏడవ రోజు శ్రీ మహలక్ష్మీదేవిగా, ఎనిమిదవ రోజు దుర్గాదేవి మరియు మహిషాసుర మర్థిని దేవిగా, తొమ్మిదవ రోజు శ్రీ రాజరాజేశ్వరి దేవి మొదలైన అవతార రూపాలతో దర్శనమిస్తూ భక్తులకు అమ్మవారు దర్శనమిస్తారు.ఇలా ఈ నవరాత్రుల సమయంలో ఒక్కో అమ్మవారిని ఆరాధించడం వలన ఒక్కో విశేష ఫలితం లభిస్తుందని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి. నవరాత్రుల్లో బెడవాడ శ్రీకనకదుర్గమ్మ వారు వివిధ అలంకారాలతో భక్తుల కోర్కేలను తీర్చు చల్లని తల్లిగా దర్శనమిస్తారు.. 1. దుర్గాదేవి అలకారం ః శరన్నవరాత్రి మహోత్సవాల్లో శ్రీ కనకదుర్గమ్మవారు శ్రీ స్వర్ణకవచాలంకృత శ్రీ దుర్గాదేవిగా దర్శినమిచ్చి భక్తులకు ఆయురారోగ్య ఐశ్వర్యాలను కలుగుజేస్తారు. 2. శ్రీ బాలాత్రిపుర సుందరి: ఫత్రిపురాత్రయంలో శ్రీ బాలాత్రి పుర సుందరీదేవి ప్రథమ స్థానంలో ఉంది. ఆమె ఎంతో మహిమాన్వితమైన ది. సమస్త దేవీ మంత్రాలలోకెల్లా శ్రీ బాలా మంత్రం గొప్పది. సకల శక్తి పూజలకు మూలమైన శ్రీ బాలాదేవి జగన్మోహనాకారాన్ని పవిత్రమైన శరన్నవరాత్రుల్లో దర్శించి, ఆమె అనుగ్రహాన్ని పొందితే, సంవత్సరం పొడుగునా అమ్మవారికి చేసే పూజలన్నీ సత్వర ఫలితాలనిస్తాయి. 3. శ్రీ గాయత్రి దేవి అలంకారం: ముక్తా విద్రుమ హేమనీల ధవల వర్థాలలతో ప్రకాశిస్తు, పంచ ముఖాలతో దర్శనమిస్తుంది. సంధ్యావందనం అధి దేవత . గాయత్రి మంత్రం రెండు రకాలు: 1. లఘు గాయత్రి మంత్రం 2. బ్రుహద్గాయత్రి మంత్రం. ప్రతి రోజూ త్రిసంధ్యా సమయంల్లో వేయి సార్లు గాయత్రి మంత్రంని పఠిస్తే వాక్సుద్ది కలుగుతుంది. 4. శ్రీ అన్నపూర్ణేశ్వరి దేవి: నాల్గవ రోజున నిత్యాన్నదానేశ్వరి శ్రీ అన్నపూర్ణా దేవి అలంకారం అన్నం జీవుల మనుగడకు ఆదారం. జీవకోటి నశించకుండా వారణాసి క్షేత్రాన్ని నిజ క్షేత్రంగా, క్షేత్ర అధినాయకుడు విశ్వేశ్వరుడి ప్రియపత్నిగా శ్రీ అన్నపూర్ణా దేవి విరాజిల్లుతుంది. 5. శ్రీ మహా సరస్వతీ దేవి: ఐదవ రోజున చదువుల తల్లి సరస్వతీ దేవి అలంకారం త్రి శక్తులలో ఒక మహాశక్తి శ్రీ సరస్వతీ దేవి. సరస్వతీ దేవి సప్తరూపాలలో ఉంటుందని మేరు తంత్రంలో చెప్పబడింది . అవి చింతామని సరస్వతి, జ్ఝాన సరస్వతి, నిల సరస్వతి, ఘట సరస్వతి, కిణి సరస్వతి, అంతరిక్ష సరస్వతి, మరియు మహా సరస్వతి. మహా సరస్వతి దేవి శుంభని శుంభులనే రాక్షసులను వధించింది. ..2 ..2.. 6. శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవివేవి : 6వ రోజున త్రిపురాత్రయంలో రెండో శక్తి శ్రీ లలితా దేవి అలంకారం. త్రిమూర్తులకన్నా ముందు నుండి ఉన్నది కాబట్టి, త్రిపుర సుందరి అని పిలవబడుతుంది. శ్రీచక్ర ఆదిష్టాన శక్తి, పంచదశాక్షరి అదిష్టాన దేవత. ఆదిశంకరాచార్యులు శ్రీ చక్రయంత్రాన్ని ప్రతిష్టించక పూర్వం ఈ దేవి ఉగ్ర రూపిణిగా ‘చండీదేవి'గా పిలవబడేది. ఆది శంకరాచార్యలు శ్ీర చక్రయంత్రాన్ని ప్రతి ష్టించాక పరమశాతం రూపిణిగా లలితా దేవిగా పిలవబడుతున్నది. 7. శ్రీ మహాలక్ష్మి తేది : 7వ రోజున మంగళ ప్రద దేవత శ్రీ మహాలక్ష్మీ దేవి అలంకారం అష్టరూపాలతో అష్ట సిద్దులు ప్రసాదించే దేవత. రెండు చేతులలో కమలాలని ధరించి, వరదాభయ హస్తాల్ని ప్రదర్శిస్తూ, పద్మాసనిగా దర్శనిమిస్తుంది. ఆది పరాశక్తి మహాకాళీ, మహాలక్ష్మీ, మహా సరస్వతి రూపాలు ధరించింది. ఆ ఆదిపరాశక్తి రూపంగానే మహాలక్ష్మీ అలంకారం జరుగుతుంది. 8. శ్రీ దుర్గా దేవి అలంకారం: దుర్గతులను నాశనం చేసే శ్రీ దుర్గా దేవి అలంకరాం రురుకుమారుడైన ‘దుర్గముడు' అనే రాక్షసున్ని సంహరించింది అష్టమి రోజునే కనుక ఈ రోజును దుర్గాష్టమి అని, దుర్గమున్ని సంహరించిన అవతారం కనుక దేవిని ‘దుర్గా' అని పిలుస్తారు. శ్రీ మహిషాసుర మర్ధినీ దేవి అలంకారం: మహిశాసురున్ని చంపడానికి దేవతలందరూ తమ తమ శక్తులను ప్రదానం చేయగా ఏర్పడిన అవతారం ఇది. సింహాన్ని వాహనంగా ఈ దేవికి హిమవంతుడు బహుకరించాడు. సింహ వాహనంతో రాక్షస సంహారం చేసి అనంతరం ఇంద్ర కీలాద్రి పై వెలిసింది 9. శ్రీరాజరాజేశ్వరి దేవి అలంకారం: 9వరోజు అపజయం అంటే ఎరుగని శక్తి కాబట్టి ఈ మాతను ‘అపరాజిత' అంటారు. ఎల్లప్పుడు విజయాలను పొందుతుంది కాబట్టి‘విజయ' అని కూడా అంటారు. శ్రీ రాజరాజేశ్వరి దేవి ఎప్పుడూ శ్రీ మహా పరమేశ్వరుడి అంకముపై ఆసీనురాలై భక్తులకు దర్శనమిస్తుందని పురాణ ఇతి హాసారు వెల్లడిస్తున్నాయి. -
Image
గాజువాక జర్నలిస్టుల వినతిని సీఎం జగన్మోహనరెడ్డి దృష్టికి తీసుకువెళ్తా
Image
మహిళల ఆర్థిక స్వావలంబనే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం
Image
శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం, ఇంద్రకీలాద్రి
Image
Kvik Fitness Arena " జిమ్ సెంటర్
Image