సోషల్ మీడియా మాథ్యమం ద్వారా విస్తృత ప్రచారం చేయాలి.

 *సోషల్ మీడియా మాథ్యమం ద్వారా విస్తృత ప్రచారం చేయాలి*



*బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి*


*పురంధేశ్వరి ని కలిసిన బిజెపి లీగల్ సెల్ రాష్ట్ర కన్వీనర్ ప్రతాప్ రెడ్డి*


*నేడు పురందేశ్వరి అధ్యక్షతన రాష్ట్ర స్థాయి పదాధికారుల సమావేశం*


*విజయవాడ, (ప్రజా అమరావతి) : బూత్ స్థాయి నుంచి వాట్స్ ప్ గ్రూప్ లు ఏర్పాటు చేసి కేంద్ర ప్రభుత్వ పధకాల ను సోషల్ మీడియా మాథ్యమం ద్వారా విస్తృత ప్రచారం కల్పించాలని బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి పిలుపు ఇచ్చారు. బిజెపి సోషల్ మీడియా కన్వీనర్ కేశవ్ కాంత్ అధ్యక్షతన శనివారం  రాష్ట్ర సోషల్ మీడియా ప్రతినిధులతో బిజెపి రాష్ట్ర కార్యాలయం లో సమావేశం నిర్వహించారు. భారతమాత ఫొటో కి పూలమాల వేసి  బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి సమావేశం ప్రారంభించారు. ఈ సందర్భంగా పురంధేశ్వరి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ పధకాల ప్రచారం ద్వారా ఈ రాష్ట్రానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఏం చేస్తున్నారనే అంశాల ను ప్రజల్లోకి తీసుకెళ్లాలని, కేంద్రం లోని బిజెపి ప్రభుత్వం పై విపక్షాలు చేస్తున్న దుష్ట ప్రచారం తిప్పి కొట్టాలన్నారు. సోషల్ మీడియా మాథ్యమం ద్వారా మాత్రమే ప్రజలకు కేంద్ర ప్రభుత్వం పధకాలు వివరించి వచ్చే ఎన్నికలకు మనం సమాయత్తం కావాల్సి న అవసరం ఉందన్నారు.  బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, సోషల్ మీడియా ఇంఛార్జి విష్ణువర్ధన్ రెడ్డి, బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వేటుకూరి సూర్య నారాయణ రాజు తదితరులు మాట్లాడారు.  సోషల్ మీడియా కన్వీనర్ కేశవ్ కాంత్  బిజెపి సోషల్ మీడియా చేస్తున్న కార్యక్రమాలు ఎల్ఈడీ స్క్రీన్ పై ప్లే చేశారు.*

 

*పురంధేశ్వరి ని కలిసిన బిజెపి లీగల్ సెల్ రాష్ట్ర కన్వీనర్ ప్రతాప్ రెడ్డి : బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు  దగ్గుబాటి పురంధేశ్వరి ని రాష్ట్ర కార్యాలయం లో బిజెపి లీగల్ సెల్ రాష్ట్ర కన్వీనర్ ప్రతాప్ రెడ్డి నేతృత్వంలో లీగల్ సెల్ కమిటీ మర్యాద పూర్వకంగా కలిశారు. ఈసందర్భంగా పురంధేశ్వరి ని శాలువా తో సత్కరించారు. లీగల్ సెల్ సభ్యులను ఉద్దేశించి రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి గారు మాట్లాడుతూ బిజెపి ని బలోపేతం చేసేందుకు అందరూ కలిసి కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు. బిజెపి లీగల్ సెల్ సభ్యులు అందరూ కామన్ సివిల్ కోడ్ బిల్లు విషయంలో అన్ని వర్గాల వారి కి అవగాహన కల్పించాలన్నారు. కామన్ సివిల్ కోడ్ ఆవశ్యకత వివరిస్తే ప్రజలు ఆమోదం తెలపడమే కాదు వ్యతిరేకించే రాజకీయ నేతల్లో కూడా బిల్లు విషయంలో పాజిటివ్ గా స్పందించే అవకాశం ఉంటుందన్నారు. కామన్ సివిల్ కోడ్ బిల్లు బిజెపి అజెండా లోని అంశం ఈ అంశం పై జాతీయ స్థాయిలో అనేక సందర్భాల్లో అవగాహన కల్పిస్తూ రావడం జరుగుతోందన్నారు. కామన్ సివిల్ కోడ్ పై అవగాహన కల్పించేందుకు బిజెపి లీగల్ సెల్ సభ్యులు అందరూ కృషి చేస్తారని అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరికి లీగల్ సెల్ కన్వీనర్ ప్రతాప్ రెడ్డి హామీ ఇచ్చారు.*


*నేడు పురందేశ్వరి అధ్యక్షతన రాష్ట్ర స్థాయి పదాధికారుల సమావేశం*


ఏపీ బీజేపీ  అధ్యక్షురాలు పురందేశ్వరి అధ్యక్షతన ఆదివారం రాష్ట్ర స్థాయి పదాధికారుల సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి పదాధికారులతో పాటు రాష్ట్రస్థాయి, జిల్లాస్థాయి నేతలు హాజరు కానున్నారు. ప్రస్తుతం నెలకొన్న తాజా రాజకీయాలు బీజేపీ భవిష్యత్తు ప్రణాళికపై సమావేశంలో ప్రధానంగా చర్చించనున్నారు. బీజేపీ అంతర్గత వ్యవహారాలతో పాటు నూతన కమిటీ ఏర్పాటుపై సమీక్ష చేయనున్నారు. ఎన్నికల ఏడాది కావడంతో కమిటీలను వాటి నియామకాలపై ప్రత్యేక దృష్టి పెట్టారు. అధికార పార్టీని టార్గెట్‌గానే వెళ్లాలని ఇప్పటికే నిర్ణయించుకున్న బీజేపీ అదిష్టానం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకూ బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో జరగనున్న ఈ సమావేశం కోసం ఏర్పాట్లు చేస్తున్నారు.

Comments
Popular posts
దసరా నవరాత్రులు: కనకదుర్గమ్మ తొమ్మిది రోజులు అలంకరణ రూపాలు ... విజయవాడ, ఇంద్రకీలాద్రి (prajaamaravati), అక్టోబరు 18 :- దసరా శరన్నవరాత్రులు హిందువులకు ఒక ముఖ్యమైన పండుగ. ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుండి ఆశ్వయుజ శుద్ధ నవమి వరకు తొమ్మిది రోజులు దేవీ నవరాత్రులు పదవ రోజు విజయ దశమి కలసి దసరా అంటారు. ఇది ముఖ్యముగా శక్తి ఆరాధనకు ప్రాధాన్యత ఇచ్చే పండుగ. ఈ పండుగకు నవరాత్రి, శరన్నవరాత్రి అనీ కూడా అంటారు. శరదృతువు ఆరంభంలో వచ్చే పండుగ కనుక ఈ పేరు వచ్చింది. కొందరు ఈ పండుగకు మొదటి మూడు రోజులు పార్వతిదేవికి తరువాతి మూడు రోజుల లక్ష్మీ దేవికి తరువాతి మూడురోజులు సరస్వతి దేవికి పూజలు నిర్వహిస్తారు. ఈ సమయంలో పూజలో విద్యార్ధులు తమ పుస్తకాలను ఉంచుతారు. ఇలా చేస్తే విద్యాభ్యాసంలో విజయం లభిస్తుందని విశ్వసిస్తారు. సామాన్యులే కాక యోగులు నవరాత్రులలో అమ్మవారిని పూజిస్తారు. ముఖ్యముగా శాక్తేయులు దీనిని ఆచరిస్తారు. బొమ్మల కొలువు పెట్టడం ఒక ఆనవాయితీ. ఆలయాలలో అమ్మవారికి ఒక్కోరోజు ఒక్కో అలంకారం చేస్తారు. ఈ తొమ్మిది రోజుల్లో అమ్మవారిని తొమ్మిది రూపాల్లో పూజిస్తూ ఉంటారు. లోకకల్యాణం కోసం అమ్మవారు ఒక్కోరోజు ఒక్కో రూపాన్ని ధరించింది. అందువలన అలా అమ్మవారు అవతరించిన రోజున, ఆ రూపంతో అమ్మవారిని అలంకరించి ఆ నామంతో ఆరాధిస్తూ ఉంటారు. ఇంద్రకీలాద్రిపై వేంచేసి యున్న శ్రీ కనకదుర్గమ్మావారు మొదటి రోజు శ్రీ స్వర్ణకవచాలంకృత శ్రీ దుర్గాదేవిగా రెండవ రోజు బాలాత్రిపుర సుందరి మూడవ రోజు గాయత్రి దేవిగా, నాల్గవ రోజు అన్నపూర్ణ దేవిగా ఐదవరోజు శ్రీ సర్వస్వతి దేవిగా ఆరవ రోజు శ్రీ లలిత త్రిపుర సుందరీ దేవిగా, ఏడవ రోజు శ్రీ మహలక్ష్మీదేవిగా, ఎనిమిదవ రోజు దుర్గాదేవి మరియు మహిషాసుర మర్థిని దేవిగా, తొమ్మిదవ రోజు శ్రీ రాజరాజేశ్వరి దేవి మొదలైన అవతార రూపాలతో దర్శనమిస్తూ భక్తులకు అమ్మవారు దర్శనమిస్తారు.ఇలా ఈ నవరాత్రుల సమయంలో ఒక్కో అమ్మవారిని ఆరాధించడం వలన ఒక్కో విశేష ఫలితం లభిస్తుందని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి. నవరాత్రుల్లో బెడవాడ శ్రీకనకదుర్గమ్మ వారు వివిధ అలంకారాలతో భక్తుల కోర్కేలను తీర్చు చల్లని తల్లిగా దర్శనమిస్తారు.. 1. దుర్గాదేవి అలకారం ః శరన్నవరాత్రి మహోత్సవాల్లో శ్రీ కనకదుర్గమ్మవారు శ్రీ స్వర్ణకవచాలంకృత శ్రీ దుర్గాదేవిగా దర్శినమిచ్చి భక్తులకు ఆయురారోగ్య ఐశ్వర్యాలను కలుగుజేస్తారు. 2. శ్రీ బాలాత్రిపుర సుందరి: ఫత్రిపురాత్రయంలో శ్రీ బాలాత్రి పుర సుందరీదేవి ప్రథమ స్థానంలో ఉంది. ఆమె ఎంతో మహిమాన్వితమైన ది. సమస్త దేవీ మంత్రాలలోకెల్లా శ్రీ బాలా మంత్రం గొప్పది. సకల శక్తి పూజలకు మూలమైన శ్రీ బాలాదేవి జగన్మోహనాకారాన్ని పవిత్రమైన శరన్నవరాత్రుల్లో దర్శించి, ఆమె అనుగ్రహాన్ని పొందితే, సంవత్సరం పొడుగునా అమ్మవారికి చేసే పూజలన్నీ సత్వర ఫలితాలనిస్తాయి. 3. శ్రీ గాయత్రి దేవి అలంకారం: ముక్తా విద్రుమ హేమనీల ధవల వర్థాలలతో ప్రకాశిస్తు, పంచ ముఖాలతో దర్శనమిస్తుంది. సంధ్యావందనం అధి దేవత . గాయత్రి మంత్రం రెండు రకాలు: 1. లఘు గాయత్రి మంత్రం 2. బ్రుహద్గాయత్రి మంత్రం. ప్రతి రోజూ త్రిసంధ్యా సమయంల్లో వేయి సార్లు గాయత్రి మంత్రంని పఠిస్తే వాక్సుద్ది కలుగుతుంది. 4. శ్రీ అన్నపూర్ణేశ్వరి దేవి: నాల్గవ రోజున నిత్యాన్నదానేశ్వరి శ్రీ అన్నపూర్ణా దేవి అలంకారం అన్నం జీవుల మనుగడకు ఆదారం. జీవకోటి నశించకుండా వారణాసి క్షేత్రాన్ని నిజ క్షేత్రంగా, క్షేత్ర అధినాయకుడు విశ్వేశ్వరుడి ప్రియపత్నిగా శ్రీ అన్నపూర్ణా దేవి విరాజిల్లుతుంది. 5. శ్రీ మహా సరస్వతీ దేవి: ఐదవ రోజున చదువుల తల్లి సరస్వతీ దేవి అలంకారం త్రి శక్తులలో ఒక మహాశక్తి శ్రీ సరస్వతీ దేవి. సరస్వతీ దేవి సప్తరూపాలలో ఉంటుందని మేరు తంత్రంలో చెప్పబడింది . అవి చింతామని సరస్వతి, జ్ఝాన సరస్వతి, నిల సరస్వతి, ఘట సరస్వతి, కిణి సరస్వతి, అంతరిక్ష సరస్వతి, మరియు మహా సరస్వతి. మహా సరస్వతి దేవి శుంభని శుంభులనే రాక్షసులను వధించింది. ..2 ..2.. 6. శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవివేవి : 6వ రోజున త్రిపురాత్రయంలో రెండో శక్తి శ్రీ లలితా దేవి అలంకారం. త్రిమూర్తులకన్నా ముందు నుండి ఉన్నది కాబట్టి, త్రిపుర సుందరి అని పిలవబడుతుంది. శ్రీచక్ర ఆదిష్టాన శక్తి, పంచదశాక్షరి అదిష్టాన దేవత. ఆదిశంకరాచార్యులు శ్రీ చక్రయంత్రాన్ని ప్రతిష్టించక పూర్వం ఈ దేవి ఉగ్ర రూపిణిగా ‘చండీదేవి'గా పిలవబడేది. ఆది శంకరాచార్యలు శ్ీర చక్రయంత్రాన్ని ప్రతి ష్టించాక పరమశాతం రూపిణిగా లలితా దేవిగా పిలవబడుతున్నది. 7. శ్రీ మహాలక్ష్మి తేది : 7వ రోజున మంగళ ప్రద దేవత శ్రీ మహాలక్ష్మీ దేవి అలంకారం అష్టరూపాలతో అష్ట సిద్దులు ప్రసాదించే దేవత. రెండు చేతులలో కమలాలని ధరించి, వరదాభయ హస్తాల్ని ప్రదర్శిస్తూ, పద్మాసనిగా దర్శనిమిస్తుంది. ఆది పరాశక్తి మహాకాళీ, మహాలక్ష్మీ, మహా సరస్వతి రూపాలు ధరించింది. ఆ ఆదిపరాశక్తి రూపంగానే మహాలక్ష్మీ అలంకారం జరుగుతుంది. 8. శ్రీ దుర్గా దేవి అలంకారం: దుర్గతులను నాశనం చేసే శ్రీ దుర్గా దేవి అలంకరాం రురుకుమారుడైన ‘దుర్గముడు' అనే రాక్షసున్ని సంహరించింది అష్టమి రోజునే కనుక ఈ రోజును దుర్గాష్టమి అని, దుర్గమున్ని సంహరించిన అవతారం కనుక దేవిని ‘దుర్గా' అని పిలుస్తారు. శ్రీ మహిషాసుర మర్ధినీ దేవి అలంకారం: మహిశాసురున్ని చంపడానికి దేవతలందరూ తమ తమ శక్తులను ప్రదానం చేయగా ఏర్పడిన అవతారం ఇది. సింహాన్ని వాహనంగా ఈ దేవికి హిమవంతుడు బహుకరించాడు. సింహ వాహనంతో రాక్షస సంహారం చేసి అనంతరం ఇంద్ర కీలాద్రి పై వెలిసింది 9. శ్రీరాజరాజేశ్వరి దేవి అలంకారం: 9వరోజు అపజయం అంటే ఎరుగని శక్తి కాబట్టి ఈ మాతను ‘అపరాజిత' అంటారు. ఎల్లప్పుడు విజయాలను పొందుతుంది కాబట్టి‘విజయ' అని కూడా అంటారు. శ్రీ రాజరాజేశ్వరి దేవి ఎప్పుడూ శ్రీ మహా పరమేశ్వరుడి అంకముపై ఆసీనురాలై భక్తులకు దర్శనమిస్తుందని పురాణ ఇతి హాసారు వెల్లడిస్తున్నాయి. -
Image
గాజువాక జర్నలిస్టుల వినతిని సీఎం జగన్మోహనరెడ్డి దృష్టికి తీసుకువెళ్తా
Image
మహిళల ఆర్థిక స్వావలంబనే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం
Image
శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం, ఇంద్రకీలాద్రి
Image
Kvik Fitness Arena " జిమ్ సెంటర్
Image