వరుసగా నాలుగో ఏడాది.. మొదటి విడతగా జగనన్న తోడు – చిరువ్యాపారుల ఉపాధికి ఊతం.


అమరావతి (ప్రజా అమరావతి);


*వరుసగా నాలుగో ఏడాది.. మొదటి విడతగా జగనన్న తోడు – చిరువ్యాపారుల ఉపాధికి ఊతం.*


*నిరుపేదలైన చిరు వ్యాపారులు, హస్త కళాకారులు, సంప్రదాయ చేతి వృత్తుల వారిని వాళ్ల కాళ్లమీద నిలబెడుతూ.. ఒక్కొక్కరికి ఏటా రూ. 10 వేలు చెల్లిస్తూ.. సకాలంలో చెల్లించినవారికి ఆ రూ.10,000కు అదనంగా క్రమంగా ఏటా రూ.1,000 చొప్పున జోడిస్తూ రూ.13,000 వరకూ వడ్డీలేని రుణం.* 


*పూర్తి వడ్డీ భారాన్ని ప్రభుత్వమే భరిస్తూ ఒక్కొక్కరికీ రూ. 10 వేలు అంతకు పైగా.. 5,10,412 మంది చిరు వ్యాపారులకు రూ.549.70 కోట్ల వడ్డీలేని రుణాలు. రూ.11.03 కోట్ల వడ్డీ రీయింబర్స్‌మెంట్‌ కలిపి మొత్తం రూ.560.73 కోట్లను నేడు(18–07–2023) క్యాంపు కార్యాలయం నుంచి బటన్‌ నొక్కి లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తున్న ముఖ్యమంత్రి శ్రీ వైయస్‌.జగన్‌.* 


ఈ పథకం ద్వారా నేడు అందిస్తున్న రూ. 549.70 కోట్ల రుణంతో కలిపి ఇప్పటివరకు 15,87,492 మంది చిరువ్యాపారాలు చేసుకునే లబ్ధిదారులకు(వీరిలో సకాలంలో రుణాలు చెల్లించి పలుమార్లు రుణం కోరి పొందినవారు 13,29,011 మంది) అందించిన వడ్డీ లేని రుణాలు రూ. 2,955.79 కోట్లు.


నేడు అందిస్తున్న వడ్డీ రీయింబర్స్‌ మెంట్‌ రూ.11.03 కోట్లతో కలిపి సకాలంలో రుణాలు చెల్లించిన 15.31 లక్షల మంది లబ్ధిదారులకు ఇప్పటివరకు శ్రీ వైయస్‌.జగన్‌ ప్రభుత్వం తిరిగి చెల్లించిన వడ్డీ రూ.74.69 కోట్లు.


చిరు వ్యాపారులు రోజువారీ పెట్టుబడి ఖర్చుల కోసం వడ్డీ వ్యాపారుల చుట్టూ తిరగాల్సిన దుస్ధితి లేకుండా, వారి పరిస్ధితి మార్చాలన్న సమున్నత లక్ష్యంతో అర్హులైన ప్రతి ఒక్కరికి వడ్డీ లేని రుణాలు అందిస్తున్న ప్రభుత్వం .. శ్రీ వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం.


లబ్ధిదారులు బ్యాంకులకు కట్టిన వడ్డీ మొత్తాన్ని ప్రతి ఆరు నెలలకోసారి నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జమ అయ్యేలా ప్రభుత్వమే చెల్లిస్తుంది. రుణం తీరిన తర్వాత లబ్ధిదారులు మళ్ళీ వడ్డీలేని రుణం పొందడానికి అర్హులు. వారికి బ్యాంకులు మళ్ళీ వడ్డీలేని రుణాలు ఇస్తాయి.


*వీరందరికీ జగనన్న తోడు.*

గ్రామాలు, పట్టణాల్లో సుమారు 5 అడుగుల పొడవు, 5 అడుగుల వెడల్పు స్ధలంలో శాశ్వత లేక తాత్కాలిక షాపులు ఏర్పాటు చేసుకున్న వారు..


ఫుట్‌పాత్‌ల మీద, వీధుల్లో తోపుడు బండ్ల మీద వస్తువులు, కూరగాయలు, పండ్లు, ఆహార పదార్ధాలు అమ్ముకుని జీవించే వారు, రోడ్ల పక్కన టిఫిన్‌ సెంటర్లు నిర్వహించేవారు, గంపలు, బుట్టలలో వస్తువులు అమ్మేవారు, సైకిల్, మోటర్‌ సైకిళ్ళు, ఆటోలపై వెళ్ళి వ్యాపారం చేసుకునేవారు...


చేనేత మరియు సంప్రదాయ చేతివృత్తుల కళాకారులైన ఇత్తడి పని చేసేవారు, బొబ్బలివీణ, ఏటికొప్పాక, కొండపల్లి బొమ్మలు, కలంకారీ, తోలుబొమ్మలు, ఇతర సామాగ్రి తయారీదారులు, లేస్‌ వర్క్స్, కుమ్మరి తదితర వృత్తులపై ఆధారపడి జీవిస్తున్న వ్యక్తులు అర్హులు.


*సకాలంలో చెల్లిస్తే...*

సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ ప్రభుత్వం తీసుకున్న చర్యల కారణంగా.. సకాలంలో రుణాలు చెల్లించిన వీధి వ్యాపారులు, సాంప్రదాయ చేతివృత్తుల వారికి నిత్యం మూలధనం అందుబాటులో ఉండేలా.. ఏ ఏడాదికి ఆ ఏడాది రుణాల మొత్తాన్ని రూ.10వేల నుంచి రూ.11వేలకు, రూ.11వేల నుంచి రూ.12వేలకు, రూ.12వేల ఉంచి రూ.13వేలకు పెంచుతూ బ్యాంకుల ద్వారా వడ్డీలేని రుణాలిప్పిస్తున్న ప్రభుత్వం.


*లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ..*

వడ్డీ లేని రుణాలకు దరఖాస్తు చేసుకోవాలనుకుంటే గ్రామ, వార్డు సచివాలయాలను సంప్రదించాలి.

 అర్హత ఉండీ, జాబితాలో పేర్లు నమోదు కానివారు కంగారు పడాల్సిన పనిలేదు. గ్రామ, వార్డు వాలంటీర్లను సంప్రదించవచ్చు లేదా సమీప గ్రామ, వార్డు సచివాలయాలకు వెళ్ళి దరఖాస్తు చేసుకోవచ్చు.

Comments