విష జ్వరాల హాట్ స్పాట్ లను గుర్తించండి.

 *విష జ్వరాల హాట్ స్పాట్ లను గుర్తించండి


*

*పరిసరాలు పరిశుభ్రంగా ఉండేలా పంచాయతీరాజ్, మున్సిపల్ విభాగాలతో సమన్వయం చేసుకోండి*

*సీజ‌న‌ల్ వ్యాధుల నియంత్ర‌ణ‌ విషయంలో నిర్ల‌క్ష్యం వ‌ద్దు*

*మ‌లేరియా, డెంగీ కేసుల విష‌యంలో అప్ర‌మ‌త్తంగా ఉండండి*

*10వ తేదీ నుంచి ఫీవర్ సర్వే చేపట్టండి*

*ఆయా ప్రాంతాల్లో ప్రత్యేక జాగ్ర‌త్త‌లు తీసుకోండి*

*డెంగీ, మ‌లేరియా కిట్ల కొర‌త లేకుండా చూసుకోండి*

*15 రోజుల‌పాటు ఇంటింటి అవ‌గాహ‌న కార్య‌క్ర‌మం చేప‌ట్టాలి*

*ర‌క్తం కొర‌త లేకుండా చ‌ర్య‌లు తీసుకోండి*

*మందుల కొర‌త ఉండ‌టానికి వీల్లేదు*

*రాష్ట్ర‌, జిల్లా స్థాయి అధికారులు క్షేత్ర‌స్థాయి ప‌రిశీల‌న‌కు వెళ్లాలి*

*ప్ర‌జ‌ల‌కు మెరుగైన ఆరోగ్యం మ‌నంద‌రి బాధ్య‌త‌*

*ఏజెన్సీ ప్రాంతాల్లో మ‌రింత అప్ర‌మ‌త్త‌త అవ‌స‌రం*

*రాష్ట్ర వైద్య ఆరోగ్య‌శాఖ మంత్రి విడ‌ద‌ల ర‌జిని*

*సీజ‌న‌ల్ వ్యాధుల‌పై రాష్ట్ర‌, జిల్లా స్థాయి అధికారుల‌తో వీడియో కాన్ఫ‌రెన్స్‌*

అమరావతి (ప్రజా అమరావతి);

డెంగీ, మలేరియా లాంటి విషజ్వరాలు గతంలో బాగా ప్రబలిన ప్రాంతాలను హాట్ స్పాట్లుగా గుర్తించి, వెంటనే తగిన చర్యలు చేపట్టాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య‌శాఖ మంత్రి విడ‌ద‌ల ర‌జిని అధికారుల‌ను ఆదేశించారు. ప్ర‌స్తుతం వ‌ర్షాకాలం ప్రారంభ‌మైన నేప‌థ్యంలో సీజ‌న‌ల్ వ్యాధులు ప్ర‌బ‌లే అవ‌కాశం ఉంద‌ని, ప్ర‌జ‌ల ఆరోగ్యం విష‌యంలో అప్ర‌మ‌త్తంగా ఉండాల్సిన బాధ్య‌త మ‌న‌దేన‌ని పేర్కొన్నారు. సీజ‌న‌ల్ వ్యాధుల‌పై వైద్య ఆరోగ్య‌శాఖ స‌న్న‌ద్ధ‌త‌కు సంబంధించి శుక్ర‌వారం మంత్రి విడ‌దల ర‌జిని రాష్ట్ర‌, జిల్లా స్థాయి అధికారులంద‌రితో క‌లిపి వీడియో కాన్ఫ‌రెన్స్ నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా మంత్రి విడ‌ద‌ల ర‌జిని మాట్లాడుతూ వ‌ర్షాలు మొద‌లైన నేప‌థ్యంలో విష జ్వ‌రాలు ప్ర‌బ‌లే అవ‌కాశాలు ఉంటాయ‌ని తెలిపారు. ప్ర‌జ‌ల‌కు మెరుగైన ఆరోగ్యం అందించ‌డం ల‌క్ష్యంగా ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి చిత్త‌శుద్ధితో ప‌నిచేస్తున్నార‌ని, ప్ర‌భుత్వ ఆశ‌యాలు, ల‌క్ష్యాలు సాధించేలా అధికారులు ప‌నిచేయాల్సి ఉంద‌ని పేర్కొన్నారు. వెంట‌నే ఇంటింటికీ పీవ‌ర్ స‌ర్వే ప్రారంభించాల‌ని చెప్పారు. వాలంటీర్లు, ఏఎన్ ఎంలు ఈ స‌ర్వేలో పాల్గొనేలా క్షేత్ర‌స్థాయిలో ఆదేశాలు వెళ్లాల‌ని, సంబంధిత ఏర్పాట్ల‌న్నీ చేసుకోవాల‌ని ఆదేశించారు. ఈ నెల పదో తేదీ నుంచి ఫీవర్ సర్వే ప్రారంభం కావాలన్నారు. పారిశుద్ధ్యం విష‌యంలో పంచాయ‌తీరాజ్‌, మున్సిప‌ల్ శాఖ‌ల‌తో స‌మ‌న్వ‌యం చేసుకుంటూ వైద్య ఆరోగ్య‌శాఖ సిబ్బంది ముందుకెళ్లాల‌ని చెప్పారు.


*కిట్ల కొర‌త ఉండ‌కూడ‌దు*

డెంగీ, మలేరియా టెస్టుల‌కు సంబంధించి వైఎస్సార్ విలేజ్ హెల్త్ క్లినిక్ స్థాయిలోనే కిట్లు అందుబాటులో ఉండాల‌ని మంత్రి ఆదేశాలు జారీ చేశారు. ఎక్క‌డా కిట్ల కొర‌త రావ‌డానికి వీల్లేద‌ని తెలిపారు. ఏజెన్సీ ప్రాంతాల్లో సాధార‌ణంగా సీజ‌న‌ల్ వ్యాధుల ప్ర‌భావం ఎక్కువ‌గా ఉంటుంద‌ని, ఆయా ప్రాంతాల్లో వెనువెంట‌నే చ‌ర్య‌లు చేప‌ట్టాల‌ని పేర్కొన్నారు. మ‌న్యం, అల్లూరి సీతారామ‌రాజు లాంటి జిల్లాల విష‌యంలో ప్ర‌త్యేక శ్ర‌ద్ధ క‌న‌బ‌ర‌చాల‌ని చెప్పారు. ఏజెన్సీ ప్రాంతాల్లో ఫాగింగ్‌, దోమ‌తెర‌ల పంపిణీ, గంబూషియా చేప‌ల పంపిణీ లాంటి చ‌ర్య‌లు చేప‌ట్టాల‌ని పేర్కొన్నారు. వైద్యులు ఆస్ప‌త్రుల్లో త‌ప్ప‌నిస‌రిగా అందుబాటులో ఉండేలా చూడాల‌న్నారు. ఎక్క‌డా మందుల కొర‌త రావ‌డానికి వీల్లేద‌ని చెప్పారు. బ్ల‌డ్ బ్యాంకుల‌పై ప్ర‌త్యేక నిఘా ఉంచాల‌ని చెప్పారు. ఎక్క‌డా ర‌క్తం కొర‌త లేకుండా చూడాల‌ని తెలిపారు. డెంగీ బాధితుల‌కు ర‌క్తం సులువుగా అందే ప‌రిస్థితులు ఉండాల‌ని చెప్పారు.


*క్షేత్ర‌స్థాయి ప‌రిశీల‌న‌లు త‌ప్ప‌నిస‌రి*

సీజ‌న‌ల్ వ్యాధుల ప్ర‌భావం ఉండే ఈ మూడునెల‌లూ అధికారులు క‌చ్చితంగా క్షేత్ర‌స్థాయి ప‌ర్య‌వేక్ష‌ణ చేస్తూ ఉండాల‌ని మంత్రి ఆదేశించారు. రాష్ట్ర‌, జిల్లా స్థాయి ఉన్న‌తాధికారులు క‌చ్చితంగా గ్రామాలు, ప‌ట్ట‌ణాల్లోకి వెళ్లి ప‌రిస్థితిని ప‌ర్య‌వేక్షిస్తూ ఉండాల‌న్నారు. ప‌రిస‌రాల‌ను ప‌రిశుభ్రంగా ఉంచ‌డం, వ్య‌క్తిగ‌త ప‌రిశుభ్ర‌త పాటించ‌డం, లార్వాల నిల్వ‌లు లేకుండా జాగ్ర‌త్త‌ప‌డ‌టం, జ‌గ‌నన్న కొత్త‌గా సృష్టించిన వైద్య స‌దుపాయాల‌ను వినియోగించుకునేలా చూడ‌టం లాంటి విష‌యాల‌పై ఇంటింటికీ వెళ్లి అవ‌గాహ‌న క‌ల్పించాల్సిన అవ‌స‌రం ఉంద‌ని పేర్కొన్నారు. రాష్ట్ర‌వ్యాప్తంగా 15 రోజుల‌పాటు ఇంటింటికీ అవ‌గాహ‌న కార్య‌క్ర‌మాన్ని చేప‌ట్టాల‌న్నారు. వాలంటీర్లు, ఏఎన్ ఎంల స‌హ‌కారం తీసుకుని వెంట‌నే ఈ కార్య‌క్ర‌మాన్ని మొద‌లుపెట్టాల‌న్నారు. సంబంధిత వివ‌రాల‌తో క‌ర‌ప‌త్రాలు రూపొందించి ఇంటింటికీ అంద‌జేయాల‌ని చెప్పారు. 


*సుర‌క్షిత మంచినీరు అందాలి*

ప్ర‌జ‌ల‌కు అందుతున్న నీరు సుర‌క్షితంగా ఉండేలా వైద్య ఆరోగ్య‌శాఖ కూడా ప‌ర్య‌వేక్షిస్తే మంచి ఫ‌లితాలు వ‌స్తాయ‌ని తెలిపారు. పంచాయ‌తీల కార్య‌ద‌ర్శుల‌తో వైఎస్సార్ విలేజ్ హెల్త్ క్లినిక్‌, పీహెచ్‌సీల సిబ్బంది క‌లిసి ప‌నిచేయాల‌ని, ప్ర‌జ‌ల‌కు అందుతున్న నీటి నాణ్య‌త‌ను వైద్య సిబ్బంది కూడా ప‌ర్య‌వేక్షించాల‌ని సూచించారు. ప్ర‌జ‌ల ఆరోగ్యం విష‌యంలో అంద‌రూ బాధ్య‌త‌గా ఉండాల‌ని సూచించారు. కార్య‌క్ర‌మంలో వైద్య ఆరోగ్య‌శాఖ ముఖ్య కార్య‌ద‌ర్శి ఎం.టి.కృష్ణ‌భాబు, కార్య‌ద‌ర్శి మంజుల డి హోస్మ‌ని, క‌మిష‌న‌ర్ జె.నివాస్‌, ఏపీవీవీపీ క‌మిష‌న‌ర్ డాక్ట‌ర్ వెంక‌టేశ్వ‌ర్లు, డైరెక్ట‌ర్ ఫ‌ర్ హెల్త్ రామిరెడ్డి, డైరెక్ట‌ర్ ఫ‌ర్ మెడిక‌ల్ ఎడ్యుకేష‌న్ న‌ర‌సింహం త‌దిత‌రులు పాల్గొన్నారు.

Comments
Popular posts
దసరా నవరాత్రులు: కనకదుర్గమ్మ తొమ్మిది రోజులు అలంకరణ రూపాలు ... విజయవాడ, ఇంద్రకీలాద్రి (prajaamaravati), అక్టోబరు 18 :- దసరా శరన్నవరాత్రులు హిందువులకు ఒక ముఖ్యమైన పండుగ. ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుండి ఆశ్వయుజ శుద్ధ నవమి వరకు తొమ్మిది రోజులు దేవీ నవరాత్రులు పదవ రోజు విజయ దశమి కలసి దసరా అంటారు. ఇది ముఖ్యముగా శక్తి ఆరాధనకు ప్రాధాన్యత ఇచ్చే పండుగ. ఈ పండుగకు నవరాత్రి, శరన్నవరాత్రి అనీ కూడా అంటారు. శరదృతువు ఆరంభంలో వచ్చే పండుగ కనుక ఈ పేరు వచ్చింది. కొందరు ఈ పండుగకు మొదటి మూడు రోజులు పార్వతిదేవికి తరువాతి మూడు రోజుల లక్ష్మీ దేవికి తరువాతి మూడురోజులు సరస్వతి దేవికి పూజలు నిర్వహిస్తారు. ఈ సమయంలో పూజలో విద్యార్ధులు తమ పుస్తకాలను ఉంచుతారు. ఇలా చేస్తే విద్యాభ్యాసంలో విజయం లభిస్తుందని విశ్వసిస్తారు. సామాన్యులే కాక యోగులు నవరాత్రులలో అమ్మవారిని పూజిస్తారు. ముఖ్యముగా శాక్తేయులు దీనిని ఆచరిస్తారు. బొమ్మల కొలువు పెట్టడం ఒక ఆనవాయితీ. ఆలయాలలో అమ్మవారికి ఒక్కోరోజు ఒక్కో అలంకారం చేస్తారు. ఈ తొమ్మిది రోజుల్లో అమ్మవారిని తొమ్మిది రూపాల్లో పూజిస్తూ ఉంటారు. లోకకల్యాణం కోసం అమ్మవారు ఒక్కోరోజు ఒక్కో రూపాన్ని ధరించింది. అందువలన అలా అమ్మవారు అవతరించిన రోజున, ఆ రూపంతో అమ్మవారిని అలంకరించి ఆ నామంతో ఆరాధిస్తూ ఉంటారు. ఇంద్రకీలాద్రిపై వేంచేసి యున్న శ్రీ కనకదుర్గమ్మావారు మొదటి రోజు శ్రీ స్వర్ణకవచాలంకృత శ్రీ దుర్గాదేవిగా రెండవ రోజు బాలాత్రిపుర సుందరి మూడవ రోజు గాయత్రి దేవిగా, నాల్గవ రోజు అన్నపూర్ణ దేవిగా ఐదవరోజు శ్రీ సర్వస్వతి దేవిగా ఆరవ రోజు శ్రీ లలిత త్రిపుర సుందరీ దేవిగా, ఏడవ రోజు శ్రీ మహలక్ష్మీదేవిగా, ఎనిమిదవ రోజు దుర్గాదేవి మరియు మహిషాసుర మర్థిని దేవిగా, తొమ్మిదవ రోజు శ్రీ రాజరాజేశ్వరి దేవి మొదలైన అవతార రూపాలతో దర్శనమిస్తూ భక్తులకు అమ్మవారు దర్శనమిస్తారు.ఇలా ఈ నవరాత్రుల సమయంలో ఒక్కో అమ్మవారిని ఆరాధించడం వలన ఒక్కో విశేష ఫలితం లభిస్తుందని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి. నవరాత్రుల్లో బెడవాడ శ్రీకనకదుర్గమ్మ వారు వివిధ అలంకారాలతో భక్తుల కోర్కేలను తీర్చు చల్లని తల్లిగా దర్శనమిస్తారు.. 1. దుర్గాదేవి అలకారం ః శరన్నవరాత్రి మహోత్సవాల్లో శ్రీ కనకదుర్గమ్మవారు శ్రీ స్వర్ణకవచాలంకృత శ్రీ దుర్గాదేవిగా దర్శినమిచ్చి భక్తులకు ఆయురారోగ్య ఐశ్వర్యాలను కలుగుజేస్తారు. 2. శ్రీ బాలాత్రిపుర సుందరి: ఫత్రిపురాత్రయంలో శ్రీ బాలాత్రి పుర సుందరీదేవి ప్రథమ స్థానంలో ఉంది. ఆమె ఎంతో మహిమాన్వితమైన ది. సమస్త దేవీ మంత్రాలలోకెల్లా శ్రీ బాలా మంత్రం గొప్పది. సకల శక్తి పూజలకు మూలమైన శ్రీ బాలాదేవి జగన్మోహనాకారాన్ని పవిత్రమైన శరన్నవరాత్రుల్లో దర్శించి, ఆమె అనుగ్రహాన్ని పొందితే, సంవత్సరం పొడుగునా అమ్మవారికి చేసే పూజలన్నీ సత్వర ఫలితాలనిస్తాయి. 3. శ్రీ గాయత్రి దేవి అలంకారం: ముక్తా విద్రుమ హేమనీల ధవల వర్థాలలతో ప్రకాశిస్తు, పంచ ముఖాలతో దర్శనమిస్తుంది. సంధ్యావందనం అధి దేవత . గాయత్రి మంత్రం రెండు రకాలు: 1. లఘు గాయత్రి మంత్రం 2. బ్రుహద్గాయత్రి మంత్రం. ప్రతి రోజూ త్రిసంధ్యా సమయంల్లో వేయి సార్లు గాయత్రి మంత్రంని పఠిస్తే వాక్సుద్ది కలుగుతుంది. 4. శ్రీ అన్నపూర్ణేశ్వరి దేవి: నాల్గవ రోజున నిత్యాన్నదానేశ్వరి శ్రీ అన్నపూర్ణా దేవి అలంకారం అన్నం జీవుల మనుగడకు ఆదారం. జీవకోటి నశించకుండా వారణాసి క్షేత్రాన్ని నిజ క్షేత్రంగా, క్షేత్ర అధినాయకుడు విశ్వేశ్వరుడి ప్రియపత్నిగా శ్రీ అన్నపూర్ణా దేవి విరాజిల్లుతుంది. 5. శ్రీ మహా సరస్వతీ దేవి: ఐదవ రోజున చదువుల తల్లి సరస్వతీ దేవి అలంకారం త్రి శక్తులలో ఒక మహాశక్తి శ్రీ సరస్వతీ దేవి. సరస్వతీ దేవి సప్తరూపాలలో ఉంటుందని మేరు తంత్రంలో చెప్పబడింది . అవి చింతామని సరస్వతి, జ్ఝాన సరస్వతి, నిల సరస్వతి, ఘట సరస్వతి, కిణి సరస్వతి, అంతరిక్ష సరస్వతి, మరియు మహా సరస్వతి. మహా సరస్వతి దేవి శుంభని శుంభులనే రాక్షసులను వధించింది. ..2 ..2.. 6. శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవివేవి : 6వ రోజున త్రిపురాత్రయంలో రెండో శక్తి శ్రీ లలితా దేవి అలంకారం. త్రిమూర్తులకన్నా ముందు నుండి ఉన్నది కాబట్టి, త్రిపుర సుందరి అని పిలవబడుతుంది. శ్రీచక్ర ఆదిష్టాన శక్తి, పంచదశాక్షరి అదిష్టాన దేవత. ఆదిశంకరాచార్యులు శ్రీ చక్రయంత్రాన్ని ప్రతిష్టించక పూర్వం ఈ దేవి ఉగ్ర రూపిణిగా ‘చండీదేవి'గా పిలవబడేది. ఆది శంకరాచార్యలు శ్ీర చక్రయంత్రాన్ని ప్రతి ష్టించాక పరమశాతం రూపిణిగా లలితా దేవిగా పిలవబడుతున్నది. 7. శ్రీ మహాలక్ష్మి తేది : 7వ రోజున మంగళ ప్రద దేవత శ్రీ మహాలక్ష్మీ దేవి అలంకారం అష్టరూపాలతో అష్ట సిద్దులు ప్రసాదించే దేవత. రెండు చేతులలో కమలాలని ధరించి, వరదాభయ హస్తాల్ని ప్రదర్శిస్తూ, పద్మాసనిగా దర్శనిమిస్తుంది. ఆది పరాశక్తి మహాకాళీ, మహాలక్ష్మీ, మహా సరస్వతి రూపాలు ధరించింది. ఆ ఆదిపరాశక్తి రూపంగానే మహాలక్ష్మీ అలంకారం జరుగుతుంది. 8. శ్రీ దుర్గా దేవి అలంకారం: దుర్గతులను నాశనం చేసే శ్రీ దుర్గా దేవి అలంకరాం రురుకుమారుడైన ‘దుర్గముడు' అనే రాక్షసున్ని సంహరించింది అష్టమి రోజునే కనుక ఈ రోజును దుర్గాష్టమి అని, దుర్గమున్ని సంహరించిన అవతారం కనుక దేవిని ‘దుర్గా' అని పిలుస్తారు. శ్రీ మహిషాసుర మర్ధినీ దేవి అలంకారం: మహిశాసురున్ని చంపడానికి దేవతలందరూ తమ తమ శక్తులను ప్రదానం చేయగా ఏర్పడిన అవతారం ఇది. సింహాన్ని వాహనంగా ఈ దేవికి హిమవంతుడు బహుకరించాడు. సింహ వాహనంతో రాక్షస సంహారం చేసి అనంతరం ఇంద్ర కీలాద్రి పై వెలిసింది 9. శ్రీరాజరాజేశ్వరి దేవి అలంకారం: 9వరోజు అపజయం అంటే ఎరుగని శక్తి కాబట్టి ఈ మాతను ‘అపరాజిత' అంటారు. ఎల్లప్పుడు విజయాలను పొందుతుంది కాబట్టి‘విజయ' అని కూడా అంటారు. శ్రీ రాజరాజేశ్వరి దేవి ఎప్పుడూ శ్రీ మహా పరమేశ్వరుడి అంకముపై ఆసీనురాలై భక్తులకు దర్శనమిస్తుందని పురాణ ఇతి హాసారు వెల్లడిస్తున్నాయి. -
Image
గాజువాక జర్నలిస్టుల వినతిని సీఎం జగన్మోహనరెడ్డి దృష్టికి తీసుకువెళ్తా
Image
మహిళల ఆర్థిక స్వావలంబనే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం
Image
శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం, ఇంద్రకీలాద్రి
Image
Kvik Fitness Arena " జిమ్ సెంటర్
Image