వెనుకబడిన వర్గాలకు రాజకీయ సమానత్వం కల్పించిన మహనీయుడు వై.యస్.జగన్ మోహన్ రెడ్డి.



*వెనుకబడిన వర్గాలకు రాజకీయ సమానత్వం కల్పించిన మహనీయుడు వై.యస్.జగన్ మోహన్ రెడ్డి


*


*వై.యస్.జగన్ మోహన్ రెడ్డి పరిపాలనలో రాష్ట్రం రామరాజ్యాన్ని తలపిస్తున్నది* 


                                                                                               *: ఉప ముఖ్యమంత్రి*


*రైతులకు వెన్నుదన్నుగా ముఖ్యమంత్రి* 


*జీడి నెల్లూరు నియోజకవర్గంలో అభివృద్ధి పథంలో పయనింపజేస్తున్న ఉప ముఖ్యమంత్రి*


                                                                        *: చిత్తూరు ఎంపి* 


*ప్రతి నెలా ఒక సంక్షేమ పథకాల అమలులో భాగంగా డిబిటి ద్వారా లబ్దిదారులకు ఆర్ధిక సహాయం చేస్తున్న ముఖ్యమంత్రి*


*అభివృద్ధి, సంక్షేమం ప్రధాన ధ్యేయంగా పాలన సాగిస్తున్న ముఖ్యమంత్రి*


                                                                  *: జెడ్ పి చైర్మన్*


*అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాల లబ్ధి*


                                                          *: ఏపీఎస్ఆర్టీసీ వైస్ చైర్మన్*


వెదురుకుప్పం, జూలై 10 (ప్రజా అమరావతి );


రాష్ట్రం లో వెనుకబడిన వర్గాలకు రాజకీయ సమానత్వం కల్పించిన మహనీయుడు వై.యస్.జగన్ మోహన్ రెడ్డి అని ఉప ముఖ్యమంత్రి కె. నారాయణ స్వామి కొనియాడారు.



సోమవారం వెదురుకుప్పం మండల కేంద్రంలో పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాలకు ముఖ్య అతిథిగా పాల్గొన్న ఉప ముఖ్యమంత్రితో పాటు చిత్తూరు ఎం పి ఎన్.రెడ్డెప్ప, జెడ్ పి చైర్మన్ గోవిందప్ప శ్రీనివాసులు, ఏ పి ఎస్ ఆర్ టి సి వైస్ చైర్మన్ విజయానంద రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. 

           ఈ సందర్భంగా *ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ...* ముఖ్యమంత్రి రాష్టంలోని వెనుకబడిన వర్గాలైన ఎస్సి, ఎస్టి, బిసి, మైనారిటీలను ఉప ముఖ్యమంత్రిగా చేసి రాజకీయ సమానత్వం కల్పించారని, ముఖ్యమంత్రికి పాదాభివందనాలు తెలిపారు. రాష్ట్రంలో అభివృద్ధి శరవేగంగా జరుగుతున్నదని, దీనిని ప్రజలందరూ గుర్తించాలన్నారు. గంగాధర నెల్లూరు నియోజకవర్గానికి నిధులు మంజూరు చేసి ఎన్టిఆర్ జలాశయంలోని నీటితో చెరువులను నింపే కార్యక్రమం చేపట్టడం జరిగిందన్నారు. నవరత్నాల ద్వారా ప్రజలకు అనేక సంక్షేమ పథకాలను ప్రవేశ పెట్టారని, ఇందులో భాగంగా ఇల్లు లేని నిరుపేదలకు ఇల్లు నిర్మించి ఇచ్చే కార్యక్రమం చేపడుతున్నామన్నారు. ప్రజలకొరకు నిరంతరం శ్రమించే ముఖ్యమంత్రిని ప్రజలందరూ పెద్ద మనసుతో ఆశీర్వదించాలని కోరారు. 

    

                 *చిత్తూరు ఎంపి మాట్లాడుతూ...* ఉప ముఖ్యమంత్రి చేతుల మీదుగా పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించుకోవడం చాలా ఆనందంగా ఉందని తెలిపారు. ముఖ్యమంత్రి పాదయాత్ర లో చెప్పిన విధంగా రాష్ట్రంలోని అక్క చెల్లెమ్మలకు స్వయం సహాయక సంఘాలలో గల దాదాపు రూ. 26 వేల కోట్ల రుణాలను చెల్లించే కార్యక్రమం చేస్తున్నారని, ఇందులో రూ.19.50 వేల కోట్లు చెల్లించడం జరిగిందని, సున్నా వడ్డీతో రుణాలు మంజూరు చేసారని, వారి పిల్లలకు అమ్మఒడి, విద్యాదీవెన, వసతి దీవెన వంటి పథకాలను అమలు చేశారని తెలిపారు. చదువుకున్న విద్యావంతులకు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నారని తెలిపారు. రైతులకు రైతు భరోసా అందజేస్తున్నారని, ఆర్బికె ల ద్వారా రైతులకు అవసరమైన అవగాహన కల్పిస్తున్నారని, అవ్వాతాతలకు పించన్లు అందిస్తున్నారన్నారు. 


              *జెడ్పి చైర్మన్ మాట్లాడుతూ...* సంక్షేమం ఒక కన్నుగా ముఖ్యమంత్రి ప్రతి నెలా  సంక్షేమ పథకాల అమలులో భాగంగా డిబిటి ద్వారా లబ్దిదారులకు ఆర్ధిక సహాయం చేయడం జరుగుతున్నదని, అభివృద్ధి మరో కన్నుగా సచివాలయాలు, ఆర్ బి కె లు, హెల్త్ క్లినిక్ ల ఏర్పాటు చేయడం జరిగిందని, నాడు నేడు ద్వారా పాఠశాలలు, ఆసుపత్రులను బాగు చేసుకున్నామని, ఆరోగ్యశ్రీ ద్వారా పేదలకు ఉచిత వైద్యం అందజేయడం జరుగుతున్నదన్నారు. విద్యా విధానంలో సమూల మార్పులు తీసుకువచ్చి విద్యలో భారత దేశంలో మొదటిస్థానం పొందే విధంగా ముఖ్యమంత్రి కృషి చేస్తున్నారన్నారు. విద్యాభ్యాసంలో నూతన ఒరవడితో జాతీయ విద్యా విధానాన్ని ప్రవేశపెట్టి సి బి ఎస్ ఈ సిలబస్, ఇంగ్లీష్ మీడియంలో విద్యాభాసం ప్రవేశపెట్టారని, ప్రతి సబ్జెక్టుకు ఒక టీచర్ ను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఫ్యామిలీ ఫిజిషియన్ విధానం ప్రవేశపెట్టి 104 వాహనం ద్వారా ప్రతి 15 రోజులకు ఒకసారి వైద్యులు గ్రామాలను సందర్శించి వైద్యం అందించి, ఉచితంగా మందులు అందజేయడం జరుగుతున్నదన్నారు. ఎల్ కె జి నుండి పి జి వరకు పూర్తి స్థాయి విద్య అందించడం జరుగుతున్నదన్నారు. 


             *ఏపిఎస్ ఆర్టిసి వైస్ చైర్మన్ మాట్లాడుతూ...* ఉప ముఖ్యమంత్రి గంగాధర నెల్లూరు నియోజకవర్గం అభివృద్ధికి కట్టుబడి ఉన్నారన్నారని, నియోజకవర్గ ప్రజలే ఆయనకు దేవుళ్ళుగా భావిస్తారని అన్నారు. 


*వెదురుకుప్పం మండలం లో ప్రారంభోత్సవ వివరాలు:* 


1. జడ్పీ నిధులతో రూ.50 లక్షలతో నిర్మించిన వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి కాంప్లెక్స్.. 


2. రూ.40 లక్షలతో నిర్మించిన సి.ఆర్. కండ్రిగ సిసి డ్రైన్ నిర్మాణo 


3 .రూ.3 లక్షల తో   కమ్యూనిటీ సానిటరీ కాంప్లెక్స్ 


4 .రూ.22 లక్షలతో ఎ ఎ డబ్ల్యు  సిసి డ్రైన్ నిర్మాణం.. 


5. జల జీవన్ మిషన్ కింద రూ.25.30 లక్షల తో నిర్మించిన రక్షిత మంచి నీటి పథకం.. 


6 .రూ.21.80 లక్షల తో నిర్మించిన డా.వై.ఎస్.ఆర్. రైతు భరోసా కేంద్రం.. 


7.రూ.4 లక్షల తో నిర్మించినకానాల వారి ఇండ్లు కు సిమెంట్ రోడ్డు.. 


8 రూ.19.90 లక్షల తో రక్షిత మంచి నీటి పథకం 



ఈ సమావేశంలో జడ్పీ సిఈఓ ప్రభాకర్ రెడ్డి, సమగ్రశిక్ష ఎపిసి వెంకట రమణారెడ్డి, పి ఆర్ డిఈ చంద్రశేఖర్ రెడ్డి, తహసీల్దార్ లక్ష్మీనారాయణ, ఎంపిడిఓ సుధాకర్, ఎంపిపి నాగరాణి, జడ్పీటీసీ సుకుమార్, సర్పంచ్ శిల్ప, ప్రజా ప్రతినిధులు, సంబంధింత జిల్లా అధికారులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.    

      

Comments
Popular posts
దసరా నవరాత్రులు: కనకదుర్గమ్మ తొమ్మిది రోజులు అలంకరణ రూపాలు ... విజయవాడ, ఇంద్రకీలాద్రి (prajaamaravati), అక్టోబరు 18 :- దసరా శరన్నవరాత్రులు హిందువులకు ఒక ముఖ్యమైన పండుగ. ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుండి ఆశ్వయుజ శుద్ధ నవమి వరకు తొమ్మిది రోజులు దేవీ నవరాత్రులు పదవ రోజు విజయ దశమి కలసి దసరా అంటారు. ఇది ముఖ్యముగా శక్తి ఆరాధనకు ప్రాధాన్యత ఇచ్చే పండుగ. ఈ పండుగకు నవరాత్రి, శరన్నవరాత్రి అనీ కూడా అంటారు. శరదృతువు ఆరంభంలో వచ్చే పండుగ కనుక ఈ పేరు వచ్చింది. కొందరు ఈ పండుగకు మొదటి మూడు రోజులు పార్వతిదేవికి తరువాతి మూడు రోజుల లక్ష్మీ దేవికి తరువాతి మూడురోజులు సరస్వతి దేవికి పూజలు నిర్వహిస్తారు. ఈ సమయంలో పూజలో విద్యార్ధులు తమ పుస్తకాలను ఉంచుతారు. ఇలా చేస్తే విద్యాభ్యాసంలో విజయం లభిస్తుందని విశ్వసిస్తారు. సామాన్యులే కాక యోగులు నవరాత్రులలో అమ్మవారిని పూజిస్తారు. ముఖ్యముగా శాక్తేయులు దీనిని ఆచరిస్తారు. బొమ్మల కొలువు పెట్టడం ఒక ఆనవాయితీ. ఆలయాలలో అమ్మవారికి ఒక్కోరోజు ఒక్కో అలంకారం చేస్తారు. ఈ తొమ్మిది రోజుల్లో అమ్మవారిని తొమ్మిది రూపాల్లో పూజిస్తూ ఉంటారు. లోకకల్యాణం కోసం అమ్మవారు ఒక్కోరోజు ఒక్కో రూపాన్ని ధరించింది. అందువలన అలా అమ్మవారు అవతరించిన రోజున, ఆ రూపంతో అమ్మవారిని అలంకరించి ఆ నామంతో ఆరాధిస్తూ ఉంటారు. ఇంద్రకీలాద్రిపై వేంచేసి యున్న శ్రీ కనకదుర్గమ్మావారు మొదటి రోజు శ్రీ స్వర్ణకవచాలంకృత శ్రీ దుర్గాదేవిగా రెండవ రోజు బాలాత్రిపుర సుందరి మూడవ రోజు గాయత్రి దేవిగా, నాల్గవ రోజు అన్నపూర్ణ దేవిగా ఐదవరోజు శ్రీ సర్వస్వతి దేవిగా ఆరవ రోజు శ్రీ లలిత త్రిపుర సుందరీ దేవిగా, ఏడవ రోజు శ్రీ మహలక్ష్మీదేవిగా, ఎనిమిదవ రోజు దుర్గాదేవి మరియు మహిషాసుర మర్థిని దేవిగా, తొమ్మిదవ రోజు శ్రీ రాజరాజేశ్వరి దేవి మొదలైన అవతార రూపాలతో దర్శనమిస్తూ భక్తులకు అమ్మవారు దర్శనమిస్తారు.ఇలా ఈ నవరాత్రుల సమయంలో ఒక్కో అమ్మవారిని ఆరాధించడం వలన ఒక్కో విశేష ఫలితం లభిస్తుందని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి. నవరాత్రుల్లో బెడవాడ శ్రీకనకదుర్గమ్మ వారు వివిధ అలంకారాలతో భక్తుల కోర్కేలను తీర్చు చల్లని తల్లిగా దర్శనమిస్తారు.. 1. దుర్గాదేవి అలకారం ః శరన్నవరాత్రి మహోత్సవాల్లో శ్రీ కనకదుర్గమ్మవారు శ్రీ స్వర్ణకవచాలంకృత శ్రీ దుర్గాదేవిగా దర్శినమిచ్చి భక్తులకు ఆయురారోగ్య ఐశ్వర్యాలను కలుగుజేస్తారు. 2. శ్రీ బాలాత్రిపుర సుందరి: ఫత్రిపురాత్రయంలో శ్రీ బాలాత్రి పుర సుందరీదేవి ప్రథమ స్థానంలో ఉంది. ఆమె ఎంతో మహిమాన్వితమైన ది. సమస్త దేవీ మంత్రాలలోకెల్లా శ్రీ బాలా మంత్రం గొప్పది. సకల శక్తి పూజలకు మూలమైన శ్రీ బాలాదేవి జగన్మోహనాకారాన్ని పవిత్రమైన శరన్నవరాత్రుల్లో దర్శించి, ఆమె అనుగ్రహాన్ని పొందితే, సంవత్సరం పొడుగునా అమ్మవారికి చేసే పూజలన్నీ సత్వర ఫలితాలనిస్తాయి. 3. శ్రీ గాయత్రి దేవి అలంకారం: ముక్తా విద్రుమ హేమనీల ధవల వర్థాలలతో ప్రకాశిస్తు, పంచ ముఖాలతో దర్శనమిస్తుంది. సంధ్యావందనం అధి దేవత . గాయత్రి మంత్రం రెండు రకాలు: 1. లఘు గాయత్రి మంత్రం 2. బ్రుహద్గాయత్రి మంత్రం. ప్రతి రోజూ త్రిసంధ్యా సమయంల్లో వేయి సార్లు గాయత్రి మంత్రంని పఠిస్తే వాక్సుద్ది కలుగుతుంది. 4. శ్రీ అన్నపూర్ణేశ్వరి దేవి: నాల్గవ రోజున నిత్యాన్నదానేశ్వరి శ్రీ అన్నపూర్ణా దేవి అలంకారం అన్నం జీవుల మనుగడకు ఆదారం. జీవకోటి నశించకుండా వారణాసి క్షేత్రాన్ని నిజ క్షేత్రంగా, క్షేత్ర అధినాయకుడు విశ్వేశ్వరుడి ప్రియపత్నిగా శ్రీ అన్నపూర్ణా దేవి విరాజిల్లుతుంది. 5. శ్రీ మహా సరస్వతీ దేవి: ఐదవ రోజున చదువుల తల్లి సరస్వతీ దేవి అలంకారం త్రి శక్తులలో ఒక మహాశక్తి శ్రీ సరస్వతీ దేవి. సరస్వతీ దేవి సప్తరూపాలలో ఉంటుందని మేరు తంత్రంలో చెప్పబడింది . అవి చింతామని సరస్వతి, జ్ఝాన సరస్వతి, నిల సరస్వతి, ఘట సరస్వతి, కిణి సరస్వతి, అంతరిక్ష సరస్వతి, మరియు మహా సరస్వతి. మహా సరస్వతి దేవి శుంభని శుంభులనే రాక్షసులను వధించింది. ..2 ..2.. 6. శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవివేవి : 6వ రోజున త్రిపురాత్రయంలో రెండో శక్తి శ్రీ లలితా దేవి అలంకారం. త్రిమూర్తులకన్నా ముందు నుండి ఉన్నది కాబట్టి, త్రిపుర సుందరి అని పిలవబడుతుంది. శ్రీచక్ర ఆదిష్టాన శక్తి, పంచదశాక్షరి అదిష్టాన దేవత. ఆదిశంకరాచార్యులు శ్రీ చక్రయంత్రాన్ని ప్రతిష్టించక పూర్వం ఈ దేవి ఉగ్ర రూపిణిగా ‘చండీదేవి'గా పిలవబడేది. ఆది శంకరాచార్యలు శ్ీర చక్రయంత్రాన్ని ప్రతి ష్టించాక పరమశాతం రూపిణిగా లలితా దేవిగా పిలవబడుతున్నది. 7. శ్రీ మహాలక్ష్మి తేది : 7వ రోజున మంగళ ప్రద దేవత శ్రీ మహాలక్ష్మీ దేవి అలంకారం అష్టరూపాలతో అష్ట సిద్దులు ప్రసాదించే దేవత. రెండు చేతులలో కమలాలని ధరించి, వరదాభయ హస్తాల్ని ప్రదర్శిస్తూ, పద్మాసనిగా దర్శనిమిస్తుంది. ఆది పరాశక్తి మహాకాళీ, మహాలక్ష్మీ, మహా సరస్వతి రూపాలు ధరించింది. ఆ ఆదిపరాశక్తి రూపంగానే మహాలక్ష్మీ అలంకారం జరుగుతుంది. 8. శ్రీ దుర్గా దేవి అలంకారం: దుర్గతులను నాశనం చేసే శ్రీ దుర్గా దేవి అలంకరాం రురుకుమారుడైన ‘దుర్గముడు' అనే రాక్షసున్ని సంహరించింది అష్టమి రోజునే కనుక ఈ రోజును దుర్గాష్టమి అని, దుర్గమున్ని సంహరించిన అవతారం కనుక దేవిని ‘దుర్గా' అని పిలుస్తారు. శ్రీ మహిషాసుర మర్ధినీ దేవి అలంకారం: మహిశాసురున్ని చంపడానికి దేవతలందరూ తమ తమ శక్తులను ప్రదానం చేయగా ఏర్పడిన అవతారం ఇది. సింహాన్ని వాహనంగా ఈ దేవికి హిమవంతుడు బహుకరించాడు. సింహ వాహనంతో రాక్షస సంహారం చేసి అనంతరం ఇంద్ర కీలాద్రి పై వెలిసింది 9. శ్రీరాజరాజేశ్వరి దేవి అలంకారం: 9వరోజు అపజయం అంటే ఎరుగని శక్తి కాబట్టి ఈ మాతను ‘అపరాజిత' అంటారు. ఎల్లప్పుడు విజయాలను పొందుతుంది కాబట్టి‘విజయ' అని కూడా అంటారు. శ్రీ రాజరాజేశ్వరి దేవి ఎప్పుడూ శ్రీ మహా పరమేశ్వరుడి అంకముపై ఆసీనురాలై భక్తులకు దర్శనమిస్తుందని పురాణ ఇతి హాసారు వెల్లడిస్తున్నాయి. -
Image
గాజువాక జర్నలిస్టుల వినతిని సీఎం జగన్మోహనరెడ్డి దృష్టికి తీసుకువెళ్తా
Image
మహిళల ఆర్థిక స్వావలంబనే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం
Image
శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం, ఇంద్రకీలాద్రి
Image
Kvik Fitness Arena " జిమ్ సెంటర్
Image