వెనుకబడిన వర్గాలకు రాజకీయ సమానత్వం కల్పించిన మహనీయుడు వై.యస్.జగన్ మోహన్ రెడ్డి.



*వెనుకబడిన వర్గాలకు రాజకీయ సమానత్వం కల్పించిన మహనీయుడు వై.యస్.జగన్ మోహన్ రెడ్డి


*


*వై.యస్.జగన్ మోహన్ రెడ్డి పరిపాలనలో రాష్ట్రం రామరాజ్యాన్ని తలపిస్తున్నది* 


                                                                                               *: ఉప ముఖ్యమంత్రి*


*రైతులకు వెన్నుదన్నుగా ముఖ్యమంత్రి* 


*జీడి నెల్లూరు నియోజకవర్గంలో అభివృద్ధి పథంలో పయనింపజేస్తున్న ఉప ముఖ్యమంత్రి*


                                                                        *: చిత్తూరు ఎంపి* 


*ప్రతి నెలా ఒక సంక్షేమ పథకాల అమలులో భాగంగా డిబిటి ద్వారా లబ్దిదారులకు ఆర్ధిక సహాయం చేస్తున్న ముఖ్యమంత్రి*


*అభివృద్ధి, సంక్షేమం ప్రధాన ధ్యేయంగా పాలన సాగిస్తున్న ముఖ్యమంత్రి*


                                                                  *: జెడ్ పి చైర్మన్*


*అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాల లబ్ధి*


                                                          *: ఏపీఎస్ఆర్టీసీ వైస్ చైర్మన్*


వెదురుకుప్పం, జూలై 10 (ప్రజా అమరావతి );


రాష్ట్రం లో వెనుకబడిన వర్గాలకు రాజకీయ సమానత్వం కల్పించిన మహనీయుడు వై.యస్.జగన్ మోహన్ రెడ్డి అని ఉప ముఖ్యమంత్రి కె. నారాయణ స్వామి కొనియాడారు.



సోమవారం వెదురుకుప్పం మండల కేంద్రంలో పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాలకు ముఖ్య అతిథిగా పాల్గొన్న ఉప ముఖ్యమంత్రితో పాటు చిత్తూరు ఎం పి ఎన్.రెడ్డెప్ప, జెడ్ పి చైర్మన్ గోవిందప్ప శ్రీనివాసులు, ఏ పి ఎస్ ఆర్ టి సి వైస్ చైర్మన్ విజయానంద రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. 

           ఈ సందర్భంగా *ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ...* ముఖ్యమంత్రి రాష్టంలోని వెనుకబడిన వర్గాలైన ఎస్సి, ఎస్టి, బిసి, మైనారిటీలను ఉప ముఖ్యమంత్రిగా చేసి రాజకీయ సమానత్వం కల్పించారని, ముఖ్యమంత్రికి పాదాభివందనాలు తెలిపారు. రాష్ట్రంలో అభివృద్ధి శరవేగంగా జరుగుతున్నదని, దీనిని ప్రజలందరూ గుర్తించాలన్నారు. గంగాధర నెల్లూరు నియోజకవర్గానికి నిధులు మంజూరు చేసి ఎన్టిఆర్ జలాశయంలోని నీటితో చెరువులను నింపే కార్యక్రమం చేపట్టడం జరిగిందన్నారు. నవరత్నాల ద్వారా ప్రజలకు అనేక సంక్షేమ పథకాలను ప్రవేశ పెట్టారని, ఇందులో భాగంగా ఇల్లు లేని నిరుపేదలకు ఇల్లు నిర్మించి ఇచ్చే కార్యక్రమం చేపడుతున్నామన్నారు. ప్రజలకొరకు నిరంతరం శ్రమించే ముఖ్యమంత్రిని ప్రజలందరూ పెద్ద మనసుతో ఆశీర్వదించాలని కోరారు. 

    

                 *చిత్తూరు ఎంపి మాట్లాడుతూ...* ఉప ముఖ్యమంత్రి చేతుల మీదుగా పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించుకోవడం చాలా ఆనందంగా ఉందని తెలిపారు. ముఖ్యమంత్రి పాదయాత్ర లో చెప్పిన విధంగా రాష్ట్రంలోని అక్క చెల్లెమ్మలకు స్వయం సహాయక సంఘాలలో గల దాదాపు రూ. 26 వేల కోట్ల రుణాలను చెల్లించే కార్యక్రమం చేస్తున్నారని, ఇందులో రూ.19.50 వేల కోట్లు చెల్లించడం జరిగిందని, సున్నా వడ్డీతో రుణాలు మంజూరు చేసారని, వారి పిల్లలకు అమ్మఒడి, విద్యాదీవెన, వసతి దీవెన వంటి పథకాలను అమలు చేశారని తెలిపారు. చదువుకున్న విద్యావంతులకు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నారని తెలిపారు. రైతులకు రైతు భరోసా అందజేస్తున్నారని, ఆర్బికె ల ద్వారా రైతులకు అవసరమైన అవగాహన కల్పిస్తున్నారని, అవ్వాతాతలకు పించన్లు అందిస్తున్నారన్నారు. 


              *జెడ్పి చైర్మన్ మాట్లాడుతూ...* సంక్షేమం ఒక కన్నుగా ముఖ్యమంత్రి ప్రతి నెలా  సంక్షేమ పథకాల అమలులో భాగంగా డిబిటి ద్వారా లబ్దిదారులకు ఆర్ధిక సహాయం చేయడం జరుగుతున్నదని, అభివృద్ధి మరో కన్నుగా సచివాలయాలు, ఆర్ బి కె లు, హెల్త్ క్లినిక్ ల ఏర్పాటు చేయడం జరిగిందని, నాడు నేడు ద్వారా పాఠశాలలు, ఆసుపత్రులను బాగు చేసుకున్నామని, ఆరోగ్యశ్రీ ద్వారా పేదలకు ఉచిత వైద్యం అందజేయడం జరుగుతున్నదన్నారు. విద్యా విధానంలో సమూల మార్పులు తీసుకువచ్చి విద్యలో భారత దేశంలో మొదటిస్థానం పొందే విధంగా ముఖ్యమంత్రి కృషి చేస్తున్నారన్నారు. విద్యాభ్యాసంలో నూతన ఒరవడితో జాతీయ విద్యా విధానాన్ని ప్రవేశపెట్టి సి బి ఎస్ ఈ సిలబస్, ఇంగ్లీష్ మీడియంలో విద్యాభాసం ప్రవేశపెట్టారని, ప్రతి సబ్జెక్టుకు ఒక టీచర్ ను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఫ్యామిలీ ఫిజిషియన్ విధానం ప్రవేశపెట్టి 104 వాహనం ద్వారా ప్రతి 15 రోజులకు ఒకసారి వైద్యులు గ్రామాలను సందర్శించి వైద్యం అందించి, ఉచితంగా మందులు అందజేయడం జరుగుతున్నదన్నారు. ఎల్ కె జి నుండి పి జి వరకు పూర్తి స్థాయి విద్య అందించడం జరుగుతున్నదన్నారు. 


             *ఏపిఎస్ ఆర్టిసి వైస్ చైర్మన్ మాట్లాడుతూ...* ఉప ముఖ్యమంత్రి గంగాధర నెల్లూరు నియోజకవర్గం అభివృద్ధికి కట్టుబడి ఉన్నారన్నారని, నియోజకవర్గ ప్రజలే ఆయనకు దేవుళ్ళుగా భావిస్తారని అన్నారు. 


*వెదురుకుప్పం మండలం లో ప్రారంభోత్సవ వివరాలు:* 


1. జడ్పీ నిధులతో రూ.50 లక్షలతో నిర్మించిన వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి కాంప్లెక్స్.. 


2. రూ.40 లక్షలతో నిర్మించిన సి.ఆర్. కండ్రిగ సిసి డ్రైన్ నిర్మాణo 


3 .రూ.3 లక్షల తో   కమ్యూనిటీ సానిటరీ కాంప్లెక్స్ 


4 .రూ.22 లక్షలతో ఎ ఎ డబ్ల్యు  సిసి డ్రైన్ నిర్మాణం.. 


5. జల జీవన్ మిషన్ కింద రూ.25.30 లక్షల తో నిర్మించిన రక్షిత మంచి నీటి పథకం.. 


6 .రూ.21.80 లక్షల తో నిర్మించిన డా.వై.ఎస్.ఆర్. రైతు భరోసా కేంద్రం.. 


7.రూ.4 లక్షల తో నిర్మించినకానాల వారి ఇండ్లు కు సిమెంట్ రోడ్డు.. 


8 రూ.19.90 లక్షల తో రక్షిత మంచి నీటి పథకం 



ఈ సమావేశంలో జడ్పీ సిఈఓ ప్రభాకర్ రెడ్డి, సమగ్రశిక్ష ఎపిసి వెంకట రమణారెడ్డి, పి ఆర్ డిఈ చంద్రశేఖర్ రెడ్డి, తహసీల్దార్ లక్ష్మీనారాయణ, ఎంపిడిఓ సుధాకర్, ఎంపిపి నాగరాణి, జడ్పీటీసీ సుకుమార్, సర్పంచ్ శిల్ప, ప్రజా ప్రతినిధులు, సంబంధింత జిల్లా అధికారులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.    

      

Comments