సెప్టెంబర్ నుంచి అన్ని జిల్లాల్లో ఫోర్టిఫైడ్ బియ్యం సరఫరా.


సెప్టెంబర్  నుంచి అన్ని జిల్లాల్లో ఫోర్టిఫైడ్ బియ్యం సరఫరా




ఫోర్టిఫైడ్ రైస్ ను ప్లాస్టిక్ బియ్యంగా అపోహపడవద్దు

ఫోర్టిఫైడ్ రైస్ లో పోషకాలు అధికం

అవగాహన కోసం ప్రభుత్వం విస్తృత ప్రచారం

రాగులు, జొన్నలు రాష్ట్రవ్యాప్తంగా త్వరలో పంపిణీ

వచ్చే సీజన్ లో 50 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ

- రాష్ట్ర పౌర సరఫరాల శాఖామాత్యులు కారుమూరి వెంకట నాగేశ్వరరావు

విజయవాడ (ప్రజా అమరావతి): రాష్ట్ర ప్రభుత్వం సెప్టెంబర్ నుంచి ఫోర్టిఫైడ్ బియ్యంను అన్ని జిల్లాల్లో పీడీఎస్, ఎండీఎం, ఐసీడీఎస్ ల ద్వారా పంపిణీ చేయనున్నామని రాష్ట్ర పౌర సరఫరాల శాఖామాత్యులు కారుమూరి వెంకట నాగేశ్వరరావు తెలిపారు. రాష్ట్ర పౌర సరఫరాల శాఖా కార్యాలయంలో గురువారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు మాట్లాడుతూ  ఫోర్టిఫైడ్ బియ్యం లో ఐరన్, పోలిక్ ఆమ్లం, బి12 ఉంటాయని, వీటి వలన ఐరన్ రక్తహీనతను నిరోధిస్తుందని, ఫోలిక్ ఆమ్లం రక్తం ఏర్పడటానికి సహయపడుతుందని, బి12 విటమిన్ తో నాడీ వ్యవస్థ పనితీరు మెరుగుపడుతుందని వివరించారు. ఫోర్టిఫైడ్ రైస్ కెర్నల్స్ ను సాధారణ బియ్యంలో 1:100 నిష్పత్తిలో కలపటం వల్లన పోషక బియ్యం తయారవుతుందన్నారు. ఈ బియ్యం గర్భిణీలు, బాలింతలు, చిన్నారులు ఎక్కువగా తీసుకోవాలని సూచించారు. ఫోర్టిఫైడ్ బియ్యంతో శరీరానికి పోషకాలు అందటమే కాకుండ విటమిన్స్ అందుతాయని తెలిపారు. ఫోర్టిఫైడ్ బియ్యం వండటానికి నీళ్లలో కలిపినప్పుడు అవి నీటిపై తేలటంతో ప్లాస్టిక్ అని అవగాహన లేని కొందరు అపోహపడుతున్నారని మంత్రి అన్నారు. మరికొంత మంది కావాలని ప్రభుత్వం ప్లాస్టిక్ బియ్యం సరఫరా చేస్తుందని సామాజిక మాధ్యమాల్లో ట్రోలింగ్ చేస్తున్నారని ఇది మంచి పద్దతి కాదని హితవు పలికారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మహోన్నత ఆశయంతో రాష్ట్ర ప్రజలకు ఆరోగ్యం చేకూర్చటానికి ఫోర్టిఫైడ్ బియ్యం పంపిణీ చేస్తున్నారని చెప్పారు. ఇప్పటికే ఫైలట్ ప్రాజెక్ట్ గా  ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో పంపిణీ చేస్తుండగా ఇకపై రాష్ట్రవ్యాప్తంగా పీడీఎస్, ఎండీఎం, ఐసీడీఎస్ ద్వారా అందించనున్నట్లు చెప్పారు. దేశంలో ఫోర్టిఫైడ్ బియ్యం పంపిణీ చేస్తున్న రాష్ట్రాల్లో మన రాష్ట్రం మొదటి స్థానంలో ఉందన్నారు.  ఈ నెల నుంచి ఐసీడీఎస్ ద్వారా గర్భిణీలకు, బాలింతలకు 3 కేజీల పోషక బియ్యం ప్యాకెట్లను ఇంటికే రేషన్ పథకం కింద పంపిణీ చేస్తున్నామని మంత్రి తెలిపారు. 

                   ఫోర్టిఫైడ్ బియ్యంపై అవగాహన పెంచటానికి ప్రభుత్వం ఇప్పటికే పోస్టర్లు తయారు చేయటం జరిగిందని, అంతేకాకుండా ప్రముఖ క్రీడాకారిణి పీవీ సింధు తో విడియో కూడా రూపొందించి ప్రచారం నిర్వహించనున్నామని చెప్పారు. విస్తృత ప్రచారం వలన ప్రజల్లో అవగాహన పెంచుతామన్నారు.  ఫోర్టిఫైడ్ బియ్యంతో పాటు రేషన్ దుకాణాల్లో ఫోర్టిఫైడ్ కెర్నల్స్ కలిపిన గోదుమపిండి కూడా అందించటానికి ఏర్పాట్లు చేస్తున్నామని, ఇందుకు సంబంధించి త్వరలో టెండర్లు కూడా పిలవనున్నట్లు తెలిపారు. బలవర్ధకమైన ఫోర్టిఫైడ్ బియ్యం ప్రతి ఒక్కరూ తీసుకుని అందరూ ఆరోగ్యంగా ఉండాలన్నదే ప్రభుత్వ లక్ష్యమన్నారు. 

             ఫోర్టిఫైడ్ బియ్యం ప్లాస్టిక్ బియ్యం అనే అనుమానాలు తీరాలంటే మెడికల్ షాపుల్లో దొరికే అయోడిన్ ను తెచ్చి ఫోర్టిఫైడ్ బియ్యంపై వేస్తే నీలం రంగులోకి మారతాయని వివరించారు. ప్లాస్టిక్ అయితే రంగు మారవు అని అన్నారు. అలాగే నీళ్లలో నానబెట్టినప్పడు ఫోర్టిఫైడ్ బియ్యం త్వరగా మెత్తబడతాయని, ప్లాస్టిక్ మెత్తబడదన్నారు. ఈ విషయాన్ని పాత్రికేయుల సమావేశంలో ప్రయోగాత్మకంగా మంత్రి చేసి చూపించారు. ఫోర్టిఫైడ్ బియ్యంను పంజాబ్, హర్యానా, మహారాష్ట్ర తదితర రాష్ట్రాలతో పాటు మన రాష్ట్రంలోనూ తయారు చేస్తున్నట్లు మంత్రి వివరించారు.        

          రాయలసీమ జిల్లాల్లో రేషన్ పంపిణీలో బియ్యంతో పాటు రాగులు, జొన్నలు అందిస్తున్నామని, ఇకపై రాష్ట్రవ్యాప్తంగా పంపిణీ చేయనున్నామని మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు పేర్కోన్నారు. వచ్చే సీజన్ లో 50 లక్షల మెట్రిక్ టన్నులు ధాన్యం సేకరించాలని లక్ష్యంగా నిర్ణయించుకున్నట్లు చెప్పారు. ధాన్యం రైతులకు 5లేదా6 రోజుల్లో నగదు జమచేస్తామని హామి ఇచ్చారు. దళారీలకు అస్కారం లేకుండా కొనుగోళ్లు ఉంటాయన్నారు. సమావేశంలో పౌర సరఫరాల కమిషనర్ హెచ్. అరుణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. 


Comments
Popular posts
దసరా నవరాత్రులు: కనకదుర్గమ్మ తొమ్మిది రోజులు అలంకరణ రూపాలు ... విజయవాడ, ఇంద్రకీలాద్రి (prajaamaravati), అక్టోబరు 18 :- దసరా శరన్నవరాత్రులు హిందువులకు ఒక ముఖ్యమైన పండుగ. ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుండి ఆశ్వయుజ శుద్ధ నవమి వరకు తొమ్మిది రోజులు దేవీ నవరాత్రులు పదవ రోజు విజయ దశమి కలసి దసరా అంటారు. ఇది ముఖ్యముగా శక్తి ఆరాధనకు ప్రాధాన్యత ఇచ్చే పండుగ. ఈ పండుగకు నవరాత్రి, శరన్నవరాత్రి అనీ కూడా అంటారు. శరదృతువు ఆరంభంలో వచ్చే పండుగ కనుక ఈ పేరు వచ్చింది. కొందరు ఈ పండుగకు మొదటి మూడు రోజులు పార్వతిదేవికి తరువాతి మూడు రోజుల లక్ష్మీ దేవికి తరువాతి మూడురోజులు సరస్వతి దేవికి పూజలు నిర్వహిస్తారు. ఈ సమయంలో పూజలో విద్యార్ధులు తమ పుస్తకాలను ఉంచుతారు. ఇలా చేస్తే విద్యాభ్యాసంలో విజయం లభిస్తుందని విశ్వసిస్తారు. సామాన్యులే కాక యోగులు నవరాత్రులలో అమ్మవారిని పూజిస్తారు. ముఖ్యముగా శాక్తేయులు దీనిని ఆచరిస్తారు. బొమ్మల కొలువు పెట్టడం ఒక ఆనవాయితీ. ఆలయాలలో అమ్మవారికి ఒక్కోరోజు ఒక్కో అలంకారం చేస్తారు. ఈ తొమ్మిది రోజుల్లో అమ్మవారిని తొమ్మిది రూపాల్లో పూజిస్తూ ఉంటారు. లోకకల్యాణం కోసం అమ్మవారు ఒక్కోరోజు ఒక్కో రూపాన్ని ధరించింది. అందువలన అలా అమ్మవారు అవతరించిన రోజున, ఆ రూపంతో అమ్మవారిని అలంకరించి ఆ నామంతో ఆరాధిస్తూ ఉంటారు. ఇంద్రకీలాద్రిపై వేంచేసి యున్న శ్రీ కనకదుర్గమ్మావారు మొదటి రోజు శ్రీ స్వర్ణకవచాలంకృత శ్రీ దుర్గాదేవిగా రెండవ రోజు బాలాత్రిపుర సుందరి మూడవ రోజు గాయత్రి దేవిగా, నాల్గవ రోజు అన్నపూర్ణ దేవిగా ఐదవరోజు శ్రీ సర్వస్వతి దేవిగా ఆరవ రోజు శ్రీ లలిత త్రిపుర సుందరీ దేవిగా, ఏడవ రోజు శ్రీ మహలక్ష్మీదేవిగా, ఎనిమిదవ రోజు దుర్గాదేవి మరియు మహిషాసుర మర్థిని దేవిగా, తొమ్మిదవ రోజు శ్రీ రాజరాజేశ్వరి దేవి మొదలైన అవతార రూపాలతో దర్శనమిస్తూ భక్తులకు అమ్మవారు దర్శనమిస్తారు.ఇలా ఈ నవరాత్రుల సమయంలో ఒక్కో అమ్మవారిని ఆరాధించడం వలన ఒక్కో విశేష ఫలితం లభిస్తుందని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి. నవరాత్రుల్లో బెడవాడ శ్రీకనకదుర్గమ్మ వారు వివిధ అలంకారాలతో భక్తుల కోర్కేలను తీర్చు చల్లని తల్లిగా దర్శనమిస్తారు.. 1. దుర్గాదేవి అలకారం ః శరన్నవరాత్రి మహోత్సవాల్లో శ్రీ కనకదుర్గమ్మవారు శ్రీ స్వర్ణకవచాలంకృత శ్రీ దుర్గాదేవిగా దర్శినమిచ్చి భక్తులకు ఆయురారోగ్య ఐశ్వర్యాలను కలుగుజేస్తారు. 2. శ్రీ బాలాత్రిపుర సుందరి: ఫత్రిపురాత్రయంలో శ్రీ బాలాత్రి పుర సుందరీదేవి ప్రథమ స్థానంలో ఉంది. ఆమె ఎంతో మహిమాన్వితమైన ది. సమస్త దేవీ మంత్రాలలోకెల్లా శ్రీ బాలా మంత్రం గొప్పది. సకల శక్తి పూజలకు మూలమైన శ్రీ బాలాదేవి జగన్మోహనాకారాన్ని పవిత్రమైన శరన్నవరాత్రుల్లో దర్శించి, ఆమె అనుగ్రహాన్ని పొందితే, సంవత్సరం పొడుగునా అమ్మవారికి చేసే పూజలన్నీ సత్వర ఫలితాలనిస్తాయి. 3. శ్రీ గాయత్రి దేవి అలంకారం: ముక్తా విద్రుమ హేమనీల ధవల వర్థాలలతో ప్రకాశిస్తు, పంచ ముఖాలతో దర్శనమిస్తుంది. సంధ్యావందనం అధి దేవత . గాయత్రి మంత్రం రెండు రకాలు: 1. లఘు గాయత్రి మంత్రం 2. బ్రుహద్గాయత్రి మంత్రం. ప్రతి రోజూ త్రిసంధ్యా సమయంల్లో వేయి సార్లు గాయత్రి మంత్రంని పఠిస్తే వాక్సుద్ది కలుగుతుంది. 4. శ్రీ అన్నపూర్ణేశ్వరి దేవి: నాల్గవ రోజున నిత్యాన్నదానేశ్వరి శ్రీ అన్నపూర్ణా దేవి అలంకారం అన్నం జీవుల మనుగడకు ఆదారం. జీవకోటి నశించకుండా వారణాసి క్షేత్రాన్ని నిజ క్షేత్రంగా, క్షేత్ర అధినాయకుడు విశ్వేశ్వరుడి ప్రియపత్నిగా శ్రీ అన్నపూర్ణా దేవి విరాజిల్లుతుంది. 5. శ్రీ మహా సరస్వతీ దేవి: ఐదవ రోజున చదువుల తల్లి సరస్వతీ దేవి అలంకారం త్రి శక్తులలో ఒక మహాశక్తి శ్రీ సరస్వతీ దేవి. సరస్వతీ దేవి సప్తరూపాలలో ఉంటుందని మేరు తంత్రంలో చెప్పబడింది . అవి చింతామని సరస్వతి, జ్ఝాన సరస్వతి, నిల సరస్వతి, ఘట సరస్వతి, కిణి సరస్వతి, అంతరిక్ష సరస్వతి, మరియు మహా సరస్వతి. మహా సరస్వతి దేవి శుంభని శుంభులనే రాక్షసులను వధించింది. ..2 ..2.. 6. శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవివేవి : 6వ రోజున త్రిపురాత్రయంలో రెండో శక్తి శ్రీ లలితా దేవి అలంకారం. త్రిమూర్తులకన్నా ముందు నుండి ఉన్నది కాబట్టి, త్రిపుర సుందరి అని పిలవబడుతుంది. శ్రీచక్ర ఆదిష్టాన శక్తి, పంచదశాక్షరి అదిష్టాన దేవత. ఆదిశంకరాచార్యులు శ్రీ చక్రయంత్రాన్ని ప్రతిష్టించక పూర్వం ఈ దేవి ఉగ్ర రూపిణిగా ‘చండీదేవి'గా పిలవబడేది. ఆది శంకరాచార్యలు శ్ీర చక్రయంత్రాన్ని ప్రతి ష్టించాక పరమశాతం రూపిణిగా లలితా దేవిగా పిలవబడుతున్నది. 7. శ్రీ మహాలక్ష్మి తేది : 7వ రోజున మంగళ ప్రద దేవత శ్రీ మహాలక్ష్మీ దేవి అలంకారం అష్టరూపాలతో అష్ట సిద్దులు ప్రసాదించే దేవత. రెండు చేతులలో కమలాలని ధరించి, వరదాభయ హస్తాల్ని ప్రదర్శిస్తూ, పద్మాసనిగా దర్శనిమిస్తుంది. ఆది పరాశక్తి మహాకాళీ, మహాలక్ష్మీ, మహా సరస్వతి రూపాలు ధరించింది. ఆ ఆదిపరాశక్తి రూపంగానే మహాలక్ష్మీ అలంకారం జరుగుతుంది. 8. శ్రీ దుర్గా దేవి అలంకారం: దుర్గతులను నాశనం చేసే శ్రీ దుర్గా దేవి అలంకరాం రురుకుమారుడైన ‘దుర్గముడు' అనే రాక్షసున్ని సంహరించింది అష్టమి రోజునే కనుక ఈ రోజును దుర్గాష్టమి అని, దుర్గమున్ని సంహరించిన అవతారం కనుక దేవిని ‘దుర్గా' అని పిలుస్తారు. శ్రీ మహిషాసుర మర్ధినీ దేవి అలంకారం: మహిశాసురున్ని చంపడానికి దేవతలందరూ తమ తమ శక్తులను ప్రదానం చేయగా ఏర్పడిన అవతారం ఇది. సింహాన్ని వాహనంగా ఈ దేవికి హిమవంతుడు బహుకరించాడు. సింహ వాహనంతో రాక్షస సంహారం చేసి అనంతరం ఇంద్ర కీలాద్రి పై వెలిసింది 9. శ్రీరాజరాజేశ్వరి దేవి అలంకారం: 9వరోజు అపజయం అంటే ఎరుగని శక్తి కాబట్టి ఈ మాతను ‘అపరాజిత' అంటారు. ఎల్లప్పుడు విజయాలను పొందుతుంది కాబట్టి‘విజయ' అని కూడా అంటారు. శ్రీ రాజరాజేశ్వరి దేవి ఎప్పుడూ శ్రీ మహా పరమేశ్వరుడి అంకముపై ఆసీనురాలై భక్తులకు దర్శనమిస్తుందని పురాణ ఇతి హాసారు వెల్లడిస్తున్నాయి. -
Image
గాజువాక జర్నలిస్టుల వినతిని సీఎం జగన్మోహనరెడ్డి దృష్టికి తీసుకువెళ్తా
Image
మహిళల ఆర్థిక స్వావలంబనే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం
Image
శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం, ఇంద్రకీలాద్రి
Image
Kvik Fitness Arena " జిమ్ సెంటర్
Image