రాష్ట్ర జీవనాడికి జీవం లేకుండా చేశారు.

 పోలవరం  (ప్రజా అమరావతి);


*మూడు గంటలపాటు పోలవరం ప్రాజెక్ట్ వద్ద చంద్రబాబు నాయుడు పర్యటన*


*ప్రాజెక్ట్ వద్ద సీఎం జగన్ కు సెల్ఫీ ఛాలెంజ్ విసిరి, ఎంతపనులు చేశారో చెప్పాలని సవాల్* 


*నేటి ప్రాజెక్ట్ దుస్థితి పై చంద్రబాబు నాయుడు అవేదన*


*అడుగడుగునా ప్రభుత్వ నిర్లక్ష్యం పై ఆగ్రహం*


*తప్పుడు నిర్ణయాలతో పోలవరాన్ని నాశనం చేసిన జగన్ ను చరిత్ర క్షమించదు*


*రాష్ట్ర జీవనాడికి జీవం లేకుండా చేశారు


*


*ప్రాజెక్ట్ ఎత్తు 41.15 మీటర్లు అనే చర్చ ఎందుకు వస్తుంది?*


*194 టీఎంసీలు ఉండాల్సిన ప్రాజెక్ట్ లో 60...70 టీంఎసీలు నిల్వచేస్తే ఎవరికి ఉపయోగం?*


*నిర్వాసితులకు జగన్ చేసిన హామీలు ఎప్పుడు నెరవేరుస్తారు?*


*జరిగిన నష్టాన్ని ప్రభుత్వం ఎంత దాస్తే, ప్రాజెక్టుకు అంతనష్టం*


మీడియా సమావేశం లో చంద్రబాబు నాయుడు:-

                                                                                                                                                               

• పోలవరం రాష్ట్రానికి లైఫ్ లైన్.. ఇది దెబ్బతింటే వీళ్లకు బాధ్యత లేదా? బాధ్యతారాహిత్యంతో రాష్ట్రానికి జీవంలేకుండా చేశారు. జరిగింది దాచి పెట్టి అబద్ధాలు చెప్పకండి.. వాస్తవాలు చెప్పండి. మీరు ఎంత దాస్తే అంత నష్టం జరుగుతుంది తప్ప ఎవరికీ ఉపయోగంలేదు. సముద్రంలోకి పోయే వృథా నీటిని ఒడిసిపట్టి, రాష్ట్రమంతా పారించి పైర్లకు జీవం పోయాలని భావిస్తే, ప్రాజెక్టునే నిర్జీవంగా మార్చారు. 

• వీళ్లు వచ్చాక 22లక్షల క్యూసెక్కుల వరద వస్తే, దాన్ని నియంత్రించలేక నీటిని నిర్మాణాలపైకి వదిలేశారు. సుడిగుండంలా ఏర్పడిన నీటి ప్రవాహా నికి డయాఫ్రమ్ వాల్ దెబ్బతిన్నది. మొత్తం నీటి ప్రవాహమే మారిపోయిం ది. 

• దెబ్బతిన్న డయాఫ్రమ్ వాల్ కొత్తది నిర్మిస్తారా? రిపేర్లు చేస్తారా? రిపేర్ చేయాలంటే 85 మీటర్ల లోతుకి వెళ్లాలని బావర్ కంపెనీ చెబుతుంది. అక్కడి నుంచి మీరు సక్రమంగా చేస్తారో లేదో తెలియదు..మీరు చేసేదానికి మేం గ్యారంటీ ఇవ్వలేమంటున్నారు. అంటే రూ.400 కోట్లతో చేసిన నిర్మా ణానికి గ్యారంటీ లేకుండా చేశారు. కొత్తడయాఫ్రమ్ వాల్ నిర్మాణానికి కేంద్రం ఒప్పుకోవాలి. అలానే కాంట్రాక్ట్ సంస్థ ముందుకురావాలి. అది అవు తుందని వీళ్లు చెప్పగలరా?  

• ఇప్పుడు జరిగిన నష్టంతో 41.15 మీటర్ల ఎత్తులో కట్టినా, 45.74 మీటర్ల ఎత్తులో కట్టినా ఉపయోగంలేదు. ముఖ్యమంత్రి ఎక్కడో ఉండి కూనిరాగా లు తీయడం కాదు. తప్పించుకోవడానికి ప్రయత్నిస్తున్న ముఖ్యమంత్రి 60,. 70 టీఎంసీలు మాత్రమే నిల్వచేస్తానంటున్నాడు. ఎవరికి ఉపయో గం? 194 టీఎంసీల సామర్థ్యాన్ని అంతతగ్గిస్తే రాష్ట్రానికి ఏం ఉపయోగం? 

జగన్ రెడ్డి తప్పిదాలు.. చేతగానితనం...పిచ్చిచేష్టలతో ప్రాజెక్ట్ నాశనమైంది

 ఇది చాలా సున్నితమైన ప్రాజెక్ట్. మొత్తం పైన అంతా అడవులే. అడవుల్లో పడే వర్షపునీరు అంతా ఇక్కడికే చేరుతుంది. అలాం టి ప్రాజెక్టుని ఇలాచేస్తే ఉభయగోదావరి జిల్లాల పరిస్థితి ఏమిటి? ఇప్పుడు తాత్కాలికంగా తనపై పడిన ముద్ర నుంచి తప్పించుకోవచ్చు. 

• నువ్వు చేసిన తప్పిదాలు, నీ చేతగానితనం, నీ పిచ్చిచేష్టలతో ప్రాజెక్ట్ నాశనమైంది. నిన్నటివరకు పోలవరం వరం అనుకుంటే ఇలాచేసి శాపంగా మార్చాడు. ప్రాజెక్ట్ చూడటానికి వస్తే అధికారులు చూపించడంలేదు. నాకు ప్రాజెక్ట్ నిర్మాణంపై పూర్తి అవగాహన ఉంది. 

• నంగనాచిగా మాట్లాడి తప్పించుకునే ప్రయత్నం చేయవద్దండి. 41.15 మీటర్లకు ఎత్తు తగ్గించాలనే ఆలోచన  ఈ ముఖ్యమంత్రికి ఎందుకు వచ్చింది? ప్రాజెక్ట్ నిర్మాణానికి కేంద్రమే డబ్బులివ్వాలి. నాలుగేళ్లు అయ్యింది.. నిర్వాసితులకు ఎన్నిఇళ్లు కట్టారు... ఎంత పరిహారం ఇచ్చారు? ఎంత భూమి సేకరించి, ఎంత మందికి ఆర్ అండ్  ఆర్ ఇచ్చారు.  ఈరోజు నేను వస్తున్నానని తెలిసి హాడావిడిగా కొంతమందికి ఆర్ అండ్ ఆర్ ఇచ్చారు. 

• నేను యుద్ధభేరి ఎందుకు ప్రకటించానో అర్థంచేసుకోండి. ఇదంతా చూశాక మీరే అర్థంచేసుకోవాలి.

 ఎకరాకు రూ.19 లక్షలు ఇస్తానన్నాడు.. ఇప్పుడు దానిపై మాట్లాడడు. 

• ల్యాండ్ అక్విజేషన్, ఆర్ అండ్ ఆర్, ఇళ్ల నిర్మాణానికే రఫ్ గా రూ.26వేల కోట్ల ఖర్చు అవుతుంది. మరి రూ.20 వేలకోట్లతో ఎలా పూర్తవుతుంది?  ఎకరాకు 19లక్షల పరిహారం ఇస్తానన్నప్పుడు ఎంత అవుతుందో తెలియ దా? ఇతను చేసినదానికి బాధితులు ఏడుస్తున్నారు. 

• వారంతా ముక్తకంఠంతో ఒకటే అంటున్నారు.. 41.15 మీటర్లకు ఇక్కడుం డే వారు ఎవరూ ఒప్పుకోవడంలేదు. అన్ని ఊళ్లకు వెళ్లి వాళ్లనే అడుగుదాం .. ముఖ్యమంత్రిని రమ్మనండి.  

• ఈ ప్రభుత్వం చేతగాని ప్రభుత్వం.. అసమర్థ, దద్దమ్మ ప్రభుత్వం. రాష్ట్రాన్ని సర్వనాశనం చేయడానికే వీళ్లకు నచ్చినట్టు చేశారు. విభజనచట్టంలో పెట్టిన ప్రాజెక్టుని పూర్తిచేయలేకపోయారు. ప్రాజెక్ట్ ప్రాంతంలో ఎవరూలేరు. పవర్ ప్రాజెక్ట్ వద్ద కొంతమంది ఉంటే, కింద కొందరున్నారు. ఎక్కడా ఎలాంటి పనులు జరగడంలేదు. 

• మేం పనులు మొదలుపెట్టినప్పుడు కూడా చాలా చేశారు. నిర్వాసితుల్ని రెచ్చగొట్టారు. వాళ్ల మనుషులతో కోర్టుల్లో కేసులు వేయించారు. అయినా మొండిగా అన్నిఅడ్డంకులు అధిగమించి మొత్తం ప్రాజెక్ట్ నిర్మాణాన్ని 72 శాతం పూర్తిచేశాం.

ప్రాజెక్ట్  పరిస్థితి చూస్తుంటే కన్నీళ్లు వస్తున్నాయి.

• ఇప్పుడు ఇక్కడి పరిస్థితి చూస్తుంటే కన్నీళ్లు వస్తున్నాయి. ప్రతి ఎకరాకు నీళ్లివ్వాలి.. రాష్ట్రం బాగుండాలనే తపనతో పనులు చేపట్టిన నేను, ఈ క్షణంలో నిస్సహాయుడిగా మిగిలిపోయాను. ఏంచెప్పినా  ఒక నాయకుడి గా కచ్చితంగా చెప్పాలి. కమిట్ మెంట్ తో చెప్పాలి. 

• నాకు మోరల్ రెస్పాన్స్ బులిటీ ఉంది కాబట్టే తెలంగాణలోని 7 ముంపు మండలాలను ఏపీలో కలపాలని పట్టుబట్టాను. భవిష్యత్ లో పోలవరం జిల్లా ఏర్పాటుచేసి, ముంపు బాధితుల్ని అన్నివిధాలా ఆదుకుంటాం. 

• ఈ ప్రభుత్వం ఒక అనిశ్చిత పరిస్థితి సృష్టించింది. వదరనీటిని నియంత్రించ డానికి ఏంచేయాలో తెలియని స్థితిలో ఉన్నారు. వరదనీటికి దెబ్బతిన్నది డయాఫ్రమ్ వాల్ అయితే.. అప్పర్  కాపర్ డ్యామ్ దెబ్బతిన్నది అనడం బుద్ధి లేకుండా మాట్లాడటమే. చేతగాకపోతే దద్దమ్మలని ఒప్పుకోవాలి. 

• 2019 మే లో  అధికారంలోకి వచ్చారు.. 2020 సెప్టెంబర్లో వరద వచ్చింది. సంవత్సరం మూడునెలలు ఏంచేశారు.. పనులు చేయకుండా కథలు చెప్పారు. ఇప్పుడూ చెబుతున్నారు.

• వినేవాళ్లకు అయితే చెప్పొచ్చు. మూర్ఖులకు ఏం చెబుతాం. ఇప్పుడు మాట్లాడిన దానికి సమాధానం చెప్పకుండా రేపు  ఊరికే రంకెలేస్తారు” అని ప్రభుత్వం పై మండిపడ్డారు

Comments
Popular posts
దసరా నవరాత్రులు: కనకదుర్గమ్మ తొమ్మిది రోజులు అలంకరణ రూపాలు ... విజయవాడ, ఇంద్రకీలాద్రి (prajaamaravati), అక్టోబరు 18 :- దసరా శరన్నవరాత్రులు హిందువులకు ఒక ముఖ్యమైన పండుగ. ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుండి ఆశ్వయుజ శుద్ధ నవమి వరకు తొమ్మిది రోజులు దేవీ నవరాత్రులు పదవ రోజు విజయ దశమి కలసి దసరా అంటారు. ఇది ముఖ్యముగా శక్తి ఆరాధనకు ప్రాధాన్యత ఇచ్చే పండుగ. ఈ పండుగకు నవరాత్రి, శరన్నవరాత్రి అనీ కూడా అంటారు. శరదృతువు ఆరంభంలో వచ్చే పండుగ కనుక ఈ పేరు వచ్చింది. కొందరు ఈ పండుగకు మొదటి మూడు రోజులు పార్వతిదేవికి తరువాతి మూడు రోజుల లక్ష్మీ దేవికి తరువాతి మూడురోజులు సరస్వతి దేవికి పూజలు నిర్వహిస్తారు. ఈ సమయంలో పూజలో విద్యార్ధులు తమ పుస్తకాలను ఉంచుతారు. ఇలా చేస్తే విద్యాభ్యాసంలో విజయం లభిస్తుందని విశ్వసిస్తారు. సామాన్యులే కాక యోగులు నవరాత్రులలో అమ్మవారిని పూజిస్తారు. ముఖ్యముగా శాక్తేయులు దీనిని ఆచరిస్తారు. బొమ్మల కొలువు పెట్టడం ఒక ఆనవాయితీ. ఆలయాలలో అమ్మవారికి ఒక్కోరోజు ఒక్కో అలంకారం చేస్తారు. ఈ తొమ్మిది రోజుల్లో అమ్మవారిని తొమ్మిది రూపాల్లో పూజిస్తూ ఉంటారు. లోకకల్యాణం కోసం అమ్మవారు ఒక్కోరోజు ఒక్కో రూపాన్ని ధరించింది. అందువలన అలా అమ్మవారు అవతరించిన రోజున, ఆ రూపంతో అమ్మవారిని అలంకరించి ఆ నామంతో ఆరాధిస్తూ ఉంటారు. ఇంద్రకీలాద్రిపై వేంచేసి యున్న శ్రీ కనకదుర్గమ్మావారు మొదటి రోజు శ్రీ స్వర్ణకవచాలంకృత శ్రీ దుర్గాదేవిగా రెండవ రోజు బాలాత్రిపుర సుందరి మూడవ రోజు గాయత్రి దేవిగా, నాల్గవ రోజు అన్నపూర్ణ దేవిగా ఐదవరోజు శ్రీ సర్వస్వతి దేవిగా ఆరవ రోజు శ్రీ లలిత త్రిపుర సుందరీ దేవిగా, ఏడవ రోజు శ్రీ మహలక్ష్మీదేవిగా, ఎనిమిదవ రోజు దుర్గాదేవి మరియు మహిషాసుర మర్థిని దేవిగా, తొమ్మిదవ రోజు శ్రీ రాజరాజేశ్వరి దేవి మొదలైన అవతార రూపాలతో దర్శనమిస్తూ భక్తులకు అమ్మవారు దర్శనమిస్తారు.ఇలా ఈ నవరాత్రుల సమయంలో ఒక్కో అమ్మవారిని ఆరాధించడం వలన ఒక్కో విశేష ఫలితం లభిస్తుందని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి. నవరాత్రుల్లో బెడవాడ శ్రీకనకదుర్గమ్మ వారు వివిధ అలంకారాలతో భక్తుల కోర్కేలను తీర్చు చల్లని తల్లిగా దర్శనమిస్తారు.. 1. దుర్గాదేవి అలకారం ః శరన్నవరాత్రి మహోత్సవాల్లో శ్రీ కనకదుర్గమ్మవారు శ్రీ స్వర్ణకవచాలంకృత శ్రీ దుర్గాదేవిగా దర్శినమిచ్చి భక్తులకు ఆయురారోగ్య ఐశ్వర్యాలను కలుగుజేస్తారు. 2. శ్రీ బాలాత్రిపుర సుందరి: ఫత్రిపురాత్రయంలో శ్రీ బాలాత్రి పుర సుందరీదేవి ప్రథమ స్థానంలో ఉంది. ఆమె ఎంతో మహిమాన్వితమైన ది. సమస్త దేవీ మంత్రాలలోకెల్లా శ్రీ బాలా మంత్రం గొప్పది. సకల శక్తి పూజలకు మూలమైన శ్రీ బాలాదేవి జగన్మోహనాకారాన్ని పవిత్రమైన శరన్నవరాత్రుల్లో దర్శించి, ఆమె అనుగ్రహాన్ని పొందితే, సంవత్సరం పొడుగునా అమ్మవారికి చేసే పూజలన్నీ సత్వర ఫలితాలనిస్తాయి. 3. శ్రీ గాయత్రి దేవి అలంకారం: ముక్తా విద్రుమ హేమనీల ధవల వర్థాలలతో ప్రకాశిస్తు, పంచ ముఖాలతో దర్శనమిస్తుంది. సంధ్యావందనం అధి దేవత . గాయత్రి మంత్రం రెండు రకాలు: 1. లఘు గాయత్రి మంత్రం 2. బ్రుహద్గాయత్రి మంత్రం. ప్రతి రోజూ త్రిసంధ్యా సమయంల్లో వేయి సార్లు గాయత్రి మంత్రంని పఠిస్తే వాక్సుద్ది కలుగుతుంది. 4. శ్రీ అన్నపూర్ణేశ్వరి దేవి: నాల్గవ రోజున నిత్యాన్నదానేశ్వరి శ్రీ అన్నపూర్ణా దేవి అలంకారం అన్నం జీవుల మనుగడకు ఆదారం. జీవకోటి నశించకుండా వారణాసి క్షేత్రాన్ని నిజ క్షేత్రంగా, క్షేత్ర అధినాయకుడు విశ్వేశ్వరుడి ప్రియపత్నిగా శ్రీ అన్నపూర్ణా దేవి విరాజిల్లుతుంది. 5. శ్రీ మహా సరస్వతీ దేవి: ఐదవ రోజున చదువుల తల్లి సరస్వతీ దేవి అలంకారం త్రి శక్తులలో ఒక మహాశక్తి శ్రీ సరస్వతీ దేవి. సరస్వతీ దేవి సప్తరూపాలలో ఉంటుందని మేరు తంత్రంలో చెప్పబడింది . అవి చింతామని సరస్వతి, జ్ఝాన సరస్వతి, నిల సరస్వతి, ఘట సరస్వతి, కిణి సరస్వతి, అంతరిక్ష సరస్వతి, మరియు మహా సరస్వతి. మహా సరస్వతి దేవి శుంభని శుంభులనే రాక్షసులను వధించింది. ..2 ..2.. 6. శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవివేవి : 6వ రోజున త్రిపురాత్రయంలో రెండో శక్తి శ్రీ లలితా దేవి అలంకారం. త్రిమూర్తులకన్నా ముందు నుండి ఉన్నది కాబట్టి, త్రిపుర సుందరి అని పిలవబడుతుంది. శ్రీచక్ర ఆదిష్టాన శక్తి, పంచదశాక్షరి అదిష్టాన దేవత. ఆదిశంకరాచార్యులు శ్రీ చక్రయంత్రాన్ని ప్రతిష్టించక పూర్వం ఈ దేవి ఉగ్ర రూపిణిగా ‘చండీదేవి'గా పిలవబడేది. ఆది శంకరాచార్యలు శ్ీర చక్రయంత్రాన్ని ప్రతి ష్టించాక పరమశాతం రూపిణిగా లలితా దేవిగా పిలవబడుతున్నది. 7. శ్రీ మహాలక్ష్మి తేది : 7వ రోజున మంగళ ప్రద దేవత శ్రీ మహాలక్ష్మీ దేవి అలంకారం అష్టరూపాలతో అష్ట సిద్దులు ప్రసాదించే దేవత. రెండు చేతులలో కమలాలని ధరించి, వరదాభయ హస్తాల్ని ప్రదర్శిస్తూ, పద్మాసనిగా దర్శనిమిస్తుంది. ఆది పరాశక్తి మహాకాళీ, మహాలక్ష్మీ, మహా సరస్వతి రూపాలు ధరించింది. ఆ ఆదిపరాశక్తి రూపంగానే మహాలక్ష్మీ అలంకారం జరుగుతుంది. 8. శ్రీ దుర్గా దేవి అలంకారం: దుర్గతులను నాశనం చేసే శ్రీ దుర్గా దేవి అలంకరాం రురుకుమారుడైన ‘దుర్గముడు' అనే రాక్షసున్ని సంహరించింది అష్టమి రోజునే కనుక ఈ రోజును దుర్గాష్టమి అని, దుర్గమున్ని సంహరించిన అవతారం కనుక దేవిని ‘దుర్గా' అని పిలుస్తారు. శ్రీ మహిషాసుర మర్ధినీ దేవి అలంకారం: మహిశాసురున్ని చంపడానికి దేవతలందరూ తమ తమ శక్తులను ప్రదానం చేయగా ఏర్పడిన అవతారం ఇది. సింహాన్ని వాహనంగా ఈ దేవికి హిమవంతుడు బహుకరించాడు. సింహ వాహనంతో రాక్షస సంహారం చేసి అనంతరం ఇంద్ర కీలాద్రి పై వెలిసింది 9. శ్రీరాజరాజేశ్వరి దేవి అలంకారం: 9వరోజు అపజయం అంటే ఎరుగని శక్తి కాబట్టి ఈ మాతను ‘అపరాజిత' అంటారు. ఎల్లప్పుడు విజయాలను పొందుతుంది కాబట్టి‘విజయ' అని కూడా అంటారు. శ్రీ రాజరాజేశ్వరి దేవి ఎప్పుడూ శ్రీ మహా పరమేశ్వరుడి అంకముపై ఆసీనురాలై భక్తులకు దర్శనమిస్తుందని పురాణ ఇతి హాసారు వెల్లడిస్తున్నాయి. -
Image
గాజువాక జర్నలిస్టుల వినతిని సీఎం జగన్మోహనరెడ్డి దృష్టికి తీసుకువెళ్తా
Image
మహిళల ఆర్థిక స్వావలంబనే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం
Image
శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం, ఇంద్రకీలాద్రి
Image
Kvik Fitness Arena " జిమ్ సెంటర్
Image