అర్భన్ ఏరియాల్లోనూ సర్వే ప్రక్రియ వేగవంతం.



- జగనన్న శాశ్వత భూహక్కు-భూరక్ష పై 14వ కేబినెట్ సబ్ కమిటీ భేటీ

- సమగ్ర సర్వే పై సమీక్షించిన మంత్రులు శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, శ్రీ ధర్మాన ప్రసాదరావు 

- మొదటి దశలో 2వేల గ్రామాల్లో  విజయవంతంగా భూహక్కు పత్రాల పంపిణీ పూర్తి

- అక్టోబర్ 15 నాటికి రెండోదశ సర్వే పూర్తి చేయాలి.

- ఇప్పటికే 13,398 గ్రామాలకు సంబంధించి 12,032 గ్రామాల్లో డ్రోన్ ఫ్లై పూర్తి

- అర్భన్ ఏరియాల్లోనూ సర్వే ప్రక్రియ వేగవంతం


- రాష్ట్రంలోని 123 యుఎల్బిల్లో 15.02 లక్షల ఎకరాల్లో సర్వే చేయాల్సి ఉంది.

- దానిలో 9.44 లక్షలు ప్రాపర్టీలు, ఖాళీ స్థలాలు ఉన్నాయి. 38.19 స్ట్రక్చర్లు ఉన్నాయి. 

- 38.19 లక్షల ప్రాపర్టీల్లో 90.16 శాతం పిఓఎల్ఆర్ పూర్తి 


అమరావతి (ప్రజా అమరావతి):


అమరావతి సచివాలయంలోని మూడో బ్లాక్ లో గురువారం జగనన్న శాశ్వత భూహక్కు-భూరక్ష పథకం అమలుపై మంత్రి శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అధ్యక్షతన కేబినెట్ సబ్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మంత్రులు శ్రీ ధర్మాన ప్రసాదరావుతో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు. సమగ్ర సర్వేపై ఇప్పటి వరకు అధికారులు చేపట్టిన చర్యలపై మంత్రులు సమీక్షించారు. పథకం అమలుపై మంత్రుల కమిటీకి అధికారులు వివరాలను తెలియచేశారు. 

దేశంలోనే అత్యంత శాస్త్రీయ విధానంలో సమగ్ర భూసర్వే చేస్తున్న రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో ఉందని మంత్రులు శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, శ్రీ ధర్మాన ప్రసాదరావులు పేర్కొన్నారు. ఇప్పటికే రాష్ట్రంలో 2వేల గ్రామాల్లో జగనన్న భూహక్కు-భూరక్ష కింద సర్వేను విజయవంతంగా పూర్తి చేసి, భూహక్కు పత్రాలను కూడా జారీ చేయడం జరిగిందని తెలిపారు. రెండోదశలో భాగంగా మరో రెండువేల గ్రామాల్లో ఈ ఏడాది అక్టోబర్ 15వ తేదీ లోగా సర్వే ప్రక్రియ పూర్తి చేయాలని ఆదేశించారు. 

రాష్ట్ర వ్యాప్తంగా 13,398 గ్రామాలకు సంబంధించి 12,032 గ్రామాల్లో అంటే దాదాపు 92 శాతం డ్రోన్ ఫ్లై పూర్తయ్యిందని అన్నారు. ఆగస్టు నెలాఖరు నాటికి డ్రోన్ ఫ్లై ను నూరుశాతం పూర్తి చేయాలని ఆదేశించారు.రాష్ట్ర వ్యాప్తంగా 7వేల గ్రామాలకు సర్వే ఇమేజెస్ కూడా పంపించడం జరిగిందని, మొదటిదశలో 25.7 లక్షల సర్వే రాళ్ళను పాతి రైతులకు హద్దులను కూడా శాశ్వతంగా గుర్తించే ప్రక్రియను పూర్తి చేశామని తెలిపారు. రెండోదశకు సంబంధించి మరో 5 లక్షల సర్వే రాళ్ళు అందించాల్సి వుందని, వాటని కూడా ఎపిఎండిసి సకాలంలో సరఫరా చేసేందుకు సిద్దంగా ఉందని తెలిపారు. అలాగే మూడు, నాలుగో దశలకు సంబంధించి ఎన్ని సర్వే రాళ్ళు కావాలో ముందుగానే రెవెన్యూ, సర్వే విభాగాలు ఇండెంట్ ను అందించాలని సూచించారు. 

రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాల్లో సర్వే ప్రక్రియ వేగంగా జరుగుతోందని, దానితో పాటు అర్భన్ ప్రాంతాల్లో కూడా సర్వేను చురుగ్గా నిర్వహించాలని మంత్రులు ఆదేశించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 123 యుఎల్బిల్లో 15 లక్షల ఎకరాలకు సర్వే చేయాల్సి ఉందని అన్నారు. అర్బన్ ఏరియాలోనే 5.5 లక్షల ఎకరాలు అగ్రికల్చర్ ల్యాండ్ గా ఉందని, మిగిలిన 9.44 లక్షల ఎకరాలు అర్బన్ ఏరియా కింద ఉందని అన్నారు. ఈ మొత్తం ఏరియాలో 38.19 లక్షల ప్రాపర్టీలను సర్వే చేయాల్సి ఉందని దీనిని కూడా నిర్ధేశిత గడువులోగా పూర్తి చేయాలని మంత్రులు కోరారు.  

ఆర్వోఎఫ్ఆర్ కింద రాష్ట్రంలో అటవీభూముల్లో సాగు చేస్తున్న మూడు లక్షల ఎకరాలకు పట్టాలు ఇచ్చామన్నారు. వాటిని వెబ్ ల్యాండ్ అడంగల్ పరిధిలోకి తీసుకువచ్చి, వాటిని కూడా సమగ్ర సర్వేలో భాగం చేయబోతున్నామని అధికారులు వివరించారు. రెండు నెలల్లో ఈ ప్రక్రియను పూర్తి చేస్తామని అన్నారు. ఇదే క్రమంలో అటవీభూముల ఆక్రమణలపై కూడా సర్వే సందర్భంగా యాజమాన్య హక్కుల నిర్ధారణలో అధికారులు అప్రమత్తంగా వ్యవహరించాలని మంత్రులు సూచించారు. రెవెన్యూ, అటవీశాఖ సంయుక్త సర్వే ద్వారా హద్దులను నిర్ధారించాలని ఆదేశించారు.

ఈ సమావేశంలో సిసిఎల్ఎ జి.సాయిప్రసాద్, స్పెషల్ సిఎస్ (పట్టణాభివృద్ధి) శ్రీలక్ష్మి, గనులశాఖ స్పెషల్ సిఎస్ గోపాలకృష్ణ ద్వివేది, పిఆర్&ఆర్డీ కమిషనర్ సూర్యకుమారి, సర్వే అండ్ సెటిల్ మెంట్ కమిషనర్ సిద్దార్థ్ జైన్, ఎంఎయుడి కమిషనర్ కోటేశ్వరరావు, డిఎంజి (ఎఫ్ఎసి) డబ్ల్యు.బి.చంద్రశేఖర్  తదితరులు పాల్గొన్నారు.

Comments
Popular posts
దసరా నవరాత్రులు: కనకదుర్గమ్మ తొమ్మిది రోజులు అలంకరణ రూపాలు ... విజయవాడ, ఇంద్రకీలాద్రి (prajaamaravati), అక్టోబరు 18 :- దసరా శరన్నవరాత్రులు హిందువులకు ఒక ముఖ్యమైన పండుగ. ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుండి ఆశ్వయుజ శుద్ధ నవమి వరకు తొమ్మిది రోజులు దేవీ నవరాత్రులు పదవ రోజు విజయ దశమి కలసి దసరా అంటారు. ఇది ముఖ్యముగా శక్తి ఆరాధనకు ప్రాధాన్యత ఇచ్చే పండుగ. ఈ పండుగకు నవరాత్రి, శరన్నవరాత్రి అనీ కూడా అంటారు. శరదృతువు ఆరంభంలో వచ్చే పండుగ కనుక ఈ పేరు వచ్చింది. కొందరు ఈ పండుగకు మొదటి మూడు రోజులు పార్వతిదేవికి తరువాతి మూడు రోజుల లక్ష్మీ దేవికి తరువాతి మూడురోజులు సరస్వతి దేవికి పూజలు నిర్వహిస్తారు. ఈ సమయంలో పూజలో విద్యార్ధులు తమ పుస్తకాలను ఉంచుతారు. ఇలా చేస్తే విద్యాభ్యాసంలో విజయం లభిస్తుందని విశ్వసిస్తారు. సామాన్యులే కాక యోగులు నవరాత్రులలో అమ్మవారిని పూజిస్తారు. ముఖ్యముగా శాక్తేయులు దీనిని ఆచరిస్తారు. బొమ్మల కొలువు పెట్టడం ఒక ఆనవాయితీ. ఆలయాలలో అమ్మవారికి ఒక్కోరోజు ఒక్కో అలంకారం చేస్తారు. ఈ తొమ్మిది రోజుల్లో అమ్మవారిని తొమ్మిది రూపాల్లో పూజిస్తూ ఉంటారు. లోకకల్యాణం కోసం అమ్మవారు ఒక్కోరోజు ఒక్కో రూపాన్ని ధరించింది. అందువలన అలా అమ్మవారు అవతరించిన రోజున, ఆ రూపంతో అమ్మవారిని అలంకరించి ఆ నామంతో ఆరాధిస్తూ ఉంటారు. ఇంద్రకీలాద్రిపై వేంచేసి యున్న శ్రీ కనకదుర్గమ్మావారు మొదటి రోజు శ్రీ స్వర్ణకవచాలంకృత శ్రీ దుర్గాదేవిగా రెండవ రోజు బాలాత్రిపుర సుందరి మూడవ రోజు గాయత్రి దేవిగా, నాల్గవ రోజు అన్నపూర్ణ దేవిగా ఐదవరోజు శ్రీ సర్వస్వతి దేవిగా ఆరవ రోజు శ్రీ లలిత త్రిపుర సుందరీ దేవిగా, ఏడవ రోజు శ్రీ మహలక్ష్మీదేవిగా, ఎనిమిదవ రోజు దుర్గాదేవి మరియు మహిషాసుర మర్థిని దేవిగా, తొమ్మిదవ రోజు శ్రీ రాజరాజేశ్వరి దేవి మొదలైన అవతార రూపాలతో దర్శనమిస్తూ భక్తులకు అమ్మవారు దర్శనమిస్తారు.ఇలా ఈ నవరాత్రుల సమయంలో ఒక్కో అమ్మవారిని ఆరాధించడం వలన ఒక్కో విశేష ఫలితం లభిస్తుందని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి. నవరాత్రుల్లో బెడవాడ శ్రీకనకదుర్గమ్మ వారు వివిధ అలంకారాలతో భక్తుల కోర్కేలను తీర్చు చల్లని తల్లిగా దర్శనమిస్తారు.. 1. దుర్గాదేవి అలకారం ః శరన్నవరాత్రి మహోత్సవాల్లో శ్రీ కనకదుర్గమ్మవారు శ్రీ స్వర్ణకవచాలంకృత శ్రీ దుర్గాదేవిగా దర్శినమిచ్చి భక్తులకు ఆయురారోగ్య ఐశ్వర్యాలను కలుగుజేస్తారు. 2. శ్రీ బాలాత్రిపుర సుందరి: ఫత్రిపురాత్రయంలో శ్రీ బాలాత్రి పుర సుందరీదేవి ప్రథమ స్థానంలో ఉంది. ఆమె ఎంతో మహిమాన్వితమైన ది. సమస్త దేవీ మంత్రాలలోకెల్లా శ్రీ బాలా మంత్రం గొప్పది. సకల శక్తి పూజలకు మూలమైన శ్రీ బాలాదేవి జగన్మోహనాకారాన్ని పవిత్రమైన శరన్నవరాత్రుల్లో దర్శించి, ఆమె అనుగ్రహాన్ని పొందితే, సంవత్సరం పొడుగునా అమ్మవారికి చేసే పూజలన్నీ సత్వర ఫలితాలనిస్తాయి. 3. శ్రీ గాయత్రి దేవి అలంకారం: ముక్తా విద్రుమ హేమనీల ధవల వర్థాలలతో ప్రకాశిస్తు, పంచ ముఖాలతో దర్శనమిస్తుంది. సంధ్యావందనం అధి దేవత . గాయత్రి మంత్రం రెండు రకాలు: 1. లఘు గాయత్రి మంత్రం 2. బ్రుహద్గాయత్రి మంత్రం. ప్రతి రోజూ త్రిసంధ్యా సమయంల్లో వేయి సార్లు గాయత్రి మంత్రంని పఠిస్తే వాక్సుద్ది కలుగుతుంది. 4. శ్రీ అన్నపూర్ణేశ్వరి దేవి: నాల్గవ రోజున నిత్యాన్నదానేశ్వరి శ్రీ అన్నపూర్ణా దేవి అలంకారం అన్నం జీవుల మనుగడకు ఆదారం. జీవకోటి నశించకుండా వారణాసి క్షేత్రాన్ని నిజ క్షేత్రంగా, క్షేత్ర అధినాయకుడు విశ్వేశ్వరుడి ప్రియపత్నిగా శ్రీ అన్నపూర్ణా దేవి విరాజిల్లుతుంది. 5. శ్రీ మహా సరస్వతీ దేవి: ఐదవ రోజున చదువుల తల్లి సరస్వతీ దేవి అలంకారం త్రి శక్తులలో ఒక మహాశక్తి శ్రీ సరస్వతీ దేవి. సరస్వతీ దేవి సప్తరూపాలలో ఉంటుందని మేరు తంత్రంలో చెప్పబడింది . అవి చింతామని సరస్వతి, జ్ఝాన సరస్వతి, నిల సరస్వతి, ఘట సరస్వతి, కిణి సరస్వతి, అంతరిక్ష సరస్వతి, మరియు మహా సరస్వతి. మహా సరస్వతి దేవి శుంభని శుంభులనే రాక్షసులను వధించింది. ..2 ..2.. 6. శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవివేవి : 6వ రోజున త్రిపురాత్రయంలో రెండో శక్తి శ్రీ లలితా దేవి అలంకారం. త్రిమూర్తులకన్నా ముందు నుండి ఉన్నది కాబట్టి, త్రిపుర సుందరి అని పిలవబడుతుంది. శ్రీచక్ర ఆదిష్టాన శక్తి, పంచదశాక్షరి అదిష్టాన దేవత. ఆదిశంకరాచార్యులు శ్రీ చక్రయంత్రాన్ని ప్రతిష్టించక పూర్వం ఈ దేవి ఉగ్ర రూపిణిగా ‘చండీదేవి'గా పిలవబడేది. ఆది శంకరాచార్యలు శ్ీర చక్రయంత్రాన్ని ప్రతి ష్టించాక పరమశాతం రూపిణిగా లలితా దేవిగా పిలవబడుతున్నది. 7. శ్రీ మహాలక్ష్మి తేది : 7వ రోజున మంగళ ప్రద దేవత శ్రీ మహాలక్ష్మీ దేవి అలంకారం అష్టరూపాలతో అష్ట సిద్దులు ప్రసాదించే దేవత. రెండు చేతులలో కమలాలని ధరించి, వరదాభయ హస్తాల్ని ప్రదర్శిస్తూ, పద్మాసనిగా దర్శనిమిస్తుంది. ఆది పరాశక్తి మహాకాళీ, మహాలక్ష్మీ, మహా సరస్వతి రూపాలు ధరించింది. ఆ ఆదిపరాశక్తి రూపంగానే మహాలక్ష్మీ అలంకారం జరుగుతుంది. 8. శ్రీ దుర్గా దేవి అలంకారం: దుర్గతులను నాశనం చేసే శ్రీ దుర్గా దేవి అలంకరాం రురుకుమారుడైన ‘దుర్గముడు' అనే రాక్షసున్ని సంహరించింది అష్టమి రోజునే కనుక ఈ రోజును దుర్గాష్టమి అని, దుర్గమున్ని సంహరించిన అవతారం కనుక దేవిని ‘దుర్గా' అని పిలుస్తారు. శ్రీ మహిషాసుర మర్ధినీ దేవి అలంకారం: మహిశాసురున్ని చంపడానికి దేవతలందరూ తమ తమ శక్తులను ప్రదానం చేయగా ఏర్పడిన అవతారం ఇది. సింహాన్ని వాహనంగా ఈ దేవికి హిమవంతుడు బహుకరించాడు. సింహ వాహనంతో రాక్షస సంహారం చేసి అనంతరం ఇంద్ర కీలాద్రి పై వెలిసింది 9. శ్రీరాజరాజేశ్వరి దేవి అలంకారం: 9వరోజు అపజయం అంటే ఎరుగని శక్తి కాబట్టి ఈ మాతను ‘అపరాజిత' అంటారు. ఎల్లప్పుడు విజయాలను పొందుతుంది కాబట్టి‘విజయ' అని కూడా అంటారు. శ్రీ రాజరాజేశ్వరి దేవి ఎప్పుడూ శ్రీ మహా పరమేశ్వరుడి అంకముపై ఆసీనురాలై భక్తులకు దర్శనమిస్తుందని పురాణ ఇతి హాసారు వెల్లడిస్తున్నాయి. -
Image
గాజువాక జర్నలిస్టుల వినతిని సీఎం జగన్మోహనరెడ్డి దృష్టికి తీసుకువెళ్తా
Image
మహిళల ఆర్థిక స్వావలంబనే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం
Image
శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం, ఇంద్రకీలాద్రి
Image
Kvik Fitness Arena " జిమ్ సెంటర్
Image