స్పందన అర్జీల పరిష్కారానికి ప్రత్యేక దృష్టి సారించాలి.



మచిలీపట్నం ఆగస్టు 7 (ప్రజా అమరావతి):


స్పందన అర్జీల పరిష్కారానికి ప్రత్యేక దృష్టి సారించాల


ని జిల్లా కలెక్టర్ పి. రాజాబాబు జిల్లా అధికారులను ఆదేశించారు.


సోమవారం నగరంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ సంయుక్త కలెక్టర్ డాక్టర్ అపరాజిత సింగ్, డిఆర్ఓ ఎం వెంకటేశ్వర్లు, ఆర్డిఓ ఐ కిషోర్, కె ఆర్ ఆర్ సి ఎస్ డి సి శివ నారాయణ రెడ్డి లతో కలిసి స్పందన కార్యక్రమం నిర్వహించి పలు ప్రాంతాల ప్రజల నుండి విజ్ఞాపన పత్రాలు  స్వీకరించారు.


ఈ సందర్భంగా జిల్లా  కలెక్టర్ అర్జీదారుల సమస్యలను ఎంతో ఓపికగా ఆలకించారు.   సంబంధిత అధికారులను పిలిపించి అర్జీల పరిష్కారంపై సత్వరమే చర్యలు తీసుకోవాలని సూచించారు.


జిల్లా అధికార యంత్రాంగం మొత్తం 185 అర్జీలు స్వీకరించినది.  వాటిలో కొన్నింటి వివరాలు ఇలా ఉన్నాయి:


మచిలీపట్నం నియోజకవర్గ పరిధిలో 10 మంది దివ్యాంగులకు మంజూరైన మూడు చక్రాల మోటారు వాహనాలను పంపిణీ చేయాలని కోరుతూ వికలాంగుల హక్కుల జాతీయ వేదిక కృష్ణా జిల్లా కమిటీ కార్యదర్శి ఎన్. సత్యనారాయణ, కెవి రామమూర్తి, ఎం శివశంకరరావు, సిహెచ్ ఆదినారాయణ ప్రసాద్, తదితరులు వినతి పత్రం అందజేశారు


గూడూరు మండలం కలపటం గ్రామానికి చెందిన రైతు మాదాసు అర్జున్ రావు మాట్లాడుతూ మల్లాపూర్ కాలువ ముక్కోలు బ్రాంచ్ కు ఒక చుక్క నీరు విడుదల చేయలేదని ఫిర్యాదు చేస్తూ నీటిని విడుదల చేయాలని కోరుతూ అర్జీని అందజేశారు.


మచిలీపట్నం గ్రామ సచివాలయాలకు చెందిన సంక్షేమ, అభివృద్ధి, డేటా ప్రాసెసింగ్ సహాయకులు తమకు బూతు స్థాయి అధికారులుగా నియమించారని వివిధ రకాలుగా విధులు, ఒత్తిళ్లు వస్తున్నందున ఎన్నికల విధుల నుండి మినహాయింపు ఇవ్వాలని కోరుతూ విజ్ఞాపన పత్రం అందజేశారు.


మచిలీపట్నం సిడింబి అగ్రహారానికి చెందిన పీవీ ఫణికుమార్,  బాలాజీ మరికొందరు మాట్లాడుతూ నగరంలో మంజూరైన రెండు ఎకరాలలో  స్వాతంత్ర సమరయోధులు డాక్టర్ భోగరాజు పట్టాభి సీతారామయ్య గారి స్మారక భవనము, పరిపాలన సముదాయము నిర్మించేందుకు అవసరమైన నిరభ్యంతర ధ్రువీకరణ పత్రం ఇవ్వమని పలుమార్లు కోరినప్పటికీ మున్సిపల్ కార్పొరేషన్ ఇవ్వడం లేదని  తెలియజేస్తూ ఇప్పటికైనా తగిన చర్యలు తీసుకోవలసినదిగా విజ్ఞప్తి చేస్తూ వినతిపత్రం అందజేశారు.


రాష్ట్ర మున్సిపల్ వర్కర్స్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ కృష్ణాజిల్లా కమిటీ గౌరవాధ్యక్షులు బి సుబ్రహ్మణ్యం పలువురు కార్మికులు మాట్లాడుతూ తమకుమునిసిపల్ కాంట్రాక్టు ఔట్సోర్సింగ్  ఆప్కాస్ సిబ్బందిని  శాశ్వతం చేయాలని, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన విüవేతనం చెల్లించాలని, కనీస వేతనం 26 వేల రూపాయలు ఇవ్వాలని, సిపిఎస్ రద్దు చేసి పాత పింఛను కొనసాగించాలని, పెండింగ్ లో ఉన్న పారిశుద్ధ కార్మికుల హెల్త్ అలవెన్స్ చెల్లించాలని కోరుతూ అర్జీ అందజేశారు


కృత్తివెన్ను మండలం లక్ష్మీపురం లాకు సెంటర్ నివాసులు ఆర్ వి వి రామచంద్ర రావు, పొన్నపల్లి వెంకట నాగరాజు, సీతాల తాతాజీ మాట్లాడుతూ అసంపూర్తిగా వదిలివేసిన 216 జాతీయ రహదారి సర్వీస్ రోడ్డును తక్షణం నిర్మించేందుకు తగిన చర్యలు తీసుకొని ప్రజల ఇబ్బందులను తీర్చాలని కోరుతూ వినతి పత్రం అందజేశారు.


ఈ సందర్భంగా  కలెక్టర్ అధికారులతో మాట్లాడుతూ ప్రజలు వివిధ ప్రాంతాల నుండి ఎంతో శ్రమకోర్చి  వ్యయప్రయాసలతో జిల్లా కేంద్రానికి వస్తున్నారని స్పందన అర్జీల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించి సకాలంలో సానుకూలంగా పరిష్కరించాలన్నారు.

 ఒకవైపు రైతులు ఇబ్బంది పడుతుంటే క్షేత్రస్థాయిలో వ్యవసాయ అధికారులు స్పందన కార్యక్రమానికి రాకపోవడం సరైనది కాదని హెచ్చరిస్తూ ఇకపై పునరావృతం కాకుండా చూడాలని వ్యవసాయ శాఖ డిడి మనోహర్ కు కలెక్టర్ సూచించారు.

  

మచిలీపట్నం నియోజకవర్గంలోని దివ్యాంగులకు మంజూరైన మూడు చక్రాల మోటారు వాహనాలను ఈ వారంలోగా పంపిణీ చేయుటకు తగిన చర్యలు తీసుకుంటామని సంయుక్త కలెక్టర్ దివ్యాంగులకు తెలిపారు.


ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ వయోజన వృద్ధులు దివ్యాంగుల శాఖ ఆధ్వర్యంలో 9 మంది ట్రాన్స్ జెండర్లకు గుర్తింపు కార్డులను అందజేశారు.


ఈ కార్యక్రమంలో జడ్పీ సీఈవో జ్యోతిబసు, డి ఆర్ డి ఎ డ్వామా పిడిలు పిఎస్ఆర్ ప్రసాద్, జి వి సూర్యనారాయణ, డిపిఓ నాగేశ్వర్ నాయక్, మున్సిపల్ కమిషనర్ చంద్రయ్య, ముడా వీసి రాజ్యలక్ష్మి, డిఎం హెచ్ ఓ డాక్టర్ గీతాబాయి, డీఈవో తెహరా సుల్తానా, వృద్ధులు దివ్యాంగుల శాఖ ఏడి కామరాజు, డి సి హెచ్ ఎస్ ఇందిరా దేవి,  ఎస్సీ, బీసీ కార్పొరేషన్ ఈడీలు  చంద్రలీల, శ్రీనివాసరావు పంచాయతీరాజ్ ఎస్ ఈ విజయకుమారి తదితర జిల్లా అధికారులు పాల్గొన్నారు. 


Comments
Popular posts
దసరా నవరాత్రులు: కనకదుర్గమ్మ తొమ్మిది రోజులు అలంకరణ రూపాలు ... విజయవాడ, ఇంద్రకీలాద్రి (prajaamaravati), అక్టోబరు 18 :- దసరా శరన్నవరాత్రులు హిందువులకు ఒక ముఖ్యమైన పండుగ. ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుండి ఆశ్వయుజ శుద్ధ నవమి వరకు తొమ్మిది రోజులు దేవీ నవరాత్రులు పదవ రోజు విజయ దశమి కలసి దసరా అంటారు. ఇది ముఖ్యముగా శక్తి ఆరాధనకు ప్రాధాన్యత ఇచ్చే పండుగ. ఈ పండుగకు నవరాత్రి, శరన్నవరాత్రి అనీ కూడా అంటారు. శరదృతువు ఆరంభంలో వచ్చే పండుగ కనుక ఈ పేరు వచ్చింది. కొందరు ఈ పండుగకు మొదటి మూడు రోజులు పార్వతిదేవికి తరువాతి మూడు రోజుల లక్ష్మీ దేవికి తరువాతి మూడురోజులు సరస్వతి దేవికి పూజలు నిర్వహిస్తారు. ఈ సమయంలో పూజలో విద్యార్ధులు తమ పుస్తకాలను ఉంచుతారు. ఇలా చేస్తే విద్యాభ్యాసంలో విజయం లభిస్తుందని విశ్వసిస్తారు. సామాన్యులే కాక యోగులు నవరాత్రులలో అమ్మవారిని పూజిస్తారు. ముఖ్యముగా శాక్తేయులు దీనిని ఆచరిస్తారు. బొమ్మల కొలువు పెట్టడం ఒక ఆనవాయితీ. ఆలయాలలో అమ్మవారికి ఒక్కోరోజు ఒక్కో అలంకారం చేస్తారు. ఈ తొమ్మిది రోజుల్లో అమ్మవారిని తొమ్మిది రూపాల్లో పూజిస్తూ ఉంటారు. లోకకల్యాణం కోసం అమ్మవారు ఒక్కోరోజు ఒక్కో రూపాన్ని ధరించింది. అందువలన అలా అమ్మవారు అవతరించిన రోజున, ఆ రూపంతో అమ్మవారిని అలంకరించి ఆ నామంతో ఆరాధిస్తూ ఉంటారు. ఇంద్రకీలాద్రిపై వేంచేసి యున్న శ్రీ కనకదుర్గమ్మావారు మొదటి రోజు శ్రీ స్వర్ణకవచాలంకృత శ్రీ దుర్గాదేవిగా రెండవ రోజు బాలాత్రిపుర సుందరి మూడవ రోజు గాయత్రి దేవిగా, నాల్గవ రోజు అన్నపూర్ణ దేవిగా ఐదవరోజు శ్రీ సర్వస్వతి దేవిగా ఆరవ రోజు శ్రీ లలిత త్రిపుర సుందరీ దేవిగా, ఏడవ రోజు శ్రీ మహలక్ష్మీదేవిగా, ఎనిమిదవ రోజు దుర్గాదేవి మరియు మహిషాసుర మర్థిని దేవిగా, తొమ్మిదవ రోజు శ్రీ రాజరాజేశ్వరి దేవి మొదలైన అవతార రూపాలతో దర్శనమిస్తూ భక్తులకు అమ్మవారు దర్శనమిస్తారు.ఇలా ఈ నవరాత్రుల సమయంలో ఒక్కో అమ్మవారిని ఆరాధించడం వలన ఒక్కో విశేష ఫలితం లభిస్తుందని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి. నవరాత్రుల్లో బెడవాడ శ్రీకనకదుర్గమ్మ వారు వివిధ అలంకారాలతో భక్తుల కోర్కేలను తీర్చు చల్లని తల్లిగా దర్శనమిస్తారు.. 1. దుర్గాదేవి అలకారం ః శరన్నవరాత్రి మహోత్సవాల్లో శ్రీ కనకదుర్గమ్మవారు శ్రీ స్వర్ణకవచాలంకృత శ్రీ దుర్గాదేవిగా దర్శినమిచ్చి భక్తులకు ఆయురారోగ్య ఐశ్వర్యాలను కలుగుజేస్తారు. 2. శ్రీ బాలాత్రిపుర సుందరి: ఫత్రిపురాత్రయంలో శ్రీ బాలాత్రి పుర సుందరీదేవి ప్రథమ స్థానంలో ఉంది. ఆమె ఎంతో మహిమాన్వితమైన ది. సమస్త దేవీ మంత్రాలలోకెల్లా శ్రీ బాలా మంత్రం గొప్పది. సకల శక్తి పూజలకు మూలమైన శ్రీ బాలాదేవి జగన్మోహనాకారాన్ని పవిత్రమైన శరన్నవరాత్రుల్లో దర్శించి, ఆమె అనుగ్రహాన్ని పొందితే, సంవత్సరం పొడుగునా అమ్మవారికి చేసే పూజలన్నీ సత్వర ఫలితాలనిస్తాయి. 3. శ్రీ గాయత్రి దేవి అలంకారం: ముక్తా విద్రుమ హేమనీల ధవల వర్థాలలతో ప్రకాశిస్తు, పంచ ముఖాలతో దర్శనమిస్తుంది. సంధ్యావందనం అధి దేవత . గాయత్రి మంత్రం రెండు రకాలు: 1. లఘు గాయత్రి మంత్రం 2. బ్రుహద్గాయత్రి మంత్రం. ప్రతి రోజూ త్రిసంధ్యా సమయంల్లో వేయి సార్లు గాయత్రి మంత్రంని పఠిస్తే వాక్సుద్ది కలుగుతుంది. 4. శ్రీ అన్నపూర్ణేశ్వరి దేవి: నాల్గవ రోజున నిత్యాన్నదానేశ్వరి శ్రీ అన్నపూర్ణా దేవి అలంకారం అన్నం జీవుల మనుగడకు ఆదారం. జీవకోటి నశించకుండా వారణాసి క్షేత్రాన్ని నిజ క్షేత్రంగా, క్షేత్ర అధినాయకుడు విశ్వేశ్వరుడి ప్రియపత్నిగా శ్రీ అన్నపూర్ణా దేవి విరాజిల్లుతుంది. 5. శ్రీ మహా సరస్వతీ దేవి: ఐదవ రోజున చదువుల తల్లి సరస్వతీ దేవి అలంకారం త్రి శక్తులలో ఒక మహాశక్తి శ్రీ సరస్వతీ దేవి. సరస్వతీ దేవి సప్తరూపాలలో ఉంటుందని మేరు తంత్రంలో చెప్పబడింది . అవి చింతామని సరస్వతి, జ్ఝాన సరస్వతి, నిల సరస్వతి, ఘట సరస్వతి, కిణి సరస్వతి, అంతరిక్ష సరస్వతి, మరియు మహా సరస్వతి. మహా సరస్వతి దేవి శుంభని శుంభులనే రాక్షసులను వధించింది. ..2 ..2.. 6. శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవివేవి : 6వ రోజున త్రిపురాత్రయంలో రెండో శక్తి శ్రీ లలితా దేవి అలంకారం. త్రిమూర్తులకన్నా ముందు నుండి ఉన్నది కాబట్టి, త్రిపుర సుందరి అని పిలవబడుతుంది. శ్రీచక్ర ఆదిష్టాన శక్తి, పంచదశాక్షరి అదిష్టాన దేవత. ఆదిశంకరాచార్యులు శ్రీ చక్రయంత్రాన్ని ప్రతిష్టించక పూర్వం ఈ దేవి ఉగ్ర రూపిణిగా ‘చండీదేవి'గా పిలవబడేది. ఆది శంకరాచార్యలు శ్ీర చక్రయంత్రాన్ని ప్రతి ష్టించాక పరమశాతం రూపిణిగా లలితా దేవిగా పిలవబడుతున్నది. 7. శ్రీ మహాలక్ష్మి తేది : 7వ రోజున మంగళ ప్రద దేవత శ్రీ మహాలక్ష్మీ దేవి అలంకారం అష్టరూపాలతో అష్ట సిద్దులు ప్రసాదించే దేవత. రెండు చేతులలో కమలాలని ధరించి, వరదాభయ హస్తాల్ని ప్రదర్శిస్తూ, పద్మాసనిగా దర్శనిమిస్తుంది. ఆది పరాశక్తి మహాకాళీ, మహాలక్ష్మీ, మహా సరస్వతి రూపాలు ధరించింది. ఆ ఆదిపరాశక్తి రూపంగానే మహాలక్ష్మీ అలంకారం జరుగుతుంది. 8. శ్రీ దుర్గా దేవి అలంకారం: దుర్గతులను నాశనం చేసే శ్రీ దుర్గా దేవి అలంకరాం రురుకుమారుడైన ‘దుర్గముడు' అనే రాక్షసున్ని సంహరించింది అష్టమి రోజునే కనుక ఈ రోజును దుర్గాష్టమి అని, దుర్గమున్ని సంహరించిన అవతారం కనుక దేవిని ‘దుర్గా' అని పిలుస్తారు. శ్రీ మహిషాసుర మర్ధినీ దేవి అలంకారం: మహిశాసురున్ని చంపడానికి దేవతలందరూ తమ తమ శక్తులను ప్రదానం చేయగా ఏర్పడిన అవతారం ఇది. సింహాన్ని వాహనంగా ఈ దేవికి హిమవంతుడు బహుకరించాడు. సింహ వాహనంతో రాక్షస సంహారం చేసి అనంతరం ఇంద్ర కీలాద్రి పై వెలిసింది 9. శ్రీరాజరాజేశ్వరి దేవి అలంకారం: 9వరోజు అపజయం అంటే ఎరుగని శక్తి కాబట్టి ఈ మాతను ‘అపరాజిత' అంటారు. ఎల్లప్పుడు విజయాలను పొందుతుంది కాబట్టి‘విజయ' అని కూడా అంటారు. శ్రీ రాజరాజేశ్వరి దేవి ఎప్పుడూ శ్రీ మహా పరమేశ్వరుడి అంకముపై ఆసీనురాలై భక్తులకు దర్శనమిస్తుందని పురాణ ఇతి హాసారు వెల్లడిస్తున్నాయి. -
Image
గాజువాక జర్నలిస్టుల వినతిని సీఎం జగన్మోహనరెడ్డి దృష్టికి తీసుకువెళ్తా
Image
మహిళల ఆర్థిక స్వావలంబనే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం
Image
శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం, ఇంద్రకీలాద్రి
Image
Kvik Fitness Arena " జిమ్ సెంటర్
Image