ఆక్వా రైతులకు ప్రభుత్వం అండగా ఉంది.





- సచివాలయంలో ఆక్వా సాధికారిత కమిటీ సమావేశం

- సమావేశంలో పాల్గొన్న మంత్రులు శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, శ్రీ సీదిరి అప్పలరాజు, శ్రీ కారుమూరు నాగేశ్వరరావు

- ఆక్వా రైతులకు ప్రభుత్వం అండగా ఉంది


- సాధికారిత కమిటీ నిర్ణయాలతో ధరల స్థిరీకరణ

- రాష్ట్ర వ్యాప్తంగా 1715 ఆక్వా హబ్ లు, 111 అవుట్ లెట్లు ఏర్పాటు

- అర్హత ఉన్న ఆక్వా రైతులకు ఏటా రూ.956 కోట్ల విద్యుత్ సబ్సిడీ

- రాష్ట్రంలో డోమెస్టిక్ మార్కెట్ ను పెంచేందుకు చర్యలు

- రైతులు, ప్రాసెసింగ్ యూనిట్ల ప్రతినిధులతో చర్చించి రేట్ల ఖరారు

- ఇకపై కౌంట్ వారీగా రేట్లు అమలుకు సన్నాహాలు

- కనీసం పదిరోజుల పాటు ఆ రేటు కొనసాగుతుంది.

- ఎగుమతిదారులు నేరుగా రైతుల నుంచే కొనుగోలు చేసేలా చర్యలు

- ప్రాసెసింగ్ యూనిట్లను ప్రోత్సహించేందుకు చర్యలు

- కేజ్ కల్చర్ పైన కూడా దృష్టి సారించాలి


: సాధికారిత కమిటీ భేటీలో మంత్రులు


అమరావతి (ప్రజా అమరావతి):

ఆక్వా సాధికారిత కమిటీ ద్వారా ఆక్వా ఉత్పత్తులపై సమీక్షించి తీసుకుంటున్న నిర్ణయాల వల్ల రైతులకు మేలు జరుగుతోందని మంత్రులు శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, శ్రీ సీదిరి అప్పలరాజు, శ్రీ కారుమూరు నాగేశ్వరరావులు పేర్కొన్నారు. సచివాలయంలో గురువారం ఆక్వా సాధికారిత కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రత్యక్షంగా, పరోక్షంగా దాదాపు 60 లక్షల మందికి ఉపాధి లభిస్తోందని అన్నారు. రాష్ట్రానికి కూడా ఆక్వా ఉత్పత్తుల ద్వారా రెవెన్యూ లభిస్తోందని అన్నారు.

గతంలో ఆక్వా ఫీడ్, సీడ్ తయారీదారులు ఇష్టారాజ్యంగా రేట్లను నిర్ణయించడం, ప్రాసెసింగ్ యూనిట్లు కూడా కొనుగోలు రేట్లను తమ నియంత్రణలో ఉంచుకోవడం వల్ల ఆక్వా రైతులు నష్టపోయే పరిస్థితి ఉండేదని అన్నారు. ఈ పరిస్థితిని మార్చాలని సీఎం శ్రీ వైయస్ జగన్ గారు ఆక్వా సాధికారిత కమిటీని ఏర్పాటు చేసి, ఆక్వారంగంను ప్రోత్సహించేలా చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు. 

ఆక్వా రంగంలో రేట్లను క్రమబద్దం చేయడం ద్వారా రైతులు సంతోషంగా ఉన్నారని అన్నారు. సీడ్, ఫీడ్ రేట్లు హేతుబద్దంగా నిర్ణయించడం జరిగిందని తెలిపారు. అలాగే మధ్యదళారీల ప్రమేయాన్ని కట్టడి చేయడం, ఆక్వా రైతులు, ప్రాసెసింగ్ యూనిట్లతో సంయుక్త సమావేశాలు నిర్వహించడం వల్ల ధరలను స్థిరీకరించామని అన్నారు. ఈ సమావేశాల్లో కౌంట్ల వారీగా రేటును ఖరారు చేసి, కనీసం పదిరోజుల పాటు ఆ రేటు కొనసాగేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. 

రాష్ట్రంలో అర్హత ఉన్న ప్రతి ఆక్వారైతుకు విద్యుత్ సబ్సిడీని అందించాలని సూచించారు. ఆక్వా రైతులకు అండగా నిలిచేందుకు ప్రభుత్వం ఏటా రూ.956 కోట్లు సబ్సిడీగా ఇస్తోందని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 63,754 విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయని, ఈ-ఫిష్ సర్వే ద్వారా 46,455 కనెక్షన్లు యాక్టీవ్ గా ఉన్నట్లు గుర్తించామని అన్నారు. అర్హతే ప్రామాణికంగా అందరికీ విద్యుత్ కనెక్షన్లు మంజూరు చేస్తున్నామని, దీనిలో ఎక్కడైనా సమస్యలు ఉంటే తక్షణం అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. 

ఆక్వా ప్రాసెసింగ్ లో కేరళ, గుజరాత్ రాష్ట్రాలు ముందంజలో ఉన్నాయని, వాటిని పరిశీలించి, రాష్ట్రంలో కూడా ప్రాసెసింగ్ యూనిట్లను ప్రోత్సహించాలని సూచించారు. కేజ్ కల్చర్ ను ప్రోత్సహించేందుకు ఉన్న అవకాశాలను పరిశీలించాలని కోరారు. రాష్ట్రంలో ఎనిమిది ఫిషింగ్ హార్బర్ లను సీఎం శ్రీ వైయస్ జగన్ గారు నిర్మించేందుకు చర్యలు తీసుకున్నారని, దీని ద్వారా మెరైన్ ఆక్వా ఉత్పత్తులను పెంచుకునేందుకు చర్యలు తీసుకోవాలని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 1715 ఆక్వా హబ్ లు, 111 అవుట్ లెట్లు పనిచేస్తున్నాయని, దీనిని మరింతగా పెంచుకోవాలని అన్నారు. ఈ ఆక్వాహబ్ ల ద్వారా జరుగుతున్న టర్నోవర్ పైన కూడా నివేదికను సిద్దం చేయాలని అధికారులను ఆదేశించారు. 

ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ మరో రెండు రోజుల్లో యుఎస్ మార్కెట్లు ఓపెన్ అవుతున్నాయని, ప్రస్తుతం ఉన్న ఆక్వా రేటు మరో పది రూపాయల వరకు పెరిగే అవకాశం ఉందని అన్నారు. విదేశీ ఎగుమతుల ద్వారా దేశీయ మార్కెట్ లో ఆక్వా ఉత్పత్తులకు రేట్లు పెరుగుతాయని, దీనివల్ల రైతులకు లబ్ధి చేకూరుతుందని తెలిపారు. ఈ సమావేశంలో స్సెషల్ చీఫ్ సెక్రటరీలు నీరబ్ కుమార్ ప్రసాద్, గోపాలకృష్ణ ద్వివేది, మత్స్యశాఖ కమిషనర్ కన్నబాబు, పర్యావరణశాఖ సిఇ శివారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Comments
Popular posts
దసరా నవరాత్రులు: కనకదుర్గమ్మ తొమ్మిది రోజులు అలంకరణ రూపాలు ... విజయవాడ, ఇంద్రకీలాద్రి (prajaamaravati), అక్టోబరు 18 :- దసరా శరన్నవరాత్రులు హిందువులకు ఒక ముఖ్యమైన పండుగ. ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుండి ఆశ్వయుజ శుద్ధ నవమి వరకు తొమ్మిది రోజులు దేవీ నవరాత్రులు పదవ రోజు విజయ దశమి కలసి దసరా అంటారు. ఇది ముఖ్యముగా శక్తి ఆరాధనకు ప్రాధాన్యత ఇచ్చే పండుగ. ఈ పండుగకు నవరాత్రి, శరన్నవరాత్రి అనీ కూడా అంటారు. శరదృతువు ఆరంభంలో వచ్చే పండుగ కనుక ఈ పేరు వచ్చింది. కొందరు ఈ పండుగకు మొదటి మూడు రోజులు పార్వతిదేవికి తరువాతి మూడు రోజుల లక్ష్మీ దేవికి తరువాతి మూడురోజులు సరస్వతి దేవికి పూజలు నిర్వహిస్తారు. ఈ సమయంలో పూజలో విద్యార్ధులు తమ పుస్తకాలను ఉంచుతారు. ఇలా చేస్తే విద్యాభ్యాసంలో విజయం లభిస్తుందని విశ్వసిస్తారు. సామాన్యులే కాక యోగులు నవరాత్రులలో అమ్మవారిని పూజిస్తారు. ముఖ్యముగా శాక్తేయులు దీనిని ఆచరిస్తారు. బొమ్మల కొలువు పెట్టడం ఒక ఆనవాయితీ. ఆలయాలలో అమ్మవారికి ఒక్కోరోజు ఒక్కో అలంకారం చేస్తారు. ఈ తొమ్మిది రోజుల్లో అమ్మవారిని తొమ్మిది రూపాల్లో పూజిస్తూ ఉంటారు. లోకకల్యాణం కోసం అమ్మవారు ఒక్కోరోజు ఒక్కో రూపాన్ని ధరించింది. అందువలన అలా అమ్మవారు అవతరించిన రోజున, ఆ రూపంతో అమ్మవారిని అలంకరించి ఆ నామంతో ఆరాధిస్తూ ఉంటారు. ఇంద్రకీలాద్రిపై వేంచేసి యున్న శ్రీ కనకదుర్గమ్మావారు మొదటి రోజు శ్రీ స్వర్ణకవచాలంకృత శ్రీ దుర్గాదేవిగా రెండవ రోజు బాలాత్రిపుర సుందరి మూడవ రోజు గాయత్రి దేవిగా, నాల్గవ రోజు అన్నపూర్ణ దేవిగా ఐదవరోజు శ్రీ సర్వస్వతి దేవిగా ఆరవ రోజు శ్రీ లలిత త్రిపుర సుందరీ దేవిగా, ఏడవ రోజు శ్రీ మహలక్ష్మీదేవిగా, ఎనిమిదవ రోజు దుర్గాదేవి మరియు మహిషాసుర మర్థిని దేవిగా, తొమ్మిదవ రోజు శ్రీ రాజరాజేశ్వరి దేవి మొదలైన అవతార రూపాలతో దర్శనమిస్తూ భక్తులకు అమ్మవారు దర్శనమిస్తారు.ఇలా ఈ నవరాత్రుల సమయంలో ఒక్కో అమ్మవారిని ఆరాధించడం వలన ఒక్కో విశేష ఫలితం లభిస్తుందని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి. నవరాత్రుల్లో బెడవాడ శ్రీకనకదుర్గమ్మ వారు వివిధ అలంకారాలతో భక్తుల కోర్కేలను తీర్చు చల్లని తల్లిగా దర్శనమిస్తారు.. 1. దుర్గాదేవి అలకారం ః శరన్నవరాత్రి మహోత్సవాల్లో శ్రీ కనకదుర్గమ్మవారు శ్రీ స్వర్ణకవచాలంకృత శ్రీ దుర్గాదేవిగా దర్శినమిచ్చి భక్తులకు ఆయురారోగ్య ఐశ్వర్యాలను కలుగుజేస్తారు. 2. శ్రీ బాలాత్రిపుర సుందరి: ఫత్రిపురాత్రయంలో శ్రీ బాలాత్రి పుర సుందరీదేవి ప్రథమ స్థానంలో ఉంది. ఆమె ఎంతో మహిమాన్వితమైన ది. సమస్త దేవీ మంత్రాలలోకెల్లా శ్రీ బాలా మంత్రం గొప్పది. సకల శక్తి పూజలకు మూలమైన శ్రీ బాలాదేవి జగన్మోహనాకారాన్ని పవిత్రమైన శరన్నవరాత్రుల్లో దర్శించి, ఆమె అనుగ్రహాన్ని పొందితే, సంవత్సరం పొడుగునా అమ్మవారికి చేసే పూజలన్నీ సత్వర ఫలితాలనిస్తాయి. 3. శ్రీ గాయత్రి దేవి అలంకారం: ముక్తా విద్రుమ హేమనీల ధవల వర్థాలలతో ప్రకాశిస్తు, పంచ ముఖాలతో దర్శనమిస్తుంది. సంధ్యావందనం అధి దేవత . గాయత్రి మంత్రం రెండు రకాలు: 1. లఘు గాయత్రి మంత్రం 2. బ్రుహద్గాయత్రి మంత్రం. ప్రతి రోజూ త్రిసంధ్యా సమయంల్లో వేయి సార్లు గాయత్రి మంత్రంని పఠిస్తే వాక్సుద్ది కలుగుతుంది. 4. శ్రీ అన్నపూర్ణేశ్వరి దేవి: నాల్గవ రోజున నిత్యాన్నదానేశ్వరి శ్రీ అన్నపూర్ణా దేవి అలంకారం అన్నం జీవుల మనుగడకు ఆదారం. జీవకోటి నశించకుండా వారణాసి క్షేత్రాన్ని నిజ క్షేత్రంగా, క్షేత్ర అధినాయకుడు విశ్వేశ్వరుడి ప్రియపత్నిగా శ్రీ అన్నపూర్ణా దేవి విరాజిల్లుతుంది. 5. శ్రీ మహా సరస్వతీ దేవి: ఐదవ రోజున చదువుల తల్లి సరస్వతీ దేవి అలంకారం త్రి శక్తులలో ఒక మహాశక్తి శ్రీ సరస్వతీ దేవి. సరస్వతీ దేవి సప్తరూపాలలో ఉంటుందని మేరు తంత్రంలో చెప్పబడింది . అవి చింతామని సరస్వతి, జ్ఝాన సరస్వతి, నిల సరస్వతి, ఘట సరస్వతి, కిణి సరస్వతి, అంతరిక్ష సరస్వతి, మరియు మహా సరస్వతి. మహా సరస్వతి దేవి శుంభని శుంభులనే రాక్షసులను వధించింది. ..2 ..2.. 6. శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవివేవి : 6వ రోజున త్రిపురాత్రయంలో రెండో శక్తి శ్రీ లలితా దేవి అలంకారం. త్రిమూర్తులకన్నా ముందు నుండి ఉన్నది కాబట్టి, త్రిపుర సుందరి అని పిలవబడుతుంది. శ్రీచక్ర ఆదిష్టాన శక్తి, పంచదశాక్షరి అదిష్టాన దేవత. ఆదిశంకరాచార్యులు శ్రీ చక్రయంత్రాన్ని ప్రతిష్టించక పూర్వం ఈ దేవి ఉగ్ర రూపిణిగా ‘చండీదేవి'గా పిలవబడేది. ఆది శంకరాచార్యలు శ్ీర చక్రయంత్రాన్ని ప్రతి ష్టించాక పరమశాతం రూపిణిగా లలితా దేవిగా పిలవబడుతున్నది. 7. శ్రీ మహాలక్ష్మి తేది : 7వ రోజున మంగళ ప్రద దేవత శ్రీ మహాలక్ష్మీ దేవి అలంకారం అష్టరూపాలతో అష్ట సిద్దులు ప్రసాదించే దేవత. రెండు చేతులలో కమలాలని ధరించి, వరదాభయ హస్తాల్ని ప్రదర్శిస్తూ, పద్మాసనిగా దర్శనిమిస్తుంది. ఆది పరాశక్తి మహాకాళీ, మహాలక్ష్మీ, మహా సరస్వతి రూపాలు ధరించింది. ఆ ఆదిపరాశక్తి రూపంగానే మహాలక్ష్మీ అలంకారం జరుగుతుంది. 8. శ్రీ దుర్గా దేవి అలంకారం: దుర్గతులను నాశనం చేసే శ్రీ దుర్గా దేవి అలంకరాం రురుకుమారుడైన ‘దుర్గముడు' అనే రాక్షసున్ని సంహరించింది అష్టమి రోజునే కనుక ఈ రోజును దుర్గాష్టమి అని, దుర్గమున్ని సంహరించిన అవతారం కనుక దేవిని ‘దుర్గా' అని పిలుస్తారు. శ్రీ మహిషాసుర మర్ధినీ దేవి అలంకారం: మహిశాసురున్ని చంపడానికి దేవతలందరూ తమ తమ శక్తులను ప్రదానం చేయగా ఏర్పడిన అవతారం ఇది. సింహాన్ని వాహనంగా ఈ దేవికి హిమవంతుడు బహుకరించాడు. సింహ వాహనంతో రాక్షస సంహారం చేసి అనంతరం ఇంద్ర కీలాద్రి పై వెలిసింది 9. శ్రీరాజరాజేశ్వరి దేవి అలంకారం: 9వరోజు అపజయం అంటే ఎరుగని శక్తి కాబట్టి ఈ మాతను ‘అపరాజిత' అంటారు. ఎల్లప్పుడు విజయాలను పొందుతుంది కాబట్టి‘విజయ' అని కూడా అంటారు. శ్రీ రాజరాజేశ్వరి దేవి ఎప్పుడూ శ్రీ మహా పరమేశ్వరుడి అంకముపై ఆసీనురాలై భక్తులకు దర్శనమిస్తుందని పురాణ ఇతి హాసారు వెల్లడిస్తున్నాయి. -
Image
గాజువాక జర్నలిస్టుల వినతిని సీఎం జగన్మోహనరెడ్డి దృష్టికి తీసుకువెళ్తా
Image
మహిళల ఆర్థిక స్వావలంబనే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం
Image
శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం, ఇంద్రకీలాద్రి
Image
Kvik Fitness Arena " జిమ్ సెంటర్
Image