టీడీపీ ఇసుక మార్చ్ సక్సెస్.

 *టీడీపీ ఇసుక మార్చ్ సక్సెస్


*


*రాష్ట్ర వ్యాప్తంగా 67 క్వారీలను గుర్తించగా 44 ప్రధాన  క్వారీలలో  ‘ఇసుక సత్యాగ్రహం’ కార్యక్రమం*


*అక్రమ అరెస్టులు, గృహ నిర్భంధాలతో అడ్డుకునేందుకు కుట్ర*


*ఇసుక అనుమతులు, తవ్వకాల లెక్క తేల్చాలని టీడీపీ నేతల పట్టు*


*రాష్ట్ర వ్యాప్తంగా ‘ఇసుక సత్యాగ్రహం’ పేరుతో టీడీపీ శ్రేణుల నిరసనల హోరు*


*ఇసుక దొంగలను అరెస్టు చేసి.. ఉచిత ఇసుక విధానం తీసుకురావాలంటూ డిమాండ్*


*జగన్ రెడ్డి ఇసుక దోపిడీతో 123 వృత్తులు, వ్యాపారాలు రోడ్డున పడ్డాయి*


*40 లక్షల మంది భవన నిర్మాణ కార్మికుల నోట్లో జగన్ రెడ్డి మట్టి కొట్టాడు*

అమరావతి (ప్రజా అమరావతి);

రాష్ట్రంలో జరుగుతున్న ఇసుక అక్రమాలపై తక్షణమే ప్రభుత్వం స్పందించాలని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు 48 గంటల గడువు ఇచ్చినా ప్రభుత్వం స్పందించకపోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ శ్రేణులు రోడ్డెక్కాయి. మూడు రోజుల నిరసన కార్యక్రమాల్లో భాగంగా తొలి రోజు రాష్ట్రంలోని ఇసుక ర్యాంపుల వద్ద ప్లకార్డులు పట్టుకుని అక్రమ ఇసుక తవ్వకాలకు వ్యతిరేకంగా నిరసన తెలిపారు. కొండలను తలపించేలా ఉన్న ఇసుక గుట్ట(డంప్‌)లను పరిశీలించారు. ప్రకృతిని నాశనం చేస్తూ, పర్యావరణాన్ని విధ్వంసం చేస్తూ ఇసుక తవ్వకాలు జరిపి వాటిని బ్లాక్ మార్కెట్లో అమ్ముకోవడాన్ని తప్పుబట్టారు. అక్రమ క్వారీలకు సంబంధించిన ఆధారాలను మీడియాకు వెల్లడించారు.టెండర్లు పిలవకుండా, కొత్త ఏజెన్సీ ఎంపిక చేయకుండా, NGT విధించిన నిషేధాజ్ఞలను పట్టించుకోకుండా రాష్ట్రంలో జరుగుతున్న ఇసుక అక్రమ మైనింగ్, ఇసుక ర్యాంపులు ఏర్పాటు చేసుకుని అధిక ధరలకు ఇసుకను అమ్ముకుంటున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో ఉచితంగా ఇసుక అందిస్తే విమర్శించిన జగన్ రెడ్డి, నేడు పందికొక్కులా ఇసుక మొత్తాన్ని బొక్కేస్తున్నాడని, పేదలకు ఇసుక అందని ద్రాక్షలా తయారు చేశాడంటూ మండిపడ్డారు. దీంతో తెలుగుదేశం పార్టీ శ్రేణులు రోడ్డెక్కకుండా పోలీసులతో అడ్డుకునే ప్రయత్నం చేయడాన్ని తప్పుబట్టారు.


*అరెస్టులు, గృహ నిర్బంధాలు*


ఆమదాలవలసలో కూన రవికుమార్, నరసన్నపేటలో బగ్గు రమణమూర్తి, మచిలీపట్నంలో కొనకళ్ల నారాయణ, పెడనలో కాగిత కృష్ణప్రసాద్, పెనమలూరులో బోడె ప్రసాద్, పామర్రులో వర్ల కుమార్ రాజా, అవనిగడ్డలో మండలి బుద్ధప్రసాద్, కళ్యాణదుర్గంలో ఉమామహేశ్వర నాయుడు,  కురుపాంలో తొయ్యక జగదీశ్వరి, వేమూరులో నక్కా ఆనందబాబు, గుంటూరు పశ్చిమలో కోవెలమూడి రవీంద్ర, కోవూరులో పోలవంరెడ్డి దినేష్ రెడ్డి, జగ్గయ్యపేటలో శ్రీరాం తాతయ్య, నందిగామలో తంగిరాల సౌమ్య, విజయవాడ తూర్పులో గద్దె రామ్మోహన్‌లను కార్యక్రమానికి వెళ్తుండగా అడ్డుకున్నారు.


మైలవరంలో దేవినేని ఉమామహేశ్వరరావు, చిలకలూరిపేటలో ప్రత్తిపాటిపుల్లారావు, తాడికొండలో తెనాలి శ్రావణ్ కుమార్, పెదకూరపాడులో కొమ్మాలపాటి శ్రీధర్, తిరువూరు శావల దేవధత్, కొవ్వూరులో గొర్రెల శ్రీధర్, కంఠమనేని రామకృష్ణ, జొన్నలగడ్డ సుబ్బారాయ చౌదరిలను ముందస్తు అరెస్టు చేసి పోలీస్ స్టేషన్లకు తరలించారు. 


నెల్లూరు రూరల్‌లో కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి, కావలి నియోజకవర్గంలో మాలేపాటి సుబ్బారాయుడు, నెల్లూరు సిటీలో కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి, తెనాలిలో ఆలపాటి రాజేంద్రప్రసాద్‌ను హౌస్ అరెస్ట్ చేశారు.


రాష్ట్రంలో ఎక్కడైనా ఇసుక తవ్వకాలు చేపట్టాలంటే ముందుగా గనుల శాఖ, కాలుష్య నియంత్రణ మండలి నుంచి అనుమతులు తీసుకుని, వాటిని పరిశీలించి కేంద్ర ఆధీనంలో ఉండే స్టేట్ లెవల్ ఎన్విరాన్‌మెంట్ ఇంపాక్ట్ అసైస్‌మెంట్ అథారిటీ (SIAA) ఏడాదికి మాత్రమే అనుమతిస్తుంది. ఆ నిబంధనలకు విరుద్ధంగా రాష్ట్ర ప్రభుత్వంరాష్ట్రంలోని ఇసుక రీచుల్ని మూడు జోన్లుగా విభజించి జేపీ పవర్స్ అనే సంస్థకు గంపగుత్తగా కట్టబెట్టడం ద్వారా అక్రమాలకు పాల్పడ్డారని నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో ఉచితంగా ఇసుక అందిస్తే జగన్ రెడ్డి ఇసుక మొత్తాన్ని గంపగుత్తగా చేతుల్లోకి తీసుకుని సామాన్యులు ఇసుక కొనుగోలు చేయాలంటేనే భయపడే పరిస్థితి కల్పించారన్నారు. జేపీ పవర్ వెంచర్స్ ఇసుక కాంట్రాక్టు 12.05.2023తో ముగిసింది. 06.06.2023న జీఎస్టీ నెంబర్‌ను సస్పెండ్ అయింది.అగ్రిమెంట్ ముగిసినా, జీఎస్టీ నెంబర్ సస్పెండైనా, అదే కంపెనీ పేరుతో, అదే జీఎస్టీ నెంబర్‌తో దొంగ వే బిల్లులు ఇచ్చి మరీ ఇసుక అమ్మకాలు ఎలా సాగుతున్నాయని ప్రశ్నించారు.ఈ దందా వెనుక సీఎం జగన్ రెడ్డి హస్తం ఉందన్నారు.  రీచుల్లో వే బిల్లులు, సీసీ కెమెరాలు లేకపోయినా అకారులు ఎందుకు చర్యలు తీసుకోవం లేదని నిలదీశారు.  రాష్ట్ర వ్యాప్తంగా అనుమతులున్న 110 రీచుల్లో ఏడాదికి కేవలం 77 లక్షల క్యూబిక్ మీటర్ల ఇసుక తవ్వకాలకు మాత్రమే అనుమతులున్నాయి. కానీ అనధికారికంగా సగటున ఏటా 15 కోట్ల క్యూబిక్ మీటర్ల చొప్పున ఇసుక తవ్వకాలు జరిపి నాలుగేళ్లలో 60 కోట్ల క్యూబిక్ మీటర్ల ఇసుక తవ్వేశారన్నారు. ప్రభుత్వం నిర్దేశించిన లెక్క ప్రకారం చూసుకున్నా నాలుగేళ్లలో రూ.45,750 కోట్ల విలువైన ఇసుక అమ్మకాలు జరిగాయని, ఆ సొమ్ము ఎవరి ఖాతాల్లోకి వెళ్లిందో చెప్పాలని డిమాండ్ చేశారు. తీసుకున్న అనుమతులకు, జరిగిన తవ్వకాలకు ఏమాత్రమూ పొంతన లేకుండా పోయిందన్నారు. అడ్డగోలుగా జరుగుతున్న ఇసుక తవ్వకాలతో రాష్ట్రంలో పర్యావరణ విధ్వంసం జరుగుతోందని ఎన్జీటీ ఆగ్రహం వ్యక్తం చేయడంతో పాటు జరిమానా కూడా విధించింది. సుప్రీంకోర్టు కూడా రాష్ట్రంలోని అక్రమాలపై అసహనం వ్యక్తం చేసింది అయినా ప్రభుత్వ పెద్దలు ఎందుకు నోరెత్తడం లేదని నేతలు ప్రశ్నించారు. రాష్ట్ర వ్యాప్తంగా 67  క్వారీలను గుర్తించగా 44 క్వారీలలో  ‘ఇసుక సత్యాగ్రహం’ విజయవంతంగా జరిగింది. మిగిలిన చోట్ల పోలీసులు అడ్డుకోవడంతో జరగలేదు.


పార్లమెంటు అధ్యక్షురాలు గుమ్మిడి సంధ్యారాణి, కూన రవికుమార్, పల్లా శ్రీనివాసరావు, మాజీ మంత్రులు కొండ్రు మురళీ మోహన్, బండారు సత్యన్నారాయణమూర్తి, కాలవ శ్రీనివాసులు, పరిటాల సునీత, ఎమ్మెల్యేలు గోరంట్ల బుచ్చయ్య చౌదరి, వేగుళ్ల జోగేశ్వరరావు, డోలా బాలవీరాంజనేయ స్వామి, శాసన మండలి మాజీ వైస్ ఛైర్మన్ రెడ్డి సుబ్రహ్మణ్యం, మండలి బుద్ధప్రసాద్, మాజీ ఎమ్మెల్సీ బత్యాల చెంగ్రాయుడు, మాజీ ఎమ్మెల్యేలు గిడ్డి ఈశ్వరి, వంతల రాజేశ్వరి, గుండ లక్ష్మీదేవి, కొండపల్లి అప్పలనాయుడు, కోళ్ల లలితకుమారి, గండి బాబ్జి, బండారు సత్యానందరావు, బోడే ప్రసాద్, శ్రీరాం రాజగోపాల్, పాశిం సునీల్ కుమార్, సుగుణమ్మ, ప్రభాకర్ చౌదరి, ఆర్.జితేందర్ గౌడ్, గౌరు చరితారెడ్డి,బి.సి.జనార్ధన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ బి.ఎన్.రాజసింహులు, బత్యాల చెంగల్రాయుడు, పుత్తా నరసింహారెడ్డి, 2019 ఎంపీ అభ్యర్ధి గంటి హరీష్ మాధుర్, నియోజకవర్గ ఇంఛార్జిలు గౌతు శిరీష, కోరాడ రాజబాబు, బత్తుల తాతయ్య బాబు, పి.వి.జి కుమార్, మద్దిపాటి వెంకట్రాజు, వర్ల కుమార్ రాజా, కాగిత కృష్ణ ప్రసాద్, వేగేశన నరేంద్రవర్మ, పోలంరెడ్డి దినేష్ రెడ్డి, హెలెన్, బొజ్జల సుధీర్ రెడ్డి, కలికిరి మురళీమోహన్, అమీర్ బాబు, జి.వి.ప్రవీణ్ రెడ్డి, పరిటాల శ్రీరామ్, మన్నె సుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Comments