టీడీపీ వచ్చిన తరువాత కరెంట్ చార్జీలు తగ్గిస్తాం.



అమలాపురం  (ప్రజా అమరావతి);


*భవిష్యత్ కు గ్యారెంటీ కార్యక్రమంలో భాగంగా అమలాపురంలో టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు రోడ్ షో*


రోడ్ షోలో చంద్రబాబు నాయుడు  మాట్లాడుతూ 


మూడు రోజులుగా కోనసీమ ప్రాంతంలో పర్యటిస్తున్నా.

అమలాపురం అభివృద్ది జరిగింది అంటే బాలయోగి హయాంలోనే.

యానాం ఎదుర్లంక బ్రిడ్జి, రైల్వే లైన్లు, ప్రభుత్వ భవనాలు అన్నీ బాలయోగి ఉన్నప్పుడే వచ్చాయి

పచ్చటి కోనసీమలో వైసీపీ నేడు రాజకీయ చిచ్చు పెట్టింది. 

కోనసీమలో అక్రమ కేసులతో ఇబ్బంది పెట్టారు. చివరికి ఇక్కడ ఇంటర్ నెట్ సేవలు కూడా నిలిపివేశారు. అలాంటి పరిస్థితి కారణం అయ్యింది ఈ ప్రభుత్వం

ఈ నియోజకవర్గ ఎమ్మెల్యే దళిత మంత్రికి సిఎం దగ్గర కనీస మర్యాద లేదు. 

దళితుడైన బాలయోగిని మనం లోక్ సభ స్పీకర్ ను చేశాం.

నాలుగేళ్లుగా రాష్ట్రంలో జగన్ చీకటి పాలన. ప్రజల జీవన ప్రమాణాలు పెరిగి ఉంటే నేను ఒక్క విమర్శ చేయను. కానీ అలా లేదు.

అందరి జీవితాలు నాశనం చేశారు. నిత్యవసర వస్తువలు ధరలతో మహిళలు ఇల్లు  గడపలేకపోతున్నారు.

కరెంట్ చార్జీలు 8 సార్లు పెంచారు. మన హయాంలో కరెంట్ చార్జీలుపెంచలేదు. మళ్లీ అధికారంలోకి వచ్చిన తరువాత కరెంట్ చార్జీలు తగ్గిస్తాం.

కరెంట్ సరఫరా కూడా సక్రమంగా ఉండడం లేదు. 200 వచ్చే కరెంట్ బిల్లు 1000 అయ్యింది. వెయ్యి వచ్చే బిల్లు నాలుగు వేలు 5 వేలు అయ్యింది. దీనికి కారణం ఎవరు.

ఒక అవినీతి ముఖ్యమంత్రి వల్లనే ఈ పరిస్థితి వచ్చింది. టీడీపీ వచ్చిన తరువాత కరెంట్ చార్జీలు తగ్గిస్తాం. 


జగన్ అమలాపురం వచ్చి చూడాలి. ప్రభుత్వ పనితీరుపై స్పందన తెలుస్తుంది.

మద్య నిషేదం అని చెప్పిన జగన్....అధికారంలోకి వచ్చి రేట్లు పెంచాడు.

మగవారిని తాగించి ఇంటి ఆదాయం అంతా లాగేస్తున్నాడు

మద్యం పేరులో ప్రజల రక్తం తాగే జలగ జగన్ మోహన్ రెడ్డి

మద్యం షాపుల్లో ఎందుకు గూగుల్ పే ద్వారా చెల్లింపులు తీసుకోవడం లేదు. 

అమ్మకాలు చేసిన డబ్బు అంతా ఎక్కడికి పోతుంది.

ఈ సైకో సిఎంకు మీ బలహీనత అర్థం అయ్యింది. అందుకే దోచుకుంటున్నాడు.

ఇంటిపన్ను పెంచాడు...కొత్తగా చెత్త పన్ను తెచ్చాడు. నాడుమనం సిమెంట్ రోడ్లు వేశా...వీధి దీపాలు పెట్టాం. ఇప్పుడు కనీసం రోడ్ల గోతుల రిపేర్లు కూడా చేయడం లేదు

వ్యవస్థలను నాశనం చేసిన జగన్...5 ఏళ్ల నుంచి రోడ్లు కూడా వేయలేకపోతున్నాడు

బుద్ది లేని ఈ సిఎం ప్రజలకు దెబ్బతిన్న రోడ్ల ద్వారా నరకాన్ని చూపిస్తున్నాడు

సాగు నీటి కాలువల్లో పూడిక లు తీయలేదు...లాకులకు గ్రీజ్ రాయలేదు....చివరి భూములకు నీరు కూడా రావడం లేదు

ప్రభుత్వం వ్యవస్థలను నాశనం చేయడం వల్లనే ఈ దుస్థితి

రాష్ట్రం శాశ్వితం ....ఈ ముఖ్యమంత్రి శాశ్వితం కాదు.

రాష్ట్రంలో ఇసుక మాఫియా తయారయ్యింది. ఇసుకాసురులు తయారు అయ్యారు

ఇసుక కొండలు తయారు చేశారు. అక్రమ తవ్వకాలతో ఇసుక ద్వారా కోట్లు కొల్లగొడుతున్నారు.

దేవుడు ఇచ్చిన ఇసుకను కూడా ఈ దుర్మార్గులు దోచుకుంటున్నారు. 40 లక్షల మంది ఉపాధి పోగొట్టారు

ప్రజా ప్రతినిధులుగా గెలిచింది....సేవ చేయడానికా...గుండు కొట్టించడానికా?

కలియుగ దైవం దగ్గర పులులు వస్తే భక్తులకు కర్రలు ఇస్తారట. చేతిలో కర్రచూసి పులిపారిపోతుంది అని చెపుతున్నారు.

పులిని తరమడం కాదు...ఇంటికొక కర్రపెట్టుకుని ఈ వైసీపీ వాళ్లను తరమాలి

పరిపాలన అంటే దోచుకోవడం కాదు...సేవ చేయడం

పేద వాడికి పెత్తందారుకి పోటీ అని అంటున్నాడు ఈ ముఖ్యమంత్రి. ప్రజలను పేదలను చేసి కథలు చెపుతున్నాడు

జగన్ 98 శాతం హామీలు నెరవేర్చాను అంటున్నాడు...కానీ 10 నుంచ 14 శాతం హామీలు కూడా నెరవేరలేదు

పోలవరం ప్రాజెక్టు పూర్తి అయ్యి ఉంటే గోదావరి జిల్లాల్లో మూడు పంటలకు నీళ్లు ఇచ్చేవాళ్లం.

దేశంలో ధనిక ముఖ్యమంత్రి ఈ జగన్. మళ్లీ పేదలకు న్యాయం చేస్తాను అంటాడు.

నేను నాడు 200 పెన్షన్ ను 2000 చేశాను. జగన్ 3 వేలు ఇస్తాను అన్నాడు...ఇప్పటికీ 3 వేలు చేయలేదు

జగన్ పెన్షన్ పెంచకపోవడం వల్ల ఒక్కో పెన్షన్ దారుడికి 30 వేలు నష్టం.

అన్న క్యాంటీన్ పెడితే దాన్ని జగన్ మూసేశాడు. 450 రూపాయిలతో అన్న క్యాంటీన్ తో నెల అంతా గడిచిపోయేది.

జగన్ పట్టా దారు పాసుపుస్తకాలపై తన బొమ్మ వేస్తాడు అంట. ఇది మీ అబ్బ సొమ్మా....మన తాత ముత్తాల ఆస్తిపై జగన్ బొమ్మలు ఏంటి.

నిద్ర లేవగానే ఎన్టీర్ బొమ్మ చూస్తే స్ఫూర్తి వస్తుంది. జగన్ బొమ్మ చూస్తే ఏమి వస్తుంది.

జగన్ ఇప్పుడు నా ఎస్ సిలు, నా బిసిలు అంటున్నాడు. దళితులను చంపి డోర్ డెలివరీ చేసే జగన్ మళ్లీ నా ఎస్ సిలు అంటున్నాడు

తల్లి చెల్లికి న్యాయం చేయని జగన్ ప్రజలకు న్యాయం చేస్తాడా

బాబాయిని చంపేసిన జగన్ మీ బిడ్డ కాదు....క్యాన్సర్ గడ్డ

క్యాన్సర్ గడ్డను చిత్తు చిత్తుగా ఓడించాలి. ఏమారకుండా రాష్ట్రం నుంచి పంపించాలి.

జగన్ పాలనలో ఉద్యోగాలు లేవు. జాబ్ క్యాలెండర్ లేదు. మళ్లీ జాబు రావాలి అంటే బాబు రావాలి అంటున్నాడు. అదీ మన సత్తా. అదీ మన బ్రాండు

మన సైన్యం యువత...వారి భవిష్యత్ కు నాదీ గ్యారెంటీ

నాడు ప్రత్యేక హోదా కోసం జగన్ నంగి నంగి మాటలు చెప్పాడు 25 మంది ఎంపిలు వస్తే అందరికీ ఉద్యోగాలు అన్నాడు.

మరి ప్రత్యేక హోదా తెచ్చాడా...విభజన హామీల కోసం ప్రయత్నం చేశాడా

డిల్లీలో ఒక్క సారి అయినా వైసీపీఎంపిలు రాష్ట్రం గురించి మాట్లాడారా

ఇవన్నీ ప్రశ్నిస్తే మనపై కేసులు పెడుతున్నాడు. చివరికి నా పై కూడా హత్యాయత్నం కేసు పెట్టారు

అమలాపురంలో ఒక్క అభివృద్ది పని జరిగిందా....ఈ ప్రాంతంలో ఏ కొబ్బరి రైతు అయినా అనందంగా ఉన్నాడా

జామకాయ 10 రూపాయలు...కానీ కొబ్బరి కాయ 4 రూపాయాలకు కొంటున్నారు. ఇలా అయితే రైతు ఎలా బతుకుతాడు.

టీడీపీ ప్రభుత్వం వచ్చిన తరువాత కొబ్బరి రైతాంగాన్ని ఆదుకుంటా. 

ఆక్వా రైతులు ఇప్పుడు వెంటిలేటర్ ఉన్నారు. జగన్ యూనిట్ విద్యుత్ 1.50 రూపాయలకు ఇస్తాను అన్నాడు. కానీ ఆక్వా జోన్ నాన్ ఆక్వా జోన్ అని ఆ హామీని ఎగ్గొట్టాడు. యూనిట్ 4.50 రూపాయాలు చేశాడు. రొయ్యల ఫీడ్ ధరలు పెరిగాయి. మార్కెట్ సెస్ పెరిగింది. నీటి పన్ను కూడా పెంచి ఆక్వాను నాశనం చేశాడు.

తెలుగు దేశం వచ్చిన తరవాత మళ్లీ ఆక్వా రైతులను ఆదుకుంటాం. జగన్ కు ఎక్స్ పైరీ డేట్ వచ్చింది. ఆక్వా కు టీడీపీ న్యాయం చేస్తుంది

కాటన్ నీళ్లు ఇచ్చాడు అని కాటన్ దొరను ఆదరిస్తారు. మంచి చేస్తే ఆరాధిస్తారు. చెడు చేస్తే ప్రజలు తోలు తీస్తారు. రాష్ట్రంలో ధాన్యానికి మద్దతు ధర లేదు. చివరికి గోనె సంచులు కూడా ఇవ్వలేదు

మళ్లీ టీడీపీ అధికారంలోకి వచ్చిన తరువాత రైతును రాజును చేస్తా.

మహిళల కష్టాల కోసం మహాశక్తి అనే కార్యక్రమం ప్రకటించాను. ఉచిత బస్సు ప్రయాణం, మూడు సిలిండర్లు ఉచితం గా ఇస్తా. ఆబిబిడ్డ, తల్లికి వందనం పథకాలు అమలు చేస్తా. యువతకు 20 లక్షల ఉద్యోగాలు ఇస్తా. రైతుకు అన్నదాత పథకం కింద 20 వేలు ఇస్తా. ప్రతి ఇంటికి మంచినీరు ఉచితం గా అందిస్తా. బిసిల రక్షణ కోసం ప్రత్యేక చట్టం తెస్తా. పి 4 విధానం ద్వారా పేదరికం నిర్మూలిస్తా

ప్రభుత్వ ఉద్యోగులకు, పోలీసులకు కూడా జగన్ అన్యాయం చేశాడు.  పోలీసులకు కూడా టీడీపీ వచ్చిన తరువాత న్యాయం చేస్తా

ప్రభుత్వ ఉద్యోగులకు నాడు న్యాయం చేశా....మన ప్రభుత్వ వచ్చిన తరవాత ప్రభుత్వ ఉద్యోగులను ఆదుకుంటా

స్వాతంత్ర్యం వచ్చిన తరువాత కాపులకు న్యాయం చేసిన పార్టీ టీడీపీ

కాపుల్లో పేదరికం ఉంది. అందుకే వారి కోసం కాపు కార్పొరేషన్ పెట్టాను.

కాపులకు 5 శాతం రిజర్వేషన్ ఇవ్వాలని ప్రయత్నం చేసిన పార్టీ టీడీపీ

బిసిలకు అన్యాయం జరగకుండా కాపులకు న్యాయం చేయాలి అని చూశాను.

అమలాపురం నియోజకవర్గంలో ఎమ్మెల్యే , అతని అనుచరలు అక్రమాలకు పాల్పడుతున్నారు. పేదలకు భూముల విషయంలో అక్రమాలు చేశారు.

ఇక్కడ లే అవుట్ వేయాలి అన్నా....బిల్డింగ్ కట్టాలి అన్నా జె ట్యాక్స్ కట్టాల్సిందే

ఇలాంటి అక్రమాలు ఒక ట్రెండ్ అయ్యింది. టిడ్కో ఇళ్లుకు కూడా డబ్బులు తీసుకుని ఇచ్చారు. ఇలాంటి అక్రమాలకు ఈ వైసీపీ నేతలు తెరతీశారు.

చేనేత పరిశ్రమకు నాడు మనం న్యాయం చేశాం. మళ్లీ చేనేత పరిశ్రమను ఆదుకునేది టీడీపీనే.

Comments