మచిలీపట్నం ఆగస్టు 7 (ప్రజా అమరావతి);
ఈనెల 10వ తేదీ నుండి జాతీయ నులిపురుగుల నివారణ కార్యక్రమాన్న జిల్లా వ్యాప్తంగా ముమ్మరంగా చేపట్టాల
ని జిల్లా కలెక్టర్ పి. రాజాబాబు అధికారులను ఆదేశించారు.
సోమవారం ఉదయం నగరంలోని కలెక్టరేట్లో జరిగిన స్పందన కార్యక్రమంలో వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో జాతీయ నులిపురుగుల నివారణ కార్యక్రమంపై రూపొందించిన గోడ పత్రాలను జిల్లా కలెక్టర్ ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్
మాట్లాడుతూ నులిపురుగుల నుండి పిల్లలను రక్షించేందుకు ప్రతి ఒక్కరూ నివారణ కార్యక్రమానికి తోడ్పడాలన్నారు
ఈ కార్యక్రమంలో సంయుక్త కలెక్టర్ డాక్టర్ అపరాజిత సింగ్, డి ఆర్ ఓ ఎం వెంకటేశ్వర్లు, డిఎం హెచ్ ఓ డాక్టర్ గీతాబాయి, ఆర్ డి ఓ ఐ కిషోర్, కె ఆర్ ఆర్ సి ఎస్డిసి శివ నారాయణ రెడ్డి తదితర అధికారులు పాల్గొన్నారు.
addComments
Post a Comment