అమరావతి (ప్రజా అమరావతి);
సీఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్ను కలిసిన గల్ఫ్ దేశాలకు చెందిన పలువురు ఏపీఎన్ఆర్టీఎస్ సమన్వయకర్తలు, వైఎస్ఆర్సీపీ కన్వీనర్లు.
ఏపీకి చెందిన వలస కార్మికులకు గల్ఫ్ దేశాల్లో రాష్ట్ర ప్రభుత్వం నుంచి అందుతున్న సాయం, వారికి అవసరమైన చర్యలపై చర్చించిన సీఎం శ్రీ వైఎస్ జగన్, ప్రభుత్వం నుంచి పూర్తి సహాయ సహకారాలు అందుతున్నట్లు సీఎంకి వివరించిన ఆయా దేశాలకు చెందిన ప్రతినిధులు.
ఈ సమావేశంలో పాల్గొన్న డిప్యూటీ సీఎం (మైనార్టీ వెల్ఫేర్) ఎస్.బి.అంజాద్ బాషా, ఏపీ ఎన్ఆర్టీ సొసైటీ ప్రెసిడెంట్ వెంకట్ ఎస్. మేడపాటి, కువైట్ ఏపీఎన్ఆర్టీఎస్ రీజనల్ కోఆర్డినేటర్లు నాయని మహేష్ రెడ్డి, ఎంవి నరసారెడ్డి, దుబాయ్ కోఆర్డినేటర్ సయ్యద్ నాసర్ వలీ, వైఎస్సార్సీపీ గల్ఫ్ కన్వీనర్ బిహెచ్ ఇలియాస్, కువైట్ కన్వీనర్ ముమ్మడి బాలిరెడ్డి, ఖతార్ కన్వీనర్ డి.శశికిరణ్, దుబాయ్ కన్వీనర్ సయ్యద్ అక్రమ్, సౌదీ అరేబియా కన్వీనర్ రెవెల్ ఆంథోని.
addComments
Post a Comment