నాది ధర్మపోరాటం.. నేను కొదమసింహాన్ని ఎవడు అడ్డొచ్చినా ముందుకే గానీ వెనకడుగు లేదు.



*నాది ధర్మపోరాటం.. నేను కొదమసింహాన్ని ఎవడు అడ్డొచ్చినా ముందుకే గానీ వెనకడుగు లేదు.*



*సొంతచెల్లికి వెన్నుపోటు పొడిచిన సైకో జగన్*


*బ్రో సినిమాపై ఢిల్లీకి వెళ్లడం కాదు  రాంబాబు..చేతనైతే రాయలసీమ ప్రాజెక్టులపై, పోలవరంపై ఢిల్లీకి వెళ్లు*


*కదిరి ఇసుక బెంగుళూరు, హైదరాబాద్ కు పోతోంది... కర్ణాటక మద్యం కదిరికి వస్తోంది*

                                                                                                                                                                                          *వైసీపీనేతలు కర్రలతో వస్తే కర్రలతోనే బుద్ధిచెప్పండి*


*ప్రతి ఒక్కరూ ఓటేసేటప్పుడు మీ పిల్లల భవిష్యత్ ను తలుచుకొని ఓటేయండి* 


*రోడ్ షోలో చంద్రబాబు నాయుడు ప్రసంగం:-*

కదిరి (ప్రజా అమరావతి);

“ కదిరి అదిరిపోయింది. కదిరి దద్దరిల్లితే వైసీపీ నేతల గుండెల్లో రైళ్లు పరిగెడుతు న్నాయి. కదిరిలో నా తమ్ముళ్ల ఉత్సాహం చూస్తుంటే, సంతోషంగా ఉంది. నవ యువత కదంతొక్కింది. నేను పనిచేసేది నవయువత కోసమే.


ఒకమూర్ఖుడు, దుర్మార్గుడు, పిచ్చివాడికి రాష్ట్రాన్ని అప్పగిస్తే ఏమవుతుందో చెప్పడానికే మీ ముందుకు వచ్చాను. రివర్స్ టెండరింగ్ తో అన్ని ప్రాజెక్టుల్ని పడుకోబెట్టాడు. రాష్ట్రాన్ని నాశనంచేసిన సైకో జగన్ రెడ్డికి పరిపాలించే అర్హత లేదు. 


ఒక్క అవకాశమన్నాడు.. కనిపించినవారికి ముద్దులు పెట్టాడు.. ఇప్పుడు పిడి గుద్దులు గుద్దుతున్నాడు. టీడీపీప్రభుత్వం రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టులకు రూ.68వేలకోట్లు ఖర్చుపెడితే, ఈ ప్రభుత్వం రూ.22వేలకోట్లు ఖర్చుపెట్టింది. రాయలసీమ సాగునీటి ప్రాజెక్టులకు మేం రూ.12వేలకోట్లు ఖర్చుపెడితే, వీళ్లు ముష్టి రూ.2వేలకోట్లు ఖర్చుపెట్టారు.

 

హంద్రీనీవా తెచ్చింది మనప్రియతమ నాయకుడు నందమూరి తారక రామారా వు. ఆ మహానాయకుడి దూరదృష్టిని ఆదర్శంగా తీసుకొని, రాయలసీమలోని సాగునీటి ప్రాజెక్టుల పూర్తికి నడుం బిగించాను.


జీడిపల్లి, చెర్లోపల్లి, మారాల, గొల్లపల్లి రిజర్వాయర్లు నిర్మించాము. గొల్లపల్లికి నీళ్లు ఇచ్చి కియా పరిశ్రమ తీసుకొచ్చాం. ఈ నాలుగేళ్లలో వీళ్లు ఒక్కపరిశ్రమ తెచ్చారా .. ఒక్క ఎకరాకు నీరిచ్చారా? వీళ్లా మనల్ని మాట్లాడేది?

 

ఎప్పుడు ఎన్నికలు వచ్చినా వైసీపీని చిత్తుచిత్తుగా ఓడించి, బంగాళాఖాతంలో పడేయాలి. ఆంబోతు రాంబాబు రంకెలేస్తున్నాడు. బ్రోసినిమాపై ఢిల్లీ కెళ్లడం కాదు రాంబాబు, పోలవరంకోసం ఢిల్లీ వెళ్లు. రాయలసీమ ప్రాజెక్టులకోసం వెళ్లు.

 

రాత్రింబవళ్లు కష్టపడి 72శాతం నిర్మించిన పోలవరం ప్రాజెక్టుని గోదావరిలో ముంచేసిన వీళ్లు నన్ను విమర్శిస్తున్నారు. ఈ దుర్మార్గులు వచ్చాక పోలవరం ఏమవుతుందో తెలియని పరిస్థితి. డయాఫ్రమ్ వాల్, కాపర్ డ్యామ్, గైడ్ బండ్ సహా అన్నీపోయాయి.

 

ఈ దుర్మార్గులు చేసిన పాపం రాష్ట్రద్రోహం. తెలుగుజాతికి తీరని అన్యాయం. పోలవరం పూర్తిచేసే బాధ్యత నాది. పోలవరం పూర్తిచేసి గోదావరి నీటిని రాయల సీమకు తీసుకురావాలి.

 

పైన వర్షాలు పడలేదు..మరోపక్క ఆల్మట్టి ఎత్తు పెంచుతున్నారు. తుంగభద్రపై కొత్త ప్రాజెక్టులు కడుతున్నారు. ఇలాంటి సందర్భంలో గోదావరి నీరు రాకపోతే, రాయలసీమ ఎడారి అవుతుంది. మీరు నా ఆస్తి, ఈ యువతే నా శక్తి, మిమ్మల్ని ఉపయోగించి రాష్ట్ర రూపురేఖలు మారుస్తాను.


ఇక్కడున్న తమ్ముళ్లూ మీరందరికీ ఉద్యోగం, ఉపాధి కల్పించే బాధ్యత నాది. డీఎస్సీ పెట్టాడా ... జాబ్ క్యాలెండర్ ఇచ్చాడా ఈ ముఖ్యమంత్రి. పరిశ్రమలు తీసుకొచ్చాడా? జాబురావాలంటే బాబుతోనే సాధ్యం.

 

టీడీపీప్రభుత్వం వచ్చిన వెంటనే యువతకు 20లక్షల ఉద్యోగాలిస్తాం. అనంతపు రానికి ఆగ్రోప్రాసెసింగ్ యూనిట్స్, పరిశ్రమలు తీసుకొచ్చి జిల్లా యువతకు ఉపాధి కల్పిస్తాను. కరోనా సమయంలో ఇళ్లల్లో కూర్చొని పనిచేయడం అలవాటైంది. ప్రపంచంలోని కంపెనీలతో కలిసి ఇంట్లోనే ఉండిపనిచేసే అవకాశమిస్తాను. మండ లానికి రెండు వర్క్ స్టేషన్లు పెట్టి, 10రోజులు అక్కడపనిచేసేలా చూస్తాను. అక్కడే మీకు శిక్షణ ఇప్పిస్తాను. రాష్ట్రయువత శక్తి నాకు తెలుసు.

 

ఈ రాష్ట్రాన్ని ఒక సంపన్న రాష్ట్రంగా మార్చే బాధ్యత నాది. వ్యవసాయం బాగు పడాలి. అనంతపురం జిల్లాలో ఈ సంవత్సరం వర్షాలు లేక, వర్షాధార పంటలు వే యలేదు. హంద్రీనీవా పూర్తిచేసి, ప్రతి ఎకరాకు నీళ్లిస్తాం. గాండ్లపెంట మండలంలో లిఫ్ట్ పెట్టి, చెర్లోపల్లి రిజర్వాయర్ ద్వారా కదిరి పట్టణానికి తాగునీరు అందిస్తా. నీళ్లుంటే ఈ జిల్లా రైతులు సిరులు పండిస్తారనే నమ్మకం నాకుంది.

 

రోజంతా కష్టపడి సాయంత్రం ఒక పెగ్ వేసే మందుబాబుల బలహీనతను ఈ సైకో పట్టేశాడు. ఏంచేసినా, ఏ మద్యం అమ్మినా తాగుతారులే అని కల్తీమద్యం అమ్ము తున్నాడు. దాన్ని అధికధరకు అమ్ముతూ, నగదువిక్రయాలు జరుపుతూ, ఆ సొమ్మంతా తాడేపల్లి కొంపకు చేరుస్తున్నాడు. సైకో జగన్ పుణ్యమా అని మందు బాబులు బాగా ఇబ్బంది పడుతున్నారు. కుటుంబాలు నాశనం చేస్తున్న ఈ సైకో మద్యం వ్యాపారం గురించి ఒక్కొక్కరు వందమందికి చెప్పాలి.


కదిరిలో ఇసుక దొరుకుతుందా? మీ ఊరిలో ఇసుక బెంగుళూరు, హైదరాబాద్ లో అమ్ముతున్నారు. బెంగుళూరులో తయారయ్యే నాసిరకం మద్యం మీ ఊళ్లో అమ్ముతున్నారు. ఈ మద్యం అమ్మకాల వెనకున్నది ఇక్కడి సిద్ధారెడ్డి కాదా? ఇక్కడొక సిద్ధారెడ్డి..అక్కడొక పెద్దారెడ్డి. వీళ్లు అసలు మనుషులేనా? ఇసుకతినే వీళ్లను మనుషులంటారా? కర్ణాటక మద్యం అమ్మే మిమ్మల్ని ఆ మద్యంలోనే ముంచేయాలి. బట్టలిప్పి జనంలో తిప్పాలి.  మట్కాలో.. మట్టిలో  డబ్బులు కావాలా మీకు? అడిగేవారు లేరని అరాచకాలు చేస్తారా? ఒళ్లు దగ్గరపెట్టుకోండి.. మీ రోజులు దగ్గరపడ్డాయి. మీకు ఎక్స్ పైరీ  డేట్ దగ్గరపడింది. ప్రజలు తిరగబడటాని కి సిద్ధంగా ఉన్నారు. ఎవరైనా మీ జోలికివస్తే, నన్ను తలుచుకొని ముందుకెళ్లండి . వైసీపీనేతలు కర్రలతో వస్తే, ఆ కర్రలతోనే వాళ్లకు బుద్ధిచెప్పండి. ఆడబిడ్డలకు రక్షణగా నిలవండి..రాష్ట్రాన్ని కాపాడండి. సిద్ధారెడ్డి మాయలన్నీ నాకుతెలుసు. మీరెంత మాయలఫకీర్లో తెలుసు. సోలార్ పార్క్ నేను తీసుకొస్తే, ఈ సిద్ధారెడ్డి దానిలో మామూళ్లు దండుకుంటున్నాడు.


నిన్న పులివెందులకు వెళ్లాను. పులివెందులలో వివేకాను ఎవరుచంపారని అడిగాను. మాకెందుకు తెలియదు అంటూ..అందరూ ఒకటే మాటచెప్పారు. సిగ్గు లేని ఈ ఎంపీ, సైకో జగన్ కుటుంబం కలిసి తండ్రితర్వాత తండ్రిలాంటి వ్యక్తిని గొడ్డ లివేటుకు గురిచేశారు.

 

సునీత అడిగేదానికి సమాధానం చెప్పమంటే నోరెత్తరు. బాబాయ్ ని చంపినవా ళ్లు... వస్తే రాష్ట్రం ఏమవుతుందో ఆలోచించుకోండి. మరలా ఓటేస్తే అందరికీ గొడ్డ లివేటే. దాన్ని భరించే స్థితిలో ఉన్నారా మీరు? సైకో జగన్ విశ్వసనీయతం గురిం చి మాట్లాడుతున్నాడు. నీ చెల్లి షర్మిల చెబుతోంది నీ విశ్వసనీయత ఏమిటో? రాజశేఖర్ రెడ్డి ఆస్తిలో జగన్ కు, షర్మిలకు సమానవాటా ఉందా..లేదా? ఆమెకు ఇవ్వాల్సింది  ఇచ్చావా జగన్? వైసీపీనేతలారా మీరేం సమాధానం చెబుతారు? పాపం అమాయకురాలు జగనన్న వదిలిన బాణమని పాదయాత్ర చేసింది. ఇప్పుడు దారితప్పిన బాణంగా మారింది. ఎక్కడికి వెళ్లింది. ఎంపీ సీటు ఇస్తానని చెప్పి చెల్లికి వెన్నుపోటు పొడిచిన నువ్వు నా గురించి మాట్లాడతావా జగన్?


నన్ను లయన్ (సింహం) అంటున్నాడు. అవును నేను కొదమసింహాన్ని. చనిపోయేవరకు నేను కొదమసింహాన్నే. నా జోలికి వచ్చినవాడు ఎవడూ లేడు. నాది ధర్మయుద్ధం. ధర్మాన్ని కాపాడటమే నా లక్ష్యం. ధర్మాన్ని మనం కాపాడి తే, ఆ ధర్మమే మనల్ని కాపాడుతుంది. ధర్మరక్షణ కోసం ఒక అడుగు వెనక్కు వేసినా పరవాలేదని స్వయంగా దేవుళ్లే చెప్పారు. తెలుగుదేశం జెండా ఎప్పుడూ రెపరెపలాడాలి.

 

తమ్ముళ్లూ మీపై కేసులుపెట్టే వారి లెక్కలన్నీ రాస్తున్నా. అధికారంలోకి వస్తూనే ట్రైబ్యునల్ వేస్తాను. తప్పుచేసిన వారిని శిక్షిస్తాను. రాజకీయఒత్తిళ్లతో ఇష్టానుసా రం పనిచేసేవారిని వదిలిపెట్టను. తమ్ముళ్లూ ఆరునెలలపాటు మనజెండా ఎగరే యండి. సైకిల్ఎక్కండి.. జెట్ స్పీడుతో తొక్కండి. సైకిల్ ని గెలిపించండి. మీ భవి ష్యత్ బంగారు భవిష్యత్ గా మార్చే బాధ్యత నాది. మనం భయపడితే వీళ్లు రెచ్చి పోతారు. బయటకు రండి.. ప్రభుత్వంపై తిరుగుబాటు చేయండి. ప్రభుత్వం తీసేసే పథకాల గురించి ఆలోచించకండి. మనప్రభుత్వం రాగానే తీసేసినవాటికి రెండిం తలు అందిస్తాను.

 

గతంలో మనప్రభుత్వం ముస్లింసమాజానికి ఏంచేసిందో కదిరి పట్టణంలోని ముస్లిం సోదరులే చెప్పాలి. 10లక్షల కుటుంబాలకు రంజాన్ తోఫా అందించాం. దుల్హన్ పథకం ఏమైంది తమ్ముళ్లూ? పేద ఆడబిడ్డ పెళ్లిచేసుకుంటే దుల్హన్ ఇవ్వ కుండా పదోతరగతి చదవితేనే ఇస్తామంటారా? మంత్రులకు ఎలాంటి అర్హతలు లేకుపోయినా పరవాలేదు. ముస్లిం ఆడబిడ్డలకు మాత్రం పదోతరగతి నిబంధన.  ఇమామ్ లు, మౌజన్ లకు గతంలో మనమే నెలనెలా ఆర్థికసహాయం చేశాం. అదేమాదిరి, అధికారంలోకి రాగానే వారికి ఇళ్లు కట్టించే బాధ్యత తీసుకుంటాం.  


మహాశక్తి పథకంతో ఆడబిడ్డల్ని శక్తివంతులుగా చేయాలన్నదే నా సంకల్పం. తల్లికి వందనంతో చదువుకునే ప్రతిబిడ్డకు సంవత్సరానికి రూ.15వేల ఆర్థికసా యం. 18ఏళ్లు పైబడిన ఆడబిడ్డలకు నెలకు రూ.1500 ఇస్తాను. దీపం పథకం కింద మూడు సిలిండర్లు ఉచితంగా ఇస్తాను. ఆర్టీసీ బస్సుల్లో ఉచితప్రయాణం.


రైతులకు సంవత్సరానికి రూ.20వేలు పెట్టుబడిసాయం. విత్తనాలు, ఎరువులతో పాటు మెకనైజేషన్, స్ప్రింక్లర్ సిస్టమ్ 90శాతం సబ్సిడీకే అమలుచేస్తాను. బీసీ సోదరులకు ప్రత్యేక రక్షణచట్టం తీసుకొస్తాను. 

 

మన ప్రభుత్వంలో కరెంట్ ఛార్జీలు పెరగవు. విద్యుత్ ఛార్జీలు తగ్గిస్తేనే పరిశ్రమలు పెట్టుబడులు వస్తాయి. దేవుడు ఇచ్చిన గాలి, ఎండ, నీరుతోనే విద్యుత్ ఉత్పత్తి చేయవచ్చు.


కందికుంట ప్రసాద్ ను గెలిపించాల్సిన బాధ్యత మీదే. మీరు ఓటేసేటప్పుడు  పిల్ల ల భవిష్యత్ కోసం ఆలోచించి, వారిసాక్షిగా ఓటేయండి. డబ్బులిస్తారనో.. కులం.. మతమనో.. బంధువులనో ఓటేస్తే మీ పిల్లల భవిష్యత్ ను అంధకారంలోకి నెట్టిన వారు అవుతారు. 6 నెలలు మీరు కష్టపడండి. మీజీవితాలు ఎందుకు బాగుపడ వో.. రాష్ట్రం ఎందుకు అభివృద్ధి చెందదో నేను చూస్తాను.


ప్రజలకు హానిచేసే వాలంటీర్లను, రాజకీయాలు చేసేవారిని వదిలిపెట్టను. మీ ఇళ్ల ల్లో విబేధాలు ఉంటే వీళ్లకెందుకు తమ్ముళ్లు? భార్యాభర్తల మధ్య గొడవలుంటే మీకెందుకు? వ్యక్తిగత సమాచారాన్ని సేకరించి ప్రజల్ని బ్లాక్ మెయిల్  చేయాల నుకుంటున్నారా? వేలిముద్రలు వేయించుకొని మీ భూముల్ని వారిపేర్లతో మార్చుకుంటున్నారు. ఒకదుర్మార్గుడి చేతిలో టెక్నాలజీ ఉంటే చాలా ఘోరమైన సమస్యలు వస్తాయి.

 

రాష్ట్రంలోకి ఓట్లదొంగలు వచ్చారు. మీ ఓట్లు ఉన్నాయో లేదో చూసుకోండి. ప్రతి ఓటుకోసం ఎలా పనిచేయాలో ఆలోచిస్తూ పోరాడుతున్నాం. నాది ధర్మయుద్ధం. ఎవడు అడ్డువచ్చినా ముందుకు పోవడమేగానీ, వెనకడుగు వేయను.  తెలుగు దేశం పార్టీ విజయాన్ని ఎవరూ ఆపలేరని కదిరిలో మా తమ్ముళ్ల ఉత్సాహం చూస్తే అర్థమవుతోంది. మీ అభిమానానికి జీవితాంతం రుణపడి ఉంటాను.  అనుకున్నవన్నీ చేసి, మీ హృదయాల్లో స్థానం సంపాదించుకోవాలన్నదే నా కోరి క. 

 

పోలీసులు ఎక్కడున్నారో సత్యసాయి జిల్లా ఎస్పీ సమాధానం చెప్పాలి. బహిరంగ సభకు వచ్చినవారిని నియంత్రించాల్సిన పోలీసులు, సిద్ధారెడ్డికి ఊడిగం చేస్తున్నా రు. పోలీసులకు కూడా అన్యాయం చేసిన వ్యక్తి జగన్ ఒక్కడే. వారికి సరిగా జీతా లు లేవు.. టీఏ డీఏలు లేవు. అలవెన్సులు కట్ చేశాడు.”*


*సాగునీటి ప్రాజెక్టుల విధ్వంసంపై యుద్ధభేరిలో భాగంగా కదిరి పట్టణంలో జరిగిన బహిరంగసభలో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడి ప్రసంగం : (03-08-2023)*


*నాది ధర్మపోరాటం.. నేను కొదమసింహాన్ని ఎవడు అడ్డొచ్చినా ముందుకే గానీ వెనకడుగు లేదు.*


*సొంతచెల్లికి వెన్నుపోటు పొడిచిన సైకో జగన్*


*బ్రో సినిమాపై ఢిల్లీకి వెళ్లడం కాదు  రాంబాబు..చేతనైతే రాయలసీమ ప్రాజెక్టులపై, పోలవరంపై ఢిల్లీకి వెళ్లు*


*కదిరి ఇసుక బెంగుళూరు, హైదరాబాద్ కు పోతోంది... కర్ణాటక మద్యం కదిరికి వస్తోంది*

                                                                                                                                                                                          *వైసీపీనేతలు కర్రలతో వస్తే కర్రలతోనే బుద్ధిచెప్పండి*


*ప్రతి ఒక్కరూ ఓటేసేటప్పుడు మీ పిల్లల భవిష్యత్ ను తలుచుకొని ఓటేయండి* 


*రోడ్ షోలో చంద్రబాబు నాయుడు ప్రసంగం:-*


“ కదిరి అదిరిపోయింది. కదిరి దద్దరిల్లితే వైసీపీ నేతల గుండెల్లో రైళ్లు పరిగెడుతు న్నాయి. కదిరిలో నా తమ్ముళ్ల ఉత్సాహం చూస్తుంటే, సంతోషంగా ఉంది. నవ యువత కదంతొక్కింది. నేను పనిచేసేది నవయువత కోసమే.


ఒకమూర్ఖుడు, దుర్మార్గుడు, పిచ్చివాడికి రాష్ట్రాన్ని అప్పగిస్తే ఏమవుతుందో చెప్పడానికే మీ ముందుకు వచ్చాను. రివర్స్ టెండరింగ్ తో అన్ని ప్రాజెక్టుల్ని పడుకోబెట్టాడు. రాష్ట్రాన్ని నాశనంచేసిన సైకో జగన్ రెడ్డికి పరిపాలించే అర్హత లేదు. 


ఒక్క అవకాశమన్నాడు.. కనిపించినవారికి ముద్దులు పెట్టాడు.. ఇప్పుడు పిడి గుద్దులు గుద్దుతున్నాడు. టీడీపీప్రభుత్వం రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టులకు రూ.68వేలకోట్లు ఖర్చుపెడితే, ఈ ప్రభుత్వం రూ.22వేలకోట్లు ఖర్చుపెట్టింది. రాయలసీమ సాగునీటి ప్రాజెక్టులకు మేం రూ.12వేలకోట్లు ఖర్చుపెడితే, వీళ్లు ముష్టి రూ.2వేలకోట్లు ఖర్చుపెట్టారు.

 

హంద్రీనీవా తెచ్చింది మనప్రియతమ నాయకుడు నందమూరి తారక రామారా వు. ఆ మహానాయకుడి దూరదృష్టిని ఆదర్శంగా తీసుకొని, రాయలసీమలోని సాగునీటి ప్రాజెక్టుల పూర్తికి నడుం బిగించాను.


జీడిపల్లి, చెర్లోపల్లి, మారాల, గొల్లపల్లి రిజర్వాయర్లు నిర్మించాము. గొల్లపల్లికి నీళ్లు ఇచ్చి కియా పరిశ్రమ తీసుకొచ్చాం. ఈ నాలుగేళ్లలో వీళ్లు ఒక్కపరిశ్రమ తెచ్చారా .. ఒక్క ఎకరాకు నీరిచ్చారా? వీళ్లా మనల్ని మాట్లాడేది?

 

ఎప్పుడు ఎన్నికలు వచ్చినా వైసీపీని చిత్తుచిత్తుగా ఓడించి, బంగాళాఖాతంలో పడేయాలి. ఆంబోతు రాంబాబు రంకెలేస్తున్నాడు. బ్రోసినిమాపై ఢిల్లీ కెళ్లడం కాదు రాంబాబు, పోలవరంకోసం ఢిల్లీ వెళ్లు. రాయలసీమ ప్రాజెక్టులకోసం వెళ్లు.

 

రాత్రింబవళ్లు కష్టపడి 72శాతం నిర్మించిన పోలవరం ప్రాజెక్టుని గోదావరిలో ముంచేసిన వీళ్లు నన్ను విమర్శిస్తున్నారు. ఈ దుర్మార్గులు వచ్చాక పోలవరం ఏమవుతుందో తెలియని పరిస్థితి. డయాఫ్రమ్ వాల్, కాపర్ డ్యామ్, గైడ్ బండ్ సహా అన్నీపోయాయి.

 

ఈ దుర్మార్గులు చేసిన పాపం రాష్ట్రద్రోహం. తెలుగుజాతికి తీరని అన్యాయం. పోలవరం పూర్తిచేసే బాధ్యత నాది. పోలవరం పూర్తిచేసి గోదావరి నీటిని రాయల సీమకు తీసుకురావాలి.

 

పైన వర్షాలు పడలేదు..మరోపక్క ఆల్మట్టి ఎత్తు పెంచుతున్నారు. తుంగభద్రపై కొత్త ప్రాజెక్టులు కడుతున్నారు. ఇలాంటి సందర్భంలో గోదావరి నీరు రాకపోతే, రాయలసీమ ఎడారి అవుతుంది. మీరు నా ఆస్తి, ఈ యువతే నా శక్తి, మిమ్మల్ని ఉపయోగించి రాష్ట్ర రూపురేఖలు మారుస్తాను.


ఇక్కడున్న తమ్ముళ్లూ మీరందరికీ ఉద్యోగం, ఉపాధి కల్పించే బాధ్యత నాది. డీఎస్సీ పెట్టాడా ... జాబ్ క్యాలెండర్ ఇచ్చాడా ఈ ముఖ్యమంత్రి. పరిశ్రమలు తీసుకొచ్చాడా? జాబురావాలంటే బాబుతోనే సాధ్యం.

 

టీడీపీప్రభుత్వం వచ్చిన వెంటనే యువతకు 20లక్షల ఉద్యోగాలిస్తాం. అనంతపు రానికి ఆగ్రోప్రాసెసింగ్ యూనిట్స్, పరిశ్రమలు తీసుకొచ్చి జిల్లా యువతకు ఉపాధి కల్పిస్తాను. కరోనా సమయంలో ఇళ్లల్లో కూర్చొని పనిచేయడం అలవాటైంది. ప్రపంచంలోని కంపెనీలతో కలిసి ఇంట్లోనే ఉండిపనిచేసే అవకాశమిస్తాను. మండ లానికి రెండు వర్క్ స్టేషన్లు పెట్టి, 10రోజులు అక్కడపనిచేసేలా చూస్తాను. అక్కడే మీకు శిక్షణ ఇప్పిస్తాను. రాష్ట్రయువత శక్తి నాకు తెలుసు.

 

ఈ రాష్ట్రాన్ని ఒక సంపన్న రాష్ట్రంగా మార్చే బాధ్యత నాది. వ్యవసాయం బాగు పడాలి. అనంతపురం జిల్లాలో ఈ సంవత్సరం వర్షాలు లేక, వర్షాధార పంటలు వే యలేదు. హంద్రీనీవా పూర్తిచేసి, ప్రతి ఎకరాకు నీళ్లిస్తాం. గాండ్లపెంట మండలంలో లిఫ్ట్ పెట్టి, చెర్లోపల్లి రిజర్వాయర్ ద్వారా కదిరి పట్టణానికి తాగునీరు అందిస్తా. నీళ్లుంటే ఈ జిల్లా రైతులు సిరులు పండిస్తారనే నమ్మకం నాకుంది.

 

రోజంతా కష్టపడి సాయంత్రం ఒక పెగ్ వేసే మందుబాబుల బలహీనతను ఈ సైకో పట్టేశాడు. ఏంచేసినా, ఏ మద్యం అమ్మినా తాగుతారులే అని కల్తీమద్యం అమ్ము తున్నాడు. దాన్ని అధికధరకు అమ్ముతూ, నగదువిక్రయాలు జరుపుతూ, ఆ సొమ్మంతా తాడేపల్లి కొంపకు చేరుస్తున్నాడు. సైకో జగన్ పుణ్యమా అని మందు బాబులు బాగా ఇబ్బంది పడుతున్నారు. కుటుంబాలు నాశనం చేస్తున్న ఈ సైకో మద్యం వ్యాపారం గురించి ఒక్కొక్కరు వందమందికి చెప్పాలి.


కదిరిలో ఇసుక దొరుకుతుందా? మీ ఊరిలో ఇసుక బెంగుళూరు, హైదరాబాద్ లో అమ్ముతున్నారు. బెంగుళూరులో తయారయ్యే నాసిరకం మద్యం మీ ఊళ్లో అమ్ముతున్నారు. ఈ మద్యం అమ్మకాల వెనకున్నది ఇక్కడి సిద్ధారెడ్డి కాదా? ఇక్కడొక సిద్ధారెడ్డి..అక్కడొక పెద్దారెడ్డి. వీళ్లు అసలు మనుషులేనా? ఇసుకతినే వీళ్లను మనుషులంటారా? కర్ణాటక మద్యం అమ్మే మిమ్మల్ని ఆ మద్యంలోనే ముంచేయాలి. బట్టలిప్పి జనంలో తిప్పాలి.  మట్కాలో.. మట్టిలో  డబ్బులు కావాలా మీకు? అడిగేవారు లేరని అరాచకాలు చేస్తారా? ఒళ్లు దగ్గరపెట్టుకోండి.. మీ రోజులు దగ్గరపడ్డాయి. మీకు ఎక్స్ పైరీ  డేట్ దగ్గరపడింది. ప్రజలు తిరగబడటాని కి సిద్ధంగా ఉన్నారు. ఎవరైనా మీ జోలికివస్తే, నన్ను తలుచుకొని ముందుకెళ్లండి . వైసీపీనేతలు కర్రలతో వస్తే, ఆ కర్రలతోనే వాళ్లకు బుద్ధిచెప్పండి. ఆడబిడ్డలకు రక్షణగా నిలవండి..రాష్ట్రాన్ని కాపాడండి. సిద్ధారెడ్డి మాయలన్నీ నాకుతెలుసు. మీరెంత మాయలఫకీర్లో తెలుసు. సోలార్ పార్క్ నేను తీసుకొస్తే, ఈ సిద్ధారెడ్డి దానిలో మామూళ్లు దండుకుంటున్నాడు.


నిన్న పులివెందులకు వెళ్లాను. పులివెందులలో వివేకాను ఎవరుచంపారని అడిగాను. మాకెందుకు తెలియదు అంటూ..అందరూ ఒకటే మాటచెప్పారు. సిగ్గు లేని ఈ ఎంపీ, సైకో జగన్ కుటుంబం కలిసి తండ్రితర్వాత తండ్రిలాంటి వ్యక్తిని గొడ్డ లివేటుకు గురిచేశారు.

 

సునీత అడిగేదానికి సమాధానం చెప్పమంటే నోరెత్తరు. బాబాయ్ ని చంపినవా ళ్లు... వస్తే రాష్ట్రం ఏమవుతుందో ఆలోచించుకోండి. మరలా ఓటేస్తే అందరికీ గొడ్డ లివేటే. దాన్ని భరించే స్థితిలో ఉన్నారా మీరు? సైకో జగన్ విశ్వసనీయతం గురిం చి మాట్లాడుతున్నాడు. నీ చెల్లి షర్మిల చెబుతోంది నీ విశ్వసనీయత ఏమిటో? రాజశేఖర్ రెడ్డి ఆస్తిలో జగన్ కు, షర్మిలకు సమానవాటా ఉందా..లేదా? ఆమెకు ఇవ్వాల్సింది  ఇచ్చావా జగన్? వైసీపీనేతలారా మీరేం సమాధానం చెబుతారు? పాపం అమాయకురాలు జగనన్న వదిలిన బాణమని పాదయాత్ర చేసింది. ఇప్పుడు దారితప్పిన బాణంగా మారింది. ఎక్కడికి వెళ్లింది. ఎంపీ సీటు ఇస్తానని చెప్పి చెల్లికి వెన్నుపోటు పొడిచిన నువ్వు నా గురించి మాట్లాడతావా జగన్?


నన్ను లయన్ (సింహం) అంటున్నాడు. అవును నేను కొదమసింహాన్ని. చనిపోయేవరకు నేను కొదమసింహాన్నే. నా జోలికి వచ్చినవాడు ఎవడూ లేడు. నాది ధర్మయుద్ధం. ధర్మాన్ని కాపాడటమే నా లక్ష్యం. ధర్మాన్ని మనం కాపాడి తే, ఆ ధర్మమే మనల్ని కాపాడుతుంది. ధర్మరక్షణ కోసం ఒక అడుగు వెనక్కు వేసినా పరవాలేదని స్వయంగా దేవుళ్లే చెప్పారు. తెలుగుదేశం జెండా ఎప్పుడూ రెపరెపలాడాలి.

 

తమ్ముళ్లూ మీపై కేసులుపెట్టే వారి లెక్కలన్నీ రాస్తున్నా. అధికారంలోకి వస్తూనే ట్రైబ్యునల్ వేస్తాను. తప్పుచేసిన వారిని శిక్షిస్తాను. రాజకీయఒత్తిళ్లతో ఇష్టానుసా రం పనిచేసేవారిని వదిలిపెట్టను. తమ్ముళ్లూ ఆరునెలలపాటు మనజెండా ఎగరే యండి. సైకిల్ఎక్కండి.. జెట్ స్పీడుతో తొక్కండి. సైకిల్ ని గెలిపించండి. మీ భవి ష్యత్ బంగారు భవిష్యత్ గా మార్చే బాధ్యత నాది. మనం భయపడితే వీళ్లు రెచ్చి పోతారు. బయటకు రండి.. ప్రభుత్వంపై తిరుగుబాటు చేయండి. ప్రభుత్వం తీసేసే పథకాల గురించి ఆలోచించకండి. మనప్రభుత్వం రాగానే తీసేసినవాటికి రెండిం తలు అందిస్తాను.

 

గతంలో మనప్రభుత్వం ముస్లింసమాజానికి ఏంచేసిందో కదిరి పట్టణంలోని ముస్లిం సోదరులే చెప్పాలి. 10లక్షల కుటుంబాలకు రంజాన్ తోఫా అందించాం. దుల్హన్ పథకం ఏమైంది తమ్ముళ్లూ? పేద ఆడబిడ్డ పెళ్లిచేసుకుంటే దుల్హన్ ఇవ్వ కుండా పదోతరగతి చదవితేనే ఇస్తామంటారా? మంత్రులకు ఎలాంటి అర్హతలు లేకుపోయినా పరవాలేదు. ముస్లిం ఆడబిడ్డలకు మాత్రం పదోతరగతి నిబంధన.  ఇమామ్ లు, మౌజన్ లకు గతంలో మనమే నెలనెలా ఆర్థికసహాయం చేశాం. అదేమాదిరి, అధికారంలోకి రాగానే వారికి ఇళ్లు కట్టించే బాధ్యత తీసుకుంటాం.  


మహాశక్తి పథకంతో ఆడబిడ్డల్ని శక్తివంతులుగా చేయాలన్నదే నా సంకల్పం. తల్లికి వందనంతో చదువుకునే ప్రతిబిడ్డకు సంవత్సరానికి రూ.15వేల ఆర్థికసా యం. 18ఏళ్లు పైబడిన ఆడబిడ్డలకు నెలకు రూ.1500 ఇస్తాను. దీపం పథకం కింద మూడు సిలిండర్లు ఉచితంగా ఇస్తాను. ఆర్టీసీ బస్సుల్లో ఉచితప్రయాణం.


రైతులకు సంవత్సరానికి రూ.20వేలు పెట్టుబడిసాయం. విత్తనాలు, ఎరువులతో పాటు మెకనైజేషన్, స్ప్రింక్లర్ సిస్టమ్ 90శాతం సబ్సిడీకే అమలుచేస్తాను. బీసీ సోదరులకు ప్రత్యేక రక్షణచట్టం తీసుకొస్తాను. 

 

మన ప్రభుత్వంలో కరెంట్ ఛార్జీలు పెరగవు. విద్యుత్ ఛార్జీలు తగ్గిస్తేనే పరిశ్రమలు పెట్టుబడులు వస్తాయి. దేవుడు ఇచ్చిన గాలి, ఎండ, నీరుతోనే విద్యుత్ ఉత్పత్తి చేయవచ్చు.


కందికుంట ప్రసాద్ ను గెలిపించాల్సిన బాధ్యత మీదే. మీరు ఓటేసేటప్పుడు  పిల్ల ల భవిష్యత్ కోసం ఆలోచించి, వారిసాక్షిగా ఓటేయండి. డబ్బులిస్తారనో.. కులం.. మతమనో.. బంధువులనో ఓటేస్తే మీ పిల్లల భవిష్యత్ ను అంధకారంలోకి నెట్టిన వారు అవుతారు. 6 నెలలు మీరు కష్టపడండి. మీజీవితాలు ఎందుకు బాగుపడ వో.. రాష్ట్రం ఎందుకు అభివృద్ధి చెందదో నేను చూస్తాను.


ప్రజలకు హానిచేసే వాలంటీర్లను, రాజకీయాలు చేసేవారిని వదిలిపెట్టను. మీ ఇళ్ల ల్లో విబేధాలు ఉంటే వీళ్లకెందుకు తమ్ముళ్లు? భార్యాభర్తల మధ్య గొడవలుంటే మీకెందుకు? వ్యక్తిగత సమాచారాన్ని సేకరించి ప్రజల్ని బ్లాక్ మెయిల్  చేయాల నుకుంటున్నారా? వేలిముద్రలు వేయించుకొని మీ భూముల్ని వారిపేర్లతో మార్చుకుంటున్నారు. ఒకదుర్మార్గుడి చేతిలో టెక్నాలజీ ఉంటే చాలా ఘోరమైన సమస్యలు వస్తాయి.

 

రాష్ట్రంలోకి ఓట్లదొంగలు వచ్చారు. మీ ఓట్లు ఉన్నాయో లేదో చూసుకోండి. ప్రతి ఓటుకోసం ఎలా పనిచేయాలో ఆలోచిస్తూ పోరాడుతున్నాం. నాది ధర్మయుద్ధం. ఎవడు అడ్డువచ్చినా ముందుకు పోవడమేగానీ, వెనకడుగు వేయను.  తెలుగు దేశం పార్టీ విజయాన్ని ఎవరూ ఆపలేరని కదిరిలో మా తమ్ముళ్ల ఉత్సాహం చూస్తే అర్థమవుతోంది. మీ అభిమానానికి జీవితాంతం రుణపడి ఉంటాను.  అనుకున్నవన్నీ చేసి, మీ హృదయాల్లో స్థానం సంపాదించుకోవాలన్నదే నా కోరి క. 

 

పోలీసులు ఎక్కడున్నారో సత్యసాయి జిల్లా ఎస్పీ సమాధానం చెప్పాలి. బహిరంగ సభకు వచ్చినవారిని నియంత్రించాల్సిన పోలీసులు, సిద్ధారెడ్డికి ఊడిగం చేస్తున్నా రు. పోలీసులకు కూడా అన్యాయం చేసిన వ్యక్తి జగన్ ఒక్కడే. వారికి సరిగా జీతా లు లేవు.. టీఏ డీఏలు లేవు. అలవెన్సులు కట్ చేశాడు.”

Comments