అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమమే లక్ష్యంగా... ఇంటింటికి ప్రభుత్వం.

    శ్రీ సత్య సాయి జిల్లా (ప్రజా అమరావతి);

 



  సురక్షకు  నీరాజనం


అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమమే లక్ష్యంగా... ఇంటింటికి ప్రభుత్వం



*ప్రజా సమస్యలు సంతృప్తి స్థాయిలో పరిష్కారమే లక్ష్యంగా.. జగనన్న సురక్ష* 


 *జగనన్న సురక్షతో ఇంటి వద్దనే 11 రకాల  ప్రభుత్వ సేవలు పొందుతున్న జనం* 


 *11 రకాల సేవలకు ఎలాంటి సర్వీసు చార్జీలు లేకుండా ఉచిత సర్టిఫికెట్లు జారీ*  


 *ఇప్పటివరకు జిల్లాలో 4,80,439 పైగా సేవలు పొందిన ప్రజలు* 

రాష్ట్రంలోని  మూడో స్థానం


జిల్లా కలెక్టర్   పి అరుణ్ బాబు


*పింఛన్ కావాలనో...'చేయూత' ఇవ్వాలనో..'భరోసా' కల్పించాలనో.. కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు...అర్జీలు ఇవ్వాల్సిన పని కూడా తప్పింది.. ఇంటి వద్దకే వలంటీర్ వచ్చి సమస్య తెలుసుకుంటున్నారు. దరఖాస్తు పూర్తి చేసి, సచివాలయాల్లో అందజేసి, ప్రభుత్వ పథకాలకు అర్హత ఉంటే లబ్ధిదారుగా చేరుస్తున్నారు. అంతేకాకుండా పైసా ఖర్చు లేకుండానే అవసరమైన సర్టిఫికెట్లు అందజేస్తున్నారు. ఇందుకోసం రాష్ట్రప్రభుత్వం జగనన్న సురక్ష కార్యక్రమాన్నికి  శ్రీ సత్య సాయి జిల్లా జిల్లాలో విశేష స్పందన లభిస్తోంది. కుల ధ్రువీకరణ పత్రం అందుకున్న విద్యార్థి.. రేషన్ కార్డు తీసుకున్న ఇంటి పెద్ద.. ఇల్లు మంజూరు పత్రాన్ని పొందిన మహిళ.. పంట నష్ట పరిహారానికి అర్హత సాధించిన రైతు.. వాహన మిత్ర పథకంలో లబ్ధిదారునిగా చేరిన డ్రైవరు.. ఇలా ఒకరేమిటి.. అన్ని వర్గాల ప్రజలు ప్రభుత్వ సేవలు ఉచితంగా అందడంతో హర్షం వ్యక్తం చేశారు. ఎక్కడికీ వెళ్లకుండా.. ఎవరి సిఫార్సులు లేకుండా.. పైసా ఖర్చు లేకుండా అవసరమైన పత్రాలు అందించేందుకు, అర్హత ఉండి ప్రభుత్వ పథకాలకు దూరంగా ఉండేవారిని లబ్ధిదారులుకు అన్ని అందేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంది. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లోని 544 సచివాలయాల పరిధిలో గ్రామ సభలు నిర్వహించారు. మొత్తం 4,88,94 మందికి వివిధ సేవలను అందజేశారు.


*సర్వీసు చార్జీలు లేకుండా అందించే సేవ‌లు*


1) ఆదాయ ధ్రువీకరణ పత్రం

2) డేట్‌ ఆఫ్‌ బర్త్‌ సర్టిఫికెట్‌

3) ఇంటిగ్రేటెడ్‌ సర్టిఫికెట్లు (కుల, నివాస ధ్రువీకరణ పత్రాలు)

4) మరణ ధ్రువీకరణ పత్రం

5) మ్యుటేషన్‌ ఫర్‌ ట్రాన్సాక్షన్‌

6) కొత్త రేషన్‌కార్డు లేదా రేషన్‌కార్డు విభజన

7) ఫ్యామిలీ మెంబర్‌ సర్టిఫికెట్లు

8) ఆధార్‌కార్డులో మొబైల్‌ నంబర్‌ అప్‌డేట్‌

9) కౌలు గుర్తింపు కార్డులు (సీసీఆర్‌సీ)

10) వివాహ ధ్రువీకరణ పత్రం (పట్టణ ప్రాంతాల్లో అయితే 90 రోజుల్లోగా, గ్రామీణ ప్రాంతాల్లో 60 రోజుల్లోపు)

11) ప్రభుత్వ డేటాకు సంబంధించి కుటుంబ వివరాల్లో కొంత మంది సభ్యుల పేర్ల తొలగింపు.


సమిష్టి కృషితో విజయవంతం

జిల్లా కలెక్టర్


ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశ పెట్టిన ‘జగనన్న సురక్ష’ కార్యక్రమం ద్వారా పౌరసేవలన్నీ వేగవంతంగా అందిస్తున్నాం. శాచ్యురేషన్‌ పద్ధతిలో అర్హులైన ప్రతి ఒక్కరికీ రాష్ట్ర ప్రభుత్వం మంచి చేస్తోంది. అర్హులై ఉండి ఏ కారణంతోనైనా ఇంకా ఎవరైనా మిగిలిపోతే వారికి కూడా సంక్షేమ పథకాలు అందాలన్న లక్ష్యంతో ఈ ‘జగనన్న సురక్ష‘ ద్వారా ఇంటింటినీ జల్లెడ పట్టుతున్నాం. దే­శంలో ఎక్కడాలేని విధంగా వినూత్నంగా జగనన్న సురక్ష కార్యక్రమంలో ప్రతి ఇంటికీ వెళ్లి స­మస్యలేమైనా ఉంటే తెలుసుకుని పరిష్కారం  చూపించడం జరిగింది,జిల్లాలోని32మండలాలలోని 544  గ్రామ వార్డ్ సచివాలయాల పరిధిలో జగనన్న సురక్ష క్యాంపులు  నిర్వహించారు.  38 కమిటీలు పనిచేసే జూన్ 24వ తేదీన ప్రారంభమైన సురక్ష కార్యక్రమం జూలై 31న పూర్తయింది , అధికారులు, వాలంటీర్లు    ఇళ్లను సర్వే చేశారు. ఇందులో 4.88 లక్షల మందికి  సర్టిఫికెట్లు అందజేశారు. దీంతో శ్రీ సత్యసాయి జిల్లా 98.16 శాతంతో రాష్ట్రంలోనే మూడో స్థానాన్ని దక్కించుకుంది

*,❇️శాఖల వారీగా అందించిన సేవలు:* 

1..రెవెన్యూ – 478210

2..ఆధార్ – 5328 

3. పౌర సరఫరాల శాఖ – 3579

4. గ్రామ/వార్డు సచివాలయాలు – 735

5. వైద్య ఆరోగ్య శాఖ – 78

6. వ్యవసాయ శాఖ  - 3

7. రిజిస్ట్రేషన్ మరియు స్టాంపు శాఖ – 51 

8. రూరల్ డెవలప్మెంట్  - 37

9. కార్మిక శాఖ – 7 

10 మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ 61

*✳️ఎలాంటి సర్వీసు చార్జీలు లేకుండా అందిస్తున్న పౌర  సేవ‌లు* 


1. ఆదాయ ధ్రువీకరణ పత్రం

2. డేట్‌ ఆఫ్‌ బర్త్‌ సర్టిఫికెట్‌

3  ఇంటిగ్రేటెడ్‌ సర్టిఫికెట్లు (కుల, నివాస ధ్రువీకరణ పత్రాలు)

4.మరణ ధ్రువీకరణ పత్రం

5.  మ్యుటేషన్‌ ఫర్‌ ట్రాన్సాక్షన్‌

6. కొత్త రేషన్‌కార్డు లేదా రేషన్‌కార్డు విభజన

7. ఫ్యామిలీ మెంబర్‌ సర్టిఫికెట్లు

8. ఆధార్‌కార్డులో మొబైల్‌ నంబర్‌ అప్‌డేట్‌

9. కౌలు గుర్తింపు కార్డులు (సీసీఆర్‌సీ)

10.  వివాహ ధ్రువీకరణ పత్రం (పట్టణ ప్రాంతాల్లో అయితే 90 రోజుల్లోగా, గ్రామీణ ప్రాంతాల్లో 60 రోజుల్లోపు)


జిల్లాలోని32మండలాలలోని 544  గ్రామ వార్డ్ సచివాలయాల పరిధిలో జగనన్న సురక్ష క్యాంపులు  నిర్వహించారు.  38 కమిటీలు పనిచేసే జూన్ 24వ తేదీన ప్రారంభమైన సురక్ష కార్యక్రమం జూలై 31న పూర్తయింది , అధికారులు, వాలంటీర్లు    ఇళ్లను సర్వే చేశారు. ఇందులో 4.88 లక్షల మందికి  సర్టిఫికెట్లు అందజేశారు. దీంతో శ్రీ సత్యసాయి జిల్లా 98.16 శాతంతో రాష్ట్రంలోనే మూడో స్థానాన్ని దక్కించుకుంది

లబ్ధిదారుల అభిప్రాయాలు


సర్టిఫికేట్ ఇంటికి  తెచ్చిచ్చారు


నాకు బర్త్ సర్టిఫికేట్ ,  కులం, ఆదాయం, అవసరమైంది, పదో తరగతి పూర్తి చేయడం జరిగింది ఇంటర్ అడ్మిషన్ లో నేను దరఖాస్తు చేసుకున్నాను, మా ఇంటికి రాజన్న ని వాలంటరీ వచ్చి నాకేం కావాలో మరి అడిగి తెలుసుకున్నారు కొన్ని జిరాక్స్ కాపీలు తీసుకున్నారు, రెండు రోజుల్లో నాకు కులం సర్టిఫికెట్, ఆదాయం సర్టిఫికెట్ తీసుకుని వచ్చి నా చేతికి ఇచ్చాడు, జగనన్న సురక్ష కార్యక్రమం ద్వారా ఇంత మేలు జరుగుతుండటం నాకు చాలా ఆనందంగా ఉన్నది ముఖ్యమంత్రి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు

కుమారి  శ్రీ మోషే శ్రీ,   ఆల్విన్ కాలనీ,పెనుగొండ, శ్రీ సత్య సాయి జిల్లా


  కొత్త రేషన్ కార్డు వచ్చింది


నా పేరు సుబ్బమ్మ, నేను  పుట్టపర్తి మండలంలోని, కర్ణాటక నాగి పల్లి నందు  నివసిస్తున్నాను. నేను వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాము. రైస్ కార్డు లేక ప్రభుత్వ పథకాలు పొందడం లేదు.  జగనన్న సురక్ష కార్యక్రమంలో రైస్ కార్డు కోసం ధరఖాస్తు చేసుకోగా ధరఖాస్తును పరిశీలించిన అనంతరం అధికారులు రైస్ కార్డు మంజూరు చేశారు. నాకు చాలా సంతోషంగా ఉంది. మా లాంటి నిరుపేద ప్రజలకు అండగా ఉన్న రాష్ట్ర ముఖ్యమంత్రికి దన్యవాదాలు. 


అన్ని ఉచితంగానే

  రూపాయి ఖర్చు లేకుండానే నా కుటుంబానికి  ఆదాయం సర్టిఫికెట్,  బర్త్ సర్టిఫికెట్, రేషన్ కార్డు  ఉచితంగా లభించడం చాలా సంతోషం, ఒక సర్టిఫికెట్ కావాలంటే మీ సేవలో దరఖాస్తు చేసి  మండల కేంద్రానికి వెళ్లాల్సి వచ్చేది. ఒక్కొక్క  సర్టిఫిట్ కు కనీసం  200 రూపాయలు ఖర్చు చేయాల్సి వచ్చేది జగనన్న సురక్షితతో సేవ సర్టిఫికెట్లు ఉచితంగా అందజేశారు

   షేక్ ఆరిఫ్ 

రెండవ సంవత్సరం బిఎస్సి, మంగళకర కళాశాల, పుట్టపర్తి



Comments
Popular posts
దసరా నవరాత్రులు: కనకదుర్గమ్మ తొమ్మిది రోజులు అలంకరణ రూపాలు ... విజయవాడ, ఇంద్రకీలాద్రి (prajaamaravati), అక్టోబరు 18 :- దసరా శరన్నవరాత్రులు హిందువులకు ఒక ముఖ్యమైన పండుగ. ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుండి ఆశ్వయుజ శుద్ధ నవమి వరకు తొమ్మిది రోజులు దేవీ నవరాత్రులు పదవ రోజు విజయ దశమి కలసి దసరా అంటారు. ఇది ముఖ్యముగా శక్తి ఆరాధనకు ప్రాధాన్యత ఇచ్చే పండుగ. ఈ పండుగకు నవరాత్రి, శరన్నవరాత్రి అనీ కూడా అంటారు. శరదృతువు ఆరంభంలో వచ్చే పండుగ కనుక ఈ పేరు వచ్చింది. కొందరు ఈ పండుగకు మొదటి మూడు రోజులు పార్వతిదేవికి తరువాతి మూడు రోజుల లక్ష్మీ దేవికి తరువాతి మూడురోజులు సరస్వతి దేవికి పూజలు నిర్వహిస్తారు. ఈ సమయంలో పూజలో విద్యార్ధులు తమ పుస్తకాలను ఉంచుతారు. ఇలా చేస్తే విద్యాభ్యాసంలో విజయం లభిస్తుందని విశ్వసిస్తారు. సామాన్యులే కాక యోగులు నవరాత్రులలో అమ్మవారిని పూజిస్తారు. ముఖ్యముగా శాక్తేయులు దీనిని ఆచరిస్తారు. బొమ్మల కొలువు పెట్టడం ఒక ఆనవాయితీ. ఆలయాలలో అమ్మవారికి ఒక్కోరోజు ఒక్కో అలంకారం చేస్తారు. ఈ తొమ్మిది రోజుల్లో అమ్మవారిని తొమ్మిది రూపాల్లో పూజిస్తూ ఉంటారు. లోకకల్యాణం కోసం అమ్మవారు ఒక్కోరోజు ఒక్కో రూపాన్ని ధరించింది. అందువలన అలా అమ్మవారు అవతరించిన రోజున, ఆ రూపంతో అమ్మవారిని అలంకరించి ఆ నామంతో ఆరాధిస్తూ ఉంటారు. ఇంద్రకీలాద్రిపై వేంచేసి యున్న శ్రీ కనకదుర్గమ్మావారు మొదటి రోజు శ్రీ స్వర్ణకవచాలంకృత శ్రీ దుర్గాదేవిగా రెండవ రోజు బాలాత్రిపుర సుందరి మూడవ రోజు గాయత్రి దేవిగా, నాల్గవ రోజు అన్నపూర్ణ దేవిగా ఐదవరోజు శ్రీ సర్వస్వతి దేవిగా ఆరవ రోజు శ్రీ లలిత త్రిపుర సుందరీ దేవిగా, ఏడవ రోజు శ్రీ మహలక్ష్మీదేవిగా, ఎనిమిదవ రోజు దుర్గాదేవి మరియు మహిషాసుర మర్థిని దేవిగా, తొమ్మిదవ రోజు శ్రీ రాజరాజేశ్వరి దేవి మొదలైన అవతార రూపాలతో దర్శనమిస్తూ భక్తులకు అమ్మవారు దర్శనమిస్తారు.ఇలా ఈ నవరాత్రుల సమయంలో ఒక్కో అమ్మవారిని ఆరాధించడం వలన ఒక్కో విశేష ఫలితం లభిస్తుందని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి. నవరాత్రుల్లో బెడవాడ శ్రీకనకదుర్గమ్మ వారు వివిధ అలంకారాలతో భక్తుల కోర్కేలను తీర్చు చల్లని తల్లిగా దర్శనమిస్తారు.. 1. దుర్గాదేవి అలకారం ః శరన్నవరాత్రి మహోత్సవాల్లో శ్రీ కనకదుర్గమ్మవారు శ్రీ స్వర్ణకవచాలంకృత శ్రీ దుర్గాదేవిగా దర్శినమిచ్చి భక్తులకు ఆయురారోగ్య ఐశ్వర్యాలను కలుగుజేస్తారు. 2. శ్రీ బాలాత్రిపుర సుందరి: ఫత్రిపురాత్రయంలో శ్రీ బాలాత్రి పుర సుందరీదేవి ప్రథమ స్థానంలో ఉంది. ఆమె ఎంతో మహిమాన్వితమైన ది. సమస్త దేవీ మంత్రాలలోకెల్లా శ్రీ బాలా మంత్రం గొప్పది. సకల శక్తి పూజలకు మూలమైన శ్రీ బాలాదేవి జగన్మోహనాకారాన్ని పవిత్రమైన శరన్నవరాత్రుల్లో దర్శించి, ఆమె అనుగ్రహాన్ని పొందితే, సంవత్సరం పొడుగునా అమ్మవారికి చేసే పూజలన్నీ సత్వర ఫలితాలనిస్తాయి. 3. శ్రీ గాయత్రి దేవి అలంకారం: ముక్తా విద్రుమ హేమనీల ధవల వర్థాలలతో ప్రకాశిస్తు, పంచ ముఖాలతో దర్శనమిస్తుంది. సంధ్యావందనం అధి దేవత . గాయత్రి మంత్రం రెండు రకాలు: 1. లఘు గాయత్రి మంత్రం 2. బ్రుహద్గాయత్రి మంత్రం. ప్రతి రోజూ త్రిసంధ్యా సమయంల్లో వేయి సార్లు గాయత్రి మంత్రంని పఠిస్తే వాక్సుద్ది కలుగుతుంది. 4. శ్రీ అన్నపూర్ణేశ్వరి దేవి: నాల్గవ రోజున నిత్యాన్నదానేశ్వరి శ్రీ అన్నపూర్ణా దేవి అలంకారం అన్నం జీవుల మనుగడకు ఆదారం. జీవకోటి నశించకుండా వారణాసి క్షేత్రాన్ని నిజ క్షేత్రంగా, క్షేత్ర అధినాయకుడు విశ్వేశ్వరుడి ప్రియపత్నిగా శ్రీ అన్నపూర్ణా దేవి విరాజిల్లుతుంది. 5. శ్రీ మహా సరస్వతీ దేవి: ఐదవ రోజున చదువుల తల్లి సరస్వతీ దేవి అలంకారం త్రి శక్తులలో ఒక మహాశక్తి శ్రీ సరస్వతీ దేవి. సరస్వతీ దేవి సప్తరూపాలలో ఉంటుందని మేరు తంత్రంలో చెప్పబడింది . అవి చింతామని సరస్వతి, జ్ఝాన సరస్వతి, నిల సరస్వతి, ఘట సరస్వతి, కిణి సరస్వతి, అంతరిక్ష సరస్వతి, మరియు మహా సరస్వతి. మహా సరస్వతి దేవి శుంభని శుంభులనే రాక్షసులను వధించింది. ..2 ..2.. 6. శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవివేవి : 6వ రోజున త్రిపురాత్రయంలో రెండో శక్తి శ్రీ లలితా దేవి అలంకారం. త్రిమూర్తులకన్నా ముందు నుండి ఉన్నది కాబట్టి, త్రిపుర సుందరి అని పిలవబడుతుంది. శ్రీచక్ర ఆదిష్టాన శక్తి, పంచదశాక్షరి అదిష్టాన దేవత. ఆదిశంకరాచార్యులు శ్రీ చక్రయంత్రాన్ని ప్రతిష్టించక పూర్వం ఈ దేవి ఉగ్ర రూపిణిగా ‘చండీదేవి'గా పిలవబడేది. ఆది శంకరాచార్యలు శ్ీర చక్రయంత్రాన్ని ప్రతి ష్టించాక పరమశాతం రూపిణిగా లలితా దేవిగా పిలవబడుతున్నది. 7. శ్రీ మహాలక్ష్మి తేది : 7వ రోజున మంగళ ప్రద దేవత శ్రీ మహాలక్ష్మీ దేవి అలంకారం అష్టరూపాలతో అష్ట సిద్దులు ప్రసాదించే దేవత. రెండు చేతులలో కమలాలని ధరించి, వరదాభయ హస్తాల్ని ప్రదర్శిస్తూ, పద్మాసనిగా దర్శనిమిస్తుంది. ఆది పరాశక్తి మహాకాళీ, మహాలక్ష్మీ, మహా సరస్వతి రూపాలు ధరించింది. ఆ ఆదిపరాశక్తి రూపంగానే మహాలక్ష్మీ అలంకారం జరుగుతుంది. 8. శ్రీ దుర్గా దేవి అలంకారం: దుర్గతులను నాశనం చేసే శ్రీ దుర్గా దేవి అలంకరాం రురుకుమారుడైన ‘దుర్గముడు' అనే రాక్షసున్ని సంహరించింది అష్టమి రోజునే కనుక ఈ రోజును దుర్గాష్టమి అని, దుర్గమున్ని సంహరించిన అవతారం కనుక దేవిని ‘దుర్గా' అని పిలుస్తారు. శ్రీ మహిషాసుర మర్ధినీ దేవి అలంకారం: మహిశాసురున్ని చంపడానికి దేవతలందరూ తమ తమ శక్తులను ప్రదానం చేయగా ఏర్పడిన అవతారం ఇది. సింహాన్ని వాహనంగా ఈ దేవికి హిమవంతుడు బహుకరించాడు. సింహ వాహనంతో రాక్షస సంహారం చేసి అనంతరం ఇంద్ర కీలాద్రి పై వెలిసింది 9. శ్రీరాజరాజేశ్వరి దేవి అలంకారం: 9వరోజు అపజయం అంటే ఎరుగని శక్తి కాబట్టి ఈ మాతను ‘అపరాజిత' అంటారు. ఎల్లప్పుడు విజయాలను పొందుతుంది కాబట్టి‘విజయ' అని కూడా అంటారు. శ్రీ రాజరాజేశ్వరి దేవి ఎప్పుడూ శ్రీ మహా పరమేశ్వరుడి అంకముపై ఆసీనురాలై భక్తులకు దర్శనమిస్తుందని పురాణ ఇతి హాసారు వెల్లడిస్తున్నాయి. -
Image
గాజువాక జర్నలిస్టుల వినతిని సీఎం జగన్మోహనరెడ్డి దృష్టికి తీసుకువెళ్తా
Image
మహిళల ఆర్థిక స్వావలంబనే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం
Image
శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం, ఇంద్రకీలాద్రి
Image
Kvik Fitness Arena " జిమ్ సెంటర్
Image