అధికారం అంటే ఆజమాయిషీ చేయడం కాదు.

 అమరావతి (ప్రజా అమరావతి);


*అర్హులై ఉండి ఏ కారణం చేతనైనా లబ్ధి అందని వారికి మరో అవకాశం కూడా ఇచ్చి మరీ ఏడాదికి రెండు పర్యాయాలు లబ్ధి చేకూరుస్తున్న ప్రభుత్వం.*


*డిసెంబరు 2022 నుంచి జూలై 2023 వరకు అమలైన వివిధ సంక్షేమపథకాలకు సంబంధించి ఏ కారణంచేతనైనా లబ్ది అందని 2,62,169 మంది అర్హులకు లబ్ధి చేకూరుస్తూ...  క్యాంపు కార్యాలయంలో బటన్‌ నొక్కి వారి ఖాతాల్లో  రూ.216.34 కోట్లు  జమ చేసిన సీఎం శ్రీ వైయస్‌.జగన్‌.*



*ఈ సందర్భంగా సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ ఏమన్నారంటే...:*


*అర్హులు మిస్‌ కాకూడదన్న తపనతో....*

దేవుని దయతో మరో మంచి కార్యక్రమానికి ఇక్కడ నుంచి శ్రీకారం చుడుతున్నాం. ఇంటింటా, మనిషి, మనిషికీ మంచి చేస్తున్న ప్రభుత్వం, అలా మంచి జరగాలని తాపత్రయపడుతున్న ప్రభుత్వం మనది. ఎక్కడా లంచాలకు తావులేకుండా, వివక్షకు ఏమాత్రం చోటు ఇవ్వకుండా, కులం, మతం, ప్రాంతం చూడకుండూ.. చివరికి  ఏ రాజకీయ పార్టీ అన్న ప్రస్తావన చూడకుండా.. మనకు ఓటు వేయకపోయిన  ఫర్వాలేదు, అర్హత ఉంటే కచ్చితంగా అందించాలి, ఏ ఒక్కరూ మిస్‌ కాకూడదు అన్న  తపన, తాపత్రయంతో అడుగులు వేస్తున్న పాలనే.. ఈ నవరత్నాల పాలనే.


ఏ పధకంలోనైనా అర్హత ఉండి, ఏ కారణంతో అయినా అందాల్సిన మంచి అందకపోయిన పరిస్థితులు ఉంటే.. అలాంటి వారికి న్యాయం చేస్తూ.. మంచి చేయడానికి మరోక్కసారి అవకాశం ఇస్తున్నాం. ఏ కారణం చేత అయినా ఆ రోజు మీకు అందకపోయి ఉంటే కంగారు పడకుండా మరలా మీరు దరఖాస్తు పెట్టుకొండి, పథకం వచ్చిన నెలరోజుల వరకూ మీకు అవకాశం ఇస్తున్నాం. మరలా వెరిఫికేషన్‌ చేయించి...  మీకు ఆ పథకం వచ్చేట్టు మిమ్నల్ని చేయిపట్టుకుని నడిపించే కార్యక్రమం ప్రభుత్వం చేస్తుంది అన్న మాట ప్రకారం ఇవాళ ఆ లెఫ్ట్‌ ఓవర్‌ బెనిఫీషియర్స్‌ కోసం  ఈ కార్యక్రమం జరుగుతోంది.  


*అధికారం అంటే ఆజమాయిషీ చేయడం కాదు.*



అధికారం అంటే ప్రజల పట్ల మమకారం చూపడం. అధికారం అంటే ప్రజలకు మంచి చేయడం కోసం నాలుగు అడుగులు ముందుకువేసే బాధ్యత అని మరొక్కసారి ఆ బాధ్యతను తల్చుకుంటూ.. గత ఆరునెలలుగా వివిధ కారణాల వల్ల వివిధ పథకాలకు సంబంధించి అందుకోలేని 2.62 లక్షల మంది అర్హులైన లబ్ధిదారులకు మరలా రీ వెరిఫికేషన్‌ చేసి వారికి అవకాశం కల్పిస్తున్నాం. రూ.216 కోట్లు నేరుగా బటన్‌ నొక్కి అక్కచెల్లెమ్మలు, వారి కుటుంబసభ్యుల ఖాతాల్లో జమ చేస్తున్నాం. 


*కొత్త ఫించన్‌, బియ్యం, ఆరోగ్యశ్రీకార్డులు సైతం మంజూరు...*

అంతే కాకుండా... ఈ ఆరునెలల పీరియడ్‌లో కొత్తగా ఫించన్‌ కార్డులు, బియ్యం కార్డులు, ఆరోగ్యశ్రీ కార్డులు, ఇళ్ల స్ధలాలకు సంబంధించి కూడా కొత్తగా దరఖాస్తు పెట్టుకుంటే... వీటి వెరిఫికేషన్‌ కూడా పూర్తి చేసుకుని.. వాటిని మంజూరు చేసే కార్యక్రమం కూడా ఇవాళ జరుగుతుంది. 


కొత్తగా మరో 1,49,875 మందికి పెన్షన్లు కూడా మంజూరు చేస్తున్నాం. వచ్చే నెల నుంచి వీరికి పెన్షన్లు కూడా అందుతాయి. అదే విధంగా 2,00,312 మందికి కొత్తగా బియ్యం కార్డులు మంజూరు చేస్తున్నాం. వీరికి వచ్చే నెల నుంచి రేషన్‌ అందుతుంది. అదే మాదిరిగా 4,327 మంది ఆరోగ్యశ్రీ కార్డులు, 12,069 మందికి ఇళ్ల స్ధలాలు కూడా ఇస్తున్నాం.



*64.27 లక్షల పెన్షన్‌లు.....*

పెన్షన్‌లకు సంబంధించి 1,49,875 మందికి కొత్తగా పెన్షన్‌లు ఇవ్వడంతో.. రాష్ట్రంలో మొత్తం పెన్షన్ల సంఖ్య దాదాపుగా  64.27 లక్షలకు చేరుకుంది.   

గత ప్రభుత్వ హయాంలో ఎన్నికలకు ఆరు నెలల మందు వరకు అంటే అక్టోబరు 2018 వరకు కేవలం 39 లక్షలు మాత్రమే ఉంటే... ఈ రోజు పెన్షన్ల సంఖ్య 64.27 లక్షలకు పెరిగింది. అప్పట్లో ఎన్నికలకు రెండు నెలల ముందు వరకు అంటే 4 సంవత్సరాల పది నెలల కాలం కేవలం రూ.1000 మాత్రమే ఇస్తున్న పరిస్థితి ఉంటే.. ఇవాళ రూ.2750 పెన్షన్‌ ఇస్తున్నాం. 



ఇప్పుడు కొత్తగా మంజూరు చేసిన 2,00,312 కార్డులతో కలుపుకుంటే.. మొత్తం బియ్యం కార్డుల సంఖ్య 1,48,12,934కు పెరిగింది. అదే విధంగా ఇవాళ కొత్తగా మంజూరు చేస్తున్న 4,327 ఆరోగ్యశ్రీ కార్డులతో కలుపుకుంటే... ఆరోగ్యశ్రీ కార్డుల సంఖ్య కూడా 1,42,15,820 కు చేరింది. అలాగే ఈ రోజు మంజూరు చేస్తున్న ఇళ్ల పట్టాలు 12,069 కలుపుకుంటే... మొత్తం ఇళ్ల పట్టాల సంఖ్య 30,84,935కు చేరుతుంది.  


వివిధ పథకాలకు సంబంధించి గత ఆరునెలల్లో అర్హత ఉండి వివిధ కారణాల వల్ల మిగిలిపోయిన ఈ 2.62 లక్షల మందికి ఇవాళ మరలా అవకాశం కల్పిస్తూ.. మంజూరు చేస్తున్నాం.

జగనన్న చేదోడు కార్యక్రమం ద్వారా 43,170 మందికి మరలా బెనిఫిట్‌ ఇస్తున్నాం. 207 మందికి వైఎస్‌ఆర్‌ మత్స్యకార భరోసా అందిస్తున్నాం. వివిధ సాంకేతిక కారణాల వల్ల గతంలో  సున్నావడ్డీ పంటరుణాలు, ఇన్‌పుట్‌ సబ్సిడీ అందని 1,08,000 మంది రైతులకు .. సాంకేతక అంశాలను సరిదిద్ది నేడు వారికి అందిస్తున్నాం. జగనన్న విద్యాదీవెనలో మరో 32,770 మంది తల్లుల ఖాతాల్లో జమ చేస్తున్నాం. జగనన్న వసతి దీవెన ద్వారా  36,898 మంది తల్లుల ఖాతాల్లో జమ చేస్తున్నాం. వైయస్సార్‌ ఈబీసీ నేస్తం ద్వారా 8,753 మందికి, 267 మందికి వైయస్సార్‌ నేతన్న నేస్తం కింద, జగనన్న అమ్మఒడి కింద 16,717 మందికి ... మొత్తంగా 2.62 లక్షల మందికి వివిధ కారణాల వల్ల ఆయా పథకాలు అందలేకపోయిన వారికి అందరికీ మరలా అవకాశం ఇచ్చి ఆ పథకాలను అందిస్తున్నాం.                                                                                        *జగనన్న సురక్ష–  94,62,184 మందికిసర్టిఫికేట్లు..*

వీటితో పాటు ఈ మధ్య కాలంలో రాష్ట్ర వ్యాప్తంగా 15,004 గ్రామ, వార్టు సచివాలయాల పరిధిలో వలంటీర్లు, సచివాలయ సిబ్బంది, స్థానిక నాయకులు, ప్రతి ఇంటికీ వెళ్లి... జగనన్న సురక్ష కార్యక్రమం నిర్వహిస్తున్నారు. వివిధ పథకాలకు అర్హులైన వారెవరూ మిగిలిపోకూడదన్న తపనతో జగనన్న సురక్ష చేపట్టాం. ఇందులో భాగంగా 94,62,184 మందికి రకరకాల సర్టిఫికేట్లు ఇవ్వడంతో పాటు.. ఇలా ప్రతి ఇంటికి వెళ్లినప్పుడు 12,405 మంది అర్హులై ఉండి వివిధ కారణాల వల్ల మిగిలిపోయిన వారికి కూడా లబ్ధి చేకూర్చున్నాం. 


జగనన్నకు చెబుదాం  కార్యక్రమం ద్వారా... కాల్‌ సెంటర్‌కు ఫోన్‌ చేసిన 1630 మంది కూడా అర్హులని తేలడంతో వారికి కూడా మంచి జరిగించే కార్యక్రమం చేస్తున్నాం.  ఏ ఒక్కరూ అర్హత ఉండి మిస్‌ కాకూడన్న తపన, తాపత్రయంతో ఇవాళ వీరందరికీ మంచి చేసే కార్యక్రమం ఇవాళ జరుగుతుంది. 


దేవుడి దయతో వీళ్లందరికీ ఇంకా మంచి జరిగే పరిస్థితి రావాలని, దేవుడు మంచి చేసే అవకాశం ఇవ్వాలని మనసారా కోరుకుంటున్నాను అని సీఎం ప్రసంగం ముగించారు.

Comments
Popular posts
దసరా నవరాత్రులు: కనకదుర్గమ్మ తొమ్మిది రోజులు అలంకరణ రూపాలు ... విజయవాడ, ఇంద్రకీలాద్రి (prajaamaravati), అక్టోబరు 18 :- దసరా శరన్నవరాత్రులు హిందువులకు ఒక ముఖ్యమైన పండుగ. ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుండి ఆశ్వయుజ శుద్ధ నవమి వరకు తొమ్మిది రోజులు దేవీ నవరాత్రులు పదవ రోజు విజయ దశమి కలసి దసరా అంటారు. ఇది ముఖ్యముగా శక్తి ఆరాధనకు ప్రాధాన్యత ఇచ్చే పండుగ. ఈ పండుగకు నవరాత్రి, శరన్నవరాత్రి అనీ కూడా అంటారు. శరదృతువు ఆరంభంలో వచ్చే పండుగ కనుక ఈ పేరు వచ్చింది. కొందరు ఈ పండుగకు మొదటి మూడు రోజులు పార్వతిదేవికి తరువాతి మూడు రోజుల లక్ష్మీ దేవికి తరువాతి మూడురోజులు సరస్వతి దేవికి పూజలు నిర్వహిస్తారు. ఈ సమయంలో పూజలో విద్యార్ధులు తమ పుస్తకాలను ఉంచుతారు. ఇలా చేస్తే విద్యాభ్యాసంలో విజయం లభిస్తుందని విశ్వసిస్తారు. సామాన్యులే కాక యోగులు నవరాత్రులలో అమ్మవారిని పూజిస్తారు. ముఖ్యముగా శాక్తేయులు దీనిని ఆచరిస్తారు. బొమ్మల కొలువు పెట్టడం ఒక ఆనవాయితీ. ఆలయాలలో అమ్మవారికి ఒక్కోరోజు ఒక్కో అలంకారం చేస్తారు. ఈ తొమ్మిది రోజుల్లో అమ్మవారిని తొమ్మిది రూపాల్లో పూజిస్తూ ఉంటారు. లోకకల్యాణం కోసం అమ్మవారు ఒక్కోరోజు ఒక్కో రూపాన్ని ధరించింది. అందువలన అలా అమ్మవారు అవతరించిన రోజున, ఆ రూపంతో అమ్మవారిని అలంకరించి ఆ నామంతో ఆరాధిస్తూ ఉంటారు. ఇంద్రకీలాద్రిపై వేంచేసి యున్న శ్రీ కనకదుర్గమ్మావారు మొదటి రోజు శ్రీ స్వర్ణకవచాలంకృత శ్రీ దుర్గాదేవిగా రెండవ రోజు బాలాత్రిపుర సుందరి మూడవ రోజు గాయత్రి దేవిగా, నాల్గవ రోజు అన్నపూర్ణ దేవిగా ఐదవరోజు శ్రీ సర్వస్వతి దేవిగా ఆరవ రోజు శ్రీ లలిత త్రిపుర సుందరీ దేవిగా, ఏడవ రోజు శ్రీ మహలక్ష్మీదేవిగా, ఎనిమిదవ రోజు దుర్గాదేవి మరియు మహిషాసుర మర్థిని దేవిగా, తొమ్మిదవ రోజు శ్రీ రాజరాజేశ్వరి దేవి మొదలైన అవతార రూపాలతో దర్శనమిస్తూ భక్తులకు అమ్మవారు దర్శనమిస్తారు.ఇలా ఈ నవరాత్రుల సమయంలో ఒక్కో అమ్మవారిని ఆరాధించడం వలన ఒక్కో విశేష ఫలితం లభిస్తుందని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి. నవరాత్రుల్లో బెడవాడ శ్రీకనకదుర్గమ్మ వారు వివిధ అలంకారాలతో భక్తుల కోర్కేలను తీర్చు చల్లని తల్లిగా దర్శనమిస్తారు.. 1. దుర్గాదేవి అలకారం ః శరన్నవరాత్రి మహోత్సవాల్లో శ్రీ కనకదుర్గమ్మవారు శ్రీ స్వర్ణకవచాలంకృత శ్రీ దుర్గాదేవిగా దర్శినమిచ్చి భక్తులకు ఆయురారోగ్య ఐశ్వర్యాలను కలుగుజేస్తారు. 2. శ్రీ బాలాత్రిపుర సుందరి: ఫత్రిపురాత్రయంలో శ్రీ బాలాత్రి పుర సుందరీదేవి ప్రథమ స్థానంలో ఉంది. ఆమె ఎంతో మహిమాన్వితమైన ది. సమస్త దేవీ మంత్రాలలోకెల్లా శ్రీ బాలా మంత్రం గొప్పది. సకల శక్తి పూజలకు మూలమైన శ్రీ బాలాదేవి జగన్మోహనాకారాన్ని పవిత్రమైన శరన్నవరాత్రుల్లో దర్శించి, ఆమె అనుగ్రహాన్ని పొందితే, సంవత్సరం పొడుగునా అమ్మవారికి చేసే పూజలన్నీ సత్వర ఫలితాలనిస్తాయి. 3. శ్రీ గాయత్రి దేవి అలంకారం: ముక్తా విద్రుమ హేమనీల ధవల వర్థాలలతో ప్రకాశిస్తు, పంచ ముఖాలతో దర్శనమిస్తుంది. సంధ్యావందనం అధి దేవత . గాయత్రి మంత్రం రెండు రకాలు: 1. లఘు గాయత్రి మంత్రం 2. బ్రుహద్గాయత్రి మంత్రం. ప్రతి రోజూ త్రిసంధ్యా సమయంల్లో వేయి సార్లు గాయత్రి మంత్రంని పఠిస్తే వాక్సుద్ది కలుగుతుంది. 4. శ్రీ అన్నపూర్ణేశ్వరి దేవి: నాల్గవ రోజున నిత్యాన్నదానేశ్వరి శ్రీ అన్నపూర్ణా దేవి అలంకారం అన్నం జీవుల మనుగడకు ఆదారం. జీవకోటి నశించకుండా వారణాసి క్షేత్రాన్ని నిజ క్షేత్రంగా, క్షేత్ర అధినాయకుడు విశ్వేశ్వరుడి ప్రియపత్నిగా శ్రీ అన్నపూర్ణా దేవి విరాజిల్లుతుంది. 5. శ్రీ మహా సరస్వతీ దేవి: ఐదవ రోజున చదువుల తల్లి సరస్వతీ దేవి అలంకారం త్రి శక్తులలో ఒక మహాశక్తి శ్రీ సరస్వతీ దేవి. సరస్వతీ దేవి సప్తరూపాలలో ఉంటుందని మేరు తంత్రంలో చెప్పబడింది . అవి చింతామని సరస్వతి, జ్ఝాన సరస్వతి, నిల సరస్వతి, ఘట సరస్వతి, కిణి సరస్వతి, అంతరిక్ష సరస్వతి, మరియు మహా సరస్వతి. మహా సరస్వతి దేవి శుంభని శుంభులనే రాక్షసులను వధించింది. ..2 ..2.. 6. శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవివేవి : 6వ రోజున త్రిపురాత్రయంలో రెండో శక్తి శ్రీ లలితా దేవి అలంకారం. త్రిమూర్తులకన్నా ముందు నుండి ఉన్నది కాబట్టి, త్రిపుర సుందరి అని పిలవబడుతుంది. శ్రీచక్ర ఆదిష్టాన శక్తి, పంచదశాక్షరి అదిష్టాన దేవత. ఆదిశంకరాచార్యులు శ్రీ చక్రయంత్రాన్ని ప్రతిష్టించక పూర్వం ఈ దేవి ఉగ్ర రూపిణిగా ‘చండీదేవి'గా పిలవబడేది. ఆది శంకరాచార్యలు శ్ీర చక్రయంత్రాన్ని ప్రతి ష్టించాక పరమశాతం రూపిణిగా లలితా దేవిగా పిలవబడుతున్నది. 7. శ్రీ మహాలక్ష్మి తేది : 7వ రోజున మంగళ ప్రద దేవత శ్రీ మహాలక్ష్మీ దేవి అలంకారం అష్టరూపాలతో అష్ట సిద్దులు ప్రసాదించే దేవత. రెండు చేతులలో కమలాలని ధరించి, వరదాభయ హస్తాల్ని ప్రదర్శిస్తూ, పద్మాసనిగా దర్శనిమిస్తుంది. ఆది పరాశక్తి మహాకాళీ, మహాలక్ష్మీ, మహా సరస్వతి రూపాలు ధరించింది. ఆ ఆదిపరాశక్తి రూపంగానే మహాలక్ష్మీ అలంకారం జరుగుతుంది. 8. శ్రీ దుర్గా దేవి అలంకారం: దుర్గతులను నాశనం చేసే శ్రీ దుర్గా దేవి అలంకరాం రురుకుమారుడైన ‘దుర్గముడు' అనే రాక్షసున్ని సంహరించింది అష్టమి రోజునే కనుక ఈ రోజును దుర్గాష్టమి అని, దుర్గమున్ని సంహరించిన అవతారం కనుక దేవిని ‘దుర్గా' అని పిలుస్తారు. శ్రీ మహిషాసుర మర్ధినీ దేవి అలంకారం: మహిశాసురున్ని చంపడానికి దేవతలందరూ తమ తమ శక్తులను ప్రదానం చేయగా ఏర్పడిన అవతారం ఇది. సింహాన్ని వాహనంగా ఈ దేవికి హిమవంతుడు బహుకరించాడు. సింహ వాహనంతో రాక్షస సంహారం చేసి అనంతరం ఇంద్ర కీలాద్రి పై వెలిసింది 9. శ్రీరాజరాజేశ్వరి దేవి అలంకారం: 9వరోజు అపజయం అంటే ఎరుగని శక్తి కాబట్టి ఈ మాతను ‘అపరాజిత' అంటారు. ఎల్లప్పుడు విజయాలను పొందుతుంది కాబట్టి‘విజయ' అని కూడా అంటారు. శ్రీ రాజరాజేశ్వరి దేవి ఎప్పుడూ శ్రీ మహా పరమేశ్వరుడి అంకముపై ఆసీనురాలై భక్తులకు దర్శనమిస్తుందని పురాణ ఇతి హాసారు వెల్లడిస్తున్నాయి. -
Image
గాజువాక జర్నలిస్టుల వినతిని సీఎం జగన్మోహనరెడ్డి దృష్టికి తీసుకువెళ్తా
Image
మహిళల ఆర్థిక స్వావలంబనే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం
Image
శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం, ఇంద్రకీలాద్రి
Image
Kvik Fitness Arena " జిమ్ సెంటర్
Image