ఎప్పుడు ఎన్నికలు వచ్చినా జగన్ ఇంటికే.



*కాకినాడలో తెలుగు దేశం పార్టీ జోన్ 2 సమావేశంలో పాల్గొన్న టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు*


 *సభకు హాజరైన ప్రతినిధులకు పలు అంశాలపై దిశానిర్దేశం చేసిన చంద్రబాబు*


*రాష్ట్రంలో రాజకీయ గాలి మారింది...తెలుగుదేశం గెలుపు ఖాయం*


*ఎప్పుడు ఎన్నికలు వచ్చినా జగన్ ఇంటికే


*


*భవిష్యత్ కు గ్యారెంటీ లో ప్రతి ఇంటికి పథకాల హామీ పత్రం*


*యువగళం గ్రాండ్ సక్సెస్...సైకిల్ ఇక అన్ స్టాపబుల్:-                                                                                                                                                                                         సభలో చంద్రబాబు ప్రసంగం :-*

      కాకినాడ ( ప్రజా అమరావతి );                                                                                                                                                                                             • తెలుగుదేశం పార్టీ ఏ కార్యక్రమం మొదలు పెట్టినా గ్రాండ్ సక్సెస్ అవుతోంది. బాదుడే బాదుడు, ఇదేం ఖర్మ వంటి కార్యక్రమాలు నిర్వహిస్తే బ్రహ్మండంగా విజయవంతం అయ్యాయి.

• ఏ ఎన్నికలు జరిగినా మనము గెలుస్తున్నాం. 108 అసెంబ్లీ నియోజకవర్గాల పరిథిలో జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో మూడు మనమే గెలిచాం.

• ఇటీవల జరిగిన  పంచాయతీ ఉప ఎన్నికల్లో కూడా తెలుగుదేశం గెలిచింది. 30 ఏళ్ల నుంచి గెలవనిచోట కూడా గెలిచింది. ప్రజల్లో మార్పు ప్రారంభమైంది. టీడీపీ జైత్ర యాత్ర మొదలైంది.

• దళితులు, బీసీలు పెద్ద ఎత్తున మనకు మద్దతు పలుకుతున్నారు. రాజకీయ గాలి ఏ విధంగా ఉందో రాష్ట్రంలో స్పష్టంగా అర్థం అవుతోంది.

• టీడీపీ విజయాన్ని ఎవరూ ఆపలేరు. మనకు 23 సీట్లు వస్తే హేళన చేశారు. ఇప్పుడు దేవుడి స్క్రిప్ట్ మారింది. రేపు ఏ ఎన్నికలు పెట్టినా గెలిచేది తెలుగుదేశమే.

•  రాష్ట్రాన్ని రివర్స్ లో నడిపించి సర్వనాశనం చేశారు. రాష్ట్రంలో ఒక్క వర్గం కూడా సంతోషంగా లేదు. 

• రైతులు, మహిళలు, యువత, కార్మికులు, ఉద్యోగులు..ఎవరూ సంతోషంగా లేరు.

• నా రాజకీయ జీవితంలో ఇంత నీచమైన పాలన ఎప్పుడూ చూడలేదు. 

• రాష్ట్రంలో నిత్యావసరాలు మండిపోతున్నాయి. కందిపప్పు కేజీ రూ.200 అయ్యింది.

• ఇసుక, మద్యం, కరెంటు చార్జీలతో ప్రజల రక్తాన్ని తాగుతున్నారు. ప్రభుత్వ వైఫల్యాలను  ప్రశ్నించిన వారిపై కేసులు, వేధింపులు.

• కాకినాడలో దళిత డ్రైవర్ ను చంపి డోర్ డెలివరీ చేశారు. ప్రశాంతమైన కోనసీమలో కూడా అరాచకాలు సృష్టించారు. పోలీసు వ్యవస్థ నిర్వీర్యం అయ్యింది.

• ఇవన్నీ ప్రజల్లో చర్చ జరగాలి. మనం ‘బాబు ష్యూరిటీ - భవిష్యత్ కు గ్యారెంటీ’  అనే కార్యక్రమం మొదలు పెట్టాం.

• 45 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. బాదుడే బాదుడుతో ప్రజలపై  పడిన భారాన్ని వారికి వివరిస్తూనే, మనం వస్తే ఏం కలిగే లబ్ధి కూడా వారికి చెప్పాలి.

• 2014లో అధికారంలోకి వచ్చిన తరువాత పెన్షన్ భారీగా పెంచాం.

• 200 రూపాయల పెన్షన్ ను 2 వేలు చేశాం. ఉద్యోగులకు 42 శాతం ఫిట్ మెంట్ ఇచ్చాం. 

• రైతన్నల కోసం లక్షన్నర రుణమాఫీ చేశాం. ఒకే దఫాలో రూ.50 వేలు మాఫీ చేశాం. రైతులకు సబ్సిడీలు ఇచ్చాం. అన్న క్యాంటీన్ లు పెట్టాం. పెళ్లి కానుక అందించాం. ఆ పథకాలు అన్నీ జగన్ రాగానే రద్దు చేశాడు.

• ‘బాబు ష్యూరిటీ - భవిష్యత్ కు గ్యారెంటీ’ కార్యక్రమంలో భాగంగా ఇవన్నీ గ్రామాల్లో చర్చించాలి.

• మనం చేసిన పనులు, జగన్ చేసిన నష్టం....మళ్లీ మనం వచ్చిన తరువాత మనం అమలు చేసే పథకాల గురించి ప్రజలకు వివరించాలి.

• అన్నీ ఆలోచించి మహాశక్తి కార్యక్రమం ప్రకటించాం. మహాశక్తి లో భాగంగా తల్లికి వందనం కింద ఎంత మంది పిల్లలు ఉంటే అంత మందికి ఏడాదికి రూ.15000 ఆర్థిక సాయం చేస్తాం. 

• పథకం అమలులో ఎలాంటి కోతలు ఉండవు. నా సంతకంతో ఒక అగ్రిమెంట్ ఇస్తున్నాం. చెప్పిన మాటపై నిలబడే పార్టీ తెలుగు దేశం పార్టీ.

•  మద్యపాన నిషేదం అని నాడు మాటలు చెప్పిన జగన్...ఇప్పుడు ఏం చేస్తున్నాడు. మనం ఇలా మాట మార్చం.

•  ఆడబిడ్డ నిధి కింద 18 ఏళ్లు నిండిన ప్రతి మహిళకు నెలకు రూ. 1500 అందజేస్తాం.

• సంపద సృష్టించడం తెలిసిన పార్టీ తెలుగుదేశం. అధికారంలోకి వచ్చిన తరువాత పీ - 4 విధానంతో పేదరికం పోగొడతాం.

• దీపం పథకం ప్రారంభించింది నేనే. మళ్లీ దీపం పథకం కింద మూడు సిలిండర్లు ఉచితంగా ఇస్తాం. అవసరం అయితే నాలుగో సిలిండర్ కూడా పేద వర్గాలకు ఇచ్చే ఆలోచన చేస్తున్నాం

•  ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తాం.

• దేశానికి అన్నంపెట్టే గోదావరి జిల్లాలు నేడు సాగు మానేసే పరిస్థితి వచ్చింది. ఈ ఏడాది రాష్ట్రంలో తీవ్ర వర్షాభావ పరిస్థితులు ఉన్నాయి. 50 నుంచి 80శాతం తక్కువ వర్షపాతం నమోదైంది. 35 లక్షల ఎకరాల్లో పంటల సాగు తగ్గిపోయింది.

• టీడీపీ హయాంలో 16 లక్షల కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు చేసుకు న్నాం. 5.13 లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చాం. నేడు రాష్ట్రంలో పట్టభద్రుల్లో నిరుద్యోగం 35 శాతానికి చేరుకుంది. 

• అందుకే అధికారంలోకి వచ్చిన తరువాత యువగళం కింద నెలకు రూ.3 వేలు ఇస్తాం. 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తాం.

• అధికారంలోకి వచ్చిన తరువాత వెనుకబడిని వర్గాలైన బీసీల రక్షణకు ప్రత్యేక చట్టం తీసుకొస్తాం.

• 5 ఏళ్లలో చిన్న రోడ్డు వేయలేని సైకో సీఎం...మూడు రాజధానులు కడతాను అంటున్నాడు

• మూడు రాజధానులు అని ప్రజల్ని నమ్మించి, అసలు రాజధానే లేకుండా చేశాడు. జగన్ కు విధ్వంసం తప్ప మరేమీ తెలీదు.

• నాడు ఇరిగేషన్ పై రూ.68 వేల కోట్లు ఖర్చు పెట్టాం. అనేక ప్రాజెక్టులు పూర్తి చేశాం. పట్టిసీమ కట్టి ఇటు కోస్తాకు...అటు సీమకు నీళ్లు ఇచ్చాం.

• తెలుగు దేశం అధికారంలో ఉండి ఉంటే రూ.70 వేల కోట్లు ఖర్చు పెట్టి అన్ని ప్రాజెక్టులు పూర్తి చేసేవాళ్లం.

• భవిష్యత్ లో పోలవరం పూర్తి చేసి మూడు పంటలకు నీళ్లు ఇస్తాం. నదుల అనుసంధానం చేసి ఉంటే రాష్ట్రంలో ప్రతి ఎకరాకు నీరు ఇవ్వొచ్చు.

• రాష్ట్రంలో ఇసుకాసురులు తయారయ్యారు. రాష్ట్రంలో ఎక్కడైనా ఇసుక దొరుకుతుందా? మన హయాంలో ఉచితంగా ఇసుక ఇచ్చాం.

• ఉచిత ఇసుకతో పలు వర్గాల ప్రజలు బతికారు. జీవనోపాధి లభించింది.

• నేడు ప్రభుత్వ ఇసుక దోపిడీ వల్ల 40 లక్షల మంది నిర్మాణ రంగ కార్మికులు రోడ్డున పడ్డారు.

• జిల్లాల వారీగా రీచ్ లు పంచుకొని ఇసుక దోపిడీ చేస్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఇసుక మాఫియాకు డబ్బులు కట్టలేక ఒక వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు.

• నాలుగున్నరేళ్లలో ఇసుకలోనే రూ.40 వేల కోట్లు వైసీపీ నేతలు దోచుకున్నారు. అందుకే మనం ఇసుక సత్యాగ్రహం అని పిలుపునిచ్చాం.

• రాష్ట్రంలో కరెంట్ ఛార్జీలతో బాదుడు. ఇప్పుడు రాష్ట్రంలో కరెంట్ కోతలు.

• మన హయాంలో కరెంట్ ఛార్జీలు పెంచలేదు. జగన్ 8 సార్లు  ఛార్జీలు పెంచి బాదేశాడు.

• రోజుకో పేరు పెట్టి....నాడు 200 వచ్చే బిల్లును ఇప్పుడు వెయ్యి చేశాడు. ఈ రోజు హామీ ఇస్తున్నా.  అధికారంలోకి వచ్చిన వెంటనే కరెంట్ ఛార్జీలు పెంచకుండా నాణ్యమైన కరెంట్ ఇస్తాను అని.


*కరెంట్ ఛార్జీల బాదుడుపై చంద్రబాబు సెటైర్లు*


రజనీ కాంత్ కొద్దిరోజుల క్రితం ఒక సభలో చెప్పిన తాజా డైలాగ్ ను ప్రస్తావిస్తూ కరెంట్ బాదుడుపై సెటైర్లు

• ఈ రోజు చెపుతున్నా కరెంట్ కోతలు లేని చోటు లేదు.....కరెంట్ బిల్లులపై ప్రభుత్వాన్ని తిట్టని నోరు లేదు....ఈ రెండు జరగని ఊరే లేదు. అర్థమైందా సైకో జగన్ రెడ్డీ! అంటూ కామెంట్స్

• మద్యనిషేధం అన్నాడు....మద్యం రేట్లు పెంచి జగన్ దోచుకుంటున్నాడు.

• జగన్ ను మళ్లీ నమ్మితే రూ.400 కరెంట్ బిల్లు రూ.4 వేలు అవుతుం ది....60 రూపాయల మందు బాటిల్ 500 అవుతుంది. ప్రజలు అప్రమత్తం గా ఉండాలి.

• వచ్చే ఎన్నికల్లో మనం అప్రమత్తంగా ఉండాలి.....ఓట్లు ఇప్పటి నుంచే చెక్ చేసుకోవాలి. జగన్ ఎక్కడో ఆఫీస్ పెట్టి మనకు పడే అవకాశం ఉన్న ఓట్లు తీసేస్తున్నాడు. 

• యువగళం గ్రాండ్ సక్సెస్ అయ్యింది. ఇక సైకిల్ ఆగే ప్రసక్తే లేదు. సైకిల్ అన్ స్టాపబుల్. ఇక బ్రేకులు వేసే అవసరం లేదు. దూసుకుపోవడమే. ప్రతి నియోజకవర్గం నుంచి సైకిల్ అసెంబ్లీకి రావాలి. 

• తప్పుడు పార్టీ వైసీపీ. ఎన్నికల సమయంలో ప్రతి సారీ నాపై ఆరోపణలు చేస్తారు. ఇప్పుడు కూడా అలాంటి ప్రయత్నమే చేస్తున్నారు. అలాంటి వాటికి ఆధారాలు చూపాల్సిన అవసరమే లేదు. 

• జగన్ పని అయిపోయింది. జగన్ ఇంటికి పోవడం ఖాయం..

Comments