పరాజయ భయంతోనే జగన్ ఈ దుశ్చర్యకు పాల్పడ్డాడు.

 


ప్రజలకోసం నేను, రాష్ట్రంకోసం ప్రజలు పోరాటానికి సిద్ధం కావాల్సిన సమయం వచ్చింది. ఒక్క ఛాన్స్ అని నమ్మి అర్హతలేని వాడిని అందలం ఎక్కిస్తే పరిస్థితి ఎంత దారుణంగా మారిందో ప్రజలు అర్థం చేసుకోవాలి.


ఎన్నికలు వచ్చేవరకు ఆగొద్దు. భయానికి, బాధలకు వెరవకుండా హక్కులకోసం రాష్ట్రం కోసం పోరాడాల్సిన సమయం వచ్చింది. 

• చేతులు ముడుచుకొని కూర్చుంటే జరిగే మనరాష్ట్రం ఎక్కడా కనిపించదు.

• ముఖ్యమంత్రి లక్షలకోట్ల భక్షకుడు...అవినీతి అర్భకుడు...పక్షపాతక రూపకుడు... ముఖ్యకంత్రీ మహామూర్ఖుడు.. ముచ్చి ముదనష్టకుడు.. జగమెరిగిన జగన్నాటకుడు..దేశానికి పట్టిన దరిద్ర జాతకుడు.. రాష్ట్రానికి రావణ పాలకుడు..  జనధన, మాన, ప్రాణ చోరకుడు.

• ఈ ముఖ్యమంత్రికి ప్రతిపక్షాలు.. ప్రజలంటే పడదు. ఎవరినీ ఇష్టడపడడు. ముదనష్టపు మూర్ఖత్వంతో, ప్రజలకు ఎంగిలి చెయ్యి విసురుతూ వారిని  దోచుకుంటున్నాడు.

• తాను 16 నెలలు జైల్లో ఉన్నాడు కాబట్టి, చంద్రబాబుని 16 రోజులైనా జైల్లోపెట్టాలన్న దురుద్దేశంతోనే తప్పుడు ఆధారాలతో స్కామ్ సృష్టించారు

దుర్మార్గుల దుష్ట రాజకీయాలు పెచ్చుమీరినప్పుడు, నీతిపరులు కష్టాల పాలైనప్పు డు ప్రజలు ఆగ్రహించకపోతే, భవిష్యత్ పరిణామాలు చాలా దారుణంగా ఉంటాయని, చంద్రబాబునాయుడి అరెస్ట్ కు పాల్పడని ఈ దుష్టప్రభుత్వం, మరిన్ని అరెస్ట్ లకు సిద్ధ మవుతోందని, ఏంజరిగినా..ఎన్ని కేసులు పెట్టినా ఎవరూ భయపడాల్సిన పనిలేదని, ప్రజాక్షేత్రంలోకి దిగడానికి సిద్ధమయ్యాయని, ప్రజలకోసం నేను..రాష్ట్రంకోసం ప్రజలు పోరాడటానికి సిద్ధంకావాల్సిన తరుణం ఆసన్నమైందని టీడీపీ పొలిట్ బ్యూరోసభ్యులు , హిందూపురం శాసనసభ్యులు నందమూరి బాలకృష్ణ తేల్చిచెప్పారు. 


మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ 


పరాజయ భయంతోనే జగన్ ఈ దుశ్చర్యకు పాల్పడ్డాడు.



చంద్రబాబునాయుడు ప్రజా నాయకుడు. ఆయనకు ప్రజలు, రాష్ట్రంతప్ప  మరో ధ్యాస ఉండదు. కేవలం కక్షసాధింపు తోనే చంద్రబాబుని అరెస్ట్ చేశారు.  చట్టాలను అతిక్రమించి, అవినీతి జరగని స్కిల్ డెవలప్ మెంట్ ప్రాజెక్ట్ అమలుకు కేటాయించిన నిధులు పక్కదారి పట్టాయని అసత్యప్రచారం చేసి అభూత కల్పనలు సృష్టించారు. వచ్చే ఎన్నికల్లో తనకు పరాజయం తప్పదన్న భయంతోనే జగన్ ఈ దుశ్చర్యకు పాల్పడ్డాడు. తాను 16 నెలలు జైల్లో ఉన్నాడు కాబట్టి, చంద్రబాబుని 16 రోజులైనా జైల్లో పెట్టాలన్న దురుద్దేశంతోనే తప్పుడు ఆధారాలతో ఫేక్ స్కామ్ సృష్టించారు. యువత భవితకోసం చేపట్టిన గొప్పప్రాజెక్ట్ ను ప్రభుత్వం తన కుట్రరాజకీయాలతో నీరుగార్చే ప్రయత్నం చేయడం దురదృష్టకరం.


స్కిల్ డెవలప్ మెంట్ ప్రాజెక్ట్ లో అవినీతి జరిగితే, ప్రాజెక్ట్ అమలు, నిర్వహణ బాధ్యత లతో పాటు నిధులు విడుదలచేసిన అధికారుల్ని ఎందుకు విచారించలేదు?


స్కిల్ డెవలప్ మెంట్ ప్రాజెక్ట్ కార్యకలాపాలు 2013లో గుజరాత్ లో ప్రారంభమ య్యాయి. అక్కడ ఎలా అమలైందో పరిశీలించాకే విభజనానంతర ఏపీలో 2015 లో దాని అమలుకు టీడీపీ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. స్కిల్ డెవలప్ మెంట్ ప్రాజెక్ట్ అయినా, మరే విషయమైనా ముఖ్యమంత్రి కేవలం పాలసీ మేకర్ మాత్రమే. కార్యాచర ణ మొత్తం నిర్వహించేది అధికారులే. స్కిల్ డెవలప్ మెంట్ ప్రాజెక్ట్ ను టీడీపీ ప్రభుత్వం లో తెరపైకి తెచ్చింది ఇప్పుడున్న ప్రభుత్వంలో కీలక స్థానంలో ఉన్న అజయ్ కల్లం రెడ్డి అయితే,  ప్రాజెక్ట్ ఒప్పందంపై సంతకాలు పెట్టి, నిధులు విడుదల చేసింది ప్రేమచంద్రారెడ్డి. స్కిల్ డెవలప్ మెంట్ ప్రాజెక్ట్ లో నిజంగా అవినీతి జరిగితే ఆనాడు ప్రాజెక్ట్ అమల్లో కీలకపాత్ర పోషించిన ఈ ఇద్దరు అధికారుల్ని ఇంతవరకు జగన్ ప్రభుత్వం, సీఐడీ  ఎందుకు విచారించలేదు? దీన్నిబట్టే అర్థమవుతోంది ఈ ప్రభుత్వం పెట్టింది తప్పుడు కేసు అని. స్కిల్ డెవలప్ మెంట్ ప్రాజెక్ట్ అమల్లో భాగంగా డిజైన్ టెక్,  సీమెన్స్ సంస్థలు యువతకు నైపుణ్యాభివృద్ధి శిక్షణ అందించడానికి ముందు కొస్తే, నాటి టీడీపీ ప్రభుత్వం నాలుగుదశల్లో రూ.330కోట్లు విడుదల చేయడం జరిగింది. జీఎస్టీ ఇతర చెల్లింపులు కలిపి మరో రూ.40 కోట్లు.. మొత్తం రూ.370 కోట్లు ప్రాజెక్ట్ అమలు కోసం ఖర్చుపెట్టడం జరిగింది. ప్రాజెక్ట్ ను  సమర్థవంతంగా అమలు చేసేందుకు రాష్ట్రంలో పేరేన్నికగన్న విద్యాసంస్థల్లో 40 శిక్షణా కేంద్రాలు ఏర్పాటు చేశారు. వాటిలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం, అధునాతన పరికరాలు ఏర్పాటు చేశారు. వాటిని సమర్థవంతంగా వినియోగించుకొని 2,13,000 మంది యువతకు శిక్షణ అందించడం జరిగింది. వారిలో 70వేల మందికి ఉపాధి, ఉద్యోగావకాశాలు కల్పించారు.ఇదంతా చాలా సక్రమంగా, ప్రణాళికాబద్ధంగా, పారదర్శకంగా జరిగింది. ఈ ప్రాజెక్ట్ అమల్లో భాగస్వామి అయిన డిజైన్ టెక్ సంస్థ బ్రహ్మండంగా పనిచేసిందని వైసీపీ ప్రభుత్వం కితాబుకూడా ఇచ్చింది. నిజంగా తప్పు జరిగితే బాగుందని ఎలా చెప్పారు?

 

స్కిల్ డెవలప్ మెంట్ ప్రాజెక్ట్ లో  తొలుత వేసిన ఛార్జ్ షీట్లో చంద్రబాబు పేరు ఎందుకు లేదు? చంద్రబాబు అరెస్ట్ కుట్ర ప్రకారం జరిగిన కక్షపూరిత వ్యవహారమే.


అంతా సజావుగా, సక్రమంగా జరిగిన దానిలో ఏదో జరిగినట్టు ప్రజల్ని నమ్మించ డానికే, వైసీపీ ప్రభుత్వం తప్పుడు కేసులు పెట్టి ప్రాజెక్ట్ లో భాగస్వాములైన సంస్థల్ని, వ్యక్తుల్ని విచారణ పేరుతో వేధించింది. భయపెట్టి బలవంతంగా వారితో తప్పుడు ప్రకటనలు చేయించింది. చివరకు ఆయా సంస్థల బ్యాంకుఖాతాలు కూడా సీజ్ చేసింది. దానిపై సంస్థ యాజమాన్యాలు న్యాయస్థానాన్నిఆశ్రయించడంతో హైకోర్టు ప్రభుత్వ విధానాన్ని తీవ్రంగా తప్పుపట్టడమే కాక, బ్యాంక్ ఖాతాలు విడిపించింది.   నిజంగా స్కిల్ డెవలప్ మెంట్ ప్రాజెక్ట్ అమల్లో చంద్రబాబు తప్పుచేస్తే మొదట్లోనే ఛార్జ్ షీట్ లో ఆయన పేరు ఎందుకు లేదు? ప్రాజెక్ట్ లో అవినీతి జరిగిందని ఇష్టమొచ్చినట్టు కేసులు పెట్టి, ఎంతమందిని విచారించారో అందరికీ గతంలోనే హైకోర్టు బెయిల్ కూడా ఇచ్చింది. జగన్ ప్రభుత్వం కక్షతో పెట్టిన కేసు మొత్తం పూర్తిగా ముగిసిపోయింది.  అంతా అయిపోయిన దాన్ని తిరగదోడి, ఎక్కడో రాయలసీమలో ప్రజల్లో ఉన్న చంద్రబాబు వద్దకు వెళ్లి, అర్థరాత్రి హడావుడి చేసి, ఆయన్ని అన్యాయంగా అరెస్ట్ చేయడం ఏమిటి? అంత సీన్ క్రియేట్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? ఇదంతా ప్రభుత్వ కుట్రలో, పథకం ప్రకారం జరిగిన కక్షపూరిత వ్యవహారమేనని స్పష్టంగా అర్థమవుతోంది.. 

                                                                                                                                                                                                        కుట్రరాజకీయాలు.. కక్షలు.. దోపిడీ తప్ప నాలుగేళ్లలో ఏం చేశారు?.

                                                                                                                                                                                                      ఈ ముఖ్యమంత్రికి ప్రతిపక్షాలు.. ప్రజలంటే మొదటినుంచీ పడదు. ఎవరినీ ఇష్టడపడడు. ముదనష్టపు మూతి వేసుకొని, ప్రజలకు ఎంగిలి మెతుకులు వేస్తూ, వారినుంచి ఎంత దోచుకుంటున్నాడో చూస్తున్నాం. అభివృద్ధి చేయడం తెలియదు.. ప్రజలకు ఏంచేయాలో ఎలా చేయాలో అర్థం కాదు. కేవలం కుట్రలు, కక్షలు..దోపిడీ తప్ప నాలుగేళ్లలో చేసిందేమీ లేదు. ఏ నియోజకవర్గంలో అయినా చంద్రబాబు, టీడీపీ చేసిన అభివృద్ధి తప్ప ఎక్కడైనా ఏమైనా చేశారా వీళ్లు? ఆఖరికి రోడ్లు కూడా వేయలే దు. కనీసం ప్రజలకు తాగునీరు, విద్యుత్ వంటి మౌలిక అవసరాలు కూడా అందించలే దు.  మూడు రాజధానులు అన్నారు.. నవరత్నాల పేరుచెప్పి, ఏదో చేస్తున్నట్టు వారిని మాయమాటలతో నమ్మించి రాష్ట్రాన్ని 10 లక్షలకోట్ల అప్పుల్లో ముంచారు. ఈ ప్రభుత్వం చేసిన అప్పులన్నీ కట్టాల్సింది ప్రజలే. ఎన్ని సంవత్సరాలైన ఈ ప్రభుత్వ రుణభారం ప్రజలే మోయాలి. 

 

ఏం జరిగినా..ఎన్ని కుట్రలు పన్నినా చంద్రబాబు అగ్నిశిఖలా రెట్టింపు ఉత్సాహంతో ప్రజల్లోకి వస్తారు.


తెలుగుదేశం ఎన్టీఆర్ గుండెధైర్యం నుంచి, తెలుగువారి ఆత్మాభిమానం కోసం పుట్టిన పార్టీ, ఇలాంటి వాటికి పార్టీ కార్యకర్తలు వెరవరు. చంద్రబాబు నాయుడు పులుకడిగిన ముత్యంలా బయటకు వస్తారు. అగ్నిశిఖలా రెట్టింపు తేజంతో త్వరలోనే ప్రజల్లోకి వస్తారు. ప్రపంచవ్యాప్తంగా తెలుగువారు రాణిస్తున్నారు అంటే, దానికి కారణం చంద్రబాబు ముందుచూపే. ఆయన ఆలోచనలతో యువత భవితను, ఉమ్మడి రాష్ట్రా న్ని బంగారు మయం చేశారు. ఎన్టీ.రామారావు గారి వల్ల తెలుగువారి ఉనికి ప్రపంచానికి తెలిస్తే, చంద్రబాబునాయుడి పనితీరు, ఆలోచనతో ఖండఖండాల్లో నేడు తెలుగువారు గర్వంతా తలెత్తుకొని జీవించేస్థితికి వచ్చారు. ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు చేసిన అభివృద్ధికి అనేక నిదర్శనాలు ఉన్నాయి. హైదరబాద్ నగర రూపురేఖలు మార్చి, దాన్ని గ్లోబల్ నగరం గా మార్చింది ఆయనే.

 

ముఖ్యమంత్రి లక్షలకోట్ల భక్షకుడు..అవినీతి అర్భకుడు...జన ధన, మాన, ప్రాణ చోదకుడు.


ఏపీ ప్రజలు ప్రస్తుతం జరుగుతున్న కుట్రలపై స్పందించాలి. భయానికి, బాధలకు వెరవకుండా హక్కులకోసం రాష్ట్రం కోసం పోరాడాల్సిన సమయం వచ్చింది.  చేతులు ముడుచుకొని కూర్చుంటే జరిగే నష్టంతో మనరాష్ట్రం ఎక్కడా కనిపించదు. ముఖ్యమంత్రి లక్షలకోట్ల భక్షకుడు...అవినీతి అర్భకుడు...పక్షపాతక రూపకుడు... ముఖ్యకంత్రీ మహామూర్ఖుడు.. ముచ్చి ముదనష్టకుడు.. జగమెరిగిన జగన్నాట కుడు..దేశానికి పట్టిన దరిద్ర జాతకుడు.. రాష్ట్రానికి రావణ పాలకుడు..  జనధన, మాన, ప్రాణ చోరకుడు .జగన్ రెడ్డికి ఉన్న లక్షణాలు ఇలా వర్ణిస్తే చాలానే ఉన్నాయి. గార్దబానికి కస్తూరి తిలకం దిద్దినట్టు...బంగారం లాంటి రాష్ట్రాన్ని సీఎం జగన్ కు  అప్పగించారు. రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రజలదే. రాజధాని లేదు.. పోలవరం లేదు..ఉద్యోగాలు లేవు... సాగునీటి ప్రాజెక్టులు లేవు... విద్యుత్ లేదు.. ఎటుచూసినా అప్పులు.. జనానికి తిప్పలు... ఇదీ చివరకు మిగిలింది.  ప్రజలు నాలుగేళ్లలో అనుభవించింది చాలు. మున్ముందు పీల్చేగాలిపై కూడా జగన్ పన్నులు వేస్తాడు. ఎన్నికలు వచ్చేవరకు ఎదురు చూడటం కాదు... ప్రజలు రోడ్డెక్కాల్సిన సమయం వచ్చింది. చంద్రబాబు అక్రమ అరెస్ట్ కు పాల్పడిన ఈ ప్రభుత్వాన్ని తరిమి తరిమి కొట్టాలి. చంద్రబాబే లక్ష్యంగా ఈ ప్రభుత్వం పాల్పడుతున్న చర్యలకు చింతించి, బాధపడి హఠాన్మరణం పాలైన ప్రతివ్యక్తి కుటుంబాన్ని త్వరలో పరామర్శిస్తాను. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై ప్రజాసంఘాలు, మేథావులు, దేశ విదేశాల్లోని తెలుగు వారు స్పందించాలి. ప్రజల కోసం నేను వస్తున్నాను...ఇకనుంచి తెలుగువాడి సత్తా, పౌరుషం ఏంటో ఈ దుర్మార్గులకు చూపిద్దాం.” అని బాలకృష్ణ పిలుపునిచ్చారు.


విలేకరుల సమావేశంలో టీడీపీ పొలిట్ బ్యూరోసభ్యులు, మండలి మాజీ ఛైర్మన్ ఎం.ఏ.షరీఫ్, మాజీ మంత్రులు కొల్లు రవీంద్ర, కన్నా లక్ష్మీనారాయణ, టీడీపీ ఎమ్మెల్సీ లు పరుచూరి అశోక్ బాబు, పంచుమర్తి అనురాధ, నందిగామ నియోజకవర్గ ఇన్ ఛార్జ్ తంగిరాల సౌమ్య తదితరులు పాల్గొన్నారు.

Comments